cell phone
-
సెల్ఫోన్ మింగి మహిళ మృతి
కాకినాడ క్రైం: సెల్ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది. అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సెల్ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం! -
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) సెల్ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్తో స్మార్ట్ వేరబుల్స్ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
జైల్లో మరో సెల్ఫోన్ గుర్తించిన అధికారులు
-
ఆటో స్టీరింగ్పై సెల్ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ..
లంగర్హౌస్: ఆటో స్టీరింగ్పై సెల్ఫోన్ పెట్టి రీల్స్ చూస్తూ.. చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకొన్న డ్రైవర్ ఆగిఉన్న ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు అతడికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన కార్తీక్, సంగారెడ్డికి చెందిన తరుణ్ రెడ్డి, సాతి్వక్, ఖమ్మంలో నివాసం ఉండే స్వరాజ్, ఆసిఫాబాద్కు చెందిన హరికృష్ణ ప్రాణ స్నేహితులు. వీరు ఇబ్రహీంబాగ్లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహబూబాబాద్కు చెందిన వివేక్ మెకానికల్ ఇంజినీరింగ్లో ఈ ఏడాది చేరాడు. వీరు లంగర్హౌస్ బాపునగర్లోని పీఎస్ఆర్ హాస్టల్లో.. వివేక్ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరు మంగళవారం ఉదయం 11 గంటలకు పరీక్షలు రాయాల్సి ఉండటంతో లంగర్హౌస్ బాపుఘాట్ వద్ద ఆటోలో బయల్దేరారు. రాందేవ్గూడ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో డివైడర్ పక్కనే ఓ ఆటో ట్రాలీ నిలిచి ఉంది. విద్యార్థులున్న ఆటో వేగంగా వచ్చి వెనక నుంచి ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వివేక్, కార్తీక్, ఆటో డ్రైవర్ మల్లే‹Ùలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: క్షతగాత్రులు ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న విద్యార్థులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఆటో డ్రైవర్ స్టీరింగ్పై సెల్ఫోన్లో రీల్స్ చూస్తున్నాడని, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడని క్షతగాత్రులు తెలిపారు. రోడ్డుపై ఆటో ట్రాలీ ఆగిఉన్న విషయం తాము గమనించి అరిచినా.. డ్రైవర్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో వినిపించలేదని.. అతని కళ్లు రీల్స్పై ఉండటంతో అంతే వేగంగా దూసుకెళ్లి ఆటో ట్రాలీని ఢీకొన్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆటో డ్రైవర్ మల్లే‹Ùను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి శ్రీధర్బాబు నివాసంలో సెల్ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నివాసంలో సెల్ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
నగరమంతా తిప్పి.. సెల్ఫోన్తో ఉడాయించి..
బంజారాహిల్స్: కస్టమర్ బుక్ చేసిన మేరకు సదరు యువకుడిని గమ్యస్థానానికి చేర్చేందుకు యత్నంచగా.. రకరకాల కారణాలతో నగరమంతా తిప్పి చివరకు బాధితుడి సెల్ఫోన్తో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కొండాపూర్లో నివసించే సావనం చంద్ర మహేష్ బాబు ర్యాపిడో నడుపుతూ పొట్టపోసుకుంటున్నాడు. ఈ నెల 18న రాత్రి 8 గంటల ప్రాంతంలో డెలాయిట్ ఆఫీసు గచ్చిబౌలిలో పని చేసే నితిన్ అనే యువకుడి నుంచి బుకింగ్ ఆర్డర్ వచ్చింది. కొండాపూర్ ఏఎంబీ మాల్ వద్ద తనను డ్రాప్ చేయాల్సిందిగా నితిన్ బుకింగ్ ఆర్డర్ పెట్టాడు. దీంతో మహేష్ బాబు ఆ యువకుడిని ఎక్కించుకుని ఏఎంబీ మాల్ వద్ద దింపాడు. తన స్నేహితుడి వద్ద డబ్బు తీసుకువస్తానని మాల్లోకి వెళ్లిన కొద్ది సేపటికే నితిన్ బయటకు వచ్చి తన స్నేహితుడు ఇక్కడ లేడని, కూకట్పల్లికి తీసుకువెళ్లాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన ర్యాపిడో డ్రైవర్ మహేష్ వెంటనే నితిన్ను కూకట్పల్లికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితుడు కృష్ణానగర్ వెళ్లాడని, అక్కడ దింపాలని కోరాడు. దీంతో బాధిత ర్యాపిడో డ్రైవర్ జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని అల్కజర్ మాల్ వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు దింపాడు. ఫోన్ పే చేయడానికి తన స్విచ్ఛాప్ చేసి ఉందని, ఒకసారి ఫోన్ ఇస్తే తన స్నేహితుడికి చెప్పి డబ్బులు తెప్పించుకుంటానని అడిగాడు. దీంతో నితిన్కు మహేష్ తన ఫోన్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఓ గల్లీలోకి వెళ్లిన నితిన్ ఎంతకీ తిరిగిరాలేదు. రెండు గంటలు గడిచినా రాకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించినా ఫలి తం లేకుండాపోయింది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 318, 303(2)ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
గుడిలో దుర్గమ్మను ఫొటో తీసేందుకు భక్తుడి యత్నం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఓ భక్తుడు నిబంధనలను అతిక్రమించి సెల్ఫోన్తో దుర్గగుడిలోకి ప్రవేశించాడు. అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. దీనిని గుర్తించిన ఆలయ అధికారులు ఆ భక్తుడి నుంచి సెల్ఫోన్ లాక్కుని హుండీలో వేసిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వారం క్రితం కూడా ఓ భక్తుడు అమ్మవారి మూలవిరాట్ను సెల్ ఫోన్తో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన సంగతి విదితమే. ఆదివారం నుంచి భక్తులు ఎవరూ సెల్ఫోన్తో ఆలయంలోకి ప్రవేశించకుండా ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని మైక్ ప్రచార కేంద్రం నుంచి పదే పదే సెల్ఫోన్లతో ఆలయంలోకి ప్రవేశించవద్దని సూచనలు చేస్తూనే ఉన్నారు. అయితే సోమవారం రాత్రి ఓ భక్తుడు తన ఖరీదైన సెల్ఫోన్తో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని ఫొటో తీసేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది వెంటనే గమనించి కేకలు వేయడంతో ఆ భక్తుడు సెల్ఫోన్ తీసుకుని రావిచెట్టు వైపు పరుగు తీశాడు. ఆ భక్తుడికి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఆలయ ఈఓ రామరావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆ భక్తుడి నుంచి సెల్ఫోన్ తీసుకుని ఆలయంలో ఉన్న హుండీలో వేశారు. హుండీ కానుకల లెక్కింపు సమయంలో సెల్ఫోన్ను బయటకు తీస్తారని, అప్పుడు దానిని ఏమి చేయాలో ఆలోచిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
సెల్ఫోన్తో నో ఎంట్రీ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్ఫోన్తో అంతరాలయంలో మూలవిరాట్ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటనపై దుర్గగుడి అధికారులు సోమవారం సీరియస్గా స్పందించారు. సోమవారం ఉదయం నుంచి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకంగా తనిఖీలు చేసిన తర్వాతే కొండపైకి అనుమతించారు. దర్శనం కోసం క్యూలైన్లోకి ప్రవేశించే ముందే భక్తులతో పాటు వారి బ్యాగులు, లగేజీలను పూర్తిగా తనిఖీ చేశారు. క్యూలైన్లోకి ప్రవేశించిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించే మార్గాల వద్ద మరోమారు తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం, రూ. 100, రూ.300, రూ.500 టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించడంతో పాటు సెల్ఫోన్తో ఉన్న భక్తులను బయటకు పంపేశారు. దీంతో ఒకరిద్దరు భక్తులు సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినా వారిని బయటకు పంపేశారు. కొంత మంది ఇదే విషయాన్ని వీడియో రికార్డు చేసి మరో మారు సోషల్మీడియాలో అప్లోడ్ చేశారు. సెల్ఫోన్లతో క్యూలైన్లోకి వస్తే, మళ్లీ కౌంటర్ వద్దకు వెళ్లాల్సి వస్తుందని, దీంతో గంట సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముందుగానే సెల్ఫోన్లను కౌంటర్లో పెట్టుకుని రావాలని ఆలయ సిబ్బంది సూచిస్తున్నారు. మరో వైపున భక్తులెవరిని ఎట్టి పరిస్థితులలోనూ సెల్ఫోన్తో ఆలయంలోకి పంపే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అలాగే మహా మండపం రాజగోపురం వద్ద, లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద, నటరాజ స్వామి వారి ఆలయం వద్ద సెల్ఫోన్లతో ఫొటోలు దిగే వారిని వారించారు. కొంత మంది నుంచి సెల్ఫోన్లను తీసుకునే ప్రయత్నం చేయడంతో వాదనలు జరిగాయి. సెల్ఫోన్లను ఆలయంలోకి అనుమతించకుండా ఇదే విధంగా కట్టుదిట్టంగా వ్యవహరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
HYD: చిలుకలగూడలో కాల్పలు కలకలం
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. -
రూ.21లక్షల విలువ చేసే 130 సెల్ఫోన్లు స్వాధీనం..!
డోన్ టౌన్: పట్టణంలోని చిగురమానుపేటలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో రూ.21 లక్షల విలువ చేసే 130 సెల్ ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు.పట్టణంలో సమస్యాత్మకమైన చిగురమానుపేటలో పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్కుమార్, అస్రత్బాషా, పట్టణ, రూరల్ ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డిలతో పాటు జలదుర్గం ఎస్ఐ విజయ్కుమార్లు మూడు పోలీసు స్టేషన్ల సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా కాలనీకి చెందిన ఎరుకలి రవి అలియాస్ పిలక రవి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఒక లగేజ్ బ్యాగ్లో దొంగలించుకొచ్చిన 130 సెల్ఫోన్లు, రూ.1,48,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమీప బంధువులు ఎరుకలి నవాగ్ మరియు ఎరుకలి పవన్లు తమిళనాడు రాష్ట్రంకు వెళ్ళి అక్కడ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగలించేవారన్నారు. వాటిని రవికి ఇవ్వగా హైదరాబాద్కు తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా నిజాముద్ధీన్ అలియాస్ ఖైజర్కు ఒట్టుగా అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ.21 లక్షలు ఉంటుందన్నారు. పైన తెలిపిన ముద్దాయిలు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
సెల్ఫోన్తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
సెల్ఫోన్తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
సెల్ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మీ సెల్ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్కు మెసేజ్ చేస్తే.. సెల్ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్గా వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్ఫోన్ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
బైక్పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
హైటెక్ కాపీయింగ్:సెల్ఫోన్తో గ్రూప్-4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్కు తెరలేపాడు. సెల్ఫోన్ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్లు, ఆఫీస్ మీటింగ్లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
సెల్ఫోన్ నిజామాబాద్లో పోయింది.. దుబాయ్లో దొరికింది!
మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్ ఫోన్. అటువంటి ఫోన్ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్ఫోన్ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ దుబాయ్లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో సెల్ఫోన్ పోతే అది దుబాయ్లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్ఫోన్ను దుబాయ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్రెడ్డి.. ఆ సెల్ఫోన్ను అప్పగించారు. -
భయం.. తత్తరపాటు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ హత్య కేసులో మృతుడు నవీన్ శరీర భాగాలు పోలీసులకు ఇంకా దొరకలేదు. హతుడి ఫోన్తో పాటు నిందితుడు హరిహరకృష్ణ సెల్ఫోన్లు సైతం ఇంకా స్వాదీనం చేసుకోలేదు. దీంతో తొలిరోజు కస్టడీలో నిందితుడు హరిని పోలీసులు ఆయా వివరాలను రాబట్టే కోణంలోనే విచారించారు. గత నెల ఫిబ్రవరి 17న ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ను స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 24న నిందితుడు హరి అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడిని ఈనెల 9వ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి నిందితుడిని తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎలాంటి భయం, తత్తరపాటు లేకుండా నిందితుడు సమాధానాలు ఇచ్ఛినట్లు తెలిసింది. హత్య కేసులో మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు నిందితుడు హరిని హత్య జరిగిన ప్రాంతం అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సీన్–రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సెల్ఫోన్తో ఠాణాకు.. హత్య తర్వాత హరి మరొక స్నేహితుడు హసన్ ఇంట్లో ఆ రోజు రాత్రి నిద్రించి మర్నాడు ఉదయం కోదాడ, విజయవాడ, విశాఖపట్నం మీదుగా తిరిగి.. సొంతూరైన వరంగల్కు చేరుకున్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని తండ్రి సూచించడంతో తిరిగి హైదరాబాద్కు వచ్ఛిన హరి.. ప్రేమికురాలిని కలిసి నవీన్ హత్య గురించి వివరించారు. ఆమె సూచన మేరకు ఫిబ్రవరి 24న అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అప్పటికే హరి వినియోగిస్తున్న సెల్ఫోన్ను ధ్వంసం చేసి.. కొత్త సెల్ఫోన్ తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ సెల్ఫోన్నే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇది కొత్త ఫోన్ అని గుర్తించిన పోలీసులు.. హత్యకు ముందు సెల్ఫోన్ గురించి కస్టడీ విచారణలో పోలీసులు ఆరా తీయగా.. తాను వాడేది ఇదే ఫోన్ అని బుకాయించినట్లు తెలిసింది. -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్రెడ్డి తెలిపారు. -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్కి ఒక దొంగ కస్టమర్లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్.. స్కూల్కు సెల్ఫోన్ తీసుకొచ్చాడని..
సికింద్రాబాద్: స్కూల్కు సెల్ఫోన్ను తీసుకొచ్చాడని విద్యార్థిని.. ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్గిరి ఆర్కే పురంలోని గాంధీనగర్కు చెందిన కొండా దినేష్ రెడ్డి (15) ఏఓసీ సెంటర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం దినేష్ రెడ్డి పాఠశాలకు సెల్ఫోన్ తీసుకెళ్లాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ పద్మజ వెంటనే దినేష్ను మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్ తెచ్చినందుకు 12 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయం విద్యార్థి తండ్రి రమణారెడ్డికి కూడా చెప్పి విద్యార్థిని అతడితోపాటు పంపారు. ఇంటికి వెళ్లిన దినేష్రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై.. సోమవారం సాయంత్రం అమ్ముగూడ స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సనత్నగర్: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల పరంపర కొనసాగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వరుసగా రియల్ ఎస్టేట్ సంస్థలపైనా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ దాడులు జరుపు తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రెండు వస్త్ర దుకాణాలతోపాటు సెల్ఫోన్ విక్రయ సంస్థలపైనా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. ఐటీ అధికారులు డజ నుకు పైగా బృందాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు చేశారు. ఈసారి కేంద్ర బలగాల బలగాల పహారాలో దాడులు నిర్వ హించడం గమనార్హం. అమీర్పేట, కూకట్ పల్లి, దిల్సుక్నగర్తోపాటు పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ఇండియా షాపింగ్మాల్స్పైనా.. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న లాట్ మొబైల్స్, బిగ్ సీ దుకాణాలపైనా దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్డిస్క్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ మాల్స్లోకి వినియోగదారులను రానీయకుండా సోదాలు నిర్వహించారు. హానర్లో పెట్టుబడులు పెట్టినందుకేనా... ఆర్ఎస్ బ్రదర్స్ ఈమధ్య పెద్దఎత్తున రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగినట్లు తెలిసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో హానర్ రిచ్మండ్ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ వస్త్ర దుకా ణాలు, మొబైల్ విక్రయాల సంస్థల యజ మానులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్ గ్రూపు 28.4 ఎకరాల్లో 142 ప్లాట్లలో విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్సీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానర్ గ్రూపు జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. -
ఒకప్పటి స్టేటస్ సింబల్.. నేడు మ్యూజియంలో వస్తువుగా..
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్లైన్ ఫోన్ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది. కాలగమనంలో అరచేతిలోకి సెల్ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్లైన్కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్గా నిలిచిన ‘ల్యాండ్లైన్ ఫోన్’.. సెల్ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్ ఫోన్కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్లైన్ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది. గ్రామగ్రామానా జియో టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్లైన్ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది. అది ఒకప్పటి స్టేటస్ సింబల్ సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్కు కాల్ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు. అందుకే ఫోన్ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్ తప్పసరి కావడంతో ల్యాండ్ఫోన్ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి. ఉపాధికి కేరాఫ్గా ఎస్టీడీ బూత్లు ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్లైన్ స్థానంలో కాయిన్బాక్స్లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్లైన్ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2015 నుంచి డౌన్ఫాల్ 2000 సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్ఫోన్ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్ కొనుక్కోవాలి. ల్యాండ్ఫోన్ కనెక్షన్కు డిపాజిట్ కట్టి ఫోన్ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్ ఫోన్ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్లకు డౌన్ఫాల్ మొదలైంది. – రామాంజనేయరెడ్డి, ఎస్డీఓటీ, ఆళ్లగడ్డ అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు ల్యాండ్ఫోన్ ఖర్చుతో పోల్చితే మొబైల్ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్ఫోన్ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్లైన్ ఫోన్లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు. – రమణ, అహోబిలం -
మొబైల్ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!
యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సెల్ఫోన్ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్ ఫోన్లయినా; కేవలం కాల్స్, మెసేజ్లు మాత్రమే పంపగల సింపుల్ ఫోన్లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్లు సాయపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్ టవర్కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో రష్యా–ఉక్రెయిన్ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్ వుడ్వర్డ్. ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్–3’ అనే సిస్టమ్ను తయారు చేశారు. ఇందులో మొబైల్ ఫోన్ టవర్స్లాగ పనిచేసే డ్రోన్స్ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వివరంగా రాశారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్ అంటే కంప్యూటర్ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్’ సిస్టమ్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!) ఇక స్మార్ట్ ఫోన్లలో ‘జీపీఎస్’ అనే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్ హేగెన్ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు) బాల్టిక్ స్టేట్స్లోనూ, అఫ్గానిస్తాన్లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్ ఇంటీరియర్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది. - డాక్టర్ కె.బి. గోపాలం రచయిత, అనువాదకులు -
Crime News: ప్రియురాలి ఉసురు తీసిన సెల్ఫోన్ గిఫ్ట్
ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం సహజం. అలాగే ప్రేమలో బ్రేకప్లు కూడా సర్వసాధారణమే. కానీ, మరో యువతితో పెళ్లి ఫిక్స్ కావడంతో బ్రేకప్ చెప్పిన ఆ ప్రియుడి తీరును ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. ప్రియురాలిపై కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. తాను కానుకగా ఇచ్చిన సెల్ఫోన్.. తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియురాలిని ఏకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. జార్ఖండ్లోని పాకుర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, సదరు బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో కూడా తెలుసు. అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు చెప్పకపోతే ఈ ఏడాదిలో వీళ్లద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కూడా. అయితే.. ఈ మధ్యే ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు తాను కొనిచ్చిన కాస్ట్లీ ఫోన్ను తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను అడుగుతూ వస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక మైదానంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి సెల్ఫోన్ తీసుకెళ్లాడు. రక్తపు మడుగులో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు. -
మేకలు అమ్మి ఫోన్ కొనిస్తే! ఆ కొడుకేమో..
భర్త కాలం చేసింది చానారోజులే అయ్యింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించేందుకు అహర్నిశలు కష్టపడేది ఆ తల్లి. కొడుకు సరస్వతి పుత్రుడు. అందుకే ఆన్లైన్ సదువుకు ఫోన్ కావాలని అడగ్గానే.. ఉన్న రెండు మేకలను అమ్మేసి కొడుకు చేతులో సొమ్ములు పెట్టింది ఆ తల్లి. కానీ, ఆ బిడ్డ.. ఆ తల్లి నమ్మకాన్ని మాత్రమే దెబ్బ తీయలేదు. కటకటాల పాలై జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు కూడా. బిహార్ నవాడా జిల్లా థాల్పోస్ గ్రామం ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం.. ఆ ఊరి నుంచి సైబర్ నేరాలనుగానూ పోలీసులు అరెస్ట్ చేయడం. జిల్లావ్యాప్తంగా ఒకే తరహాలో జరిగిన స్కామ్లో మొత్తం 33 మందిని అరెస్ట్చేస్తే.. అందులో 31 మంది థాల్పోస్ గ్రామం నుంచే కావడం ఆశ్చర్యం కలిగించేదే కదా!. అందునా నేరాలకు పాల్పడింది 14 నుంచి 40 ఏళ్లలోపు వాళ్లే కావడం గమనార్హం. అందులో ఒకడే 19 ఏళ్ల గుల్షన్. అరెస్ట్ అయిన చాలామంది ఈపాటికే బెయిల్ మీద బయటకు వచ్చారు. కొందరేమో ఆర్థిక స్థితి బాగోలేక జైల్లోనే ఉండిపోయారు. మరికొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నారు. గుల్షన్ తండ్రి చనిపోయాక అన్నితానై చూసుకుంది ఆ తల్లి. అలాగని గుల్షన్ సుద్దమొద్దు కాదు. 2019లో పదవ తరగతి ఫస్ట్ డివిజన్లో పాసయ్యాడు. ముఖ్యమంత్రి బాలక్ బాలికా ప్రోత్సాహన్ యోజన కింద 10 వేల రూపాయల స్కాలర్షిప్ కూడా అందుకున్నాడు. స్థానికంగా ట్యూషన్స్ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ.. తల్లి, తమ్ముడి పోషణలో భాగం అయ్యాడు కూడా. అలాంటోడి జీవితాన్ని సెల్ఫోన్ దెబ్బ తీసింది. సులువుగా డబ్బు సంపాదించాలన్నా దుర్భుది.. అతని కుటుంబం పరువు తీయడంతో పాటు వ్యక్తిగతంగా ఆ కుర్రాడిని కటకటాల పాల్జేసింది. అతనికి బెయిల్ ఇప్పించే పరిస్థితిలోనూ లేదు 42 ఏళ్ల సర్విలా దేవి. అరెస్ట్ అయిన చాలామందివి పేద కుటుంబాలే. కాస్తో కూస్తో చదువుకున్నారు. అప్పో సొప్పో చేసి స్మార్ట్ఫోన్లు కొని సైబర్నేరాలకు పాల్పడ్డారంతా. ఓటీపీ నేరాల దగ్గరి నుంచి, నకిలీ ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే దాకా.. వాళ్లు పాల్పడి నేరాలంటూ లేవు. ఉన్నంత చదువు, ఆన్లైన్ మోసాలపై పెంచుకున్న జ్ఞానం వాళ్లతో నేరాలు చేయించింది. ఊరిలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. పోలాల దగ్గర, బోరు బావిల దగ్గర, ఊళ్లో చెట్ల అరుగుల మీద కూర్చుని ఈ నేరాలకు పాల్పడ్డారని థాల్పోస్ ఎస్సై బెయిడ్నాథ్ ప్రసాద్ చెప్తున్నారు. బీహార్లో నమోదు అయ్యే సైబర్ నేరాలు తక్కువేం కాదు. ఒక్క నవాడా జిల్లా పరిధిలో 2019-20 మధ్య 18 కేసులకుగానూ 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020-21లో ఆ సంఖ్య 14 కేసులకు 30 మందికి చేరింది. కానీ, 2022లో అదీ మార్చి వరకే 11 కేసుల్లో 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంతా. పేదరికం, కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, వలస కూలీలకు పనులు లేకపోవడం, బడిలు బంద్ కావడంతో చాలామంది ఇటువంటి నేరాల వైపు మళ్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ ద్వారా వీళ్లలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది పోలీస్ శాఖ. -
ఉపాధ్యాయులకు షాక్.. క్లాస్ రూమ్స్లో ఫోన్ల వాడకంపై ఆంక్షలు
డెహ్రాడూన్: క్లాస్ రూమ్స్లో ఫోన్లు వాడే టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. క్లాస్ రూమ్ల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ శంకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా టీచర్ల వద్ద క్లాస్ రూమ్స్లో ఫోన్లు కలిగి ఉన్నట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తరగతి గదుల్లో కూడా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో బిజీగా గేమ్స్ ఆడటం, చాటింగ్లు చేయడం వంటివి గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుండి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులు, ఫిర్యాదులను ధృవీకరించడానికి అధికారులను పంపించినట్టు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వారు మొబైల్ ఫోన్లు లేకుండా తరగతి గదిలోకి ప్రవేశించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పాండే చెప్పారు. అయితే, టీచర్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలియజేసారు. కాగా, ప్రిన్సిపాల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్ తమ వద్ద పెట్టుకోవచ్చనని సూచించారు. ఈ క్రమంలోనే తమ ఆకస్మిక తనిఖీల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఫోన్ను వాడుతున్నట్టు గమినిస్తే.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ కూడా బాధ్యత వహించాలన్నారు. Following complaints from students, parents that teachers were engaged with their phones in classrooms, an order has been issued which makes it mandatory for teachers to deposit their phones to Principal. Strict action in case of violation:Vinay S Pandey, Haridwar DM, Uttarakhand pic.twitter.com/B4GVDVwKcU — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022 -
AP Assembly: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్ ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. -
సెల్ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్
చెన్నై: సెల్ఫోన్ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రమణియన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours. Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J — ANI (@ANI) March 15, 2022 -
ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
సాక్షి,బంట్వారం(వికారాబాద్): ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలిచడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడే. ఈ సంఘటన బుధవారం కోట్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన ప్రకారం.. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి అఖిలేష్ (20) జహీరాబాద్ మహీంద్రా కంపెనీలో అప్రెంటీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఫోన్ మాట్లాడే విషయంలో కుమారుడిని తండ్రి మందలించాడు. చదవండి: జేపీ నేతల పెట్రోల్ దాడి.. ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మృతి దీంతో మనస్తాపం చెందిన అఖిలేష్ మంగళవారం ఇంట్లో నుంచి బైక్ పై వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు బుధవారం కోట్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అఖిలేష్ బైక్ను నాగసమందర్ సమీపంలో కోట్పల్లి ప్రాజెక్టు తూము కాల్వ దగ్గర గుర్తించారు. బోటింగ్ నిర్వాహకుల సాయంతో అఖిలేష్ మృతదేహన్ని చెరువులో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరాజు చెప్పారు. చదవండి: ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో -
ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్పేటలో ఉంటున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు తరుణ్ పట్టణంలో ఫుడ్ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్కు సమాచారం వస్తుంది. ఈ యాప్లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఆ ఇంట్లో ఎటుచూసినా సెల్ఫోనే!:కొట్టేసినవి కాదు.. కొన్నవే
ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్బోర్డులు, బెడ్రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు. ‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్మెంట్లో. ప్రస్తుతం నా కలెక్షన్స్లో 3,500 హ్యాండ్సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్. ఆ ఘటన తర్వాత.. చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు. భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను. పాత వీడియో చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు.. -
హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం.. చీకటిలో యువతిని చూస్తూ..
బెంగళూరు: కర్ణాటకలోని యలహంక పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గత ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. వివరాలు.. కర్ణాటకలోని యలహంక ప్రాంతంలో ఒక 26 ఏళ్ల యువతి అర్దరాత్రి వీధికుక్కలకు ఆహరం వేయడానికి బయటకు వచ్చింది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అప్పుడు ఆమెకు కాస్త దూరంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి చీకట్లో నిలబడి యువతిని చూస్తూ అసభ్యకరరీతిలో ప్రవర్తించాడు. అంతటిలో ఆగకుండా.. అతని సెల్ఫోన్ టార్చ్లైట్ను ఆన్చేసి యువతి దుస్తులపై పడేలా చేశాడు. దీన్ని చూసిన యువతి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. వెంటనే గట్టిగా అరించింది. దీంతో భయపడిపోయిన చంద్రశేఖర్.. తాను పోలీసు కానిస్టేబుల్ అని, అమృతహళ్లి పోలీస్స్టేషన్లో పనిచేస్తానని తెలిపాడు. అతని విపరీత చర్యను ఒక బాటసారి కూడా వీడియో తీశాడు. ఈ క్రమంలో భయపడిపోయిన కానిస్టేబుల్ ఆ వీడియో తొలగించాలని కోరాడు. ఇది బయటకు వస్తే తన ఉద్యోగం పోతుందని ప్రాధేయ పడ్డాడు. కాగా, ఘటన జరిగిన రెండు రోజులకు బాటసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది వైరల్గా మారింది. దీంతో గమనించిన అధికారులు హెడ్ కానిస్టేబుల్ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖలో కలకలంగా మారింది. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
Guntur: ఫోన్ మాట్లాడుతుండగా బస్సు ఢీకొని యువకుడు మృతి
తాడేపల్లిరూరల్: సెల్ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన పాలకొండ సుబ్రహ్మణ్యం (38) జుమోటాలో పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముండేవాడు. వారి ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు రావడంతో విజయవాడ బదిలీ చేయించుకున్నాడు. తాడేపల్లిలో విధులు ముగించుకుని విజయవాడ మొగల్రాజపురంలోని తన నివాసానికి వెళుతుండగా మార్గంమధ్యలో ఉండవల్లి సెంటర్ స్క్రూ బిడ్డి వద్దకు వచ్చేసరికి ఫోన్ రావడంతో బండి పక్కకు తీసి మాట్లాడుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేయగా అప్పటికే సుబ్రహ్మణ్యం శరీరం మీదకు బస్సు వెనుక టైర్లు ఎక్కాయి. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బస్సుకింద ఉన్న సుబ్రహ్మణ్యాన్ని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాడు. చదవండి: ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ -
సీఎం జగన్ ఆదేశాలు: పెద్దమ్మా.. ఇదిగో సెల్ఫోన్!
తిరుపతి తుడా: సీఎం జగన్తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్ పోగొట్టుకున్న ఓ మహిళ బుధవారం కొత్త సెల్ఫోన్ అందుకుంది. వివరాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని సరస్వతి నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు సీఎం జగన్తో సెల్ఫీ దిగేందుకు ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో తూకివాకం విజయ సెల్ఫోన్ జారి కాలువలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్.. ‘పెద్దమ్మా, మీకు కొత్త ఫోన్ ఇప్పించే బాధ్యత నాది. బాధపడవద్దు’ అని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ పీఎస్ గిరీష కొత్త సెల్ఫోన్ను డాక్టర్ రవికాంత్ ద్వారా ఆమెకు అందజేశారు. ‘నన్ను ఓదార్చడానికి జగన్బాబు అలా చెప్పారనుకున్నా. గుర్తుపెట్టుకొని నిజంగా సెల్ఫోన్ పంపిస్తారనుకోలేదు’ అంటూ విజయ సంతోషం వ్యక్తం చేసింది. (చదవండి: టీటీడీ విధానాలే మిగతా ఆలయాల్లోనూ..) -
చిరునవ్వుతో భర్తకు ఎదురెళ్లింది.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే..
పెళ్లి ముచ్చట తీరనేలేదు.. ఇంటిముంగిట కట్టిన తోరణాలు తొలగనేలేదు.. అన్యోన్యంగా జీవించే నవదంపతులు క్షణికావేశానికి గురయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరితర్వాత ఒకరు మృత్యుఒడికి చేరుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. సాక్షి, కొత్తవలస (విజయనగరం): జీవనోపాధికోసం బైక్పై బయలుదేరిన భర్తకు చిరునవ్వుతో ఎదురెళ్లిన భార్య.. ఏమైందో తెలియదు.. కొద్ది నిమిషాల్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ వార్త తెలుసుకున్న భర్త సైతం భార్య మార్గంలోనే మృత్యుఒడికి చేరుకున్న విషాదకర ఘటన కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము (30) జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రాము తల్లి ఈశ్వరమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో తండ్రి అప్పారావు, చెల్లి కనకలు, బావ అప్పారావు కలిసి ఒకే ఇంటిలో నివసిస్తున్నారు. ఈ ఏడాది జూలై 1న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కొండల వెంకటహేమదుర్గ(29)తో రాము వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగానే జీవించేవారు. కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతంలో సర్దుకుపోతూ ఆనందంగా గడిపేవారు. ఈ జంటను చూసి గ్రామస్తులు ముచ్చటపడ్డారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో భర్తతో పాటు ఆడపడుచు భర్త అప్పారావు బైక్పై విధులకు వెళ్లే సమయంలో హేమదుర్గ చిరునవ్వుతో ఎదురొచ్చింది. అనంతరం మేడపైకి వెళ్లి ఎంతసేపటికీ కిందకి రాకపోవడంతో పిలిచేందుకు ఆడపడుచు వెళ్లింది. అప్పటికే ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించింది. ఇరురుపొరుగువారిని పిలిచి వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చదవండి: (విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..) తమ్ముడు,మరదలు చనిపోవడంతో విలపిస్తున్న రాము అక్క లక్ష్మి సెల్ఫోన్ వల్లేనా? హేమదుర్గ పెళ్లికి ముందు పెద్దాపురంటౌన్లోని 8వ వార్డు వలంటీరుగా పనిచేసేది. వివాహానంతరం మానేసింది. విషయం తెలియని అక్కడి గ్రామస్తులు ఏదో ఒక సమస్య చెప్పేందుకు తరచూ ఫోన్లు చేసేవారు. విధులు మానేశాక కూడా ఫోన్లు రావడంతో సున్నిత మనస్కుడైన రాము సిమ్ను తీసేయాలని హేమకు సూచించాడు. ఇదే క్రమంలో ఈనెల 23న దంపతులిద్దరూ పెద్దాపురం వెళ్లినప్పుడు సెల్సిమ్ మార్చమని బావమరిది జగదీశ్వరరావుకు రాము చెప్పాడు. ఆయన వద్దే సెల్ వదిలి వీరిద్దరూ ఈ నెల 27న తిరిగి చీపురువలస చేరుకున్నారు. ఎప్పటిలాగే కలసిమెలసి ఉన్న హేమదుర్గ భర్తను విధులకు సాగనంపి ఆత్మహత్యకు పాల్పడింది. చెల్లి ద్వారా విషయం తెలుసుకున్న రాము మనస్థాపానికి గురయ్యాడు. తను కూడా చనిపోతానంటూ స్నేహితులకు ఫోన్లో తెలిపి స్విచ్ఆఫ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన కోసం రెండుగంటల పాటు వెతికారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో చీపురువలస గ్రామ సరిహద్దుల్లో ఉన్న దాట్లాహోం వద్ద కాగుచెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న సీఐ బాలసూర్యారావు, ఎస్సై జనార్దన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాలను పరిశీలించారు. తహసీల్దార్ రమణారావు, సర్పంచ్ మచ్చ ఎర్రయ్యస్వామి, గ్రామపెద్దల సమక్షంలో ఇద్దరి మృతదేహాలకు శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. హేమదుర్గ సోద రుడు జగదీశ్వరరావు (పెద్దాపురం) సెల్ఫోన్ విషయమై గొడవలు పడుతున్నారని ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
స్క్రీన్ లేని స్మార్ట్ఫోన్,నెక్ట్స్ జనరేషన్ ఫోన్లన్నీ ఇలానే ఉంటాయ్?
స్క్రీన్లెస్ సెల్ఫోనా? స్క్రీన్లేని సెల్ఫోన్ను ఏం చేసుకుంటారు? ఏడ్చినట్లే ఉంటుందనుకుంటున్నారా? ఫొటోలో కనిపిస్తున్న ఈ సెల్ఫోన్కు బొత్తిగా స్క్రీన్ లేకపోవడమేమీ కాదుగాని, స్క్రీన్ మీద కేవలం బ్యాటరీ మాత్రమే కనిపిస్తుంది. నంబర్లు, పేర్లు వగైరా సమాచారమేమీ కనిపించదు. ఇది పాకెట్ ట్రాన్సిస్టర్లు, క్యాలికులేటర్లు వంటి వాటిలో వాడే ‘ఏఏ’ సైజ్ బ్యాటరీతో పనిచేస్తుంది. సింగపూర్లోని టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘నెక్ట్స్ ఆఫ్ కిన్ క్రియేటివ్స్’ రూపొందించిన ఈ స్క్రీన్లెస్ సెల్ఫోన్కు ‘స్పేర్వన్ ఫోన్’ అని పేరు పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది భేషుగ్గా ఉపయోగపడుతుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఫోన్ నంబర్లను సేవ్ చేసుకునేందుకు మెమొరీ, బేసిక్ సెల్ఫోన్ మాదిరి బటన్ కీబోర్డ్తో పాటు రాత్రివేళల్లో ఉపయోగపడేలా శక్తిమంతమైన ఎల్ఈడీ టార్చ్లైట్ మాత్రమే దీనిలో ఉండే ప్రత్యేక సౌకర్యాలు. చదవండి: రేసిజం ఎఫెక్ట్..వరల్డ్ ఫేమస్ టిక్ టాకర్కు షాక్ -
మోండాలో సెల్ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్ఫోన్ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్డ్రెస్లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
ఫోన్ మింగిన ఘనుడు.. కడుపులోకి వెళ్లగానే..
ప్రిస్టినా: బాగా ఆకలి వేసిందో.. లేక మత్తులో ఉన్నాడో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా నోకియా ఫోన్ను మింగేశాడు. అనంతరం దాన్ని అలానే కడుపులో ఉంచుకోవడంతో ప్రాణం మీదకు వచ్చేసరికి ఆస్పత్రి మెట్లెక్కాడు. కోసోవోలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. యూరప్లోని కోసోవో రిపబ్లిక్ ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్ను మింగేశాడు. ఫలితంగా అతని కడుపులో ఆ ఫోన్ ఇరుక్కుపోవడంతో బాధతో తల్లడిల్లిపోయి ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. అనంతరం లేటెస్ట్ టెక్నాలజీని వాడి, కడుపులోంచి ఫోన్ను బయటకు తీశారు. అతనికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు మాట్లాడుతూ.. అతడికి స్కాన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించాము. అది కడుపులో వెళ్లిన అనంతరం మూడు భాగాలుగా విడిపోయి ఉందని, అన్నింటిని బాగానే బయటకు తీయగలిగామన్నారు. కాకపోతే బ్యాటరీని బయటకు తీసేటప్పుడే ఇబ్బంది ఎదురైందని, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది కడుపు లోపలే పేలిపోయేదని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ మింగాడన్న విషమంపై సమాచారం తెలియలేదు. చదవండి: పబ్లో ‘దెయ్యం’ కలకలం.. వీడియో వైరల్ -
కొత్త రకం మోసం: ఫిట్స్ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత..
పెదకాకాని(గుంటూరు జిల్లా): కింద పడిన వ్యక్తిని పైకి లేపి కూర్చోబెడదామని జాలి తలిస్తే ఫోన్లు మాయం అవుతున్న ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే పెదకాకాని సెంటర్లో రోడ్డు పక్కనే జనాలు ఉన్న ప్రదేశంలో వారు చూస్తూ ఉండగానే ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చిన వాడిలా కిందపడి కొట్టుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం అని జాలి చూపి అతనిని పైకి లేపేందుకు ఒకరు, అతని చేతిలో తాళాలు పెట్టాలని మరొకరు అక్కడికి చేరుకుంటారు. వారితో పాటే కింద పడిన వ్యక్తిని అనుసరిస్తూ వచ్చిన వ్యక్తి కూడా అక్కడికి చేరుకుని సహాయం చేస్తున్నట్లు వారిలో కలుస్తాడు. కొద్దిసేపటికి ఫిట్స్ వచ్చి పడిపోయిన వాడిలా నటించిన వ్యక్తి కోలుకుంటాడు. అతని అనుచరుడు మాత్రం అక్కడ కనిపించడు. కొద్దిసేపటి తరువాత చూసుకుంటే అప్పటికే జేబులో, హడావుడిలో పక్కన పెట్టిన ఫోన్ కనిపించకుండా పోతుంది. పెదకాకాని సెంటర్లో ఇదే తరహాలో కోటేశ్వరరావు ఫోన్ మాయం కాగా, సాయం చేసేందుకు చెయ్యేసిన బోయపాటి రామ్మోహన్ ఫోన్ సుందరయ్యకాలనీ వద్ద కాజేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవీ చదవండి: సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్: నిన్న షాక్.. నేడు ప్రేమపెళ్లి పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి -
ఆకతాయి ఆలోచన.. సరదాగా సెల్ఫోన్ స్నాచింగ్
హిమాయత్నగర్: సరదాగా ట్యాంక్బండ్పైకి షికారుకు వచ్చిన ఆ ముగ్గురు మైనర్లకు ఆకతాయి పని చేయాలనే ఆలోచన తట్టింది. ట్యాంక్బండ్పై ఏదైనా ఆకతాయి పనిచేస్తే దొరికితే కొడతారనే భయం వేసింది. దీంతో ఈ నెల 5న హిమాయత్నగర్ లిబర్టీ రోడ్డువైపు వచ్చారు. అదే సమయంలో అంబర్పేటకు చెందిన బాలకృష్ణ కరీంనగర్ నుంచి లిబర్టీ వద్దకు వచ్చాడు. బస్సులు రాకపోవడంతో సెల్ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో కామాటిపురాకు చెందిన 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు బాలురు ద్విచక్రవాహనంపై వచ్చారు. బాలకృష్ణ చేతిలోని సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించిన డిఎస్ఐ చందర్సింగ్ సీసీ పుటేజీల ఆధారంగా కేవలం 24 గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకు -
ఫోన్ చూపించి, అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పి..
సాక్షి, పెద్దకొడప్గల్(నిజామాబాద్): సెల్ఫోన్ గ్లాస్ను కవర్లో ఉంచి సెల్ఫోన్లుగా చూపించి మోసగిస్తున్న ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన హలావత్ సంతోష్ అనే యువకుడి వద్దకు బుధవారం బైక్పై ఇద్దరు యువకులు వచ్చారు. వారు సంతోష్కు సామ్సంగ్ ఫోన్ చూపుతూ, అత్యవసరంగా డబ్బులు అవసరముందని చెప్పి రూ.24వేల విలువ గల ఫోన్ను రూ.2500కు విక్రయించారు. నిందితులు డబ్బులు తీసుకొని ముందే పర్సులో పెట్టి ఉంచిన గ్లాస్లాంటి ఫోన్ను బాధితుడికి ఇచ్చి బైక్పై వెళ్లిపోయారు. అనంతరం సంతోష్ పర్సులోని ఫోన్ను చూడగా కేవలం ఫోన్ గ్లాస్ మాత్రమే ఉంది. దీంతో తను మోసపోయానని గ్రహించి, నిందితులను వెంబడించారు. పెద్దకొడప్గల్లో నిందితులను పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు పిట్లం మండల పరిధిలోకి వస్తుందని చెప్పి, నిందితులు షామిరోద్దీన్, ఆర్ఫత్లను పిట్లం పోలీస్ స్టేషన్కు తరలించారు. -
మీ సెల్ ఫోన్ పగిలినా దానంతట అదే అతుక్కుంటే?
కోల్కతా: మీ సెల్ ఫోన్ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను రిపేరు చేసుకునే మెటీరియల్ను ఐఐఎస్ఈఆర్ కోల్కతా, ఐఐటీ ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో స్వీయరిపేర్లు చేసుకునే ఎల్రక్టానిక్ గాడ్జెట్లు మనిషి చేతికి వస్తాయి. ఈ ప్రయోగ వివరాలను తాజాగా యూఎస్కు చెందిన సైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఇప్పటికే కొన్నిరకాల సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ ఏరోస్పేస్, ఆటోమేషన్ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా తాము రూపొందించిన ఉత్పత్తి గతంలో వాటి కన్నా పదిరెట్లు గట్టిగా ఉందని సైంటిస్టులు చెప్పారు. అందుబాటులో ఉన్న మెటీరియల్స్కు తమంత తాము రిపేరయ్యేందుకు వెలుతురో, వేడో కావాల్సివస్తుండేది. తాజా మెటీరియల్ సొంతగా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ చార్జితో రిపేరు చేసుకుంటుందని ఐఐటీ ప్రొఫెసర్ భాను భూషణ్ కతువా చెప్పారు. పరిశోధనలో తెలుగువాడు నూతన సెల్ఫ్ రిపేర్ మెటీరియల్ రూపకల్పనలో ఐఐఎస్ఈఆర్ కోల్కతా ప్రొఫెసర్ సి. మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. సరికొత్త తరగతికి చెందిన ఘనపదార్ధాల ఉత్పత్తికిగాను, మల్లారెడ్డి, ఆయన బృందానికి 2015లో ప్రతిష్ఠాత్మక స్వర్ణజయంతి ఫెలోషిప్ను పొందారు. ఈయనతో పాటు మరో సైంటిస్టు నిర్మాల్యఘోష్ సైతం ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలక్ట్రిక్ చార్జిలను సృష్టించే పదార్ధాలే పీజో ఎలక్ట్రిక్ పదారాలు. ఈ చార్జిని ఉపయోగించుకొని స్పటికాలు తిరిగి యథాతధ రూపాన్ని పొందుతాయి. జీవ కణాల్లో రిపేరింగ్ మెకానిజం ఆధారంగా కొత్త పదార్ధం పనిచేస్తుంది. దీన్ని మెబైల్ స్క్రీన్ల నుంచి ఎల్ఈడీ స్క్రీన్ల వరకు అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువులకు వాడవచ్చని సైంటిస్టులు చెప్పారు. -
సెల్ఫోన్ స్వాబ్తో కరోనా నిర్ధారణ పరీక్షలు!
కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. అందుకే కరోనా నిర్ధారణను మరింత తేలికగా చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్కు పరిశోధకులు. ఓ వ్యక్తి ఉపయోగించే సెల్ఫోన్ సహాయం తో తనకు కరోనా ఉందో లేదో తెలుసుకునే ప్రక్రియను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్కు చెందిన ’యూనివర్సిటీ కాలేజ్ లండన్’ శాస్త్రవేత్తలు. ప్రతి వ్యక్తీ తాను మొబైల్ మాట్లాడుతున్నప్పుడు వదిలే గాలి ఫోన్కు అంటుకుంటుంది. పుల్ల సహాయంతో సెల్ఫోన్ను రుద్దడం ద్వారా సేకరించిన స్వాబ్తో మరింత తేలిగ్గా... అంటే ముక్కులో పుల్లలు దూర్చి ఇబ్బంది పెట్టకుండానే కరోనా వైరస్ నిర్ధారణ చేయవచ్చునంటున్నారు. ఇది ర్యాపిడ్ టెస్ట్కు ఓ ప్రత్యామ్నాయంగా ఉండగలదని పేర్కొంటున్నారు. ఇలా ఫోన్ స్వాబ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడు అది దాదాపుగా 81%కి పైగా నమ్మకమైనదిగానూ చెబుతున్నారు. అంతేకాదు... ఈ ప్రక్రియతో వ్యాధి నిర్ధారణ కోసం ఖర్చు కేవలం 5 పౌండ్లకు మించదని, ఆర్థికంగానూ ఇది మరింత మంచి మార్గమని చెబుతున్నారు. ‘‘ముక్కునుంచి తీసుకునే చేసే (నేసల్ స్వాబ్) పరీక్షే కోవిడ్ నిర్ధారణకు ఓ గోల్డ్ స్టాండర్డ్. కానీ పెద్ద పెద్ద సమూహాల్లో త్వరగా నిర్ధారణ పరీక్షలు అవసరమైనప్పుడు మాస్ టెస్టింగ్ కోసం ఈ ‘ఫోన్ స్వాబ్’ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. ‘‘మనం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, అలాగే దాన్ని ముట్టుకోవడం వల్ల ఒకవేళ మనలో వైరస్ ఉంటే... వాటిని ఫోన్ స్వాబ్ ద్వారా సేకరించి పరీక్షించడం వల్ల నమ్మకమైన ఫలితాలే వస్తాయి. దాంతో అటు పరీక్షలకు అయ్యే ఖర్చులూ తగ్గుతాయి. ఫలితాలు వేగంగానూ వస్తాయి ’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ రోడ్రిగో యంగ్. ఇంకా చెప్పాలంటే చిలీలోని డయాగ్నోసిస్ బయోటెక్ అనే సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉండగా, దక్షిణ అమెరికాలోని కొన్ని స్కూళ్లలోనూ ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద సమూహాల్లో భారీగా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
కొత్త సెల్ఫోన్: బైక్ దిగగానే ఒక్కసారిగా షాక్..
సోమందేపల్లి: మొబైల్షాపులోని కొత్తసెల్ఫోన్తో ఓ అపరిచిత వ్యక్తి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల మొబైల్షాప్కు బుధవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తాను పక్కనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడినని పరిచయం చేసుకున్నాడు. తోటి మహిళా ఉపాధ్యాయురాలికి సెల్ఫోన్ కొనేందుకు వచ్చానని, వీవో కంపెనీకి చెందిన రూ.18వేలు విలువ చేసే పీస్ని ఎంపిక చేసుకుని, దీన్ని చూపించుకుని వస్తానన్నాడు. కావాలంటే తన వెంట మీ సేల్స్మన్ను కూడా పంపించండి అని అనడంతో షాపు యజమాని ఈశ్వరయ్య సరేనన్నాడు. అలా సేల్స్మన్తో ద్విచక్రవాహనంపై ఉన్నతపాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ సేల్స్మన్ కిందకు దిగగానే అపరిచిత వ్యక్తి సెల్ఫోన్తో బైక్పై తుర్రుమన్నాడు. బాధిత షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య -
సెల్ఫోన్లో గేమ్స్: తల్లిదండ్రులు మందలించారని..
నెల్లూరు రూరల్: సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుందని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్ పరిధిలోని నరుకూరు సెంటర్లో ఆదివారం జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నరుకూరు సెంటర్లో నివాసం ఉంటున్న యదపర్తి మల్లికార్జున్, శైలజ దంపతుల కుమార్తె సుష్మశ్రీ (16) 8వ తరగతి వరకు చదువుకుని ఏడాది నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. కొంత కాలంగా సుష్మ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లిదండ్రులు మందలిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండగా తల్లి శైలజ గమనించి సెల్ఫోన్ తీసుకుని మందలించింది. అదే సెంటర్లో వీరు టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తల్లి టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఆనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని వంట గదికి ఉన్న ఇనుప రాడ్లకు తన చున్నీతో ఉరేసుకుంది. పక్కింటి వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సుష్మను కిందకు దింపి నగరంలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం.. విషాదం: మృత్యువులోనూ సహచర్యం.. -
విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ..
సాక్షి, డబీర్పురా: సెల్ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన హరీష్, లక్ష్మణ్ (22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జహేరానగర్ ప్రాంతంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారిద్దరూ నిర్మాణంలో ఉన్న మోయిన్ ఆలం ఖాన్ భవనంలోని 5వ అంతస్తుకు వెళ్లారు. ఫోన్ మాట్లాడుతున్న లక్ష్మణ్ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మతి చెడగొడుతున్న సెల్ఫోన్
సాక్షి, అమరావతి: ‘‘దేశవ్యాప్తంగా మానసిక జబ్బుల తీవ్రత పెరుగుతోంది. ఇది వర్తమానానికే కాదు భవిష్యత్కూ పెద్ద ప్రమాదమే. సెల్ఫోన్ పుణ్యమా అని మెదడు ఉచ్చులో ఇరుక్కుంది. సెల్ఫోన్లో ఏది కనిపిస్తోందో అదే నిజమనుకుంటున్నారు. దీంతో యువత ఆలోచనలు ఎదగకుండా ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే భవిష్యత్ ఆగిపోయిందని తెలుసుకున్నారో.. అక్కడ్నుంచే మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇవి క్రమంగా మానసిక జబ్బులుగా మారి జీవితాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నాయి’’ అని అంటున్నారు.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిమ్హాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్–బెంగళూరు) మాజీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వంలో పాతికేళ్లపాటు మానసిక జబ్బులపై సేవలందించిన డా.కె.వి.కిషోర్ కుమార్. విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మానసిక జబ్బులకు కారణాలనేకం.. 15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు. ఏటా లక్షల్లో పెరుగుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చేస్తున్న వ్యయంలో 12.5 శాతం మానసిక జబ్బులకే అవుతోంది. మన దేశంలో మానసిక రోగుల కోసం 20 వేల పడకలుంటే.. అందులో 5 వేల మంది పాతికేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఏటా లక్షల్లో రోగులు పెరుగుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లల పెరుగుదల, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, వాతావరణం ఇవన్నీ కీలకం. నాలుగేళ్ల వయసులోనే సెల్ఫోన్ వాడకం గురించి తెలుసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు.. మా పిల్లలు చాలా గొప్ప అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. సెల్ఫోన్ల బారిన 25 ఏళ్ల లోపు యువత వయసు, మనసు, కెరీర్పరంగా ఎదిగే క్రమంలో సరిగ్గా 25 ఏళ్లలోపు యువతను సెల్ఫోన్లు నాశనం చేస్తున్నాయి. వారి విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఆలోచించే సమయాన్ని లాగేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడటం కష్టం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 13.5 శాతం మంది వివిధ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో వెయ్యికి 10 మంది తీవ్ర మానసిక జబ్బులతో కుంగిపోతున్నారు. దీంతో ఒక్కో రోగి వల్ల వారింట్లో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్పగా లేదు మానసిక జబ్బులతో బాధపడుతూ ఇంట్లో లేకుండా ఆస్పత్రుల్లోనూ, వీధుల్లోనూ ఉంటున్న చాలామందికి చికిత్స చేసి తిరిగి ఇంటికి తేవడమే.. హోం అగైన్. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా మానసిక వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా బనియాన్ ఎన్జీవో సంస్థ ద్వారా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆస్పత్రుల నెట్వర్క్ చాలా బాగుంది. ఐదేళ్లు కష్టపడితే రాష్ట్రంలో 90 శాతం వ్యాధులను నియంత్రించొచ్చు. దీనివల్ల ఆర్థిక భారమూ తగ్గుతుంది. చదవండి: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ నివాస్ చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
ఎస్ఈసీ ఆదేశాలపై తీర్పును రిజర్వ్లో ఉంచిన హైకోర్టు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. కాగా, వలంటీర్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకు వాటిని రద్దు చేయాలని సవాలు చేస్తూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్జైన్ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫోన్ విసిరేసిన బాలకృష్ణ : వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : చిత్ర విచిత్ర వ్యాఖ్యలు, వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ట మరోసారి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. సందర్బం ఏదైనా, సమయం ఏదైనా తనకు కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్లో నిలిచింది. ఒక సినిమా పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “'సెహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్కు నందమూరి బాలకృష్ణ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ రిలీజ్కు బాలకృష్ణ సన్నద్దమవుతున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. అంతే.. జేబులో నుంచి ఫోన్ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్ను అలా గాల్లోకి క్యాచ్ విసిరారు. అలా ఆయన స్టేజిపై నుంచే ఫోన్ విసిరేయటంతో సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం బిక్క చచ్చిపోయారు. దీంతో నెటిజన్లు వ్యంగ్య కామెంట్లు, మీమ్స్తో సందడి చేస్తున్నారు. కోపదారి మనిషికి ఆ సమయంలో ఎవరబ్బా ఫోన్ చేసింది.. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబుకు కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారంటూ సోషల్ మీడియాలోకామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమాని ప్రేమించండి.. సినిమా అనేది ఒక ప్యాషన్.. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు.. అంటూ చిత్రయూనిట్కు బాలయ్య ఇచ్చిన సలహాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. ఇకముందు రాదు కూడా.. దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. (గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్) View this post on Instagram A post shared by Punch Siksha (@punchsiksha) View this post on Instagram A post shared by hakunamatata3 (@hakunamatataaa_3) -
సెల్ ఫోన్ రీప్లేస్ చేయలేదని ఆవేదనతో..
న్యూఢిల్లీ : పాడై పోయిన ఫోన్ను రీప్లేస్ చేయనన్నారనే ఆవేదనతో సెల్ఫోన్ సర్వీస్ సెంటర్ ముందు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన ఢిల్లీలోని రోహినిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహ్లాద్పూర్ గ్రామానికి చెందిన భీమ్ సింగ్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఓ సెల్ఫోన్ కొన్నాడు. వారం రోజుల తర్వాతినుంచి అది పనిచేయటం మానేసింది. దీంతో భీమ్ నవంబర్ 6వ తేదీన సెల్ఫోన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లాడు. అయితే వారు సెల్ఫోన్ను రీప్లేస్ చేయటం కుదరదని చెప్పారు.( పండుగ వేళ విషాదం ) మరికొన్నిసార్లు సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం షాపు ముందు ఒంటికి నిప్పంటించుకున్నాడు. మంటల్లో తీవ్రగాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్ఫోన్ తరచుగా హీటెక్కేదని, ఉన్నట్టుండి బ్యాటరీ పేలి పోయిందని బాధితుడి భార్య పూనమ్ పోలీసులకు తెలిపింది. -
ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!
ముంబై: మహారాష్ట్రలోని పుణేలో ఒక వ్యక్తి కేవలం ఆటో డ్రైవర్ల ఫోన్లు మాత్రమే కొట్టేస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. 70కి పైగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను దొంగతనం చేయడం వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడు ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. తన ప్రియురాలు తనని మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయిందని తెలిపాడు. దాంతో ఆటో డ్రైవర్ల మీద కక్ష తీర్చుకోవడం కోసమే వారి ఫోన్లను దొంగిలిస్తున్నట్లు తెలిపాడు. అహ్మదాబాద్కు చెందిన ఆసిఫ్ అకా భురభాయ్ ఆరిఫ్ షేక్ ఒక రెస్టారెంట్ను నడుపుతుండే వాడు. అయితే అతను అక్కడి నుంచి తన 27 ఏళ్ల ప్రేయసితో కలిసి పుణే వచ్చి ఒక బిజినెస్ ప్రారంభించాలనుకున్నాడు. అక్కడికి వచ్చిన రెండు రోజుల తరువాత అతని వద్ద ఉన్న డబ్బు తీసుకొని ఆమె ఒక ఆటో డ్రైవర్తో వెళ్లిపోయినట్లు ఆరిఫ్ షేక్ తెలిపాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరీఫ్ దగ్గర నుంచి 20 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. చదవండి: దారుణం: భార్య కాళ్లు, చేతులు నరికేశాడు -
పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
సాక్షి, బెల్లంపల్లి : మండలంలోని నాగారాం గ్రామంలో ఏలాది అనిల్(19) తండ్రి సెల్ఫోన్ కొనివ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలాది వెంకటి– మల్లక్కల మూడో కుమారుడు అనిల్ గ్రామంలో కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆరు నెలలుగా ఇంటి పక్కనే ఉన్న హోంగార్డు మడె తిరుపతి ఇంట్లో నిద్రించేవాడు. ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి హమాలీ పనులకు వెళ్తున్నాడు. రెండు రోజులుగా తనకు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.10వేలు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. వరి పంట అమ్మినడబ్బులు రాగానే కొనిస్తానని తండ్రి నచ్చజెప్పాడు. అయిన సంతృప్తి చెందక మనస్థాపానికి గురై తాను నిద్రించే పక్కింట్లో తాడుతో మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. పలు అనుమానాలు... అనిల్ పక్కింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కింట్లో ఎవరు ఉండటం లేదు. మృతిడి చేతిలోని చిట్టీపై ఇద్దరి యువకుల పేర్లు రాసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. యువకుడు వేరే కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’
సాక్షి, హైదరాబాద్: కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటూ స్మార్ట్ఫోన్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ విస్తరణకు యత్నిస్తున్న వైనం బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్.. తీహార్ జైల్లో ఉంటూ సీఏఏకు వ్యతి రేకంగా స్మార్ట్ఫోన్ సాయంతో మద్దతు కూడ గడుతూ ఓ గ్రూపును తయారుచేస్తున్నట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్కు చెందిన జహన్ జెబ్ సామి, హీనా బషీర్బేగ్ దంపతులు ఇటీవల ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఐసిస్కు చెందిన ఖొరాసన్ మాడ్యూల్లో ఉగ్రవాదులుగా మారిన వీరిద్దరూ, బాసిత్ ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు విచారణలో తేలింది. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. దీంతో వీరిద్దరినీ ఢిల్లీకి రప్పించిన బాసిత్ అక్కడి ఓక్లాలోని జామియానగర్లో ఉంచాడు. సామి ప్రైవేట్ ఉద్యోగిగా, హీనా గృహిణిగా చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించా రు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జం ట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విశ్లేషణ, విచారణలో వెలుగుచూసిన వివరాల ఆధారంగా బాసిత్ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ సమాచారం ఇచ్చారు. జైలు నుంచే స్మార్ట్ఫోన్తో.. విచారణలో జమ్మూకశ్మీర్ జంట తెలిపిన వివరాల ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్.. తీహార్ జైలులో ఉన్న అబ్దుల్లా బాసిత్ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెం దిన యువతకు బాసిత్ సోషల్మీడియా ద్వారా వలవేస్తూ ఉగ్ర బాట పట్టేలా చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. దీంతో బాసిత్కు జైల్లో సెల్ఫోన్ ఎలా అందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. హఫీజ్బాబానగర్కు చెందిన అబ్దుల్లా బాసిత్ (26) ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్ సా నుభూతిపరుడిగా మారాడు. 2014, ఆగస్టు లో మరికొందరితో కలిసి పశ్చిమబెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసు కోవాలని భావించాడు. నిఘా వర్గాలు వీరిని కోల్కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. అనంతరం హిమాయత్నగర్లోని ఓ సంస్థలో ఆర్నెల్ల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. 2015, డిసెంబర్లో ఐసిస్లో చేరుతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్పూర్లో వీరిని అరెస్టుచేశారు. బెయిల్పై బయటికొచ్చిన బాసిత్.. ఐసిస్కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టుచేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తూ బాసిత్ వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పలువురిని ఆకర్షిస్తున్నాడు. జమ్మూకశ్మీర్కు చెందిన భార్యభర్తలు ఈ విధంగానే అతని వలలో పడ్డారు. -
సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి
సాక్షి, చెన్నై: సెల్ఫోన్ ఛార్జింగ్లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. అయితే అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా సెల్ ఫోన్ను ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసినా, పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి. -
ఫోన్ చేయగానే దగ్గుతున్న శబ్దం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు సెల్ ఫోన్లకు తాకిందా?. అదేంటి సెల్ ఫోన్లకు కరోనా వైరస్ అనుకుంటున్నారా?. ఈ వైరస్ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా ...దగ్గుతున్న శబ్దం.. ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్ను రూపొందించింది. (కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు) మీరు ఎవరికి ఫోన్ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్ ట్యూన్ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్ చేస్తే మాత్రం మాములుగానే రింగ్ సౌండ్ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. (కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!) రోజుకు ఓ 20 ఫోన్ కాల్స్ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్ ట్యూన్ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. (వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!) -
ప్రాణం తీసిన సెల్ఫోన్
అవసరాల కోసం ఉపయోగపడే సెల్ఫోన్ ఇప్పుడు ఒకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి పంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాగే శంకరయ్య, కావిరి నారాయణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. నారాయణ అన్న సమ్మయ్య పిల్లలైన నగేష్, మధుకర్.. నారాయణ ఇంట్లోనే ఉంటున్నారు. శివరాత్రి కావడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ఇవ్వగా.. నగేష్ సెల్ఫోన్లో మధుకర్, శంకరయ్య కుమార్తె, మరో విద్యార్థిని కలసి సినిమా పాటల వీడియోలు చూస్తున్నారు. ఇదే క్రమంలో శంకరయ్య ఇంటికి రాగానే పిల్లలు వెళ్లిపోయారు. అయితే, తన కుమార్తె, మరో విద్యార్థిని శంకరయ్య మందలించి వదిలేశాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వెళ్లిన శంకరయ్య.. నగేష్ను కర్రతో కొడుతుండగా.. అడ్డొచ్చిన మధుకర్ తలపై కూడా బలంగా కొట్టాడు. దీంతో అతని తల బాగా వాయగా.. వాంతులు అయ్యాయి. మధుకర్ను వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి.. ఆపై వరంగల్, హైదరాబాద్కు తరలించారు. అంతలోగానే మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మధుకర్ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని ఏటూరునాగారం సీఐ నాగబాబు, ఎస్సై సురేష్ తెలిపారు. – ఏటూరునాగారం/కన్నాయిగూడెం -
‘నెట్టే’ట మునక
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజలు ‘నెట్’లోకంలో మునిగితేలుతున్నారు. గంటలకొద్దీ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ ఇంటర్నెట్కు బానిసలుగా మారుతున్నారు. ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడుతూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, సోషల్ మీడియా... ఇలా డిజిటల్ మాధ్యమాలతో రోజుకు ఏడు గం టల చొప్పున ఏడాదికి సరాసరిన 1,800 గంటలపాటు కుస్తీ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ మార్కెటీర్ అనే సంస్థ ఇటీవల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఆన్లైన్ మాధ్యమం ద్వారా సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించి అధ్యయన వివరాలు ప్రకటించింది. చేతిలో నిరంతరం స్మార్ట్ఫోన్తో దర్శనమిచ్చే యువత... ఖాళీ సమయాల్లో డిజిటల్ మాధ్యమాలతో కుస్తీ పడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి సెల్ఫోన్ టచ్ చేస్తూ అప్డేట్స్ చూసుకుంటున్నట్లు అధ్యయనం తెలి పింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్ఫోన్ తమ జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. టీనేజర్లలో 50% మంది డిజిటల్ ఎడిక్షన్కు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజిటల్ అడిక్షన్తో పలు శారీరక, మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది. డిజిటల్ వర్రీ.. క్షణం తీరికలేకుండా స్మార్ట్ఫోన్తో గంటలతరబడి కాలక్షేపం చేస్తున్న మెట్రో నగరవాసులకు కొత్త చిక్కులొచ్చాయి. నిరంతరాయంగా వాట్సాప్లో చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అప్డేట్స్ కోసం రెప్పవాల్చకుండా స్మార్ట్ఫోన్ వైపు దృష్టిసారిస్తుండడంతో మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా స్మార్ట్ఫోన్ను చేతిలో పట్టుకొని సరిగా కూర్చోకుండా చాటింగ్ చేయడం, అధిక సమయం చాటింగ్లోనే గడిపేస్తుండటంతో వెన్నెముక డిస్క్ లు ఒత్తిడికి గురై పలువురు వెన్నునొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొంది. చాటింగ్ సమయం లో భుజం, తల, మెడ కండరాలు అధికంగా ఒత్తిడికి గురై బిగుసుకుపోవడంతోనే ఇవి తలెత్తుతున్నాయని, ఛాతీ కండరాలూ పలుమార్లు బిగుసుకుపోతున్నట్లు వైద్యులను ఉటంకిస్తూ పేర్కొంది. చిన్నారులూ బాధితులే.... అధిక గంటలు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడే చిన్నారులు సైతం మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా సెల్ఫోన్లు, ట్యాబ్లెట్స్లో గేమ్స్ ఆడే సమయంలో సోఫాలు, మంచాలు, కుర్చీల్లో సరిగా కూర్చోకపోవడం వల్ల శారీరక కదలికలు లేక జీవనక్రియల్లో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించింది అనర్థాలివే: మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతివేళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, స్పర్శకోల్పోవడం, జీవన క్రియలు మందగించ డం, వెన్నునొప్పులు, నిద్రలేమి, తుంటికండరాలు పట్టేయడం. శ్రుతి మించితే వైద్యులను సంప్రదించాల్సిందే. చిన్నారులకు స్మార్ట్ఫోన్ వినియోగం దురలవాటు గా మారితే తప్పకుండా సైకియాట్రిస్ట్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫోన్ హాబీ ఇటీవలి కాలంలో 5 రెట్లు పెరిగిందని సైకాలజిస్టులు చెబు తున్నారు. పిల్లలకు ఫోన్లను సరదా కోసం ఇస్తున్న తల్లిదండ్రులు... అది వారికి దురలవాటుగా మారి నప్పుడే కళ్లు తెరుస్తున్నారని చెబుతున్నారు. చాలా మంది మాట్లాడటం కంటే ఫోన్ చాటింగ్కే ప్రాధాన్యతనిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ హాబీ శ్రుతి మించి దురలవాటుగా మారితే చిన్నారుల మెదడు కణాలూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామం, ఆటల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆటలకు దూరమై ఫోన్లు, ట్యాబ్లెట్లతో కుస్తీపట్టే చిన్నారులు తీవ్ర ఆవేశకావేశాలకు గురవడంతోపాటు వారిలో క్రమంగా హింసా ప్రవృత్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం ►స్మార్ట్ఫోన్లు వినియోగించే సమయంలో తరచూ బ్రేక్ తీసుకోవాలి. శరీర కదలికలు ఉండేలా చూసుకోవాలి. ►మెడను వంచకుండా స్మార్ట్ఫోన్ తెరను చూడాలి. ►నొప్పులు అధికమైతే న్యూరోసర్జన్లు, ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. -
సెల్లో 'సెల్లు'కు చెల్లు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో (సెల్) మొబైల్ (సెల్ఫోన్) వినియోగానికి శాశ్వతంగా తెరదించేలా జైళ్ల శాఖ యంత్రాంగం కృషి చేస్తోంది. కారాగారంలో ఉంటూ నేర సంబంధిత లావాదేవీల్ని ఖైదీలు యథేచ్ఛగా కొనసాగిస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారాలు మొబైల్ ఫోన్లలో నిర్వహిస్తున్నట్లు తేలింది. జైళ్లలో మొబైల్ ఫోన్ల అక్రమ వినియోగానికి తెరదించడం పరిష్కారంగా రాష్ట్ర కారాగార శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ముందుకు సాగుతున్నట్లు కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ తెలిపారు. మొబైల్ ఫోన్లను కారాగారాల్లో నివారించేందుకు లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ఆధ్వర్యంలో జైళ్లలో మొబైల్ ఫోన్ల చొరబాటు నివారణ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 91 జైళ్లలో మొబైల్ లొకేటర్ల వ్యవస్థను ప్రవేశ పెడతామని తెలిపారు. 2019›– 20 ఆర్థిక సంవత్సరంలో 300 మొబైల్ ఫోన్ లొకేటర్లు కొనుగోలు చేస్తారు. తొలి విడత కింద రూ. 75 లక్షలు వెచ్చించి మొబైల్ లొకేటర్లు ఏర్పాటు చేస్తారు. నేరాల నియంత్రణలో భారీ సంస్కరణ రాష్ట్రంలో నేరాల నియంత్రణలో మొబైల్ లొకేటర్ల ఏర్పాటు భారీ సంస్కరణగా జైళ్ల శాఖ డీజీ పేర్కొన్నారు. యావజ్జీవ కారాగారవాసం చేస్తున్న ఖైదీలు తమ అనుచరులతో బయటి ప్రపంచంలో నేర కార్యకలాపాల్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న నేర చరిత లావాదేవీలకు ఈ వ్యవస్థ తెర దించుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ వ్యవస్థ అమలును పురస్కరించుకుని జైలు సిబ్బంది, అధికారుల మొబైల్ ఫోన్లను కూడా జైళ్ల ప్రాంగణాలకు అనుమతించరు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ సంతోష్ ఉపాధ్యాయ్ హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను ప్రధాన ప్రవేశ ద్వారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్ కౌంటర్లో జమ చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ఫోన్లో మాట్లాడుతూ..
చెన్నై, టీ.నగర్: సెల్ఫోన్లో మాట్లాడుతూ ఆదివారం ఓ యువతి మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. చెన్నై ట్రిప్లికేన్ కెనాల్ రోడ్డుకు చెందిన 17 ఏళ్ల యువతి ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తోంది. ఈ నెల 25న రాత్రి ఇంటి మూడో అంతస్తులో తన స్నేహితురాలితో సెల్ఫోన్లో మాట్లాడుతూ కింద పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అన్నాస్క్వేర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మృతిచెందింది. -
స్నాచర్లను పట్టుకుంటే గ్యాంగ్ దొరికింది
సాక్షి, సిటీబ్యూరో: సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ సెల్ఫోన్ స్నాచింగ్ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారి నుంచి ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆరా తీయగా అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు తేలింది. దీంతో లోతుగా విచారించిన అధికారులు 11 మంది సభ్యులతో కూడిన వాహనచోరీలు, చైన్ స్నాచింగ్ల ముఠాను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్లీడర్ ఆదేశాల మేరకు సభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ వాహెద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ అఫ్రోజ్ ఖాన్ ఎనిమిదితో తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై కొన్నాళ్ల పాటు ఆటోడ్రైవర్గా పని చేసిన ఇతను చివరకు బైక్ మెకానిక్గా మారాడు. దురలవాట్లకు బానిసైన అతను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వాహనచోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసిఫ్నగర్కు చెందిన మహ్మద్ అల్తాఫ్, జిర్రాకు చెందిన సయ్యద్ జమీల్, రాజేంద్రనగర్కు చెందిన అమీర్, మోతీదర్వాజ ప్రాంతానికి చెందిన మరో మైనర్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వృత్తిరీత్యా మెకానిక్ అయిన వాహెద్కు వాహనాల తాళాలు పగులకొట్టడం, అసలు తాళం చెవి లేకుండా స్టార్ట్ చేయడంపై పట్టుంది. దీనిపై తన గ్యాంగ్ సభ్యులకు అవగాహన కల్పించిన అతను వాహన చోరీలకు పురిగొల్పాడు. మహ్మద్ అల్తాఫ్ ద్వారా వహీద్కు కుమ్మర్వాడికి చెందిన ఎలక్ట్రీషియన్ హర్షవర్ధన్తో పరిచయం ఏర్పడింది. అతడినీ ఈ ‘రంగం’లోకి దింపిన వాహెద్ చోరీలకు ప్రోత్సహించాడు. దీంతో ఇతగాడు తన స్నేహితులైన అభిషేక్, ఉదయ్కిరణ్, అభిలాష్, మల్లేష్లతో ముఠా కట్టాడు. వీరు వాహనచోరీలతో పాటు స్నాచింగ్స్లకు పాల్పడేవారు. ఈ చోరీ సొత్తును తీసుకునే వాహెద్ దానిని జిర్రాలో వెల్డింగ్ దుకాణం నిర్వహించే సయ్యద్ జమీల్తో పాటు ఆసిఫ్నగర్కు చెందిన సేల్స్మెన్ షేక్ జమీర్లకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్మును అందరూ పంచుకునే వారు. రిసీవర్గా ఉన్న సయ్యద్ జమీల్ ఈ గ్యాంగ్స్తో కలిసి కొన్ని నేరాలు కూడా చేశాడు. దాదాపు నాలుగు నెలలపాటు ఈ ముఠాలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ పంజా విసిరాయి. వీరు ప్రధానంగా పార్కింగ్ ప్లేసులు, మాల్స్, ఇళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలనే ఎత్తుకెళ్లేవారు. సాయికిరణ్, మల్లేష్లు కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పార్కింగ్ ఏరియా నుంచి బైక్ చోరీ చేశాడు. గత నెల 17న దానిపై వెళ్లిన హర్షవర్థన్, ఉదయ్ కిరణ్, అభిషేక్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెల్ఫోన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీలతో కూడిన బృందం ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్నాచింగ్కు ఉపయోగించిన వాహనాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఇది తమ బంధువుకు చెందినదని నిందితులు చెప్పడంతో వాహనం పత్రాల కోసం ఆరా తీశారు. వారి వద్ద అవి లేకపోవడంతో వాహనంతో పాటు ఇంజిన్, చాసిస్ నంబర్ ఆధారంగా సదరు బైక్ కొన్నాళ్ల క్రితం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నిందితులను విచారించగా మొత్తం ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైనర్తో పాటు చోరులు, రిసీవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఆటో, బుల్లెట్, కేటీఎంలతో సహా 28 వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలు సిటీలో మూడు, సైబరాబాద్లో 22, రాచకొండలో 5, సంగారెడ్డిలో 3 నేరాలు చేసినట్లు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను వారు నేరం చేసిన ప్రాంతాల వారీగా స్థానిక పోలీసులకు అప్పగించారు. హర్షవర్ధన్, ఉదయ్కిరణ్, అభిషేక్, జమీర్లను సైఫాబాద్, అమీర్ఖాన్, అల్తాఫ్, సమీల్లను ఎస్సార్నగర్, అబ్దుల్ వాహెద్తో పాటు మైనర్ను మీర్చౌక్, సాయికిరణ్, మల్లేష్లను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లకు అప్పగించినట్లు తెలిపారు. -
సెల్ఫోన్ పేలి బాలిక మృతి
కజకిస్తాన్ : సేల్ఫోన్ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్కు చార్జింగ్ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్లోని బాస్టోబల్ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్బెక్(14) రాత్రి పడుకునే ముందు ఫోన్లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్కి చార్జీంగ్ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్ చార్జీంగ్ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్ అధికారులు వెల్లడించారు. -
సెల్ఫోన్ దొంగల అరెస్టు
బంజారాహిల్స్: గంజాయికి అలవాటు పడి సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించార. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి, వివరాలు వెల్లడించారు. శ్రీకాకులం జిల్లా, జగన్నాథపుర గ్రామానికి చెందిన పెద్దింటి యాదగిరి సెంట్రింగ్ వర్కర్గా పనిచేస్తూ మూసాపేట యాదవ బస్తీలో తన స్నేహితుడు మహ్మద్ జజ్బార్ అహ్మద్తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరు కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్నారు. గత నెల 26న బోరబండకు చెందిన సతీష్ అనే డ్రైవర్, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 36లో నడిచి వెళుతుండగా బైక్పై వచ్చిన వీరు సెల్ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. -
బోయింగ్కు ‘సెల్ఫోన్’ గండం
సెల్ఫోన్ కారణంగా విమానాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) తెలిపింది. సెల్ఫోన్ సిగ్నళ్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన కొన్ని విమానాల్లోని కాప్పిట్లో ఉండే డిస్ప్లే బోర్డులు పనిచేయడం ఆగిపోతున్నాయని వెల్లడించింది. ఈ విషయమై కొందరు పైలట్లు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఓ నివేదికను సమర్పించింది. 2013 వరకూ విమానాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడటంపై అమెరికాలో నిషేధం ఉండేది. అయితే ఆ తర్వాతికాలంలో దాన్ని తొలగించారు. ప్రస్తుతం విమానాల్లో సెల్ఫోన్లను ‘ఎయిర్ప్లేన్ మోడ్’లో ఉంచి తీసుకెళ్లేందుకు ఎయిర్లైన్స్ అనుమతిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు రకాలకు.. తాజాగా ఈ సెల్ఫోన్ల వైఫై సంకేతాలు, భూమిపై ఉండే రాడార్ల కారణంగా బోయింగ్ కంపెనీకి చెందిన 737, 777 క్లాస్ విమానాల్లోని కాప్పిట్ డిస్ప్లే యూనిట్లో సమస్య తలెత్తుతోంది. విమానం వెళుతున్న వేగం, ఎత్తు, వెళ్లాల్సిన దిశ తదితర అంశాలు ఈ డిస్ప్లే యూనిట్లో కనిపిస్తాయి. పైలట్లు సురక్షితంగా విమానాన్ని నడిపేందుకు ఈ వ్యవస్థ మార్గదర్శనం చేస్తుంది. కానీ సెల్ఫోన్ సిగ్నళ్ల కారణంగా ఈ డిస్ప్లే యూనిట్లు పనిచేయకుండా పోతున్నాయని, తద్వారా విమాన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశముందని ఎఫ్ఏఏ తెలిపింది. తాము గాల్లో ఉండగానే డిస్ప్లే యూనిట్లు మూగబోయినట్లు బోయింగ్ ఎన్జీ 737 పైలట్లు దాదాపు 12 సార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. తప్పు సరిచేస్తామన్న హనీవెల్ ప్రస్తుతం అమెరికాలో 1,300కుపైగా విమానాలు తిరుగుతుండగా, వీటిలో బోయింగ్ 737, 777 క్లాస్ విమానాలకు ఈ ముప్పుందని ఎఫ్ఏఏ చెప్పింది. ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ హనీవెల్ ఇంటర్నేషనల్ ఈ డిస్ప్లే యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది. ఈ డిస్ప్లే యూనిట్లను 2019, నవంబర్లోగా మార్చాలని ఎఫ్ఏఏ ఆదేశించింది. కాగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) నివేదికను హనీవెల్ సంస్థ ఖండించింది. సెల్ఫోన్లలోని సిగ్నల్స్, ఇతర రేడియో సంకేతాలు తమ డిస్ప్లే యూనిట్లను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసింది. తాజాగా ఎఫ్ఏఏ ఆదేశాల నేపథ్యంలో బోయింగ్ విమానాల్లోని తమ డిస్ప్లే యూనిట్లను మారుస్తున్నామని హనీవెల్ సంస్థ తెలిపింది. ఈ విషయమై తమ ఇంజనీరింగ్ నిపుణులు దృష్టి సారిస్తారని కూడా తెలిపింది. -
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
-
మొగల్తూరులో అశ్లీల వీడియోల కలకలం
సాక్షి, మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అశ్లీల చిత్రాలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. మొగల్తూరులోని ఓ సెల్ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వాహకుడు... తన దగ్గరకు ఫోన్స్ రిపేర్స్ కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారితో ఏకాంతంగా గడిపిన వీడియోలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సదరు కామాంధుడితోపాటు అతని వద్ద పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో నిందితుడు సెల్ఫోన్ రిపేర్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వద్దకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే.. అతని వద్ద ఫోన్ రిపేర్ పనులు నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. యజమాని ఫోన్లోని అశ్లీల చిత్రాలను చూసి షాక్ అయ్యాడు. అశ్లీల వీడియోలను తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకున్నాడు. అలా ఆ విజువల్స్.. తన స్నేహితులకు ఫార్వర్డ్ చేశాడు. సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయిన ఆ విజువల్స్ చివరికి బాధితుల ఫోన్లకు చేరటంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో బాధితురాలు ఒకరు పోలీసులను ఆశ్రయించటంతో.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఫోన్లను సీజ్ చేశారు. పెద్దసంఖ్యలో యువతులు, మహిళలను నిందితుడు వంచించాడని, ఆ కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. -
సెల్ఫోన్ చిచ్చు.. భార్య అదృశ్యం
హొసూరు: సెల్ఫోన్లో మాట్లాడద్దని భర్త మందలించడంతో భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటన బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల మేరకు.. బెంగళూరు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్రాజ్ భార్య శిల్ప (23). వీరు హొసూరు సమీపంలోని బాగలూరులో నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. శిల్ప వేరొకరితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉందని భర్త గొడవపడేవాడు. ఇదే విషయమై ప్రేమ్రాజ్ ఇటీవల నిలదీశాడు. దీంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్రాజ్ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
సెల్ఫోన్ చోరీకి యత్నం
విశాఖపట్నం, బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో విజయరామరాజుపేట గ్రామం వద్ద సెల్ ఫోన్ లాక్కొని బైక్పై ఊడాయిం చేందుకు యత్నించిన యువకుడిని బాధితుడే పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీసులకు అప్పగించాడు. పి భీమవ రం గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నూకరాజు అనే యువకుడు మంగళవా రం ఉదయం సైకిల్పై చోడవరం వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యా డు. విజయరామరాజుపేట గ్రామం వద్ద పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు రావికమతం ఎంత దూరం ఉంటుందని నూకరాజుతో మాటలు కలుపుతూ అతని చేతిలో సెల్ఫోన్ లాక్కొని ఉడాయించడానికి ప్రయత్నిం చారు. దీంతో వెంటనే తేరుకున్న నూకరాజు ద్విచక్ర వాహనంపై వెనక కూర్చు న్న మూడో వ్యక్తి చొక్కా కాలర్ పట్టుకుని గట్టిగా లాగడంతో ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్నవారు రావడంతో ద్విచక్ర వాహ నాన్ని వదిలి ఇద్దరు పారిపోయారు. నూకరాజు మాత్రం కాలర్ పట్టుకున్న వ్యక్తిని వదలక పోవడంతో స్థానికులు అతనిని పట్టుకున్నారు. బుచ్చెయ్యపేట పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్ఐ పాండు వచ్చి బైక్ను,సెల్ ఫోన్ దొంగతనం చేయబోయిన వ్యక్తిని స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వ్యక్తి మాడుగులకు చెందిన మేకల దావిద్ కాగా, పారిపోయిన ఇద్దరు రాము,కుమార్లుగా పోలీసులు గుర్తించారు. -
టార్గెట్ సెల్ఫోన్స్!
ఒకప్పుడు స్నాచింగ్ అంటే మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం మాత్రమే చేసేవారు. ఇక జేబు దొంగలైతే టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో కంటికి తెలియకుండా దొంగిలించేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటు పడిన వారు ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న ఈ తరహా కేసులు ప్రస్తుతం సిటీ పోలీసులకు ఓ పెద్ద ఛాలెంజ్గా మారాయి. సాక్షి, సిటీబ్యూరో: స్నాచింగ్.... ఎంపిక చేసుకున్న బాధితుడు/బాధితురాలి మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్ తస్కరించడం పిక్పాకెటింగ్... టార్గెట్ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో వ్యక్తికి తెలియకుండా దొంగిలించడం ఇప్పటి వరకు ఈ తరహా నేరాలపైనే ఆధారపడేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్పాకెటర్లు సెల్ఫోన్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వారు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్ఫోన్’ ఓ పెద్ద ఛాలెంజ్గా మారింది. గణాంకాల ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేలకు పైగా సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.దీనికితోడు అనేక ఛోటామోటా ముఠాలు సెల్ఫోన్ పిక్పాకెటింగ్, స్నాచింగ్ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. పర్సులు, గొలుసుల నుంచి సెల్ఫోన్ల వైపు... నగరంలోని పిక్పాకెటింగ్ గ్యాంగ్లు గతంలో కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. ఐదేళ్ల క్రితం వరకు చైన్ స్నాచింగ్ ముఠాలు వరుపెట్టి పంజా విసిరాయి. అయితే ప్రజల్లో పెరిగిన చైతన్యం, పోలీసుల చర్యలతో ఈ వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పడింది. మిగిలిన స్నాచర్లకు మెడల్లో బంగారం దొరకడం గగనంగా మారిపోవడంతో వారి దృష్టీ సెల్ఫోన్లపై పడింది. అందుకే ఇటీవల కాలంలో పిక్పాకెటర్లు పర్సులను, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరు ముఠాలు కట్టి వ్యవస్థీకృతంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరు..సరదా కోసం.. ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతుండటం నగర పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. వ్యవస్థీకృతం కాని, నేరం చేయాల్సి అవసరం లేని వారిలో సరదా కోసం చేస్తున్న వారి సంఖ్యా ఇటీవల పెరుగుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు సరదా కోసం సెల్ఫోన్లు లాక్కుపోతూ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా దక్షిణ మండలంతో పాటు అంతరాష్ట్ర, జిల్లా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఉన్న చోట్ల ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులునేరగాళ్లను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్ ఫోన్కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యుప్మెంట్ ఐడెంటిఫికేషన్గా పిలిచే (ఐఎంఈఐ) నంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల మాదిరిగా ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్ఫోన్ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్ను వినియోగించి దానికి ఉన్న నంబర్కు బదులు మరో ఐఎంఈఐ నంబర్ కేటాయిస్తారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ చేసిన వాటికి వేసే వారు. తద్వారా సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. గతంలో కేవలం ఈ విధానం ద్వారా మాత్రమే దొంగ ఫోన్లను ‘దొర’ఫొన్లుగా మార్చేసేవారు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే తస్కరణకు గురవుతున్న సెల్ఫోన్లలో గరిష్టంగా 30 నుంచి 40 శాతం కూడా రికవరీ కావట్లేదని భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్ వ్యాపారస్థులు సిండికేట్స్గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు కొన్ని ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు నిర్థారిస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. -
వాచ్వుమన్ ఫోన్ పోయిందని విద్యార్థినులపై..
మోమిన్పేట: వాచ్ఉమన్ ఫోన్ పోయిందని కేజీబీవీ ప్రత్యేకాధికారి విద్యార్థినులను మిట్ట మధ్యాహ్నం ఎండలో బండలపై కూర్చోబెట్టింది. ఎండకు కాళ్లు కాలడంతో కదిలిన విద్యార్థినులను కర్రతో కొట్టింది. కాళ్లకు బొబ్బలు రావడంతో విద్యార్థినులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సంఘటన మోమిన్పేటలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆదివారం సోమవారం వెలుగుచూసింది. విద్యార్థినుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చంద్రా యన్పల్లిలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో దాదాపు 160 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి నైట్ వాచ్ఉమన్ నర్సమ్మ ఫోన్ పోయింది. ఈ విషయం ఆదివారం ఉద యం ఆమె ప్రత్యేకాధికారి(స్పెషల్ ఆఫీసర్) శైలజకు తెలిపింది. దీంతో ఎస్ఓ విద్యార్థినులను పిలిచి ఫోన్ తీసుకొన్నవారు మర్యాదగా అప్పగించండి.. లేదంటే అందరికి మధ్యాహ్నం భోజనం బంద్ అంటూ బెదిరించింది. విద్యార్థులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎండలో పాఠశాల ఆవరణలో బం డలు వేసిన ప్రదేశంలో వారిని కూర్చోబెట్టింది. ఎండకు తాళ లేక విద్యార్థినులు అంద రూ రూ.10 చొప్పున పోగేసి ఫోను కొనిస్తామని వేడుకున్నా ప్రత్యేకాధికారి వినిపించుకోలేదు. ఎండ వేడిమికి విద్యార్థులు కదలడంతో వారిని కర్రతో దండించింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఎస్ఓ వారిని బెదిరించింది. కాళ్లకు బొబ్బలు రావడంతో ప్రత్యేకాధి కారి విద్యా ర్థులను సోమ వారం మండల కేంద్రం లోని ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం మధ్యాహ్నం నగరంలోని తన ఇంటికి వెళ్లిపోయింది. పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ భర్త మధుసూదన్ సైతం తరచూ రాత్రి వేళలో పాఠశాలలోనే బస చేస్తాడని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సైతం మధుసూదన్ వచ్చాడని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో పురుషులు హాస్టల్కు రాకూడదని, ఎస్ఓ భర్త తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, నైట్ వాచ్ఉమన్ నర్సమ్మ నిత్యం రాత్రి పాఠశాలకు కల్లు తీసుకొచ్చి తాగుతుందని విద్యార్థినులు ఆరోపించారు.రాత్రి సమయంలో బయటకు వెళ్లా ల్సి వచ్చినా.. ఆమె స్పందించేది కాదని చెప్పారు. వివరాలు సేకరించిన అధికారులు పాఠశాలలో జరిగిన సంఘటనపై పలువురు అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. జిల్లా బాలికల, పిల్లల అభివృద్ధి అధికారి వసుం ధర, ఎంపీడీఓ శైలజారెడ్డి, ఎంఈఓ శంకర్ పాఠశాలను సందర్శించి జరిగిన సంఘటనను విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకొన్నారు. చిన్న విషయానికే కఠినంగా శిక్షించే ప్రత్యేకాధికారి తమకు వద్దని విద్యార్థులంతా అధికారులకు తెలిపారు. ప్రత్యేకారిని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయా లని కోరారు. ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అయితే, ప్రత్యేకాధికారి శైలజను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించే యత్నం చేయగా ఫోన్ స్విఛాఫ్ వచ్చింది. ప్రత్యేకాధికారి సస్పెన్షన్ సోమవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ ఇబ్బందులను డీఈఓతో వెల్లబోసుకున్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రత్యేకాధికారి శైలజ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరారు. వివరాలు సేకరించిన డీఈఓ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
కిక్కులో స్నాచింగ్స్
సాక్షి, సిటీబ్యూరో: బతుకుతెరువు కోసం నగరానికి వసల వచ్చిన వారి కుటుంబాలు కష్టపడి పని చేసుకుంటున్నాయి. వీరి ముగ్గురు సంతానం కూడా సోఫా రిపేరింగ్ చేస్తూ బతుకుతున్నారు. వీరిలో ఒకరు గత ఏడాది ఓ స్నేహితుడితో కలిసి నేరం చేశాడు. వారం రోజుల క్రితం ముగ్గురూ కలిసి మద్యం తాగినప్పుడు కిక్కులో ఒకతను ఆ విషయం చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన ముగ్గురు కేవలం గంట వ్యవధిలో రెండు ఠాణాల పరిధిలో నాలుగు సెల్ఫోన్లు స్నాచింగ్స్ చేశారు. ఈ ముఠా కదలికల్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదివారం వెల్లడించారు. విజయవాడ నుంచి వలసవచ్చి.. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన మూడు కుటుంబాలు దాదాపు 15 క్రితం నగరానికి వలసవచ్చాయి. తుకారాంగేట్ పరి«ధిలోని అంబేడ్కర్ నగర్లో స్థిరపడిన ఈ కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ములు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వీరికి జక్కుల వంశీ, జక్కుల జాన్, పూజారీ ఏసోబ్ అనే కుమారులు ఉన్నారు. వీరు కూడా నగరంలోని పలు కాలనీల్లో సంచరిస్తూ సోఫాలు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏసోబుకు తుకారాంగేట్ టీచర్స్ కాలనీకి చెందిన టమాటో సంజయ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. దీంతో గతేడాది మైనర్గా ఉండగానే అతడితో కలిసి సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో ఓ సెల్ఫోన్ స్నాచింగ్ చేసి పోలీసులకు చిక్కి జువైనల్ హోమ్కు వెళ్లాడు. గురువారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పట్టుకున్న నలుగురు సెల్ఫోన్ స్నాచర్స్ గ్యాంగ్లో సంజయ్ కూడా ఉండటం గమనార్హం. మద్యం మత్తులో నిర్ణయం... సమీప బంధువులు, స్నేహితులు అయిన వంశీ, జాన్, ఏసోబు గత కొంతకాలంగా కల్లు, మద్యానికి అలవాటు పడ్డారు. దీంతో సోమవారం ఈ ముగ్గురూ కలిసి తుకారాంగేట్ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తు తలకెక్కిన తర్వాత సెల్ఫోన్ స్నాచింగ్స్ చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అది మన ఖర్చులకు సరిపోతుందని ఏసోబు సలహా ఇచ్చాడు. దీనికి మిగిలిన ఇద్దరూ అంగీకరించడంతో అర్దరాత్రి ముగ్గురూ కలిసి బయటకు వచ్చారు. జాన్కు చెందిన ద్విచక్ర వాహనంపై తుకారాంగేట్ నుంచి బయలుదేరిన ఈ త్రయం ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మహంకాళి, గోపాలపురం ఠాణాల పరిధుల్లో చెక్కర్లు కొట్టారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న వారిని గుర్తించి వారి సెల్ఫోన్లను దొంగిలించి పారిపోవడం మొదలెట్టారు. వంశీ వాహనం నడుపుతుండగా అతడి వెనుక జాన్, తర్వాత ఏసోబు కూర్చున్నారు. ఫోన్లు స్నాచ్ చేసే ఏసోబు వాటిని జాన్కు ఇచ్చేవాడు. గంటలో నాలుగు చోట్ల పంజా.. ఈ పంథాలో స్వైరవిహారం చేసిన ఈ గ్యాంగ్ కేవలం గంట వ్యవధిలో నాలుగు చోట్ల పంజా విసిరి సెల్ఫోన్ స్నాచింగ్స్కు పాల్పడింది. ఈ ఉదంతాలకు సంబంధించి ఆయా ఠాణాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. వీటి దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నేరాలు చోటు చేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్ఐలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, కేఎస్. రవి, జి.రాజశేఖర్రెడ్డితో కూడిన బృందం మొత్తం దాదాపు 250 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్ను అధ్యయనం చేసి నిందితులను గుర్తించింది. ఆదివారం ముగ్గురిని పట్టుకున్న టాస్క్ఫోర్స్ టీమ్ వారి నుంచి సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మహంకాళి పోలీసులకు అప్పగిం చినట్లు డీసీపీ రాధాకిషన్రావు తెలిపారు. -
పౌర పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రతి పోలీసు యూనిఫాంలో ఉన్న పౌరుడు... ప్రతి పౌరుడు యూనిఫాంలో లేని పోలీసు’... ఈ అంతర్జాతీయ నానుడిని నిజం చేశారు ఆ ముగ్గురు. బుధవారం రాత్రి తార్నాక ప్రాంతంలో తమ కళ్ల ఎదుట జరిగిన సెల్ఫోన్ స్నాచింగ్పై తక్షణం స్పందించి బైక్పై పారిపోతున్న స్నాచర్లను వెంటాడి పట్టుకున్నారు. వీరి స్ఫూర్తిని గుర్తించిన సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం వారిని సన్మానించారు. బషీర్బాగ్లోని కమిషనరేట్లో ఈస్ట్, నార్త్ జోన్స్ డీసీపీలు ఎం.రమేష్, కల్మేశ్వర్ సింగెనవర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు యువకులకూ జ్ఞాపికలు అందజేశారు. వరుస స్నాచింగ్లతో హడలెత్తిస్తూ.. నగరానికి చెందిన ఇద్దరు మైనర్లు గతంలోనూ కొన్ని నేరాలు చేశారు. తాజాగా బైక్పై తిరుగుతూ రెండు కమిషనరేట్ల పరిధిలో ఆరు చోట్ల పంజా విసిరారు. రాచకొండలోని మల్కాజ్గిరిలో బ్యాగ్, నగరంలోని లాలాగూడ, నల్లకుంట, ఉస్మానియా వర్శిటీ పరిధుల్లో సెల్ఫోన్లు లాక్కుపోయారు. ఓయూ పరిసరాల్లో మూడు సెల్ఫోన్లు ఎత్తుకుపోయారు. నల్లకుంటలో సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు తక్షణం స్పందించి ‘100’కు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. వెంటాడి పట్టుకుని... తార్నాక ప్రాంతంలో ఓ వ్యక్తిని వీరు టార్గెట్గా చేసుకున్నారు. అందులో ఒకరు వాహనాన్ని స్టార్ చేసే ఉంచి సిద్ధంగా ఉండగా, మరొకరు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి తన తల్లితో మాట్లాడాలంటూ ఫోన్ అడిగి తీసుకున్నాడు. అదే అదనుగా భావించి ఫోన్తో సహా తన ‘సహచరుడి’తో కలిసి వాహనంపై మెట్టుగూడ వైపు ఉడాయించారు. దీనిని గుర్తించిన బాధితుడు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న యువకులు ధీరజ్కుమార్, శ్రీకాంత్, బీవీ ప్రమోద్ అప్రమత్తమై బైక్పై వారిని వెంబడించారు. 80 నుంచి 90 కిమీ వేగంతో దూసుకుపోతున్న వారు కొద్దిసేపటికి మెట్టుగూడ ప్రాంతంలో కనుమరుగయ్యారు. ఆటోలో నక్కి ఉండగా... ఈ స్నాచర్లు తమ వాహనానికి ఉన్న సైలెన్సర్ను పీకేశారు. రాత్రి వేళ విపరీతమైన శబ్ధంతో దూసుకుపోతున్న ఆ వాహనాన్ని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే స్నాచర్లు దాక్కున్న ప్రదేశానికి చేరుకున్న ముగ్గురు యువకులూ వారి కోసం గాలించగా, ఓ గల్లీ వద్ద ఆగి ఉన్న బైక్ను గుర్తించారు. ఆ సమీపంలోనే ఆటోలో నక్కిన ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి ద్వారా సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు తక్షణం ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. స్నాచర్లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురూ రామాంతపూర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ధీరజ్ విద్యార్థి కాగా... మిగిలిన ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులు. అయ్యో పాపం అనిపించింది.. తార్నాకలో నేరం జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమై స్నాచర్లను వెంటాడాం. మెట్టుగూడలోని స్కైల్యాబ్ హోటల్ వద్ద ఆటోలో దాక్కున్న ఇద్దరినీ పట్టుకున్నాం. తొలుత వారు తమ వద్ద ఉన్న ఓ బేసిక్ ఫోన్కు ఇచ్చి తమ వద్ద ఇంకా ఏమీ లేవన్నారు. దాంతో పాటు వారి స్థితి చూడగానే అయ్యో పాపం అనిపించింది. ఆ తర్వాత వారి బైక్ను వెతికితే మిగిలిన ఫోన్లు, బ్యాగ్ బయటపడ్డాయి. అప్పుడే వీరి నిజస్వరూపం తెలిసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న పోలీసుల పని తీరూ మాకు పూర్తిగా అవగతమైంది. పారిపోతున్న నేరగాళ్లను పట్టుకోవడం మా బాధ్యతగా భావించాం. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – ధీరజ్, శ్రీకాంత్, ప్రమోద్ అందరికీ ఆదర్శం తమ కళ్ల ఎదుట జరిగిన నేరంపై ఈ యువకులు స్పందించిన తీరు అభినందనీయం. ఇదే స్ఫూర్తిని మరికొందరు ఆదర్శంగా తీసుకోవాలి. పోలీసు–ప్రజల మధ్య సంబంధాలకు ఇదో మంచి ఉదాహరణ. ప్రజలు తమకు సహకరిస్తూ ఉంటే కేసులు కొలిక్కి తీసుకురావడమే కాదు... నేరాల నిరోధానికి ఆస్కారం ఏర్పడుతుంది. మీ కళ్ల ముందు ఎలాంటి నేరం జరిగినా, మీ వాళ్లలోవిపరీతమైన మార్పులు గమనించినా తక్షణం స్పందించండి. నేరుగా లేదా 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, బ్యాగ్ స్వాధీనం చేసుకున్నాం.– అంజనీకుమార్, కొత్వాల్ -
దారికాచి దాదాగిరి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్లో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న 15 మంది యువకులు దారికాచి అటు వెళుతున్న వారిని అడ్డగిస్తూ సెల్ఫోన్లు, నగదు దోచుకుంటూ బీభత్సానికి పాల్పడ్డారు. ఇదేమిటని అడిగిన వారిని చితకబాదారు. తప్పించుకొని ఇళ్లల్లోకి పారిపోయినా కత్తులు, కర్రలు, రాడ్లతో వెంటపడ్డారు. ఇళ్ల ముందు బీరు బాటిళ్లను పగులగొట్టి భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రోడ్ నెంబర్–2లోని ఇందిరానగర్లో నివసించే కృష్ణ అనే యువకుడు ఆదివారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా రిచ్మండ్ స్కూల్ దాటి ముందు గల్లీలోకి వెళ్లగానే అప్పటికే అక్కడ మాటు వేసిన మహేష్ అలియాస్ మయి, సుతార్ మహేష్, నవీన్, తేజశివ, సురేష్, మల్లి, రాకేష్ తదితరులు అతడిని అడ్డగించారు. అప్పటికే వారు కొందరిని అడ్డుకుని బలవంతంగా వారి జేబులో ఉన్న నగదు లాక్కుని సమీపంలోని మైదానంలోకి వెళ్లి బీర్లు తాగారు. మళ్లీ బీర్లు, గంజాయి తాగడానికి డబ్బులు అవసరం కావడంతో అటుగా వస్తున్న కృష్ణను అడ్డగించారు. వారి నుంచి తప్పించుకున్న కృష్ణ తన తమ్ముడు సాయి ఇంట్లోకి వెళ్లగా మందుబాబులు అతడిని వెంబడించి ఇంటికి వద్దకు వెళ్లి బీరు బాటిళ్లు పగులగొడుతూ కత్తులు, కర్రలతో అరగంటపాటు వీరంగా సృష్టించారు. ఈ ఘటనలో నిషాంత్, సాయి అనే యువకులకు గాయాలయ్యాయి. అడ్డువచ్చిన వారిని పగిలిన బీర్ బాటిల్తో పొడుస్తామంటూ బెదిరించారు. బాధితులు సమాచారంఅందించడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోగా నిందితులు పరారయ్యారు. నిషాంత్, సాయి తదితరులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహేష్, నవీన్, తేజశివ, సుతార్ మహేష్, సురేష్, రాకేష్, మల్లి తదితరులతో పాటు 15 మంది తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నోవా కాలేజీలో బీటెక్ చదువుతున్న నిందితుడు మహేష్ అలియాస్ మయిని అదుపులోకి తీసుకున్నారు. కత్తి, బీరు బాటిళ్లతో దాడి చేసిన నవీ, సుతార్ మహేష్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీవితాలతో ‘సెల్’గాటం..!
ప్రస్తుతం ప్రపంచమంతా సెల్ మయం. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ ఆండ్రాయిడ్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇవి భవిష్యత్ను నిర్దేశిస్తున్నాయి. సెల్ ఫోన్ను అవసరం మేరకు వినియోగించేవారు పనులు పూర్తిచేసుకుంటున్నారు. సెల్నే ప్రపంచంగా భావించేవారు భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. సెల్ గేమ్లలో మునిగిపోయి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలను తీసుకుంటున్నారు. సెల్లో వచ్చే ఆటలకు అధికమంది పిల్లలు, యువత బానిసలవుతున్నారని, ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు మేలుకోకుంటే పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమని హెచ్చరిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : బ్లూ వెల్ చాలెంజ్ గేమ్. ఇది ఒక ఆన్లైన్ వీడియో గేమ్. 50 రోజుల పాటు సాగే బ్లూవెల్ గేమ్లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్లో లీనమై ఏడాదిన్నర కిందట మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్లో మరొక పాఠశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆ ఆటను ఇండియాలో నిషేధించింది. అయితే... ఇది జరిగిన కొద్దినెలల వ్యవధిలోనే మరికొన్ని ఆన్లైన్ వీడియో గేమ్లు విద్యార్థులు, యువత జీవితాలతో ఆటాలాడుకుంటున్నాయి. తాజాగా పబ్జీ ఉరఫ్ ‘ప్లేయర్ అనోస్ బ్యాటిల్ గ్రౌండ్’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూల్ విద్యార్థులను ఆ లోకంలో ముంచేస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాల స్థాయిలో కాకున్నా పబ్జీ విద్యార్థులను హింస, నేరప్రవత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. పాఠశాలలను ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుతోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతుండడంతో మానసిక వైద్యులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు... యువత భవిష్యత్తే టార్కెట్... ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని గేమ్లో ప్రవేశించగానే ఒక ఐడీ వస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్. ఎంత మందితో ఈ గేమ్ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించుకుంటారు. ఈ గేమ్ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే, ఇది గ్రూప్ వాయిస్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్లో ఉంది. ఈ గేమ్లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న జట్టు తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట ప్రధాన లక్ష్యం. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్లో ప్రవేశించాలనుకుంటారు. వైరల్గా మారుతున్న వీడియో గేమ్స్.. మానవాభివృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం.. అదే స్థాయిలో మానవమనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. వయస్సు, లింగ బేధాలు లేకుండా ఆన్లైన్ ఆటల్లో నిమగ్నమయ్యేవారి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా గేమ్స్ కేవలం ధనిక వర్గాలకే పరిమితం కాగా... ప్రస్తుతం అందరివద్ద హస్త భూషణంగా మారిన ఆండ్రాయిడ్ ఫోన్లతో ఈ సంస్కృతి మరింత పెరిగింది. ఒకసారి ఆడితే చాలు మనకు తెలియకుండానే బానిసలైపోతారు. ఇంట్లో ఖాళీగా ఉండే అండ్రాయిడ్ ఫోన్లలో వింత వింత వీడియో గేమ్స్ను డౌన్లోడ్ చేస్తున్న చిన్నారులు వాటిలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. చివరికి ఆహారం తీసుకునేందుకు విముఖత చూపే స్థాయికి చిన్నారులు దిగజారిపోతున్నారు. తాజాగా ఇంటర్నెట్ను అనుసంధానం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ వీడియో గేమ్లు మరింత ప్రమాదకారిగా మారాయన్నది మానిసిక నిపుణుల వాదన. ఒక్కసారి అలవాటు పడితే రోజుల తరబడి అదే ధ్యాసలో ఉండిపోతున్నారు పిల్లలు. దీనికి సెల్ కంపెనీలు ప్రకటిస్తున్న ఇంటర్నెట్ ఆఫర్లు మరింత ఆజ్యం పోస్తున్నట్లవుతోంది. తక్కువ మొత్తానికే రోజుల తరబడి ఇంటర్నెట్ వాడుకునే అవకాశం కల్పించడంతో తల్లిదండ్రులు అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే అదునుగా ఇంట్లో చిన్నారులు నెట్కు అనుసంధానమై గేమ్స్ భూతంలో చిక్కుకుంటున్నారు. ఇలా రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వరకు ఈ తరహా ఉచ్చులో చిక్కుకునే వారిలో ఉంటున్నారు. మేలుకుంటేనే మంచిది చిన్నారులు, విద్యార్థులు సెల్గేమ్లలో మునిగిపోకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకమని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆడే చాలా రకాల క్రీడలు అడేందుకు ఉన్నా... పాశ్చాత్య సంస్కృతిలో అందుబాటులోకి వచ్చిన వీడియేగేమ్ల వల్ల కలిగే అనర్థాలను వివరించాలి. కేవలం తమ పిల్లల విద్యాభివృద్ధిపైనే కాకుండా వారి అభిరుచులు, అలవాట్లపై దృష్టి సారించి అవుట్ క్రీడల్లో ప్రోత్సహించాలి. తద్వారా వారిలో మానసిక ఉల్లాసం పెరిగి చదువులో ఏకాగ్రత పెరుగుతోంది. ప్రతిరోజు వ్యాయామం చేయించడం, శారీరక అలసట ఉండే క్రీడల్లో ప్రోత్సహించాలని చెబుతున్నారు. భారతీయ క్రీడల్లో ప్రోత్సహించాలి ప్రస్తుతం తల్లిదండ్రులు కేవలం చదువు, ఉద్యోగంపైనే దృష్టి సారిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదువుతున్నారా..? లేదా..? అన్నదే కాకుండా వారి అలవాట్లను పరిశీలించాలి. ప్రధానంగా వీడియే గేమ్లు ఆడే చిన్నారుల్లో మార్పు తీసుకురావాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటారు కదా అని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఒక్కసారి ఈ గేమ్ ఆడేందుకు అలవాటుపడితే వారిని అంత వేగంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకురాలేం. ఇంట్లో ఉన్నది కొద్ది సమయమే అయినా మన సంస్కృతికి సంబంధిత క్రీడల్లో ప్రోత్సహించాలి. – ఎం.మురళీధరరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మానసిక సమస్యలు ఉత్పన్నం పూర్తిగా మెదుడుకు సంబంధించి వీడియో గేమ్స్ను ఆడటం వల్ల చిన్నారులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఫలితంగా మానసికంగా బలహీనంగా మారుతారు. చిన్న వయస్సులోనే దృష్టిలోపం వస్తుంది. తలనొప్పి వంటి వ్యాధులు అనుబంధ క్రమంలో వ్యాప్తి చెందుతాయి. మానసిక సమస్యలు కొనితెచ్చుకోవడం ద్వారా చదువులో వెనుకబడతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇప్పించి వారి అలవాట్లను మారేలా చేయాలి. లేకపోతే బ్లూ వెల్గేమ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. – ఎన్.సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం వీడియో గేమ్స్తో కలిగే దుష్ఫరిణామాలు... చిన్నతనంలో కదలకుండా ఒకే చోట కూర్చుని ఆడే వీడియో గేమ్స్ వల్ల కండరాల అభివృద్ధి తగ్గిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. నెక్పెయిన్, అర్థరైటిస్, వీక్నెస్ వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. కణజాలం పునరుత్పత్తి తగ్గిపోతుంది. ఉత్సాహం తగ్గిపోయి.. నిరుత్సాహం ఆవహిస్తుంది. నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తడంతో పాటు నిద్రలో ఇవే ఆలోచనలు వెంటాడుతుంటాయి. జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరికి ఏం చేస్తున్నారో తెలియని అయోమయ స్థితికి చేరుకుంటారు. పక్కన కూర్చున్న వారిని సైతం పట్టించుకోరు. దీంతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. -
‘స్మార్ట్’గా చేద్దాం
వేసవి ప్రారంభం కానేలేదు. అప్పుడే తాగునీటికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్టులో జలాలు అడుగంటడమే. వర్షాభావ పరిస్థితులతో సింగూరులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. వేసవి నాటికి ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది. ఫలితంగా మిషన్ భగీరథ ద్వారా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నర్సాపూర్ నియోజకవర్గానికి నేటి నుంచి నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం మెదక్ నియోజకవర్గంలో రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఇక్కడ కూడా సరఫరా నిలిచిపోనుంది. సాక్షి, మెదక్: ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే మాతాశిశు మరణాలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) ప్రత్యేకంగా కామన్ అప్లికేషన్ సిస్టం (సీఏఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు పని భారంతో పాటు రికార్డుల నిర్వహణ తప్పనుంది.ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు రిజిస్టర్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను మొత్తం 14 రకాల రికార్డులు రాయాల్సి ఉంది. దీంతో వారికి పని భారంతో పాటు రిజిస్టర్ల మోత ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించనుండటంతో ఇకపై వారికి ఈ బాధలు తప్పనున్నాయి. దీంతో పాటు గర్భిణులకు సంబంధించిన ఇమ్యూనైజేషన్, ప్రసవం తేదీలను మూడు రోజుల ముందుగానే సంక్షిప్త సమాచారం ద్వారా తెలియడంతో వారు గర్భిణులను సరైన సమయంలో ఆసుపత్రులకు పంపించే అవకాశం ఉంటుంది. స్మార్ట్ఫోన్లు అందించిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు నాలుగు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడతలో కుటుంబ నిర్వహణ అనే అంశంపై శిక్షణ ఉంటుంది. ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలను స్మార్ట్ఫోన్లో ఎలా అనుసంధానం చేయడం తదితర వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. రెండోవిడతలో గృహ సందర్శన అనే అంశంపై శిక్షణ నిర్వహిస్తారు. మూడో విడతలో భాగంగా ఆహార పదార్థాలకు సంబంధించి శిక్షణనిస్తారు. చివరగా నాలుగో విడతలో అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అంశంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలన్ని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించిన అనంతరం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక యాప్ ద్వారా... పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లను సొంతంగా వినియోగించకుండా ప్రత్యేక యాప్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వీరికి స్మార్ట్ఫోన్తో పాటు పవర్ బ్యాంక్, ప్రతిపాదించిన నెట్వర్క్ సిమ్కార్డుతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. సంబంధిత బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది. అయితే ఇప్పటి వరకు రికార్డులు రాయడంలోనే అంగన్వాడీ టీచర్లు పూర్తిస్థాయిలో నిమగ్నం కావడంతో పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, పాలు, భోజనం వంటి పౌష్టికాహారం అందించడంలో సైతం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఇవి సక్రమంగా అందుతున్నాయా ? లేదా ? సరుకులు అందుబాటులో ఉన్నాయా ? లేదా ? అనే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలుసుకునే వీలుంది. అయితే కొందరు అంగన్వాడీ టీచర్లు ఈ విషయమై తమకు పని భారం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ఫోన్లలో పొందుపర్చిన వివరాలు ఒక్కోసారి డిలీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయని... దీంతో తాము రిజిష్టర్లలో కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. పారదర్శకత పెరుగుతుంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. వీటిలో వివరాలు నమోదుకు సంబంధించి నాలుగు దశల్లో ఆయా సెక్టార్లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పోషన్ అభియాన్ కింద స్మార్ట్ఫోన్, పవర్ బ్యాంక్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో అంగన్వాడీ టీచర్లకు పని భారం తగ్గుతుంది. అలాగే పనిలో పారదర్శకత పెరుగుతుంది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే అవకాశం ఉంటుంది. –జ్యోతిపద్మ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి