Chittoor: Young Man Suicide Girlfriend Did Not Lift The Phone Viral - Sakshi
Sakshi News home page

ప్రేయసి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని.. ఎంత పనిచేశావ్‌ తరుణ్‌..

Jan 11 2022 2:38 PM | Updated on Jan 11 2022 3:18 PM

Young Man Suicide Girlfriend Did Not Lift Phone In Chittoor District - Sakshi

తరుణ్‌ పట్టణంలో ఫుడ్‌ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్‌ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్‌పేటలో ఉంటున్నారు.

చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు

తరుణ్‌ పట్టణంలో ఫుడ్‌ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement