chittoor district
-
ఏపీలో ప్రసిద్ధ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
నిను వీడని ‘నాగు’ను నేను!
పలమనేరు/బైరెడ్డిపల్లె: పిచ్చుగుంట్ల సుబ్రహ్మణ్యం.. ఊరు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరకుంట. పదేళ్ల వయసులో ఐదో తరగతి చదువుతున్న అతడిని పశువులు కాస్తున్న సందర్బంలో ఓ నాగుపాము కాటేసింది. ప్రస్తుతం అతడి వయసు 48. ఇప్పటివరకు నాగుపాములు అయన్ని 103సార్లు కాటేశాయి. అయినా.. ఎప్పటికప్పుడు చికిత్స పొందుతూ మృత్యుంజయుడిగా మారాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ‘ఇదో మిరాకిల్’ అంటూ వైద్యులే షాకవుతున్న ఈ విచిత్రమైన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. సుబ్రహ్మణ్యేశ్వరుడి కృపతో పుట్టారట బైరెడ్డిపల్లె మండలం కుమ్మరకుంటకు చెందిన పిచ్చుగుంట్ల కుప్పయ్య దంపతులకు పెళ్లయిన చాలాకాలం వరకు సంతానం లేదు. దీంతో ఆ దంపతులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం మొక్కుకున్నారట. మొక్కు సాకారమై కొడుకు పుట్టడంతో అతడికి సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. సుబ్రహ్మణ్యం ఐదో తరగతి చదువుతూ పొలంలో పశువులను కాస్తుండగా మొదటిసారి నాగుపాము అతన్ని కాటేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎక్కడికెళ్లినా పాములు అతడిని వదలడం లేదు. తొలినాళ్లలో పెద్దగా ఆస్పత్రులు లేకపోవడంతో సుబ్రహ్మణ్యం పాము కాటేసినప్పుడల్లా బైరెడ్డిపల్లిలోనే నాటువైద్యుడు దైవకటాక్షం వద్ద చికిత్సలు పొందేవాడు. ఆ తరువాత బైరెడ్డిపల్లి పీహెచ్సీ, కోలార్ మెడికల్ కాలేజీ, పీఈఎస్ కుప్పం, పెద్దపంజాణిలోని క్రిస్టియన్ ఆస్పత్రి, జేఎంజే గుట్టూరులో చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడుతున్నాడు. తాజాగా నాలుగు రోజుల క్రితం ఇంటిముందు మంచంపై కూర్చుని ఉండగా.. వెనుకనుంచి వచి్చన పాము కాలిపై కాటేసింది. గుట్టూరులో చికిత్స పొంది మంగళవారం అతడు డిశ్చార్జి అయి ఇంటికి చేరాడు. చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చు 103సార్లు పాముకాట్లకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్సలకు రూ.లక్షలు ఖర్చు పెట్టాడు. తనకున్న మూడెకరాల పొలం కాస్తా ఇప్పుడు రెండెకరాలకు చేరింది. ఆస్తులు విక్రయించి, అప్పులు చేసి ఇలా పాముకాట్ల నుంచి బయటపడుతున్నాడు. సుబ్రహ్మణ్యంను రైతులెవరూ కూలి పనులకు సైతం పిలవడం లేదు. కూలి పనులు చేస్తున్నప్పుడు పాము కాటేస్తే తాము బాధ్యులమవుతామనే భయమే దీనికి కారణం. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందోననే ఆందోళనతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. దీనిపై వైద్యులు సైతం ఇదో మిరాకిల్ అంటున్నారు. ఇలా ఎవరికీ జరగదని.. ఇతడినే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు. తిరగని గుడుల్లేవుచిన్నప్పటి నుంచి పాము కలలో కనిపించేది. పాముకాట్లు మొదలయ్యాక నాగదోషం ఉందని కాళహస్తి వెళ్లా. తరువాత తిరుత్తణికి జీవిత కావడి మోస్తున్నా. వీరనాగమ్మ మా ఇలవేల్పు కాబట్టి.. ఇంటివద్ద నాగులు రాళ్లకు పూజలు చేస్తున్నా. కొక్కే సుబ్రహ్మణ్యస్వామి, తిరువణ్ణామలై, కురుడమళై కులదేవీ తదితర ఆలయాలకు తిరిగినా పాము కసి వదలిపెట్టలేదు. – సుబ్రహ్మణ్యం, నాగుపాము కాటు బాధితుడు నాగుపాములు పగబట్టవు నాగుపాములు పగబడతాయనేది నిజం కాదు. పాములకు ఉండేది చిన్నపాటి మెదడు. దీనివల్ల వాటికి జ్ఞాపకశక్తి తక్కువ. ఏవేవో పాములు అతన్ని యాధృచ్చికంగా కాటేస్తుండవచ్చు. పగబట్టి మాత్రం కాదు. ఇలాంటి మూఢనమ్మకాలతో తనకు నాగదోషం ఉందని, పాము పగబట్టిందని భావించడం వట్టి ట్రాష్ మాత్రమే. మేం అతడింటికి వెళ్లి అవగాహన కల్పిస్తాం. – యుగంధర్, జన విజ్ఞాన వేదిక నాయకుడు, పలమనేరు -
మాయమయ్యాడు.. మామూలు మనిషి
ఒకప్పడు ఎటు చూసినా బంధాలు..అను బంధాలు..ఆత్మీయతలు.. అనురాగాలు.. విలసిల్లేవి.. ప్రపంచీకరణ పుణ్యమాని.. మనిషిలో స్వార్థం పెరిగి మాన సంబంధాలు కనుమరుగవుతున్నాయి. తన జీవితం తనదే, పొరుగువారితో పనేముందన్న రీతి లో మానవుడు సాగుతున్నాడు. యాంత్రిక జీవనం గడుపుతున్నాడు.. మచ్చుకైనా మానవత్వం కనిపించకపోవడంతో మామూలు మనిషి మాయమైపోయాడనక తప్పదు. నేటి మానవ సంబంధాలపై ప్రత్యేక కథనం. పలమనేరు: మానవ సంబంధాలను మంటగలిపి కేవలం తమ స్వార్థం చూసుకుంటున్న మనుషులు సమాజంలో ఎక్కువైపోయారు. గమ్యం తెలియని జీవన పయనమెటో తెలియని గందరగోళం నెలకొంది. సమాజంలో మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలు కొల్పాల్సిన అవరసం ఎంతైనా ఉంది. గత ఏడాదిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరూ ఉండి అనాథల్లా మారి కనీసం అంత్యక్రియలకు నోచుకోని పదిమందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దహనసంస్కారాలు చేశారంటే సమాజంలో ఎలాంటి మావనీయ సంబంధాలున్నాయే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మానవ సంబంధాలెలా ఉన్నాయంటే? పలమనేరు మండలంలోని మొరం పంచాయతీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన కుటుంబంతో బెంగళూరులో కాపురముంటున్నారు. అనారోగ్యంతో అతని తల్లి మృతి చెందింది. దీంతో ఆ ఇంటి యజమాని మానవత్వం లేకుండా తన ఇంట్లో శవాన్ని పెట్టకుండా అడ్డుకున్నాడు. దీంతో విధిలేక వారు స్వగ్రామానికి తీసుకొచ్చారు. బయట చనిపోయినవారు గ్రామంలోకి రాకూదనే సంప్రదాయంతో శవాన్ని ఊరిబయటే పెట్టి ఆపై అంత్యక్రియలను నిర్వహించారు. పలమనేరు సమీపంలోని సాయినగర్లో ఓ ఉద్యోగి సొంత ఇంటిని నిర్మించుకుని పదేళ్లుగా కాపురముంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఇరుగుపొరుగు వారితో మాట్లాడలేదు. ఎరింటికీ వెళ్లలేదు. ఆ వీధిలో ఎవరికైనా కష్టమొచ్చినా సాయం చేయలేదు. పొద్దున ఆఫీసుకెళ్లడం పొద్దుపోయాక ఇంటికి రావడం తప్ప అతనికి ఎవరితోనూ సంబంధం లేని జీవితం గడుపుతున్నారు. మారిన బతుకులు ఒకటో తరగతి నుంచి కార్పొరేట్ స్కూల్ ఆపై కాలేజీ, మళ్లీ కుటుంబానికి దూరంగా పిల్లల చదువులు. ఆపై ఉద్యోగం రాగానే వారి జీవితం వారిది. ఇక ఇళ్లల్లోని పెద్దలను పిల్లలే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో కుటుంబ విలువలు తెలియని పిల్లలు ఎవరికివారేఅన్న భావనతో తమ బతుకులకు అంకితమైపోతున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యమాని మానవ సంబంధాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గతంలో ఓ గ్రామంలో వంద కుటుంబాలుంటే కనీసం 20 కుటుంబాలన్నా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఊరికి రెండు, మూడు కుటుంబాలు సైతం కలిసి ఉండడం లేదు. సచ్చినా బాధపడే వారెవరు? సొంత కుటుంబసభ్యులు ఎవరైనా మృతి చెందితే కనీసం కొన్నేళ్లపాటు బాధపడే రోజులు గతంలో కనిపించేవి. కానీ ఇప్పుడు సొంత కుటుంబసభ్యులు చనిపోయినా కేవలం రెండు మూడు రోజులే బాధ, ఆపై అసలు పట్టించుకోరు. మాయమవుతున్న మానవసంబంధాలు ఎవరు ఏమైతే నాకేంటి నా కుటుంబం బాగుంటే చాలనే స్వార్థం ఎక్కువైంది. ఆఖరికి తన సొంత అమ్మా నాన్న, అక్కా చెల్లి, అన్నదమ్ములను సైతం పట్టించుకోవడం లేదు. గతంలో గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా శుభ, అశుభకార్యాలు జరిగితే పనులు చేసేందుకు ఇంటికోమనిషి వెళ్లేవారు. ఇప్పుడు పెళ్లికి సైతం రావడంలేదు. దీంతో శుభ, అశుభ కార్యక్రమాలకు ఈవెంట్ మేనేజర్లే దిక్కుగా మారారు. నాటి పలకరింపులు కరువు గతంలో ఇంటికి ఎవరైనా బంధువులొస్తే గంటల తరబడి పలకరింలుండేవి. ఆపై బంధువులకు విందుభోజనం చేసిపెట్టేవాళ్లం. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఇంటికోస్తే నిమిషం పలకరింపు, బిజీగా ఉన్నాం ఇంకోసారి వస్తాంలేనంటూ పదినిమిషాల్లో వెళ్లడం కనిపిస్తోంది. మన ఇంట్లోని వారు సైతం బంధువులతో మాట్లాడకుండా స్మార్ట్ఫోన్లకు అతక్కుపోయి ఉంటున్నారు . – లక్ష్మీపతినాయుడు, బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం కష్టమొస్తే పలకరించేవాళ్లుండాలయ్యా! గతంలో ఎవరికైనా కష్టం వస్తే ఇంటిపక్కనున్నవారో స్నేహితులో మంచి సలహా చెప్పి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఇప్పుడు ఆత్మీయ పలకరింపులు లేవు. ఎవరు చూసినా వారి పనుల్లో బిజీబీజీ. రోడ్డుపై ప్రమాదం జరిగినా మనకెందుకులే, కేసవుతుందని వెళ్లిపోయే సమాజమిది. అమ్మా,నాన్న, బిడ్డలకంటే ఎక్కువగా సోషల్మీడియాతో గడుపుతున్నారు. – పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు -
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలుముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పేపర్ కట్టు... లాభాలు పట్టు!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులకు ఆదాయం వచ్చే పంట మామిడే. మామిడి తోటల్లో కాయలకు కవర్లను కట్టే విధానం గత రెండు మూడేళ్లుగా కొందరు రైతులు అవలంభిస్తున్నారు. దీంతోపాటు కొందరు కర్ణాటకకు చెందిన రైతులు ఇక్కడి రైతుల మామిడి తోపులను లీజుకు తీసుకొని క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ విధానాలతో తోటలను సస్యరక్షణ చేసి నిమ్మకాయ సైజులో మామిడి కాయలున్న దశలోనే వాటికి పేపర్ను కట్టడం ద్వారా కాయల దిగుబడిలో నాణ్యతను పెంచుతున్నారు. ఈ పేపర్ మ్యాంగోకు మార్కెట్లో ఎక్కువ ధర పలికి మంచి లాభాలను గడిస్తున్నారు. దీన్ని గమనించిన ఇక్కడి మామిడి రైతులు సైతం తోటల్లోని కాయలకు పేపర్ను చుట్టడాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు. కవర్లతో కాయలకు రక్షణసా«ధారణంగా మామిడి కాయలు కోతకొచ్చే ముందు కాయలు నిమ్మసైజులోకి రాగానే కవర్లను కట్టుకో వాల్సి ఉంటుంది. దీంతో కాయలపై సూర్యరశ్మి పడ కుండా, ఎలాంటి క్రిమికీటకాలు సోకకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. దీంతోపాటు కాయల సైజు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా కాయ రంగు, షైనింగ్ వస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, తెగుళ్ళు, బంకపేను లాంటివి కాయపై కనిపించవు. దీంతో వీటిని ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు సైతం అధిక ధరలకు కొనేందుకు అవకాశం ఉంటుంది. వీటికి మార్కెట్లోనూ మంచి ధర పలుకుతోంది.హెక్టారుకు పది వేల కవర్లుఉద్యానవనశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. కవర్ ధర రూ.2గా ఉంది. హార్టికల్చర్ శాఖ కవర్కు రూపాయి రాయితీ ఇస్తోంది. అంటే హెక్టారుకు పదివేల కవ ర్లకు రూ. 20వేలు అయితే రైతులు సంబంధిత రైతు సేవాకేంద్రంలో రూ.10వేలను చెల్లించి రిజిస్టర్ చేయించుకొంటే దానికి ప్రభుత్వం రూ.10వేలను కలిపి హెక్టారుకు పదివేల కవర్లను ఆ రైతుకు అందిస్తుంది. ప్రస్తుతం కవర్లకోసం ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు మొదలైయ్యాయి. రైతులు ప్రైవేటుగా కావాలనుకుంటే ఇండియామార్ట్, అమెజాన్లాంటి ఆన్లైన్లోనూ పొందవచ్చు. వీటిని మ్యాంగో ప్రొటెక్షన్ గ్రోత్ పేపర్ కవర్లుగా పిలుస్తారు. కవర్లు కట్టిన రైతులకు పండగే.మామిడి సీజన్ ముగుస్తున్న దశలో మార్కెట్కు వచ్చే నీలం మామిడికి ఏటా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. జిల్లాలోని మొత్తం మామిడి సాగులో 20 శాతం మాత్రమే నీలం మామిడి సాగవుతోంది. ఇది మామిడిలో ఆఖరు సీజన్ ఫ్రూట్గా పేరుంది. ఇక్కడి రైతులు సహజ పద్ధతులతో మామిడిని సాగుచేయడమే కాకుండా కాయలకు కవర్లను కట్టడంతో సరుకు నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ అధిక ధరకు మామిడిని కొంటుండడంతో ధరలు ఆశాజనంగా మారాయి. గతేడాది నీలం రకానికి కవర్లు కట్టినందున టన్ను ధర రూ.లక్షను దాటింది.ఇక్కడి తోపులు లీజుకు పెట్టుకొని..కవర్లు్ల కట్టడం ద్వారా నాణ్యమైన సరుకును పొందే విధానంపై ఎక్కువ అవగాహన కలిగిన కర్ణాటక వ్యాపారులు, రైతులు ఇక్కడి మామిడి తోపులకు లీజుపెట్టుకుంటున్నారు. ఆపై వీరే తోపుల సస్యరక్షణ చేసి కాయలకు పేపర్లు కట్టి ఎక్కువ ధర దక్కేలా బయటి దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని గమనించిన ఉమ్మడి జిల్లా రైతులు సైతం ఈ విధానాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నారు.కొమ్మఅంటు (టాప్వర్కింగ్) కూడా..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడిì కాయలు పల్ఫ్కోసం కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తూ... గ్యారెంటీ మార్కెటింగ్ ప్రయోజనం పొందుతున్నారు. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్వర్కింగ్ జూలై, ఆగస్టునెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్దతులు ప్రత్యామ్నాయంగా మారాయి.రైతులను ప్రోత్సహిస్తున్నాంజిల్లాలోని మామిడి రైతులకు కవర్లను కట్టడంపై అవగాహన కల్పిస్తున్నాం. మామిడి సాగు చేస్తున్న రైతులకు ఏటా సమావేశాలను నిర్వహించి కవర్లను కట్టడం ద్వారా కలిగే మేలును వివరిస్తున్నాం. హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం రైతు రూ.10వేలను చెల్లిస్తే మా శాఖ రూ.10వేలను కలిపి కవర్లను అందిస్తున్నాం. అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. – మధుసూదన్రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ అధికారికాయ నాణ్యత బాగుంటుందిగిట్టుబాటు ధర లభించాలంటే మామిడి రైతులు కాయలకు పేపర్ బ్యాగులను అమర్చాలి. దీంతో కాయల నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర వస్తుంది. – నయాజ్, మామిడి వ్యాపారి, పలమనేరుటాప్వర్కింగ్తో భారీ లాభాలు...టాప్వర్కింగ్తో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఉన్న తోటల్లో కాయలకు కవర్లను కట్టడం ద్వారా సరుకు నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయి. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్ఫెన్సింగ్ను 40 కి.మీ మేర ట్రెంచ్లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్ఫెన్సింగ్ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
పెళ్లెప్పుడవుతుంది బాబూ!
కొడుకంటే మమకారం.. వంశోద్ధారకుడు కావాలన్న ఆశయం.. ఫలితం సమాజంలో తగ్గుతున్న అమ్మాయిల జననం.. దీనికితోడు గొంతెమ్మ కోర్కెలు.. సాఫ్ట్వేర్లు.. మన కనుసైగల్లో మసలుకునే వారు కావాలన్న ఆశలు.. కూతురు, అల్లుడు ఒంటరిగా ఉండాలన్న వధువు తల్లిదండ్రుల షరతులు.. వెరసి పలువురు యువకులు పెళ్లికానీ ప్రసాద్లుగా మారుతున్నారు.పలమనేరు: అబ్బాయికి ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి వందలాది సంబంధాలు చూస్తున్నారు..అయినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ఏ ళ్లు దాటిపోతోందని, అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. గతంలో అమ్మాయి తరఫువారే వరసైన వారికి పెళ్లి చేయించేలా పెద్దలు మాటిచ్చేవారు. ఇక బావా, మరదళ్లు అయితే చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. కట్నకానుకలపై పెద్దగా పట్టింపులుండేవి కాదు. కానీ రెండు దశాబ్ధాలుగా వ్యవస్థ మారిపోయింది. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు కుదరడం ఆషామాషీ కాదు. అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్ అకౌంట్లో సేవింగ్స్ ఎంత, సొంతంగా సైట్ లేదా సొంత ఇ ల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్బుక్, ఇన్స్ట్రా, ఎక్స్తోపాటు జీమెయిల్లో సెర్చింగ్ ఆధారంగా గర్ల్ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది. 5 వేల మంది పెళ్లిళ్ల పేరయ్యలు మ్యాట్రిమోనియల్ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లుతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5వేల మందికిపైగా పెళ్లిళ్ల పేరయ్య లున్నారు. వీరందరూ తమ వద్ద వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిల ఫ్రొఫైళ్లు పెట్టుకుని ఇరువర్గాలకు చూపుతున్నా పెళ్లిళ్లు మాత్రం సెట్ కావడం లేదు.కర్షకుడా..? అయితే వద్దులే! సేద్యం చేసుకునే వారికి ఆడబిడ్డ దొరకడం చాలా కష్టంగా మారింది. మరికొన్ని వృత్తి పనులు చేసేవారికి సైతం ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని ఉన్నత కులాల్లోనూ అమ్మాయిల దొరకడం కష్టంగా మారింది. ఇంకొందరికి జాతకాలు సెట్కాలేదనే కారణం కనిపిస్తోంది. గతంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లింగవివక్ష కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిల సగటు తగ్గుతోంది. నిఘా వర్గాలతో కొన్ని సంబంధాలు విఫలం తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్వేర్ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాలే!గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మా ట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది.చదవండి: ‘లైవ్’ కోడి స్పెషల్!పెళ్లిళ్లు సెట్ చేయడం చాలా కష్టం గతంలో ఎన్నో పెళ్లిళ్లు సెట్ చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎన్నో షరతులు పెడుతున్నారు. గతంలో అబ్బాయి, అమ్మాయి ఫొటోలు చూసి పెళ్లికి ఒప్పుకొనేవారు. ఇప్పుడలా కాదు ఇరువర్గాలు మొత్తం విచారించుకుని, నచ్చితేనే ఓకే అంటున్నారు. నేడు పెళ్లి కుమా ర్తె డిమాండ్లను తీర్చడం ఆషామాషీ కాదు. –త్యాగరాజులు, ఎస్ఎల్వీ మ్యారేజి లింక్స్ నిర్వాహకులు, పలమనేరుఅమ్మాయిల సంఖ్య తక్కువ అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి కావాల్సిన మేరకు అ మ్మాయిలు దొరకడం లేదు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఒ ప్పుకుంటే పెళ్లి ఠక్కున జరిగేవి. ఇప్పుడలాకాదు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఎన్నో డిమాండ్లు పెడుతోంది. అంతా సాఫ్ట్వేర్లే కావాలంటున్నారు. సేద్యం చేసుకునే వాడిని పెళ్లి చేసుకొనేవాళ్లెవరో అర్థం కాలేదు. గొంతెమ్మ కొర్కెలతో ముదిరిపోతున్నారు. – లక్ష్మీపతినాయుడు, మ్యారేజి బ్రోకర్,బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం -
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
ఇంటి పన్ను కడితేనే పింఛన్!
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పింఛన్ డబ్బులిచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు. -
కొడుకును చంపించిన తండ్రి
-
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
మహిళా ‘సూపర్’ మార్ట్
చిత్తూరు యాసలో వినిపించే ‘పుష్పా–2’ డైలాగ్....‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేసనల్’ బాగా పేలింది.చిత్తూరు జిల్లా తవణంపల్లె మహిళా మార్ట్కు కూడా ఈ డైలాగ్ను అన్వయించుకోవచ్చు.‘మా మహిళా మార్ట్ అంటే స్టేట్ అనుకుంటివా... ఇప్పుడు నేషనల్... రేపు ఇంటర్నేషనల్’ఆనాటి వై.ఎస్.జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత’ నినాదంతో పురుడు పోసుకున్న ‘మహిళా మార్ట్’లు ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదిగి పోయాయి.కార్పొరేట్ సూపర్ మార్కెట్లతో సమానంగా సత్తా చాటుతున్నాయి.తాజాగా... చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె ‘మహిళా మార్ట్’ జాతీయస్థాయిలో పురస్కారం పొందింది.చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నోవిధాల ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్లకు దీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళల ‘మహిళా మార్ట్’లు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు ‘మహిళా మార్ట్’ల పుణ్యమా అని వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు.‘ఇది మా వ్యాపారం. మా టర్నోవర్ ఇంత...’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో మండల సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే రెండో ‘చేయూత మహిళా మార్ట్ ను తవణంపల్లెలో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మండలంలోని 1,431 స్వయం సహాయక సంఘాల్లోని 14,889 మంది సభ్యుల వాటా ధనం రూ.26 లక్షలతో ‘చేయూత మహిళా మార్ట్’(ప్రస్తుతం వెలుగు మహిళ మార్ట్గా పేరు మార్చారు)ను ్రపారంభించారు.ఆర్థిక అవగాహన, పొదుపు, అప్పుల రికవరీలు, సిఐఎఫ్ చెల్లింపులు. స్త్రీనిధి, పారదర్శక నిర్వహణ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలతో తవణంపల్లె మహిళా మార్ట్ ముందంజలో ఉంది. మండల సమాఖ్య ద్వారా సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ మహిళా మార్ట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ యూసఫ్గూడలోని నేషనల్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత సర్టిఫికేట్, షీల్డు, ్రపోత్సాహక నగదు (రూ.75 వేలు) అందుకున్నారు.‘ఇది ఒకరిద్దరి విజయం కాదు. ఎంతోమంది మహిళల సామూహిక విజయం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అంటున్నారు రేఖ, అనిత.– తగీరు జగన్నాథం, సాక్షి, తవణంపల్లె, చిత్తూరు జిల్లా.పారదర్శకత... మా బలం‘అన్నీ తెలిసిన వారు లేరు. ఏమీ తెలియని వారు లేరు’ అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవరూ ఉండరు. మనకు తెలిసినదాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏదీ అసాధ్యంగా అనిపించదు. ‘మహిళా మార్ట్’ అనే బడిలో వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఏ వ్యాపారానికి అయినా పారదర్శకత అనేది ముఖ్యం. ఆ పారదర్శకత వల్లే జాతీయ గుర్తింపు వచ్చింది. మహిళా సంఘాలు ‘వెలుగు మహిళా మార్ట్’ను పారదర్శకంగా నిర్వహించడంతో జాతీయ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.– అనిత మహిళా సమాఖ్య మండల కార్యదర్శిఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందివ్యాపారంలో ఫలానా మహిళ ఉన్నత స్థాయికి చేరింది... లాంటి ఎన్నో విజయగాథలను వినేవాళ్లం. అలాంటి ఒక స్థాయికి ఏదో ఒకరోజు చేరుకోగలమా అనిపించేది. ‘మహిళా మార్ట్’ ద్వారా మమ్మల్ని గొప్ప అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ముందుకు నడిపించింది. ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అడిగే వాళ్లకు నేను చెప్పే జవాబు... ‘నేను సాధించగలను’ అనే నమ్మకం. ఆ నమ్మకానికి కష్టం, అంకితభావం తోడు కావాలి. తవణంపల్లెలోని వెలుగు మహిళా మార్ట్లో సభ్యులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డ్వాక్రా సభ్యులు మార్ట్లోని వస్తువులే కొంటున్నారు.– రేఖ మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు -
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్ఎన్పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
తిరుపతి, చిత్తూరు జిల్లాల YSRCP అధ్యక్షుడిగా భూమన బాధ్యతలు
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
9న పుంగనూరుకు వైఎస్ జగన్
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.అంజుమ్ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైఎస్ జగన్ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఇదీ చదవండి: తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు, మరో లారీ డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. టెంపో-మినీ లారీ ఢీ
సాక్షి, చిత్తూరు జిల్లా: బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద మీనీ లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ నెల 13 న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో మొగిలి ఘాట్ రోడ్డులో హైవే ప్రమాదాలు నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్స్పై వేగంగా వెళ్లడంతో ఈ రోజు మరో ప్రమాదం సంభవించింది. -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, చిత్తూరు జిల్లా: రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ షాప్పై టీడీపీ నేతలు దాడి చేశారు. షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఓబులేసుపైనా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఓబులేసుకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతల వేధింపులకు మహిళ మృతిమరో ఘటనలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మహిళ మృతిచెందింది. కుప్పం కేజీబీవీలో ఆయాగా పనిచేస్తున్న సెల్వమ్మను పనికిరావద్దని టీడీపీ నేతలు చెప్పడంతో మనస్తాపానికి గురైంది. వాటర్ సంపులో పడి ఆయా సెల్వమ్మ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతికి టీడీపీ నేతలే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో 50 కోట్ల స్కాం..
-
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
కుమ్మపల్లిలో టీడీపీ నేతల అరాచకం
-
కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాచకం
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు. -
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు -
అన్నా, ఊరికే కనిపిద్దామని..!
చిత్తూరు అర్బన్ : జిల్లాలో పుంగనూరు తప్ప మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కై వశం చేసకున్న విషయం తెలిసిందే. పుంగనూరులో టీడీపీ ఇన్చార్జ్తో కలిపి మిగిలిన ఆరు చోట్ల కూడా నాయకులు తమకు అనుకూలంగా ఉన్న సీఐలు, ఎస్ఐల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఇప్పటికే జాబితా సిద్ధం చేయగా, మరికొందరు తమకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాల ఆధారంగా గతంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులు ఎక్కడున్నారో అంటూ ఆరా తీస్తున్నారు. పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆయా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తమకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాలని నేరుగా కోరకుండా.. పూలబొకే చేతికి అందించి ‘అన్నా, ఊరికే కనిపిద్దామని వచ్చాను’ అని చెబుతున్నారు. గతంలో తాము పనిచేసిన స్థాయిని వివరిస్తూ, అప్పట్లో చేసిన అనుకూల ఘటనలను ఉదహరిస్తున్నారు.కుప్పంలో కార్యదర్శులు..కుప్పంలో పోస్టింగుల విషయమై చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శులు పలువురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపతున్నట్లు సమాచారం. పూతలపట్టులో ఎమ్మెల్యే కొత్తకావడంతో ఐదు మండలాల్లోని టీడీపీ నేతల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పూర్తిగా తనకు నచ్చిన అధికారులను నియమించుకునేలా ఎమ్మెల్యే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కూడా పూర్తిగా ఎమ్మెల్యేనే నేరుగా పోలీసు అధికారుల నియామకంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.బయటి జిల్లాల నుంచే..ఎక్కువ శాతం పోలీసు అధికారులు బయటి జిల్లాల నుంచి చిత్తూరుకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో తిరుపతి పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్న ము గ్గురు సీఐ స్థాయి అధికారులు పలమనేరు, బంగారుపాళ్యం స్టేషన్లను అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అటాచ్మెంట్లో ఉన్న ఓ డీఎస్పీ పలమనేరు పోస్టింగుపైనే పట్టుగా ఉన్నారని, ఇందుకు మాజీ మంత్రి సైతం పచ్చ జెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. సీఐడీ విభాగంలో డీఎస్పీ ఒకరు నగరిపై గురి పెట్టినట్లు సిబ్బందే చెప్పుకుంటున్నారు. తిరుపతి ట్రాన్స్కో సీఐ ఒకరు చిత్తూరు వెస్ట్ కావాలని, గతంలో చిత్తూరులో పనిచేసి డీటీసీలో ఉన్న సీఐకి చిత్తూరు వన్టౌన్పై హామీ లభించినట్లు సమాచారం. కర్నూ లు జిల్లాలోని లూప్లైన్లో ఉన్న మరో సీఐ పలమనేరుకు వస్తున్నట్లు సమాచారం.ఎస్బీకి తీవ్ర పోటీ..లా అండ్ ఆర్డర్ విషయం పక్కన పెడితే ఈసారి స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభాగానికి సైతం తీవ్ర డిమాండ్ నెలకొంది. ఎస్పీకి దగ్గరగా పనిచేస్తూ, ఇదే సమయంలో పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడానికి ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి అధికారులు కర్చీఫ్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎస్బీలో పనిచేసిన అనుభవాన్ని, సామాజికవర్గాన్ని చూపించి కొందరు నేతలను పోస్టింగులు అడుగుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే వారంలో ఎస్ఐలు, సీఐల బదిలీలు.. పది రోజుల్లో కిందిస్థాయి సిబ్బందికి స్థానచలనం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఏపీ వ్యాప్తంగా ఆగని టీడీపీ దాడులు
-
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
-
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
బాబు ఇంతేకదమ్మ!
బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా భరత్కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్కి టికెట్ ఇచ్చి బీసీలను గౌరవించింది. మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే. టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. బాబు కులస్తులకే పెద్దపీట కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్ (తిరుపతి) టికెట్ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. -
భీరకుప్పంలో రోజా ఎన్నికల ప్రచారం
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్ -
ఉమ్మడి చిత్తూరు జిల్లా: ఏప్రిల్ 2, 3 తేదీల్లో బస్సు యాత్ర
సాక్షి, తిరుపతి: ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. గతంలో సిద్దం సభలు విజయవంతంగా జరిగాయన్నారు. ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, నంద్యాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. మార్చి 30 గుత్తిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏప్రిల్ 1న కదిరిలో ఇఫ్టార్ విందు, ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాలో ‘మేము సిద్దం’ సభలు నిర్వహిస్తామన్నారు. సభలు విజయవంతం చేసేందుకు అన్ని నియోజక వర్గాలు నాయకులు, కార్యకర్తలు సిద్దం గా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
YSRCP చిత్తూరు జిల్లా అభ్యర్థులు వీళ్లే
చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్పోర్ట్ టౌన్కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..! -
చిత్తూరు జిల్లాలో కుప్పంను ముద్దాడిన కృష్ణాజలాలు
-
మహానేతపై తరగని అభిమానం
బంగారుపాళెం(చిత్తూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిపై ప్రజాభిమానం తరగలేదు. బంగారుపాళెం మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన జిల్లా వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రఘుపతిరాజు వైఎస్సార్ వీరాభిమాని. చనిపోయిన తన తల్లిదండ్రుల చిత్ర పటాలతో పాటు తాను అమితంగా అభిమానించే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటం ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు పెట్టి పూజలు నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు. బంధువులు, స్నేహితులను పిలిచి మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాజశేఖర్రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
వద్దు బాబూ..మీకో దండం!
సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్కు అంజనం వేసినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. సర్వేలో బహిర్గతమైన ఓటమి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు. కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మాజీ మంత్రికి ఓటమి భయం పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్ వైఎస్సార్సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్నాథ్రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించేందుకు బాబు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు. చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. తిరుపతిలో పలాయనమే.. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్బోర్డు చైర్మెన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తున్నా, ఆయన గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
జొన్న కురుకుల గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం
-
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
-
పలమనేరులో మిన్నంటిన సాధికార నినాదం
సాక్షి, చిత్తూరు/పలమనేరు: సాధికార నినాదంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మార్మోగింది. నియోజకవర్గంలోని పలమనేరు, పెద్దపంజాణి, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల నుంచి భారీగా తరలి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలతో శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఘనంగా జరిగింది. యాత్రలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తొలుత గంగవరం వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిం చారు. ఆనంతరం భారీ జనసందోహం మధ్య యాత్ర బయల్దేరింది. ఈ యాత్రకు అడుగగడునా ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అని నినదిస్తూ పూలు జల్లుతూ యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం అశేష జన సందోహం మధ్య సామాజిక సాధికార సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జగనే కావాలి అంటూ ప్రజలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సన్నగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా సభను విజయవంతం చేశారు. జగనన్నతోనే సామాజిక న్యాయం: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. సామాజిక న్యాయమంటే ఏమిటో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, అందరికీ సొంతింటి కలను నిజం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. రాజకీయ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటిలోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. సీఎం జగన్ చలవతో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారని అన్నారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 అభివృద్ధి నిరోధక శక్తులని పేద పిల్లల చదువుల కోసం ట్యాబ్లిస్తే వాటి కారణంగా ఎంతో నష్టమంటూ రామోజీరావు తప్పుడు కథనం రాశారని, ఆయన మనవడు మాత్రం ట్యాబ్లు వాడొచ్చా అని ప్రశ్నించారు. రూ.700 కోట్లతో పలాసలో ఫిల్టర్ నీళి్చచ్చి, కిడ్నీ ఆస్పత్రిని కట్టినా ఎల్లోమీడియా కడుపు మంటతో తప్పుడు రాతలు రాసిందన్నారు. ప్రతిపక్షానికి బాధగా ఉంది: మంత్రి జయరామ్ బీసీలకు పెద్దపీట వేసింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. మన బిడ్డలు బాగా చదివి బాగుపడుతుంటే ప్రతిపక్షానికి చాలా బాధగా ఉందని అన్నారు. వాల్మీకి కులస్థుడైన తన తలరాతను మార్చింది కేవలం జగనన్నే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే జగనన్న రావాల్సిందే మాజీమంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నాఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనారిటీ అని చెప్పే వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ ఇంటి ముందుకెళ్లి నిలబడాలని, అదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో పథకాలే ఇంటి ముందుకొస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో 8 చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు దక్కని దత్తపుత్రుడు ఇక్కడకొచ్చి తాటతీస్తా.. తొక్కతీస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరో శ్రీలంక అని విషప్రచారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు పలమనేరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భరత్, రమేష్ యాదవ్, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర దేవరపల్లి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు, వారిని సామాజిక సాధికారత వైపు నడిపించిన వైనాన్ని వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది. -
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
'Michaung' Cyclone: దిశమార్చుకున్న మిచౌంగ్.. తీవ్ర తుపానుగా..
cyclone michaung Live Updates.. ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్ ప్రచండ గాలులతో విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ తీరం దాటిన తర్వాత కూడా కొనసాగనున్న తుపాను ప్రభావం తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పలువురు.. సహాయక చర్యలందించేందుకు రెడీ చెన్నై-నెల్లూరు రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను బీభత్సం సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదనీరు తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు బారికేడ్లతో జాతీయ రహదారి మూసివేత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచన మిచౌంగ్ ఒంగోలు హెల్ప్లైన్ నెంబర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో హెల్ప్ లైన్ 1. 9949796033 2. 8555931920 3. 9000443065 4. 7661834294 5. 8555871450 ఎలాంటి సమస్య వున్నా హెల్ప్.లైన్.నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పిలుపు చెన్నై నగరంలో వర్ష బీభత్సం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం నగరంలో ఎటు చూసినా నీరే. నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తుపాను తీవ్రతకు సరిపోలేదని వ్యాఖ్య తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందన్న తమిళనాడు మంత్రి ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించినట్లు వెల్లడి చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి కాళంగి నది ఉధృతి ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల తిరుపతిలో స్కూళ్లకు సెలవు మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ధాన్యం నష్టపోకుండా.. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ ) తుపాన్ ఎఫెక్ట్తో గన్నవరం నుంచి విమానాలు రద్దు ముంచుకొస్తున్న ముప్పు అల్లకల్లోలంగా సముద్రం రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్ నెల్లూరు 120 కి.మీ. దూరంలో! రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం కుంభవృష్టి వర్షాలతో ఆక్మసిక వరదలు తప్పవని హెచ్చరిక తీవ్ర తుపాను నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు తీవ్రతుపాన్గా మారిన మిచౌంగ్ అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు అనకాపల్లి : 08924 - 221698 తుని : 08854 – 252172 సామర్లకోట : 08842 - 327010 రాజమండ్రి : 08832 – 420541 తాడేపల్లిగూడెం : 08818 – 226162 ఏలూరు : 08812 – 232267 భీమవరం టౌన్ : 08816 – 230098; 7815909402 విజయవాడ : 08862 – 571244 తెనాలి : 08644 – 227600 బాపట్ల : 08643 – 222178 ఒంగోలు : 08592 – 280306 నెల్లూరు : 08612 – 345863 గూడూరు : 08624 – 250795; 7815909300 కాకినాడ టౌన్ : 08842 – 374227 గుంటూరు : 9701379072 రేపల్లె : 7093998699 కర్నూల్ సిటీ : 8518220110 తిరుపతి : 7815915571 రేణిగుంట : 9493548008 కమర్షియల్ కంట్రోల్ రూమ్స్ సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112 హైదరాబాద్ : 9676904334 కాచిగూడ : 040 – 27784453 ఖాజీపేట్ : 0870 – 2576430 ఖమ్మం : 7815955306 దిశమార్చుకున్న మిచౌంగ్ హఠాత్తుగా దిశ మార్చుకున్న మిచౌంగ్ తుపాను ప్రస్తుతం నెల్లూరు సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం ఇప్పటికే జలదిగ్బంధంలో సూళ్లూరుపేట రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం.. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కలువాయి, నెల్లూరులో ఈదురు గాలుల బీభత్సం ఇవాళ అర్ధరాత్రి లోపు నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశం మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు బాపట్లలో హైఅలర్ట్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో బాపట్ల చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు 14 పునరావస కేంద్రాలకు 800 మందిని తరలించిన అధికారులు మండలానికి ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీములు ఏర్పాటు 350 మంది గజ ఈతగాళ్ళను సిద్దం చేసిన అధికారులు 43 తుఫాను పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండో చోట్లా బస్సుయాత్ర వాయిదా మిచౌంగ్ ఎఫెక్ట్తో డిసెంబర్ 5వ తేదీ రెండు చోట్ల వైఎస్సార్సీపీ బస్సు యాత్ర వాయిదా రేపు చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన యాత్ర భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాయిదా అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా కొనసాగనున్న యాత్ర వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం తెలంగాణపైనా మిచౌంగ్ ఎఫెక్ట్ ఏపీతో పాటు తెలంగాణ పైనా మిచౌంగ్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు.. హాస్టల్ విద్యార్థులు బయటకు రావొద్దని హెచ్చరికలు సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు 1077, 9063211298 ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ తీవ్రతుపానుగా మారిన మిచౌంగ్ తీరప్రాంత గ్రామాల్లో పెరిగిన గాలుల తీవ్రత , వర్షం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఎదురుమొండి దీవుల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఏటిమొగ గ్రామంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం రాబోయే రెండు రోజుల్లో.. చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తరుముకొస్తున్న మిచౌంగ్ అధికార యంత్రాగం అప్రమత్తం తిరుపతిలో.. రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు.. వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం.. రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేసిన అధికారులు.. మిచౌంగ్తో.. నాలుగు రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను కారణంగా 4 రైళ్లు పూర్తిగా రద్దు 3 రైళ్లు పాక్షికంగా రద్దు తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం బాపట్ల – కాటమనేని భాస్కర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి తూర్పుగోదావరి – వివేక్ యాదవ్ కాకినాడ – యువరాజ్ ప్రకాశం – ప్రద్యుమ్న నెల్లూరు – హరికిరణ్ తిరుపతి – జె.శ్యామలరావు వెస్ట్గోదావరి – కన్నబాబు చెరువును తలపిస్తున్న చెన్నై విమానాశ్రయం చెన్నై విమానాశ్రయంలోకి భారీగా చేరిన వరద నీరు. వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 వర్షపు నీటిలో మునిగిపోయిన వాహనాలు.. #ChennaiRains Hi Chennai! The same old chennai with not a single improvement. This is happening every year & still no one cares about it. All they need is big apartments & for that they cut down the trees, demolish the lakes. Hence, the suffering!!!#CycloneMichuang #CycloneAlert pic.twitter.com/L0yo94nwBD — Bala Harish (@balaharish25) December 4, 2023 నీట మునిగిన పలు కాలనీలు.. It's Aishwarya Nagar, Madambakkam, Chennai-126 (@TambaramCorpor ) It's a scary day... Seems like ocean. #ChennaiFloods #Chennai #ChennaiCorporation #chennairains pic.twitter.com/rBgvF6CQig — CommonHuman (@voiceout_m) December 4, 2023 ఈదురు గాలులతో భారీ వర్షం.. location: sholinganallur wipro. #ChennaiRains #ChennaiFloods pic.twitter.com/GMuHc9NqS6 — ワル.🍭🍿 (@itz_shivvvuuu) December 4, 2023 పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు.. Despite this much rain TNEB power is still going. So that I can use Twitter. Hats off to vidiyal arasu. #ChennaiRains #Guduvacheri pic.twitter.com/hcyTrj26Kr — Kabilan Shan (@ksrsk92_) December 3, 2023 கடவுளை கொஞ்சம் கருணை காட்டு பா.... தண்ணி ஏறிக்கிட்டே வருது... 😰😰😰#ChennaiRains #CycloneMichaung https://t.co/d0D3HjnqiU pic.twitter.com/7wTG4zr8xy — Ravi (@ajuravi) December 4, 2023 SAD!!!!!Next to Apollo hospitals at Teynampet be safe #chennairains #chennairains #ChennaiRains #ChennaiFloods #ChennaiFloods #DunkiTrailer #DunkiDrop4 #Yash19DAMNNN@Portalcoin#CycloneMichuang pic.twitter.com/GrkHTzLwtS — Jussu ❤️ Memecoin | jitu123sahani.bnb (@Jussu26237885) December 4, 2023 తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ వీడియో కాన్పరెన్స్లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అనుభవం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి కృష్ణాజిల్లా: మిచౌంగ్ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి రైతులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడల రేవు సముద్రతీరంలో ఎగసి పడుతున్న అలలు 8 మీటర్ల మేర కోతకు గురైన సముద్రతీరం అధికారిక యంత్రాంగం అప్రమత్తం నక్కపల్లి నుండి వేటకు వచ్చిన 30 మంది మత్స్యకారులను నక్కా రామేశ్వరం తుఫాన్ పునారావాస కేంద్రానికి తరలింపు... మిచౌంగ్ ప్రభావంతో ఐదు జిల్లాలకు అలర్ట్.. మచిలీపట్నం చేరుకున్న 25 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అవనిగడ్డ చేరుకున్న 37 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తణుకులో మంత్రి కారుమూరి పర్యవేక్షణ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన కారుమూరి మిచౌంగ్ తుపాన్కు రైతులు ఎవరూ అదైర్యపడవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని మీకు అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలి ఆప్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించాం. ఏ మిల్లర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తుపాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించాము. ఏ ఒక్క రైతు నష్టపోకుండా మనమే చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం.. తుపాన్ ఎఫెక్ట్తో పలు విమానాలు రద్దు.. ఐదు విమానాలను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన తమిళనాడు అతలాకుతలం.. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours#ChennaiRains #CycloneMichaung pic.twitter.com/QNu8LPNkqL — Memer Aspirant (@MemerAspirant) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid heavy rainfall in Chennai city, severe water logging witnessed in several areas of the city. (Visuals from the Pazhaverkadu Beach area) pic.twitter.com/dQpvK0e5VA — ANI (@ANI) December 4, 2023 పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Tamil Nadu: As cyclone 'Michaung' approaches Chennai coast, accompanied by heavy rainfall, several trains are delayed and a few have been cancelled. (Visuals from Egmore Railway Station) pic.twitter.com/5SfV1Xr81L — ANI (@ANI) December 4, 2023 Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours #ChennaiRains @Portalcoin #CycloneMichaung pic.twitter.com/fMUerahj2v — M.N.K (@Nithin1833) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షం, కూలిన చెట్లు.. #WATCH | Tamil Nadu: Amid heavy rainfall, trees uprooted near the Ambattur area, Chennai. pic.twitter.com/XU2Tihh9PO — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 కాకినాడలో అప్రమత్తం.. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణ పరిస్ధితులు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానలు తుపాన్ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు వేటను నిలిపివేసిన మత్స్యకారులు భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచన ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం. యుద్ద ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా 16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు ఉప్పాడ జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు. హోప్ ఐలాండ్ మత్స్యకారుల తరలింపు. తుపాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. కలెక్టరేట్.. 18004253077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం 9701579666 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం 9949393805 నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు నేడు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా నేడు, రేపు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు. తుపాను ఎఫెక్ట్ నేడు పలు రైళ్లు రద్దు.. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు. Cancellation of Trains pic.twitter.com/JpRBLoj5Cx — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Cancellation of Trains pic.twitter.com/JtoUYobINh — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Diversion/Restoration of Trains pic.twitter.com/EgdyrWLBX7 — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు.. రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీరు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. #WATCH | Tamil Nadu | Heavy rainfall in Chennai causes massive waterlogging in parts of the city. Visuals from Vadapalani area of the city. pic.twitter.com/nBNE5oDW25 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Several parts of Chennai receive heavy rainfall as cyclone 'Michaung' approaches the coast. pic.twitter.com/SXeeGaCaH0 — ANI (@ANI) December 4, 2023 మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాన్ రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్ దీని ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం తీరం వెంబడి గంటకు 80 -100 కి.మీ సాయంత్రం నుంచి గంటకు 90-110 కి.మీల వేగంతో గాలులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. #ChennaiRains to continue till noon #ChennaiRain#CycloneMichaung is 110 kms E-NE of #Chennai as it slowly moves North closer to the coasts of North Tamil Nadu & South Andhra Pradesh. North TN will see heavy rains till noon. Coastal AP will see heavy rains post late noon with… pic.twitter.com/N3IggzlHz6 — Karnataka Weather (@Bnglrweatherman) December 4, 2023 విజయవాడ: దక్షిణమధ్య రైల్వే హెల్ప్ డెస్క్.. మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు ఒంగోలు - 08592-280306 కాకినాడ టౌన్ - 0884-2374227 తెనాలి - 08644-227600 గూడూరు - 08624-250795; 7815909300 నెల్లూరు - 0861-2345863 ఏలూరు - 08812-232267 బాపట్ల - 08643-222178 భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402 సామర్లకోట - 0884-2327010 గుడివాడ - 08674-242454 విజయవాడ - 0866-2571244 తుని - 0885-4252172 రాజమండ్రి - 0883-2420541. విశాఖ, అనకాపల్లిలో సెలవు.. ►మిచౌంగ్ తుపాన్ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
అన్ని రంగాల్లో సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్
-
నిరసనల పేరుతో టీడీపీ నేతల సంబరాలు!
కుప్పం(చిత్తూరు జిల్లా): చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నేతలు నిరసనల పేరిట చేపట్టిన కార్యక్రమాలు.. సంబరాల్నే మించిపోతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో అమ్మవారి జాతరలో సంబరాలు జరుపుకొంటారు. మారెమ్మ, గంగమ్మ వేషధారణలతో వేపాకు చేతపట్టి.. అమ్మవారి రికార్డింగ్ పాటలతో డ్యాన్స్లు వేసి భక్తులను అలరింపజేస్తారు.అదే తరహాలో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా కుప్పంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న శిబిరం వద్ద.. తెలుగు మహిళలు వేపాకు చేతబట్టి.. అమ్మవారి వేషధారణలో రికార్డు డ్యాన్స్లతో మురిపింపజేశారు. అటువైపు వెళుతున్న బాటసారులు ఆసక్తిగా వారి డ్యాన్సులను తిలకిస్తూ ముచ్చటపడ్డారు. స్థానికులు మాత్రం ఇదంతా నిరసన చేసినట్టు లేదని, సంబరాలు, విందు భోజనాలు చేస్తున్నట్టుందంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. చదవండి: స్కిల్ కార్పొరేషన్కు, టీడీపీకి ఒకరే ఆడిటర్ -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
చిక్కిన మదపుటేనుగు..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది. ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపోయింది. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరుకుంది. ఒంటరి ఏనుగు 197–రామాపురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏనుగులతో సిద్ధంగా ఉంటూ మదపుటేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది కిందపడిపోయింది. తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్లో చిత్తూరు అటవీశాఖ అధికారి చైతన్యకుమార్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వహించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
మాటిచ్చారు.. నెరవేర్చారు
నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. మానవత్వంతో ఆదుకున్నారు నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్తో సీఎం జగన్ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది. కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. -
పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు -
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు: మధుసూదన్రెడ్డి
-
పథకం ప్రకారమే పోలీసులపై దాడి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): చంద్రబాబు పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడిచేసి గాయపరచి, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.శ్రీలక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్కుమార్తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో రూట్మ్యాప్ను కాదని పుంగనూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను నివారించినందుకే రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ çఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు. పోలీసులను రెచ్చగొట్టి.. తద్వారా కాల్పులు జరిగేలా చేయాలన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం అని తేలిందన్నారు. అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే టీడీపీ వారు చనిపోతే తద్వారా ఇమేజ్ పొందేలా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహ రచన చేశారన్నారు. ఆయన పీఏ గోవర్దన్రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయం వెల్లడైందన్నారు. దీంతో ప్రస్తుతం చల్లా రామచంద్రారెడ్డిని ఏ–1 నిందితునిగా కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు. -
‘మరణ’హోమమే లక్ష్యం! కనీసం ఇద్దరు పోలీసులనైనా..?
చిత్తూరు అర్బన్: టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు శనివారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మారణహోమమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులను చంపాలని దుర్మార్గపు ఆలోచనలు చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ మొత్తం రూపొందించారు. పుంగనూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణహోమ వ్యూహాన్ని రచించారు. అతని వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్రెడ్డిని పోలీసులు విచారించగా, పూసగుచ్చినట్లు విషయం అంతా వివరించాడని తెలిసింది. ఇది విన్న పోలీసులు షాక్కు గురవ్వడంతోపాటు, ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీడీపీ నేతలు రూపొందించిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. ప్లాన్–ఎ: పోలీసు కాల్పులు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజు రోజుకు జనాదరణ పెరిగిపోయి హీరో అయిపోతున్నాడని చల్లా బాబు తరచూ పార్టీ నేతల వద్ద అక్కసు వెళ్లగక్కేవారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరు వైపు చూసేలా మారణహోమం జరగాలని సంకల్పించారు. ఈ మేరకు విషయాన్ని పార్టీ పెద్దకు చేరవేసి, ఆయన ఆశీర్వాదం పొందారని తెలిసింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చినప్పుడు.. పుంగనూరు పట్టణంలోకి రావాలని పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని, పోలీసులు దీనికి అంగీకరించరని నిశ్చయించుకున్నారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును పోలీసులే లక్ష్యంగా విసిరేలా కొందరికి బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగా మొత్తం 30 నిమిషాల పాటు దాడి కొనసాగించేందుకు సరిపడా రాళ్లు, ఇతర వస్తువులను పరిసర ప్రాంతాల్లో ఉంచారు. తొలి మూడు నిమిషాల్లో చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారని, ఇదే అదునుగా పోలీసుల ఊహకు అందని విధంగా రాళ్లు, టపాసు బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదనే వ్యూహానికి పదునుపెట్టారు. ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్ చేస్తారని, ఈ కాల్పుల్లో కనీసం 30 మంది వరకు టీడీపీ శ్రేణులు మరణిస్తారు.. అప్పుడు దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతుంది.. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల ద్వారా ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని భారీ కుట్ర పన్నారు. తర్వాత జరిగే ఎన్నికల్లో సానుభూతి వల్ల టీడీపీ ఆటోమేటిక్గా గద్దెనెక్కడం ఖాయం అని భావించారు. ప్లాన్–బీ: అల్లకల్లోలం సృష్టించడం ఏ కారణాల వల్లయినా ప్లాన్–ఏ అమలుకాని పక్షంలో టీడీపీ నేతలు ప్లాన్–బీ కూడా రూపొందించుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, వాళ్లు ఫైర్ ఓపెన్ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడి ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. దీంతో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్లు చేసే దాడుల్లో ఆస్తుల విధ్వంసంతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలూ చనిపోతారు. దీనికంతటికీ కారణం ప్రభుత్వంపై నెట్టేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలి. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోయి శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదని తీర్మానం చేశారు. ఎక్కడా ఈ ప్లాన్ల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదని అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు అవసరమయ్యే వారిని మదనపల్లె, మొలకలచెరువు, సదుం, సోమల నుంచి రప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రంగంలోకి దించారు. పోలీస్ ప్లాన్ భళా.. టీడీపీ డీలా.. టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమ ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని టీడీపీ పెద్దలు భావించారు. అయితే అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసులు రక్తమోడుతుండటం చూసిన ఆ అధికారి చలించిపోయి.. గద్గద స్వరంతో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు. మనం ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే మీరు కలెక్టర్తో మాట్లాడి ఫైర్ ఓపెన్ చేసేలా ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడినట్లు సమాచారం. అప్పుడు టీడీపీ మూకలు రాళ్లు, బాటిళ్లు విసురుతున్న తీరు, వాటి నిల్వల వివరాలు ఆరా తీసి.. పోలీసులు వెంటనే 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వస్తారని.. అప్పుడు టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జ్, బాష్ప వాయువు ప్రయోగించాలని ఆదేశించినట్లు సమాచారం. తాను పుంగనూరుకు బయలుదేరానని, తాను అక్కడికి వచ్చే వరకు ఒక్క బుల్లెట్ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రక్తమోడుతున్నప్పటికీ ఎస్పీ ఆదేశాలను అమలు చేశారు. అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలయ్యాయి. -
ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ..
చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. దీంతో మనుగడ కొల్పోతామన్న భయంతో టీడీపీ హింస రాజకీయాలకు తెరతీస్తోంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక్షస మనస్తత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారు. పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే ఎందుకు వేశారో సమాధానం లేదు. ఇదిలా ఉండగా, పుంగనూరు అభివృద్ధిపై ఆ ప్రాంత వాసి పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ►పుంగనూరుకి వస్తున్నట్టు ఉన్నావ్.. వచ్చేటప్పుడు అలా నువ్వు నీ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేసి నిలిపివేసిన నేతి గుట్లపల్లి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కావాలంటే కొంత సేవు ఈతకొట్టు.. ►పుంగనూరు శాశ్వత తాగు, సాగునీటి అవసరాల కోసం 95 శాతం పూర్తయిన ప్రాజెక్ట్ను అడ్డుకోవాలని చూస్తున్న నీ వక్రబుద్ది తెలుస్తుంది ►అలాగే ముందుకు వస్తే రూ.40 కోట్ల రూపాయలతో పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైంది ఒక్కసారి చూడు ►ఇంకొంచెం ముందుకు వస్తే పెద్దిరెడ్డి గారి సహకారంతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ ఉంటుంది తలపైకి ఎత్తి చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే ఒక్క కారు బస్సు వెళ్లాలంటే ఇబ్బంది పడే మినీ బైపాస్ ఇప్పుడు ఎంత విశాలంగా సర్వాంగా సుందరంగా ఉందో చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు అధికారంలో ఉండగా అడ్డుకున్నా ఆర్టీసీ డిపో.. నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్యారేజ్తో మా పెద్దాయన నిర్మించిన ఆర్టీసీ డిపో కనిపిస్తుంది చూడు. ►ఇంకొంచెం ముందుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతోంది.. దాని వెనకాల కడుతున్న భవనాలను చూడు.. ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా మారి ప్రజల అన్ని సౌకర్యాలు తీర్చడనికి రూపుదిద్దుకున్న తీరును చూడు.. ►ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సొంత నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ని చూడు ►ఇంకొంచెం ముందుకు వెళ్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనబడుతుంది.. కావాలంటే కొంతసేవు గట్టుపై సేదదీరు ►ఈ మధ్య సమ్మర్ స్టోరేజ్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పుంగనూరుకి విద్యుత్ అందించనున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకో ►ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంపీ మిథున్ రెడ్డి గారి డ్రీమ్ బైపాస్ రోడ్డు కనబడుతోంది చాలా బాగుంటుంది ►అలా బోయకొండ వెళ్తే కోట్ల రూపాయలతో బోయకొండను బంగారు కొండగా మార్చిన తీరును చూస్తే ఆశ్యర్యం కలగక మానదు.. ►ఇదంతా పుంగనూరు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే కేవలం 4సంవత్సరాల లొనే పెద్దాయన ఇంత చేస్తుంటే.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కుప్పానికి ఏమి చేశావు అని మాత్రం ఆలోచించకు చంద్రబాబూ.. -
రక్తపాతం లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్.. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్
చంద్రబాబుది మొదటి నుంచి హింసావాదమే. ప్రాజెక్టుల పర్యటనల ముసుగులో హింసకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టి ప్రజల్లో విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం రచించారు. పలమనేర్ బై పాస్లో వెళ్లకుండా.. పుంగనూర్కు రూట్ ఎందుకు మార్చాడు.. చంద్రబాబు రూట్ మార్చడం వెనుక భారీ కుట్ర ఉంది. కావాలనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చంద్రబాబు చేశారు. చిత్తూరు అర్బన్/ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్పైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు. చదవండి: ‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి.. పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వా«దీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్మిత్సింగ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అంతా వ్యూహాత్మకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. -
పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. ‘‘రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించాం. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. కేసు నమోదు.. పుంగనూరు పీఎస్లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న బంద్
-
టీడీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో చంద్రబాబు అను చరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ బంద్కు పిలుపునివ్వడంతో శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాగా, అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. -
చిత్తూరుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన, షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి -
చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ ఇంచార్జ్లు కరువు!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్లు లేరట. చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని టాక్. నాయకులే లేకపోవడంతో అసలు పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? చిత్తూరు జిల్లా పూతలపట్టులో తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఆ పార్టీ నాయకత్వం చాలా సంవత్సరాలుగా ఆశ పడుతోంది. 2009 నుంచి ఇప్పటివరకు అక్కడ టిడిపి జెండా ఎగరలేదు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆ తర్వాత పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జినే నియమించలేదు. మాజీ మంత్రి, టిడిపి నేత గల్లా అరుణకుమారి ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఆమె కుటుంబానికి పూతలపట్టు నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గల్లా కుటుంబం కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ నియోజకవర్గంలో నాలుగేళ్ళుగా పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. ఉన్నవాళ్ళలో కొంతమంది ఇన్చార్జి పదవి ఆశిస్తున్నా వాళ్లకు చంద్రబాబు ఓకే చెప్పడంలేదు. ఈ టాపిక్ మీదే ఇప్పుడు పూతలపట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇన్చార్జి లేకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతాయని పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న వారిలో సప్తగిరి ప్రసాద్, సప్తగిరి, ముత్తులతోపాటు తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఈ జర్నలిస్టు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ద్వారా తన ప్రయత్నాలు చేస్తున్నారట. ఇన్చార్జిగా ఎవరూ లేకపోవడంతో కార్యకర్తలు సైతం టీడీపీకి దూరం దూరంగానే ఉంటున్నారు. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చు భరించేది ఎవరంటూ పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని పసుపు కేడర్ ఆందోళన పడుతోంది. గడచిన మూడు ఎన్నికల్లో గెలవని పార్టీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎలా గెలుస్తుందని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. అసలు పూతలపట్టులో టీడీపీ అనే పార్టీ ఉన్న విషయాన్నే ప్రజలు మర్చిపోయేట్టు ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. -నరేష్బాబు, సాక్షి వెబ్డెస్క్ -
ఇదేందయ్యా ఇది.. టీడీపీ నేతల ఓవరాక్షన్
పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు -
టీడీపీ అల్లరిమూకల పైశాచికత్వం
గంగవరం (చిత్తూరు జిల్లా): వైఎస్సార్సీపీ నేత, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అల్లరిమూకలు దాడులకు తెగబడిన ఘటన చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. ఘటనపై బాధితులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగవరం మండలంలోని మార్జేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత, గ్రామ సచివాలయ కన్వినర్ చిన్నరెడ్డెప్ప కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత శంకరప్ప కుటుంబ సభ్యులైన ఆ పార్టీ కార్యకర్తలు 20 మందికి పైగా దాడి చేశారు. శనివారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంతమంది చిన్నరెడ్డెప్ప ఇంటి ముందు టపాసులు కాల్చడంతో పశువులు బెదిరాయి. దీంతో కాస్త పక్కన కాల్చుకోవాలని చిన్నరెడ్డెప్ప కోరాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ‘మాకు నువ్వేంది చెప్పేది.. టపాసులు ఇక్కడే పెడతాం’ అంటూ చిన్నరెడ్డెప్పపై దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు సునీల్, చరణ్, విశ్వేశ్వరయ్య, యువరాజు, భాను, బాలరాజు, అశోక్, అమర్నాథరెడ్డి, కార్తీక్, మరికొంతమంది కలిసి చిన్నరెడ్డెప్ప, అతని భార్య సుభద్ర, తండ్రి శ్రీరాములు, తల్లి మునివెంకటమ్మ, సమీప బంధువులు రత్నారెడ్డి, యశ్వంత్, చంద్రప్పపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు విసరడంతో కిటికీలు, తలుపులు పగిలిపోగా కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్నవారిని తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులు ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, గతంలో టీడీపీ కార్యకర్త చరణ్ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నరెడ్డప్ప, యువతి బంధువులు చరణ్ను మందలించారు. దీంతో కక్షగట్టిన చరణ్.. యువతి అన్నపై అప్పట్లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ నేపథ్యంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే చరణ్, ఇతర టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు చెప్పారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రతాప్రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటనపై విచారించారు. శంకరప్పతో సహా దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. -
తిరుమల ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
కుప్పం పీఎస్పై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు
సాక్షి, చిత్తూరు: టీడీనీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. తమకేంటి అడ్డు అన్నట్లుగా పోలీస్ట్ స్టేషన్పైనే దాడికి యత్నించారు టీడీపీ నాయకులు. అడ్డుకోబోయిన పోలీసుల్ని నెట్టేశారు. ఈరోజు(మంగళవారం) స్థానిక టీడీపీ నాయకులు కుప్పం పోలీస్ స్టేషన్ వద్దకు మూకుమ్ముడిగా వచ్చారు. అక్కడ హల్చల్ చేస్తూ పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించారు. దీన్ని అక్కడ ఉన్న సీఐ శ్రీధర్, ఎస్ఐ శివకుమార్లు అడ్డుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఐ, ఎస్లు కిందపడిపోయారు. ఈ క్రమంలోనే వారు పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. -
వైద్యరంగంలో మరింతగా ముందడుగులు వేస్తున్న వైఎస్ జగన్
-
Womens Day: వనిత జీవితం మనందరికీ ఆదర్శం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వనిత గారి జీవితం మనందరికీ ఆదర్శం అంటూ ట్వీట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వనిత తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచారంటూ కొనియాడారు. వనితతోపాటు మహిళాలోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, తన బిడ్డల కోసం ఒంటరి పోరాటం చేస్తూ సమాజానికి ప్రేరణగా నిలిచిన చిత్తూరు జిల్లాకు చెందిన వనిత గారి జీవితం మనకు ఆదర్శం. వనిత గారికి, మరియు రాష్ట్ర ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.#InternationalWomensDay pic.twitter.com/rtRHf3O1pF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2023 ఈ వీడియోలో వనిత ఏం చెప్పారంటే.. వివాహమయ్యాక ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో భర్తతో తనకు గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్లిపోయినట్లు టీ వనిత తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తనపైనే పడిందన్నారు. కష్టాల్లో ఉన్న తనకు వలంటీర్ ఉద్యోగం ఇప్పించారని పేర్కొన్నారు. ఆసరా డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు, అమ్మఒడి డబ్బులు అన్నీ అందుతున్నాయని వివరించారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తన జీవితంలో సీఎం జగన్ వెలుగులు నింపారని చెప్పారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్ -
చిత్తూరు జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ప్లెక్సీలు వెలిశాయి. పీలేరు పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం వరకు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అయితే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు తొలగించాయి. సోమవారం నుంచి లోకేష్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే..
నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది. నేడు: ‘బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏకమవుతున్న బీసీలు టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం. బీసీల సాధికారత ఎక్కడ? బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. –డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం. – పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు మొదలైన బుజ్జగింపుల పర్వం బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
లోకేశ్ పాదయాత్రలో హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, చిత్తూరు/గంగాధర నెల్లూరు/ పాలసముద్రం: మొన్న చంద్రబాబు సభలు పలువురు ప్రజలను బలి తీసుకోగా, నేడు ఆయన కుమారుడు లోకేశ్ సభ ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. రహదారులు, ఇరుకు రోడ్లు, మార్జిన్లు తదితర ప్రాంతాల్లో సభలు, ర్యాలీల వల్ల జరిగే విపరిణామాలకు ఇటీవలి చంద్రబాబు సభలే ఉదాహరణలు. ఇటువంటి ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం విశాలమైన మైదానాల్లో సభలు పెట్టుకోవాలని జీవో తెచ్చింది. అయినా, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో భద్రతాపరమైన అంశాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేదు. కార్యకర్తలు కూడా నామమాత్రంగా వస్తున్నారు. జనం రాకపోవడంతో లోకేశ్ అనుమతుల్లేకుండానే ఎక్కడపడితే అక్కడ పాదయాత్ర ఆపి మాట్లాడుతున్నారు. జనం ఎక్కువగా ఉన్నట్లు కనిపించేందుకు ఇరుకు రోడ్లు, మార్కెట్ ప్రాంతాల్లో లోకేశ్ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతకు భంగం కలిగించేలా నిర్వహిస్తున్న ఈ సభలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పెరిగిన టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు జరుగుతున్నాయి. ఇలాంటి సభే హెడ్ కానిస్టేబుల్ మరణానికి కారణమైంది. గురువారం గంగాధర నెల్లూరు మండలం సంశిరెడ్డిపల్లెలో నిర్వహించిన పాదయాత్రలో ఈ విషాద ఘటన జరిగింది. సంశిరెడ్డిపల్లెలో లోకేశ్ అనుమతుల్లేకుండానే, జాగ్రత్తలు తీసుకోకుండానే మాట్లాడటం ప్రారంభించారు. దీంతో పోలీసులు అడ్డు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తీవ్ర అలజడి సృష్టించారు. ఈ సమయంలో అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న చిత్తూరు జిల్లా ఐరాల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎ.రమేష్ (54) తీవ్ర అస్వస్థతతో గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసు కుటుంబాలు, ఆయన స్వస్థలమైన యాదమరి మండలంలోని కుచుంపల్లెలో విషాదం నెలకొంది. హెడ్కానిస్టేబుల్ మృతికి పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. టీడీపీ సభల్లో ఇది మరో దుర్ఘటన అని, నిబంధనలు పాటించకుండా టీడీపీ నేతలు మూర్ఖంగా ప్రవర్తించడంవల్లే హెడ్ కానిస్టేబుల్ మరణం సంభవించిందని పలువురు వ్యాఖ్యానించారు. శూలం గుచ్చుకొని కార్యకర్తకు గాయాలు ఎండీ మంగళం సమీపంలోని ఆలయం వద్ద లోకేశ్ మరో సభ నిర్వహించారు. ఇదీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. ఇక్కడ ఆలయం వద్ద ఉన్న శూలం గుచ్చుకుని మండలంలోని టీడీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈసారైనా గెలిపించండి: లోకేశ్ వేడుకోలు గంగాధర నెల్లూరులో 2009 నుంచి టీడీపీని గెలిపించలేదని, ఈసారైనా గెలిపించండి అంటూ నారా లోకేశ్ ప్రజలను అభ్యర్థించారు. ఆయన గురువారం గంగాధర నెల్లూరు మండలం దేవళంమిట్ట నుంచి పాలసముద్రం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కడపగుంటలో మాట్లాడుతూ చంద్రబాబు పాలిచ్చే ఆవులాంటివాడని అన్నారు. మూడున్నరేళ్లుగా జగన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే నారాయణస్వామి ఏం పీకారని ప్రశ్నించారు. సమిసిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై పర్మిషన్ లేకుండా మాట్లాడొద్దన్న పోలీసుల్ని యూజ్లెస్ఫెలోస్ అంటూ దుర్భాషలాడాడు. తనకు చట్టం తెలుసంటూ రాజ్యాంగం పుస్తకాన్ని చూపించారు. రంగాపురంలో మద్యం సీన్ పాలసముద్రం మండలం రంగాపురంలో గురువారం సాయంత్రం లోకేశ్ సభకు జనాలను తరలించేందుకు చుట్టుపక్కల పల్లెలతోపాటు తమిళనాడుకు కూడా వాహనాలు ఏర్పాటుచేశారు. అయినా జనం రాలేదు. వచ్చిన వారు కూడా చాలా మంది టీడీపీ నేతలిచ్చిన మద్యం తాగి, బిర్యానీ తిని అక్కడే పడిపోయారు. రెండు గంటలు ఆలస్యంగా సభకు వచ్చిన లోకేశ్ జనం లేకపోవడంతో చిర్రుబుర్రులాడారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
చిత్తూరు: లోకేష్ యాత్రలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, చిత్తూరు: నారా లోకేష్ యాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. బంగారుపాలెంలో నడిరోడ్డుపై లోకేష్ ప్రసంగించే యత్నం చేశారు. అభ్యంతరం తెలిపిన పోలీసులను టీడీపీ కార్యకర్తలు దూషించారు. పోలీసులు సర్దిచెబుతున్నా టీడీపీ నేతలు గొడవకు దిగారు. నడిరోడ్డుపై ప్రసంగాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులకు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అనుమతి తీసుకోకుండా సభలు నిర్వహించకూడదని పోలీసులు సూచించారు. చదవండి: ఏపీఎఫ్డీసీ ఛైర్మన్గా పోసాని బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే? -
జెట్ స్పీడ్గా హైవే పనులు.. ఇక బెంగళూరుకు 135 నిమిషాలే టైమ్..
పలమనేరు : చెన్నై–బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనులు స్పీడందుకున్నాయి. చెన్నై సమీపంలోని శ్రీపెరంబూదూర్ నుంచి బెంగళూరు సరిహద్దు లోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేరకు 6 ట్రాక్ ఎక్స్ప్రెస్ హైవేను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా) భారత్మాల పరియోజన పథకం కింద రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడు ఫేజుల్లో పనులు సాగుతున్నాయి. తొలిఫేజ్లో కర్ణాటక పరిధిలోని 71 కిలోమీటర్లలో ఇప్పటికే 37.56 శా తం పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ఫేజ్ లలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 112 కిలోమీటర్లలో పదిశాతం మట్టిరోడ్డు పనులు, అలైన్మెంట్ ల్యాండ్ లెవలింగ్ సాగుతోంది. పనులు త్వరితగతిన జరిగేలా మూడు ఫేజ్లలో పది ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో కర్ణాటకలో మూడు, ఏపీలో మూడు, తమిళనాడులో నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా 60 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున్నాయి. వీటిని బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు మోంటేకార్లె లిమిటెడ్ కంపెనీ, బైరెడ్డిపల్లె నుంచి బంగారుపాళెం వరకు ఆప్కో ఇన్ఫ్రాటెక్ కంపెనీ, బంగారుపాళెం నుంచి గుడిపాల దాకా దిలీప్బిల్డ్కాన్ కంపెనీ పనులు చేపడుతున్నా యి. పలమనేరు మండలంలోని బేలుపల్లి క్రాస్, పట్టణ సమీపంలోని గంటావూరు వద్ద పనుల సామగ్రి కోసం యంత్రాలను నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గంలో చెన్నై– బెంగళూరు 6 ట్రాక్ ఎక్స్ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలైన్మెంట్ మేరకు మట్టి రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హైవే మూడు ఫేజ్లలో నిర్మాణం సాగుతుండగా.. ఇప్పటికే కర్ణాటకలో 37శాతం పనులు పూర్తయ్యాయి. రెండో ఫేజ్లో పలమనేరు నియోజకవర్గంలోనూ పదిశాతం పనులు జరిగాయి. ఈనెల 10న కర్ణాటక రాష్ట్రంలోని హొసకోట సమీపంలో వడగనహళ్లి వద్ద పనులను పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్గడ్కరి 2024 మార్చికల్లా పూర్తిచేసి ప్రారంభించనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. దక్షిణాదిలోనే తొలి ఎక్స్ప్రెస్ హైవే దక్షిణ భారతదేశంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్ప్రెస్హైవే మొట్టమొటది కానుంది. దీనికి ఎన్హెచ్ఏఐ ఎన్ఈ 7గా నామకరణం చేశారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి పెంపొందించడమే ఈ రహదారి నిర్మాణ ఉద్దేశం. బెంగళూరు నుంచి చెన్నై పోర్టుకు రవాణా సౌకర్యాలు పెరిగేందుకు ఈ రోడ్డు ఉపకరిస్తుంది. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించేవారు సైతం తక్కువ. ఈ హైవే పూర్తయితే దాదాపు అంతే సమయానికి విమాన చార్జీలకంటే తక్కువ ధరతో రోడ్డు మార్గంలోనే ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. ఎక్స్ప్రెస్హైవే వివరాలిలా... - చెన్నై నుంచి బెంగళూరు వరకు రోడ్డు దూరం 283.5 కిలోమీటర్లు - ఇది కర్ణాటకలో 77 కి.మీ, ఏపీలో 91 కి.మీ, తమిళనాడులో 93 కిలోమీటర్లు - ఇప్పటి వరకు బెంగళూరు–చెన్నై ప్రయాణ సమయం 6 గంటలు - ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల 15 నిమిషాలు మాత్రమే - ఈ రహదారిలో సాధారణ వేగం గంటకు 120 కిమీ - ఎక్స్ప్రెస్హైవేలో మొత్తం బ్రిడ్జిలు –162 - రైల్వే క్రాసింగ్లు–4, కల్వర్టులు–143 - మొత్తం ఫ్లైఓవర్లు– 17 ఉంటాయి. -
వైఎస్ జగన్ లాంటి కొడుకు లేడని చంద్రబాబుకు కుళ్లు: మంత్రి పెద్దిరెడ్డి
-
‘చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు’
తిరుపతి: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పని ఎప్పుడో అయిపోయిందని, చిత్తూరు జిల్లాను వదిలేసి చంద్రబాబు ఎప్పుడో వెళ్లిపోయారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈరోజు(సోమవారం) పెద్దిరెడ్డి తిరుపతిలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడు విశ్వసించలేదు. చంద్రబాబు ప్రజాకంఠక పరిపాలన చేశారు. చంద్రబాబు ఏడుపులను ప్రజలు విశ్వసించరు. చంద్రబాబుకు మమ్మల్ని తిట్టడం తప్ప వేరే పనేమీ లేదు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు కారుకూతలు కూస్తున్నారు. చంద్రబాబు తన కోసం, తన ఎల్లో మీడియా కోసమే పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మళ్లీ పోటీ చేసే పరిస్థితే ఉండదు. కుప్పంలో వైఎస్సర్సీపీనే గెలుస్తుంది. కుప్పంలో టీడీపీ జెండా పీకేయడం ఖాయం. ప్రజాస్వామ్మం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు ప్రజాకంఠక పాలనపై రాష్ట్రంలో అందరికీ తెలుసు. చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే చంద్రబాబు అజెండా. ప్రజా సంక్షేమ కోసమే సీఎం జగన్ పని చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా పక్షానే ఉన్నారు’ అని పేర్కొన్నారు. -
రంగంపేటలో జల్లికట్టు సంబరాలు
-
పుంగనూరులో తారస్థాయికి చేరిన టీడీపీ ఆగడాలు
14 ఏళ్లు అధికార మదంతో టీడీపీ నేతలు పేట్రేగిపోయారు. అవసరాలను అవకాశంగా చేసుకుని ప్రజలను ముప్పుతిప్పలకు గురిచేశారు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పడడంతో ఏమిచేయాలో దిక్కుతోచక వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాటను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారు. తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో పచ్చని పల్లెల్లో నిప్పురాజేసి రాక్షస క్రీడకు ఆజ్యం పోస్తున్నారు. అభిమానంతో ఏర్పాటు చేసుకున్న బ్యానర్లు, ఫ్లెక్సీలను చించివేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అడ్డుకున్న కార్యకర్తలు, ప్రజలపై పిడిగుద్దులు కురిపిస్తున్నారు. హాకీ స్టిక్లు, రాళ్లతో దాడులు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పుంగనూరు నియోజకవర్గ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోతోందన్న అక్కసుతో దాడులకు తెగబడుతున్నారు. ఏంచేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించివేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అడ్డుకుంటున్న కార్యకర్తలు, ప్రజలపై విక్షణారహితంగా దాడులు చేస్తూ రచ్చకీడుస్తున్నా రు. తర్వాత వాటన్నింటినీ ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపైకి నెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలమైన పత్రికలు, మీడియాలో అసత్య కథనాలు వళ్లిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దాడులు ఎందుకంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లో పుంగనూరు నియోజకవర్గం కూడా ఉంది. 14 ఏళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర వాటిని టీడీపీ కార్యకర్తకో, వారి కుటుంబ సభ్యులకో మంజూరు చేయడం రివాజుగా మారేది. లేదంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పడం.. ఆపై మొండిచేయి చూపడం అటవాటుగా మారింది. ఆ పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే రోడ్లు, ఇతర పథకాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. 2019 సాధారణ ఎన్నికల తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా సంక్షేమ పాలన మొదలైంది. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్ పాలనకు మెచ్చి పుంగనూరు నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. ఆయన అనేక మందికి తనవంతు సాయం చేస్తుండడంతో ఆ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాలు సైతం వైఎస్సార్సీపీ జెండా కిందకు వస్తున్నాయి. ప్రస్తుతం పల్లెబాట పేరుతో ఊరూరా తిరుగుతున్న మంత్రికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో.. నియోజకవర్గంలో అక్కడక్కడా మిగిలిపోయిన టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటున్నారు. మరికొందరు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయి. రెచ్చిపోతున్న తమ్ముళ్లు మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట నేపథ్యంలో రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్యగారిపల్లె, పెద్దగొట్టిగల్లు, బోడిపాటివారిపల్లెకు చెందిన టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ మూకలు దాడులకు తెగబ డ్డారు. రెండు రోజుల క్రితం రొంపిచెర్ల క్రాస్లో వైఎస్సార్సీపీ జెండాలు, ఫ్లెక్సీలను చించివేశారు. అలాగే ఈనెల 1వ తేదీ రాత్రి చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లె పంచాయతీ, తెల్లనీళ్లపల్లిలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్రెడ్డి (చిట్టి), అతని అనుచరులు కలిసి ఎంపీటీసీ శ్రీరాములును చితకబాదారు. ఆ గ్రామంలో బ్యానర్లు కట్టకూడదని దౌర్జన్యానికి ఒడిగట్టారు. అదేవిధంగా ఈనెల 3న దిగువపల్లె పంచాయతీ భవానీనగర్లో భూ విషయమై టీడీపీ వర్గాలు రెండు ఘర్షణకు దిగాయి. దీన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా ద్వారా అతస్య కథనాలు రాయించడం కొసమెరుపు. బరితెగిస్తూ.. నియోజకవర్గంలో ‘చల్లా’యిస్తూ.. ఇటీవల టీడీపీ నియోజకవర్గ నేత చల్లా బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ‘ఇందేం ఖర్మ’ కార్యక్రమా న్ని చేపట్టారు. గత శుక్రవారం పీలేరు, కలికిరి నుంచి ర్యాలీగా సోమల మండలానికి చేరుకున్నా రు. పెద్ద ఉప్పరపల్లి మీదుగా సోమల దళితవాడకు చేరుకున్న టీడీపీ ర్యాలీని స్థానికులు అడ్డుకున్నారు. ‘టీడీపీ ప్రభుత్వంలో మాకేం చేశారు..’ అంటూ ఎదురుతిరిగారు. తమ గ్రామంపై ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు వికృతచేష్టలకు ఒడిగట్టారు. అడ్డు తప్పుకోకపోతే వాహనాలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే స్థానికులకు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహించలేని టీడీపీ శ్రేణులు స్థానికులపై హాకీ స్టిక్స్, రాళ్లతో దాడికి దిగారు. వీరి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకుడు పీఎల్ఆర్ రాజారెడ్డిపై దాడిచేశారు. ఆయన కాలు, చేయిని విరగ్గొట్టి పంతం నెగ్గించుకున్నారు. చివరకు సోమల ఎస్ఐ లక్ష్మీకాంత్ పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. (క్లిక్ చేయండి: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్) -
చిత్తూరు, తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకలు
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ సీనియర్ నేత
చౌడేపల్లె(సోమల): రాష్ట్ర విద్యుత్, అటవీ, గనుల శాఖామంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో మూడోరోజు పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తు న్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి నెల్లిమంద కమ్మ పల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ నాయుడు పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి ఆహ్వానించారు. ఆయనతోపాటు మ రో ఇరవై కుటుంబాలవారు వైఎస్సార్ సీపీలో చే రారు. పార్టీలో చేరిన వారిలో రెడ్డిబాషా, ముబాకర్, బావాజీ, సుబ్రమణ్యంనాయుడు, రహీంబాషా, వెంకట్రామయ్య, షంషీర్, బాబు, మ«ధు, బషీర్ ఉ న్నారు. అలాగే నవాబుపేట, బురుపల్లెలో అజీజ్, జై బూన్తోపాటు మరో పది కుటుంబాల వారు వైఎస్సాసీపీలో చేరారు. మంత్రి వారికి కూడా పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వారు మా ట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంతోపా టు తమ మండలానికి చేస్తున్న అభివృద్ధి చూసి ఆక ర్షితులైనట్టు తెలిపారు. ఏకష్టమొచ్చినా వెన్నంటి ఉంటూ ఆదుకొనే స్వభావం ఉన్న మంత్రి వెంట నడవడానికి సిద్ధమై పార్టీలో చేరినట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీను మరింత బలోపేతం చేసి, రా నున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించే దిశగా అందరితో కలిసి ఐకమత్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగనూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జింకా వెంకటాచ లపతి, ఎంపీపీ ఈశ్వరయ్య, జెడ్పీటీ సీ సభ్యురాలు అమాస కుసుమ, వైస్ ఎంపీపీ సయ్యద్బాషా, కోఆప్షన్ స భ్యుడు మస్తాన్బాషా, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు గంగాధర రాయల్, పాల్గొన్నారు. వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక పలమనేరు: మున్సిపాలిటీ పరిధిలోని గడ్డూరు గ్రా మానికి చెందిన వంద టీడీపీ కుటుంబాల ప్రజలు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలను కప్పి, ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
పోలీసులపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసులు
శాంతిపురం/చిత్తూరు అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా బుధవారం పోలీసులపై దాడులకు తెగబడిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్లబూదుగూరు ఎస్ఐ మునస్వామి తెలిపిన వివరాల మేరకు పోలీసులపై దాడి చేసిన ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఎస్.గొల్లపల్లి క్రాస్లో పోలీసులపై దాడి, చేయి చేసుకోవడం, తోసివేయడం, దౌర్జన్యం చేయడంపై పలమనేరు సీఐ అశోక్కుమార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విశ్వనాథనాయుడు, కేదార్నాథ్, ఆంజనేయరెడ్డి, చంద్రకళ, నాగరాజు, అనసుయ, ప్రవీణ్, సుగుణ, రమేశ్, జయపాల్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రచార ర«థాలను వినియోగించినందుకు రామకుప్పం మండలం ననియాలకు చెందిన రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా పెద్దవల్లమిల్లికి చెందిన నానిబాబు, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన రాజుపై కేసులు నమోదు చేశారు. 121 పెద్దూరులో కృష్ణమూర్తి ఇంటి మేడపై ఉన్న పోలీసులపై దాడికి సంబంధించి గంగవరం ఎస్ఐ సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు మంజునాథ్, అరుణ్కుమార్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు.. ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేస్తారంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును ఏక్షణమైనా పోలీసులు అరెస్టు చేయొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. ఇలా తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
చిత్తూరు: పోలీసులపై దాడి వ్యవహారంలో 3 కేసులు నమోదు
-
చంద్రబాబు కుప్పం పర్యటన: కేసులు నమోదు
చిత్తూరు జిల్లా: చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు పోలీసులపై దాడి, విధులను అడ్డుకోవడంపై మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి, శాంతిపురం, పెద్దూరు ఘటనపై కేసులు నమోదయ్యాయి. పెద్దూరులో ఎస్ఐ సుధాకర్రెడ్డిని దూషించిన ఘటనలో కేసు నమోదు చేయగా, గొల్లపల్లి వద్ద సీఐ విధులకు ఆటంకం కల్గించినందుకు కేసు నమోదయ్యింది. శాంతిపురంలోరని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మొత్తం మూడు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. చదవండి: నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్ -
Sakshi TV: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు
సాక్షి, చిత్తూరు జిల్లా: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి టీవీనా.. వాడిని లాగి బయట పడేయండన్న చంద్రబాబు.. వారిది అమానుషం, బయట తిరగకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కుప్పంలో పోలీసులపై కూడా చంద్రబాబు వీరంగం సృష్టించారు. పోలీసులపై ఆయన రెచ్చిపోయారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్ చెబుతారా’ అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు. కాగా, చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అందుకే ఆ జీవో తెచ్చాం: మంత్రి జోగి రమేష్ -
నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పబ్లిసిటీనే ప్రధాన అజెండాగా చంద్రబాబు మరో షోకు తెరతీశారు. తన పబ్లిసిటీ కోసం కందుకూరు, గుంటూరులో 11 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యిందే కాక.. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మూకలు పోలీసులపై దాడులకు తెగబడేలా రెచ్చగొట్టారు. వెరసి.. ఎల్లో మీడియా ద్వారా పబ్లిసిటీ చేయించుకొని, రాజకీయ మైలేజీ పొందడానికి విఫలయత్నం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ్యుడిగా మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో రోడ్ల మీద బహిరంగ సభలను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు.. ఆయన పీఏ మనోహర్కు ముందస్తు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు కార్యక్రమాల వివరాలు ఏమిటి? ఎక్కడెక్కడ పర్యటించనున్నారు? బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించనున్నారు? రోడ్షోలు ఎక్కడ? అనే వివరాలు తెలియజేసి, అనుమతి తీసుకోవాలని సోమవారం రాత్రే నోటీసు ఇచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు నుంచి కానీ, ఆయన పీఏ నుంచి కానీ పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో సభలు, సమావేశాలకు అనుమతులు లేవంటూ పోలీసులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. అంతా పథకం ప్రకారమే.. టీడీపీ శ్రేణులు ఏపీ, కర్ణాటక సరిహద్దులోని శాంతిపురం మండలం 121 పెద్దూరు, గడ్డూరు క్రాస్ వద్ద హంగామా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ శ్రేణులు మదనపల్లె, వీ.కోట, కర్ణాటక నుంచి ప్రత్యేక వాహనాల్లో జనాన్ని తీసుకు రావడం ప్రారంభించారు. దీంతో పోలీసులు అనుమతి లేని వాహనాలకు ప్రవేశం లేదని, వాటిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఇక్కడి విషయాలను మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, చంద్రబాబు పీఏ, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు ఫోన్ ద్వారా చెబుతూ వచ్చారు. డ్రామాను రక్తి కట్టించాలని.. కుప్పం వాసుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గ్రహించిన చంద్రబాబు.. తన ఎల్లో మీడియా ద్వారా విస్తృత ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారంటూ.. టీడీపీ శ్రేణుల ద్వారా హడావుడి చేయించారు. తన జనాన్ని రెచ్చగొట్టి పోలీసుల పైకి ఉసిగొల్పారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చనే ఉద్దేశంతో కొందరు టీడీపీ శ్రేణులను సామాన్య జనం రూపంలో గడ్డూరు క్రాస్ వద్దకు పంపించారు. వారి వద్ద రాడ్లు, కర్రలు, రాళ్లు కనిపించాయి. వారి ద్వారా గొడవ సృష్టించి లబ్ధి పొందడానికి విఫల యత్నం చేశారు. 1861 పోలీసు చట్టమే వర్తించదంటూ వక్రభాష్యం చంద్రబాబుకు చట్టాల పట్ల కనీస అవగాహన లేదని మరోసారి నిరూపితమైంది. రోడ్లపై సభలకు అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం 1861 పోలీసు చట్టం ప్రకారం జీవోను జారీ చేసింది. అయితే ఆ చట్టం ఆంధ్రప్రదేశ్కు వర్తించదని చంద్రబాబు పోలీసులతో వాగ్వాదం పెట్టుకోవడం విస్మయ పరిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 30 పోలీస్ యాక్ట్ను ఇక్కడ ఎలా అమలు చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. కేంద్ర పోలీసు బలగాలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు వ్యవస్థలు 1861 పోలీస్ యాక్ట్ ప్రకారమే పని చేస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా రాష్ట్రంలో ఎన్నోసార్లు 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. జనం ముసుగులో పోలీసులపై దాడి బుధవారం ఉదయం నుంచే గడ్డూరు వద్ద వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, అద్దె మనుషులు ఇరుకైన రోడ్లపై గుమికూడారు. దీనిపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ససేమిరా అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలుగు తమ్ముళ్లను మరింత రెచ్చగొట్టారు. పోలీసులపై దాడికి దిగేలా ఉసిగొల్పారు. దీంతో కార్యకర్తలు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన బందోబస్తు బ్యారికేడ్లను పక్కకు లాగేశారు. రోడ్డుపై బైఠాయించారు. ‘సీఎం డౌన్డౌన్.. ఇదేం ఖర్మ.. ఇదేం ఖర్మ..’ అంటూ నినాదాలతో రెచ్చిపోయారు. ఈ గందరగోళం మధ్య కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై పిడిగుద్దులతో దాడి చేశారు. పోలీసులు కూడా లాఠీలను పైకెత్తి వారిని తరిమే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సరిహద్దు నుంచి చంద్రబాబు 121 పెద్దూరు చేరుకున్నాక టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయాయి. ఇంకో వైపు తమను అడ్డుకుంటున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్లు వేయించారు. ఉదయం నుంచి ఇలా జరిగేలా చంద్రబాబు ప్రణాళిక రచించి, అమలు చేయించారని స్పష్టమైంది. ఇలా గొడవ చేయడం ద్వారా పోలీసులు తనను అరెస్టు చేసేలా వ్యూహం పన్నారు. అయితే పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు, శ్రేణులను సమర్థవంతంగా కట్టడి చేశారు. చదవండి: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్ -
ఏ సమస్యలు లేవన్నందుకు టీడీపీ దౌర్జన్య కాండ
చిత్తూరు: టీడీపీ రౌడీ మూకలు అవకాశం దొరికిందే తడువుగా రెచ్చిపోతున్నాయి. తాజాగా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. తమ గ్రామంలో ఏ సమస్యలు లేవని చెప్పినందకు గ్రామంలో ఉండే స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. వివరాల్లోకి వెళితే.. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం సంజం పేటలో ఇదేం కర్మ పేరిట టీడీపీ కార్యక్రమం చేపట్టింది. టీడీపీ నియోజకవర ఇంచార్జి చల్ల రామచద్రారెడ్డి నేతృత్వంలో గ్రామంలోకి వెళ్లారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మీ గ్రామంలో సమస్యలు చెప్పండి’ అంటూ ఆరా తీయబోయారు ఆ గ్రామంలోకి వెళ్లిన టీడీపీ కార్యకర్తలు. కానీ వారు ఊహించని జవాబు స్థానికుల్ని వచ్చింది. తమకు ఏ సమస్యలు లేవని చెప్పడంతో టీడీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. అంతే దీంతో టీడీపీ మూకలు రెచ్చిపోయి ప్రవర్తించాయి. రాళ్లు, హాకీ స్టిక్స్తో రెచ్చిపోయారు. అక్కడున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. స్థానికులు తిరగబడటంతో చేసేది లేక అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాయి టీడీపీ అల్లరి మూకలు. -
Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
యాదమరి(చిత్తూరు జిల్లా): జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్ చేయండి: టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం) -
ఒక్కగానొక్క బిడ్డ.. విధి ఆడిన ఆటలో..
శాంతిపురం(చిత్తూరు జిల్లా): విధి ఆడిన ఆటలో ఆ కుటుంబం ఇంట తీరని విషాదం మిగిలింది. రోడ్డు ప్రమాద రూపంలో ఉన్న ఒక్కగానొక్క బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదన అంతాఇంతా కాదు. వివరాలు.. కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో ఏపీ మోడల్ స్కూల్ ఎదుట కారు ఢీకొనడంతో గాయపడి న 6వ తరగతి విద్యార్థిని లావణ్య(11) చికిత్స పొందు తూ మృతి చెందింది. కడపల్లి పంచాయతీలోని కదిరి ఓబనపల్లికి చెందిన వెంకట్రామప్ప, కాంతమ్మ ఏకైక సంతానం లావణ్య. గొర్రెలు మేపుతూ జీవనం సాగి స్తున్న దంపతులకు చాలాకాలం తర్వాత లావణ్య పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. చదువుల్లో చురుకుగా ఉండే లావణ్య స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో సీటు సాధించింది. శుక్రవారం సాయంత్రం స్కూల్ ముగిశాక రోడ్డు దాటే క్రమంలో కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లావణ్యను వెంటనే కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో బాలికకు వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడిన లావణ్య శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుప్పం ప్రాంతీయ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్న ఒక్క బిడ్డ దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. విద్యార్థిని మృతితో శనివారం స్కూల్కు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, టీచర్లు కదిరిఓబనపల్లిలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మా నన్ను క్షమించండి.. వెళ్లాలని లేకున్నా వెళ్తున్నా’ -
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
పల్లెకు పట్టం: వేలల్లో జనాభా.. కోట్లలో అభివృద్ధి
పల్లె అంటేనే అభివృద్ధికి ఆమడదూరమనే భావం అందరిలోనూ ఉండేది. గతంలో రోడ్లు లేవు. పక్కా భవనాల్లేవ్. పిల్లలు చదువుకోడానికి కనీస వసతుల్లేవ్. ఇక పల్లెవాసులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కాలంటే చెప్పులరిగేలా తిరిగినా దరిచేరని దుస్థితిలో పల్లెజనం మగ్గిపోయారు. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పరిస్థితులు మారాయి. ప్రతి గడపలోనూ ప్రభుత్వ పథకాలు తలుపుతట్టాయి. అవ్వా, తాత, అక్కా చెల్లెమ్మలకు జగనన్న అండగా నిలిచారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆదరిస్తున్నారు. పల్లె ముంగిట్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వెలిశాయి. పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. ఆరోగ్య కేంద్రాలు ఆధునికతను సంతరించుకున్నాయి. వీటన్నింటికీ కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం పల్లెకు పట్టం కట్టింది. దీంతో పల్లెలు ప్రగతి బాట పట్టాయి. సాక్షి, చిత్తూరు: పునర్విభజన తర్వాత జిల్లాలోని ఏడు నియోజవర్గాల్లో మొత్తం 31 మండలాలున్నాయి. ఇందులో 697 గ్రామ పంచాయతీలున్నాయి. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పల్లె స్వరూపం మారింది. అభివృద్ధి పరంగా మూడున్నరేళ్లలో గ్రామాల రూపురేఖలు మారాయి. అభివృద్ధి నినాదంతో ముందుకుపోతున్నాయి. మచ్చుకు కొన్ని గ్రామ పంచాయతీలకే ప్రభుత్వం పారించిన నిధుల వరద చూద్దాం. మహాసముద్రానికి రూ.14 కోట్లు బంగారుపాళెం మండలంలో 1,290 మంది జనాభా ఉన్న మహాసముద్రం గ్రామానికి రూ.14 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, పక్కా గృహాలు, రోడ్ల నిర్మాణాల కోసం రూ.6కోట్ల 79 లక్షలు వ్యయం చేశారు. ఈ గ్రామంలో సంక్షేమ పథకాలకు చేదోడు, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ కింద రూ.4.5 కోట్లు అందజేశారు. మిగిలిన పథకాలకు పింఛన్– రూ.1.8 కోట్లు, ఆసరా –రూ.49 లక్షలు, విద్యాదీవెన – రూ.18 లక్షలు, రైతు భరోసా – రూ.20 లక్షలు, చేయూత – రూ.22 లక్షలు, ఆరోగ్యశ్రీ – రూ.9 లక్షలు, రొంపిచెర్లకు రూ.30.71 కోట్లు మండలంలోని 6756 మంది జనాభా ఉన్న రొంపిచెర్ల గ్రామానికి రూ.30.71 కోట్లు ఖర్చు చేశారు. 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, షాదీ మహల్, పక్కా గృహాలు, సీసీ రోడ్డు, కాలువల నిర్మాణాలకు రూ.11.87 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాలైన చేదోడు, జగనన్న తోడు, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, సున్నావడ్డీ మొత్తంగా రూ.10.2 కోట్లు చెల్లించారు. వీటితోపాటు పింఛన్ – రూ.2.77 కోట్లు, ఆసరా – రూ.2.85 కోట్లు, విద్యాదీవెన – రూ.69 లక్షలు, చేయూత – రూ.1.4 కోట్లు, ఆరోగ్య శ్రీ – రూ.30 లక్షలు వెచ్చించారు. బుగ్గ అగ్రహారంలో రూ.30 కోట్లు నగరి మండలంలోని 2028 మంది జనాభా ఉన్న బుగ్గ అగ్రహారంలో మొత్తం రూ.30 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పక్కా గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.15 కోట్లు చెల్లించారు. పింఛను –రూ.2.55 కోట్లు, ఆసరా – రూ.1.15 కోట్లు, విద్యాదీవెన – రూ.23 లక్షలు, చేయూత – రూ.75 లక్షలు, ఆరోగ్య శ్రీ – రూ.32 లక్షలు, చేయూత, జగనన్న తోడు, విద్యాదీవెన, సున్నావడ్డీ ఇలా మొత్తంగా సంక్షేమం కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశారు. చిన్నవేపంజేరిలో రూ.9.32 కోట్లు జీడీనెల్లూరులోని 910 మంది జనాభా ఉన్న చిన్నవేపంజేరి గ్రామానికి రూ.9.32 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్క్లినిక్, గృహ నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.6.15 కోట్లు వెచ్చించారు. పింఛను– రూ.2.33 కోట్లు, రైతు భరోసా – రూ.1.28 కోట్లు, సున్నా వడ్డీ – రూ.15 లక్షలు, ఆసరా –రూ.94 లక్షలు, విద్యాదీవెన – రూ.1.06 కోట్లు, చేయూత – రూ.14.5 లక్షలు, ఆరోగ్య శ్రీ – రూ.12.9 లక్షలు ఇలా సంక్షేమ పథకాల కోసం రూ.3.17 కోట్లు ఖర్చు పెట్టారు. పల్లెకు ప్రాధాన్యత పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. సచివాలయాల ద్వారా గ్రామీణులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అర్హులు ప్రభుత్వ పథకాల కోసం వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. వాటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని వర్గాలవారికి మేలు చేయటం ప్రభుత్వ లక్ష్యం. – ప్రభాకర్రెడ్డి, జెడ్పీసీఈఓ గ్రామాల్లో వసతులకు పెద్దపీట గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రోడ్లు, కాలువలు, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటితో పాటు సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు జగనన్న ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. చిన్న చిన్న పల్లెల్లో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రామాల్లోనూ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. – శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ మా గ్రామానికే రూ.15 కోట్లు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మా గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణా లు చాలా బాగున్నాయి. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. మా పంచాయతీ పరిధిలో రూ.15 కోట్ల వరకూ అభివృద్ధి పనులకు కేటాయించటం ఆనందంగా ఉంది. – షర్మిల శరత్, సర్పంచ్, మహా సముద్రం, బంగారుపాళెం గ్రామ పంచాయతీ బాగా అభివృద్ధి చెందింది రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. మూడేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. తాగునీరు, సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. ఇలాంటి అభివృద్ధి నేను ఎన్నడూ ఇంత వరకు చూడలేదు. రొంపిచెర్లలో మైనారిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగనన్న కృషి చేస్తున్నారు. – అబుబక్కర్, చిన్న మసీదు వీధి, రొంపిచెర్ల మా ఇంట పథకాల పంట మాది పేద కుటుంబం. నా భర్త సైకిల్ షాపు నడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మా కష్టాలు తొలగిపోయాయి. అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న తోడు, విద్యాదీవెన, ఆసరా, పక్కా ఇల్లు వంటి అన్ని పథకాలు అందాయి. మూడేళ్లలో మాకు రూ.2.25 లక్షలు లబ్ది చేకూరింది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. – ధనలక్ష్మి, బుగ్గ అగ్రహారం అభివృద్ధి మెండుగా జరిగింది గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరిగాయి. గతంలో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా రోడ్డు సక్రమంగా లేక ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మంత్రి ఆర్కేరోజా ఆస్పత్రి వరకు సిమెంటు రోడ్డు వేయించారు. వీధి దీపాలు పెట్టించారు. సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం గ్రామంలో నిర్మించారు. కొండ కింద బోరు వేసి తాగునీరందిస్తున్నారు. – కుమారస్వామి, రిటైర్డ్ రైల్వే అధికారి, బుగ్గ అగ్రహారం ఆదుకుంటున్న సీఎం వైఎస్ జగన్ గతంలో అనేక ప్రభుత్వాలు చూశాం. వేపంజేరి నియోజవర్గంగా ఉండేది. అయినా అభివృద్ధి కనిపించలేదు. సీఎంగా జగన్మోహన్రెడ్డి వచ్చారు. మాకు అన్ని విధాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేసి కుటుంబంలోని సోదరుడిలాగా ఆదుకుంటున్నాడు. మా కుటుంబం ఆయనకు ఎప్పడూ రుణపడి ఉంటుంది. –శ్యామల, చిన్నవేపంజేరి, గంగాధర నెల్లూరు మండలం -
ఆ ఒక్క దెబ్బ మామూలుగా లేదు కదా.. వణుకు మొదలైంది
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో సైకిల్ పార్టీ కనుమరుగవుతుందా? గత ఎన్నికల్లో కుప్పంలో మాత్రమే గెలిచి ఎలాగో ఒడ్డున పడ్డారు చంద్రబాబు. కానీ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లభిస్తున్న ఆదరణ చూసి పచ్చ పార్టీకి చెమట్లు పడుతున్నాయని టాక్. మదనపల్లిలో జగన్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు. దీంతో టీడీపీ కేడర్లో గుబులు మొదలైంది. చావు తప్పి కన్ను లొట్టబోయి రాష్ట్రంలో 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచింది ఒకే ఒక స్థానం. అది కూడా కుప్పంలో చంద్రబాబు బొటా బొటి మెజారిటీతో ఒడ్డునపడ్డారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును కూడా ఓడిస్తామని వైఎస్ఆర్సీ నేతలు శపథం పూనారు. దానికి అనుగుణంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. మదనపల్లిలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు పోటెత్తిన జనాన్ని చూసి టీడీపి శ్రేణుల్లో వణుకు ప్రారంభమైంది. ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో వైఎస్ జగన్ సభకు ప్రజలు హాజరుకావడమే ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమిని పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట. వైఎస్ జగన్ చెప్పినట్లు వై నాట్ 175 ప్రకటనకు తగ్గట్టుగానే సభ జరిగిందని టిడిపి క్యాడర్ చెవులు కొరుక్కొంటోందని టాక్. మదనపల్లి దెబ్బ మామూలుగా లేదు కదా మదనపల్లిలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ జరిగినప్పటినుంచీ.. ఏ ఇద్దరు టిడిపి కార్యకర్తలు కలిసినా సభ గురించే మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. మదనపల్లితో పాటు తంబళ్లపల్లి, పీలేరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ సభ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. చంద్రబాబు సైతం తమ పార్టీ శ్రేణులతో ఫోన్లో మాట్లాడి..సభ జరిగిన తీరు గురించి తెలుసుకున్నారట. ఇంత భారీగా జగన్ సభ ఎలా జరిగిందంటూ ఆరా తీస్తున్నారట. మదనపల్లిలో జగన్ సభ తర్వాత టిడిపి క్యాడర్ ఇక తమ పార్టీ బతికి బట్ట కట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్నారట. అందుకే ఎవరిదారి వారు చూసుకునే ప్రయత్నాలు ప్రారంభించారనతి తెలుస్తోంది. మొత్తం మీద మదనపల్లిలో సీఎం జగన్ సభ టిడిపి క్యాడ తీవ్ర నిరాశలోకి నెట్టేసిందని ప్రచారం జరుగుతోంది. ఇక ముందు చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని గ్రామస్థాయి నాయకులు, కేడర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎదగాలంటే మరో పార్టీలో చేరాల్సిందేనని పచ్చ పార్టీ కేడర్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సీఎం వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. జగన్కు వస్తున్న ప్రజల్ని చూసి తెలుగుదేశం కేడర్లో ఆందోళన పెరుగుతుంటే..వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత జోష్ పెరుగుతోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
AP: 87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలం
సాక్షి, చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. ఇందుకు ప్రధాన బాధ్యులు టీడీపీ నేతలు.. వారి మాటను కాదనలేకపోయిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనలో 87 మంది హోంగార్డులను తొలగిస్తూ శనివారం అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. బయటపడింది ఇలా.. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్–పేమెంట్. అగి్నమాపక, టీటీడీ, ఆరీ్టసీ, రవాణాశాఖ, ఎఫ్సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్ఐ మురళీధర్ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, మూణ్ణెల్ల క్రితం వన్టౌన్లో ఆర్ఐ మురళీధర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతల ఆదేశాలతో తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు అంగీకరించాడు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు. చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి) అరెస్టులకు న్యాయపరమైన సలహాలు హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగి్నమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది టీడీపీ హయాంలో చినబాబుకు కుడిభుజంగా మెలగిన చిత్తూరు జిల్లా పార్టీ నేతగా తెలుస్తోంది. ఇతను ఆడమన్నట్లు ఆడిన అప్పటి చిత్తూరు పోలీసు బాసు, ఓ ప్రత్యేక డీఎస్పీ సైతం ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు. మరోవైపు.. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కొందరు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలుచేసిన మొత్తంలో కొంత ఉన్నతాధికారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము చిన్నబాబుకు అందజేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్పటి ఐపీఎస్ అధికారి, డీఎస్పీలు, ఆర్ఐలతో పాటు టీడీపీ నేతలను అరెస్టుచేయడానికి పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. తమ్ముళ్లలో వణుకు.. నిజానికి.. పోలీసుశాఖలో అంతర్లీనమైన హోంగార్డులు విధుల్లోకి చేరాలంటే నోటిఫికేషన్, శారీరక దేహదారుఢ్య పరీక్షలు, తుదిగా రాత పరీక్షల్లో ప్రతిభ చూపించడం తప్పనిసరి. అయితే, ఇవేమీ లేకుండా 2014–2019 మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పోలీసుశాఖలోకి దాదాపు 87 మంది హోంగార్డులు చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నకిలీ హోమ్గార్డులు నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంగార్డుల తొలగింపు విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో చిత్తూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారు. ఏ ఒక్కర్నీ వదలం ఇది చాలా పెద్ద నేరం. అసలు ఎలాంటి పరీక్షలు, శిక్షణ లేకుండా పోలీసుశాఖలో చేరిపోవడం అంటే తమాషా కాదు. ప్రాథమికంగా 87 మంది హోంగార్డులను డీఐజీ తొలగించారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు అని తేలితే ఆ హోంగార్డులను సైతం అరెస్టుచేస్తాం. ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. – వై. రిషాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు. -
అన్న డబ్బులు ఇస్తున్నారహో..!
పుంగనూరు(చిత్తూరు జిల్లా): గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రూ.2వేల టోకెన్లు పంపిణీ చేసిన అప్పటి జనసేన అభ్యర్థి బి.రామచంద్ర యాదవ్ను ఉద్దేశించి బుధవారం పట్టణంలో ప్లెక్సీ లు వెలిశాయి. ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ప్లెక్సీలు భారీగా కనిపించాయి. చదవండి: తక్కువ సమయంలో అధిక ఆదాయం.. నెలకు లాభం ఎంతంటే? అందులో రామచంద్రయాదవ్ అన్నా.. ఎన్నికలప్పుడు మీరిచ్చిన టోకన్లకు ఇప్పుడైనా డబ్బులు ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. రామచంద్రయాదవ్ అన్నగారు.. ఎన్నికలలో ఇచ్చిన టోకెన్లకు కొత్తయిండ్లులోని తన నివాసం వద్ద 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి టోకెన్లు ఉన్న వారికి డబ్బులు ఇస్తున్నారు అంటూ మరికొన్ని ఫ్లెక్సీల్లో ఉంది. ఈ క్రమంలో టోకెన్లు తీసుకుని డబ్బులు ఇవ్వాలంటూ పెద్దసంఖ్యలో మహిళలు ఆందోళనకు దిగడం గమనార్హం. టోకెన్లకు డబ్బు ఇవ్వాలని వెలసిన ప్లెక్సీ -
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో రోడ్డు ప్రమాదం
-
ఇల్లరికపు అల్లుడు షాకింగ్ ట్విస్ట్.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..
నగరి(చిత్తూరు జిల్లా): అత్తను హతమార్చి అల్లుడు పరారైన సంఘటన శుక్రవారం రాత్రి విజయపురం మండలం ఇల్లత్తూరు దళితవాడలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం.. గ్రామానికి చెందిన మణియమ్మ (42) తన కుమార్తె నిరోషను తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్ (28)కి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేసింది. అప్పటి నుంచి కార్తీక్ ఇల్లరికపు అల్లుడుగా అత్తగారింట్లోనే ఉంటూ తాపీ మేస్త్రీ పనికి వెళ్లేవాడు. చదవండి: నడిరోడ్డుపై భర్త దాష్టీకం.. భార్యను లారీ కిందకు తోసి.. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక, నిరోష మూడేళ్ల నుంచి శ్రీపెరంబదూర్లో ప్రైవేటు కంపెనీలో పనికి వెళ్తోంది. తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో కార్తీక్ తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కూడా తన భార్యతో కార్తీక్ గొడవ పడ్డాడు. ఇది గమనించిన మణియమ్మ అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన కార్తీక్ చేతికి దొరికిన ఇనుప కమ్మీతో మణియమ్మను పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందింది. దీంతో కార్తీక్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తీక్ కోసం గాలిస్తున్నారు. -
ఫేస్‘బుక్’ అవుతున్నారు.. వందలాది ఖాతాలు హ్యాక్ !
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఫోన్లు వాడే వారి సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇందులో 80 శాతం మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా సెల్ఫోన్ల వాడకం 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతా లను కలిగి ఉన్నట్టు గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పలమనేరు: మీ ఫోన్లో ఫేస్ బుక్ (ముఖ పుస్తకం) ఖాతా ఉందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. నిత్యం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ హ్యాక్ బుక్గా మారిపోయింది. ఫేస్బుక్ను టార్గెట్గా చేసుకొని హ్యాకర్లు విరుచుకు పడుతున్నారు. యూజర్స్ వ్యక్తిగత సమాచారం, ఫొటోలను వాడుకుంటూ నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఫేక్ అకౌంట్లను ఎలా డిలీట్ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. హ్యాకర్లను గుర్తించినా వారి పేరు, చిరునామా తప్పుగా ఉంటుంది. దాంతో వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఆపదలో ఉన్నామంటూ రిక్వెస్ట్లు హ్యాక్ చేసిన వారి వివరాలతో ఫేక్ ఖాతాలను సృష్టించి వాటిద్వారా మన స్నేహితులకు ఫేస్బుక్తో పాటు వారి మొబైల్ నంబర్లకు మెసెంజర్, వాట్సాప్, సాధారణ ఎస్ఎంఎస్లను పంపుతున్నారు. తాను ఆస్పత్రిలో ఉన్నానని వెంటనే డబ్బు కావాలంటూ వారి ఫోన్పే లేదా గుగూల్పే నంబర్లను అందులో ఉంచి, సులభంగా డబ్బు కాజేస్తున్నారు. ఇది నిజమని నమ్మి ఎంతోమంది తమ ఖాతాలనుంచి నగదును హ్యాకర్లకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాదిమంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అయి అదే పేర్లతో రెండు, మూడు ఫేక్ అకౌంట్లు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బగ్స్ సృష్టించి హ్యాక్ చేస్తున్న వైనం ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పలువురు సోషల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హ్యాకింగ్ చేయడమే వృత్తిగా చేసుకొని నిత్యం డబ్బులు సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మన ఫోన్కొచ్చే లింక్స్ ద్వారా, యాడ్స్ ద్వారా, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. మన ఫోన్కు తరచూ వచ్చే ఫోన్ రీచార్జీలు ఉచితమని, లాటరీ వచ్చిందని, ఫెస్టివల్ ఆఫర్లని క్యూఆర్ కోడ్లను పంపుతున్నారు. వాటిని టచ్ చేస్తే చాలు మన సమాచారం మొత్తం హ్యాకర్ల చేతిలోకి చేరుతోంది. మన ఫోన్ను హ్యాకర్లు ఆపరేట్ చేస్తుంటారు. మన ఫోన్లోని యాక్సెస్ లోకేషన్ ఆధారంగా మనకు తెలియకుండానే మన మొబైల్లోని కెమరాసైతం మనల్ని రికార్డు చేసే టెక్నిక్స్ను ఎథికల్ హ్యాకర్స్ సులభంగా చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ పటిష్టం చేసుకోండి ఫేస్బుక్ హ్యాక్ చేశాక ఇబ్బందులు పడేకంటే ముందుగానే సెక్యూరిటీ సిస్టంను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మన ఫేస్బుక్లోని సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో టు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేసుకోవడం, మన పాస్వర్డ్ను మార్చుకోవడం, ఫేస్బుక్ ప్రొఫైల్ను లాక్ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మన ఫేస్బుక్ హ్యాక్ అయిందా లేదా అని సెటింగ్స్లో కెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫేస్బుక్లో అన్నోన్ ఫ్రెండ్ రిక్సెస్ట్లను ఎప్పుడూ అంగీరించకుండా ఉంటే మంచిది. మనకు బాగా తెలిసిన వారినే ఫ్రెండ్స్గా పెట్టుకోవాలి. హ్యాక్చేసి.. ఫేక్ ఖాతాల సృష్టి హ్యాక్చేసిన ఖాతాలోని వ్యక్తిగత వివరాలు, ఫొటోలను వాడి, అసలు ఖాతాను పోలిన నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. పోనీ ఎందుకొచ్చిన తంటలేనని మన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా డిలీట్ చేసుకుంటే మరిన్ని తిప్పలు తప్పవు. అప్పటికే హ్యాకర్ల చేతిలోకి వెళ్లిన మన సమాచారంతో మరిన్ని సైబర్ నేరాలు చేసుకొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన జీమెయిల్ ఆధారంగా బ్యాంకు ఖాతాలను సైతం సులభంగా హ్యాక్ చేసి ఆపై మన మొబైల్ నంబర్కు కొన్ని యాడ్లింక్స్ పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త స్మార్ట్ఫోన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన లింకులను టచ్ చేయడం, మనకు తెలియని యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం, కోడ్ను స్కాన్ చేయడం చాలా ప్రమాదకరం. మనకు రకరకాలుగా ఆశపెట్టి హ్యాక్ చేసేవాళ్లు సిద్ధంగా ఉంటారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. సైబర్ నేరాలపై తమశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలి. పొరబాటు జరిగాక బాధపడేకంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. – సుధాకర్ రెడ్డి, డీఎస్పీ, పలమనేరు నా ఫేస్బుక్ను హ్యాక్ చేశారు ఇటీవల నా ఫేస్బుక్ హ్యాక్ అయింది. ఎవరో ఫేక్ అకౌంట్ను సృష్టించి ఆపదలో ఉన్నానని డబ్బులు కావాలంటూ రిక్వెస్ట్లు పెట్టారు. దీంతోనేను ఫేస్బుక్హ్యాక్ అయిందని, అదే పేజీలో మెసేజ్ పెట్టాను. నా ఖాతాను సైతం మరింత భద్రపరుచుకున్నా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వివరాలు సులభంగా బయటకు పోతాయి. – సుధాకర్రెడ్డి, వి.కోట, పలమనేరు నియోజకవర్గం -
హౌరా ఎక్స్ప్రెస్లో మంటలు.. కుప్పం రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పరుగులు
సాక్షి, చితూర్తు జిల్లా: బెంగళూరు నుంచి కుప్పం మీదగా యశ్వంత్పూర్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్9 బోగీలో మంటలు వ్యాపించాయి. దీంతో కుప్పం రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. రైలు దిగిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఎవరు హోల్డ్? ఎవరు ఓపెన్?.. అసలు కథేంటో తర్వాత అర్థమైందట.. -
పల్లెల్లో సాఫ్ట్వేర్ కొలువులు.. 3.30 లక్షల ప్యాకేజీ
గంగాధరనెల్లూరు: పల్లెల్లోని విద్యావంతులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడమే స్మార్ట్ డీవీ లక్ష్యమని.. తమ కంపెనీలో 4,500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్కుమార్ తాళ్ల తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని అగరమంగళంలో ఆయనతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఎస్ఆర్ పురం మండలం కొట్టార్లపల్లి వద్ద స్మార్ట్ డీవీ కంపెనీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఎంవోయూ జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. దీనిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహిస్తామని, తొలి విడతగా 600 మందిని తీసుకుంటామన్నారు. డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారూ అర్హులని తెలిపారు. ఎంపికైన ఫస్టియర్ డిప్లొమో, బీకాం, డిగ్రీ చేసిన వారికి రూ.2.70 లక్షలు, బీటెక్ చేసిన వారికి రూ.3.30 లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు. (క్లిక్ చేయండి: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
భార్యా భర్త.. మధ్యలో ఓ అక్క!.. షాకింగ్ విషయాలను రాబట్టిన పోలీసులు
చిత్తూరు అర్బన్: తెలిసిన వాళ్లు, స్నేహితులు, అయినవాళ్లు ఇలా అందర్నీ నమ్మించి మోసం చేయడం, వాళ్ల వద్ద ఉన్న కార్లను ఇప్పుడే తెచ్చిస్తామంటూ అమ్మేయడం.. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిందితులను చిత్తూరు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకు చెందిన డి.యుగంధర్ (42), డి.అనిత (35) దంపతులతోపాటు యుగంధర్ అక్క వై.మంజుల (43) ఉన్నారు. బుధవారం చిత్తూరు పోలీసు అతిథిగృహంలో డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ నరసింహరాజు వివరాలను మీడియాకు వివరించారు. దుర్గానగర్ కాలనీకి చెందిన యుగంధర్ యాక్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎవరైనా కార్లు అద్దెకు అడిగితే ట్రావెల్స్ వద్ద, తెలిసినవాళ్ల వద్ద ఉన్న కార్లను తీసుకెళ్లేవాడు. అయితే విలాసాలకు అలవాటుపడ్డ యుగంధర్, ఇతని అక్క మంజుల, భార్య అనిత కలిసి కొంతకాలంగా తెలిసినవాళ్లు, స్నేహితుల కార్లను ఇప్పుడే ఇస్తామని చెప్పి తీసుకెళ్లి, విక్రయించి, తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా కార్లు ఇచ్చి మోసపోయిన బాధితులు చిత్తూరులోని సంతపేటకు చెందిన జనార్దన్, చవటపల్లెకు చెందిన ఢిల్లీ, గంగనపల్లెకు చెందిన ప్రసాద్ ఇటీవల పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. తమ కార్లను అద్దెకు తీసుకున్న యుగంధర్ తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కార్లను అద్దెకు తీసుకున్న తరువాత వాటిని తాకట్టుపెట్టడం, కొన్నిసార్లు మంచి ధరకు అమ్మిస్తానని చెప్పి, కార్లను విక్రయించేసి, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం నగరంలోని కాజూరు కూడలి వద్ద ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా యుగంధర్ కారులో చిత్తూరు వైపు వస్తూ.. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇతడ్ని వెంబడించి పట్టుకున్న పోలీసులు అసలు విషయాలు రాబట్టారు. తన భార్య, అక్కతో కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు యుగంధర్ పోలీసులకు చెప్పడంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీళ్ల నుంచి రెండు స్విఫ్ట్ డిజైర్, ఓ ఇన్నోవా కారును పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో తాలూక ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: ష్.. గప్చుప్..!!.. యువతులు దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణ -
ఫ్యామిలీ డాక్టర్: తలుపు తట్టి.. నాడి పట్టి
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు షబీరా. రామకుప్పం మండలం కెంచనబల్ల . ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుతోనే జీవనం సాగిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. గతంలో వైద్య సేవల కోసం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పంలోని పీహెచ్సీకి ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల కొద్దీ క్యూలో ఉంటేనే వైద్యం అందేది. ఇప్పుడా అవస్థలు తప్పాయి. ఇంటి దగ్గరకే డాక్టర్, వైద్య సిబ్బంది వచ్చి బీపీ, షుగర్ స్థాయిని పరిశీలించి మందులు అందజేస్తున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య ఉందని గుర్తించిన డాక్టర్లు గతవారం 108 ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించారు. ఇలా నడవలేని, కదలేని స్థితిలో చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వ్యాధుల బారిన పడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే బెంగ ఇక ఉండబోదు. నాణ్యమైన వైద్యం ఇంటి తలుపు తడుతోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువచేసేందుకు ఇంటి వద్దే వైద్యం(ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్) అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే సకాలంలో చికిత్స ద్వారా కోలుకునే అవకాశం ఉంటుందని గ్రహించి ఆ మేరకు చర్యలు చేపట్టడం విశేషం. చిత్తూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీలేని నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరికీ చేరువ అవుతోంది. దాదాపు 4వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరి«ధిలోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించడం విశేషం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు. ఏళ్ల తరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంటి వద్దకే వైద్యం అనే నినాదంతో ప్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం అమలుకానుంది. డేటా యాప్లో రోగుల ఆరోగ్య వివరాలు ఫ్యామిలీ డాక్టర్స్ గ్రామ పర్యటనకు ముందురోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటిస్తారు. ప్రతి ఇంటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. 14 రకాల రక్తపరీక్షలతో పాటు వివిధ ప్రాథమిక వైద్య పరీక్షలు చేపడతారు. ఇందుకు సంబం«ధించిన పూర్తి ఆరోగ్య వివరాలను డేటా ఎఫ్పీసీ యాప్లో పొందుపరు స్తారు. కుటుంబం, అందులోని వ్యక్తులు, వారి వివరాలను పూర్తి స్థాయిలో డేటా యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇలా నెలకు రెండుసార్లు ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం నిర్వహిస్తారు. 67 రకాల మందులు నూతన విధానంలో భాగంగా ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వ హిస్తారు. 104 (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనంలోని మెడికల్ ల్యాబ్లో 14 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉంటాయి. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచనల మేరకు రక్తపరీక్షలు చేపడతారు. అలానే అనారోగ్య సమస్యలను గుర్తించి బాధితులకు అప్పటికప్పుడే మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ వాహనంలో 67 రకాల మందులు సిద్ధం చేశారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం శస్త్ర చికిత్సల అనంతరం బాధితుడి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందుబాటులో వైద్యులు జీఓ 143 ప్రకారం ప్రతి పీహెచ్సీలోనూ 14 మంది వైద్య సిబ్బంది ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది వైద్యులను నియమించింది. అదేవిధంగా టెక్నీషియన్స్, డిజిటల్ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో నియమించి విలేజ్ హెల్త్ క్లినిక్లను బలోపేతం చేసింది. పకడ్బందీగా అమలు జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు వైద్యాన్ని తీసుకొచ్చింది. డాక్టర్లు రోగుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విజయవంతంగా జరుగుతోంది. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది. దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
మాదకద్రవ్యాల ముఠా అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా, వినియోగిస్తున్న ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 34 గ్రాముల బరువున్న మిథైలెనెడియోక్సీ–మెంథాఫేటమైన్ (ఎండీఎంఏ) అనే డ్రగ్స్ను సీజ్ చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో సూడాన్ దేశానికి చెందిన అహమ్మద్ ఒమర్ (28)తో పాటు చిత్తూరుకు చెందిన కె.సిరాజ్ (37), కె.సురేష్ (25), ఎస్.జయశంకర్ (32), సి.ప్రతాప్ (26), ఎస్.తేజకుమార్ (22) అనే యువకులున్నారు. చిత్తూరు ఎస్పీ వై.రిషాంత్రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఆదివారం నగరంలోని ఇరువారం–యాదమరి కూడలి వద్ద కొంతమంది వ్యక్తులు స్ఫటికల రూపంలో ఉన్న పదార్థాన్ని విక్రయించడం, కొనుగోలు చేస్తుండటాన్ని గుర్తించిన టూటౌన్ ఎస్ఐలు మల్లికార్జున, లోకేశ్ తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా, ఆ ప్రదేశంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. సూడాన్ దేశంలోని ఖార్టోమ్ సిటీకు చెందిన అహమ్మద్ ఒమర్ అనే వ్యక్తితో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం అరగొండకు చెందిన కె.సిరాజ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ బెంగళూరులో ఒమర్తో స్నేహం చేసేవాడు. అతని వద్దనుంచి ఎండీఎంఏ అనే మాదకద్రవ్యాన్ని కొనుగోలుచేసి, దాన్ని చిత్తూరు నగరానికి చెందిన సురేష్, జయశంకర్, ప్రతాప్, తేజ, వెంకటేష్, మోహన్, మురళి అనే యువకులకు విక్రయించేవాడు.కాగా, పోలీసులు రూ.2 లక్షల విలువజేసే 34 గ్రాముల మాదకద్రవ్యం, 20 సిరంజీలు, మూడు సెల్ఫోన్లు, ఒమర్ పాస్పోర్టు, వీసాను సీజ్ చేశారు. -
టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత చాకచక్యంగా ముందుకు నడుపుతున్నట్టు సమాచారం. మార్ఫింగ్ చేసి.. నమోదు చేసి టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలను ఎమ్మెల్సీ ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నారు. యూజీసీ జాబితాలో లేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు. వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్టు సమాచారం. అందులో టీడీపీ నేతలు తాము ఎంచుకున్న కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేపనిలో నిమగ్నమైనట్టు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆపై వారికి అనుకూలంగా ఉన్న గెజిటెడ్ అర్హత లేని ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతోనే సంతకాలు చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, మండల స్థాయిలో విచారణాధికారులు అత్యంతపటిష్టంగా ఓటర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని ఓ విద్యాసంస్థలో 54 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 18 మంది మాత్రమే. మిగిలిన వారు నాన్ టీచింగ్ సిబ్బంది. వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాన్ టీచింగ్ సిబ్బందిని ఉపాధ్యాయులుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రగిరి పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల క్రితం టీడీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించాలని కోరారు. ‘మీకెంత కావాలి?.. డబ్బులు కాకుండా ఇంకేమైనా కావాలా?’ అని అడిగారు. ఎక్కువ మంది డబ్బే డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం హాజరైన వారందరికీ మందు, విందు ఏర్పాటు చేశారు. టీడీపీ అడ్డదారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీలో హడావుడి మొదలైంది. తమకు అనుకూలంగా ఓట్లు వేయించే వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు పక్కాప్రణాళికలు రచించారు. అనర్హులను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రిను దిగ్విజయంగా పూర్తిచేసేపనిలో తలమునకలయ్యారు. చిత్తూరుకు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళా శాలలో దాదాపు 35మంది పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 12 మంది మాత్రమే. కానీ మొత్తం మందిని ఓటర్లుగా చూపేందుకు అక్కడ టీడీపీ నేతలు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. పూతలపట్టుకు సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో 17 మంది సిబ్బంది దాకా పనిచేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 8 మంది మాత్రమే. మిగిలిన వారు అనర్హులైనా ఓటర్లుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గూడూరులో ప్రముఖ విద్యాసంస్థలో మొత్తం 43 మంది వరకు పనిచేస్తుండగా అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 25 మంది మాత్రమే. కానీ అక్కడ టీడీపీ నేత ఒకరు సిబ్బంది అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సదరు యాజమాన్యానికి హుకుం జారీచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 14 మంది సిబ్బంది ఉండగా అందులో ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులు 08 మంది మాత్రమే. స్థానికంగా టీడీపీ నేత దగ్గరుండి అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండడం గమనార్హం. ప్రచారంలో బిజీబిజీ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పురాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్రెడ్డి, చంద్రశేఖరరెడ్డి దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాకముందే ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ అడ్డదారులు తొక్కడం విమర్శలకు తావిస్తోంది. -
రెండు నెలల క్రితం లవ్ మ్యారేజ్.. అంతలోనే షాకింగ్ ఘటన.. అసలు ఏం జరిగింది?
కుప్పం(చిత్తూరు జిల్లా): పట్టణంలో గురువారం రాత్రి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. ఆజాద్ రోడ్డులో ఉంటున్న రోహిత్కుమార్, భువనేశ్వరి రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత పెద్దలు అంగీకరించడంతో రోహిత్కుమార్ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి భువనేశ్వరి ఇంట్లో ఉరి వేసుకుని శవమై కనిపించింది. తమ కుమార్తెను రోహిత్ కుటుంబ సభ్యులే కడతేర్చారని భువనేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మృతురాలి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య -
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గంగవరం(చిత్తూరు జిల్లా): పెద్దపంజాణి మండలం ఇటుక నెల్లూరు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దామోదరం హత్య కేసులో నిందితులుగా ఉన్న మృతుడి భార్య అనూరాధ, ఆమె ప్రియుడు గంగరాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు నిర్ధారించారు. గురువారం గంగవరం పోలీస్స్టేషన్లో డీఎస్పీ గంగయ్య వివరాలను వెల్లడించారు. పుంగనూరు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన దామోదర్కి, పెద్దపంజాణి మండలం పెనుగొలకలకి చెందిన అనురాధతో ఏడాది క్రితం వివాహమైంది. దామోదరం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి.. వివాహ సమయంలో అనురాధాకు అత్తింటి వారే నగలు పెట్టి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అనురాధకు నాగిరెడ్డిపల్లికి చెందిన గంగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. అతనికి ఇది వరకే కొత్తపల్లికి చెందిన మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం అనంతరం అనురాధ తన భర్తతో సక్రమంగా కాపురం చేసేది కాదు. కాగా అత్తింటివారు పెట్టిన నగలను కొన్ని నెలల తరువాత భర్తకు తెలియకుండా ప్రియుడి అవసరార్థం ఇచ్చింది. కొన్నాళ్ల తరువాత పుంగనూరు పట్టణంలో సైటు కొనేందుకు కొంత నగదు సరిపోకపోవడంతో నగలను ఇవ్వమని అనురాధను అడగడంతో పుట్టింటిలో ఉన్నాయంటూ తప్పించుకుంది. అలా అడిగిన ప్రతిసారి సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఈ దీపావళి పండుగ (ఈ నెల 24)న భార్య భర్తలిద్దురూ అత్తింటికి వెళ్లారు. పండుగ ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాము వస్తున్న లొకేషన్ గురించి ప్రియుడికి తరచూ సెల్ఫోన్లో మెసేజీలు పెట్టుకుంటూ వచ్చింది. తరువాత తుర్లపల్లి గ్రామ సమీపంలో నాగలాకుంట చెరువు కట్టపై వెళ్లగానే గంగరాజు వాహనాన్ని ఆపాడు. దామోదరం కళ్లలో కారం కొట్టి తల, శరీర భాగాల్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హతమార్చి నగలు దోచుకెళ్లారంటూ అనురాధ కథ అల్లింది. అందురూ నిజమనే అనుకున్నారు. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలిసులు హత్యకు వినియోగించిన కత్తి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
గంగవరం(చిత్తూరు జిల్లా): మండలంలో రెండు రోజుల క్రితం జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొగుడే భార్యను రేషన్ కట్టర్తో కిరాతకంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. డీఎస్పీ గంగయ్య బుధవారం నిందితుడి అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. మండలంలోని మల్లేరు గ్రామానికి చెందిన యాదగిరికి అదేగ్రామానికి చెందిన రోజాకు 2019లో వివాహమైంది. రోజాకు పుట్టింటివారు కానుకగా ఇచ్చిన బంగారు నగలను ఆమెకు తెలియకుండానే యాదగిరి అమ్మేశాడు. చదవండి: మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు విషయం తెలుసుకున్న రోజా తన నగలను తెచ్చివ్వాలంటూ భర్తను నిలదీసేది. ఈ క్రమంలో భర్తతో పాటు, అతని తమ్ముడు చోళరాజు, అత్తమామలు ఆమెను వేధించేవారు. కొన్నాళ్ల తరువాత అత్తమామలతో గొడవ పడి తన భర్తతో కలిసి ఇంటి పక్క నే ఉన్న రేకుల ఇంటిలోకి మకాం మార్చింది. ఆదివారం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవైంది. దీంతో ఆగ్రహించిన యాదగిరి మల్బరీ ఆకును కత్తిరించే పెద్ద కట్టర్ను తీసుకొచ్చి రోజా గొంతుపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే భార్య మెడలోని బంగారు తాళిబొట్టు, చెవి పోగులు తీసుకెళ్లి కోళ్లషెడ్డులో దాచాడు. తరువాత పక్కింటిలో ఉన్న తల్లిదండ్రులతో తన భార్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి నగలు దోచుకెళ్లారని కథ అల్లాడు. ఎస్ఐ సుధాకర్రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది చేపట్టిన దర్యాప్తులో భర్తే అసలు దోషిగా నిర్ధారణైంది. నిందితుడు యాదగిరిని అదుపులోకి తీసుకుని, హత్యకు వినియోగించిన కట్టర్, బంగారు నగలు, సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. భర్త, అత్తమామలను కీలపట్లలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
ఆటో డ్రైవర్తో వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్..
పలమనేరు/పెద్దపంజాణి(చిత్తూరు జిల్లా): కట్టుకున్న భార్యే తనభర్తకు విలనైంది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్వేసి తెలివిగా అంతమొందించింది. ఆపై ఏమీ తెలియనట్టు బంగారు నగల కోసం దొంగలు హత్య చేశారంటూ డ్రామా ఆడింది. నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం, తుర్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి దామోదర్(25) దారుణ హత్యకుగురైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో.. పెద్దపంజాణి మండలం, పెనుగొలకలకు చెందిన చంద్రమోహన్ కుమార్తె అనురాధ, పుంగనూరు మండలం, బత్తలాపురానికి చెందిన రెడ్డెప్ప కుమారుడు దామోదర్తో ఏడాది క్రితం వివాహం జరిగింది. అత్తారింట్లో నోముల పండగకు దంపతులు వచ్చి స్వగ్రామానికి బైక్పై భార్యాభర్తలు తిరుగు ప్రయాణంలో దామోదర్ను కత్తులతో పొడిచి చంపారు. అయితే కళ్లలో కారంపొడి కొట్టి దొంగలు నగల కోసమే హత్య చేశారంటూ మృతుని భార్య అనురాధ పోలీసులకు తెలిపింది. అందరూ నిజమేననుకున్నారు. అయితే ఆమె తండ్రి గ్రామంలో పాల సెంటర్ను నిర్వహించేవాడు. అక్కడికి పాలను తీసుకెళ్లేందుకు పెద్దపంజాణి మండలం, తిరుమలకొండయ్యగారిపల్లికి చెందిన గంగరాజు(25) పాల ఆటో డ్రైవర్గా వచ్చేవాడని తెలిసింది. అప్పటి నుంచే అనురాధ, గంగరాజు మధ్య చనువుందని సమాచారం. వీరికి భర్త అడ్డుగా ఉండడంతో పక్కా స్కెచ్తో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. అనురాధ ఇచ్చిన సమాచారంతోనే గంగరాజు దారిమధ్యలో వేచి ఉండి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇప్పటికే పోలీసులు మృతిని భార్య అనురాధ, పాల ఆటో డ్రైవర్ గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని సమాచారం. కేసులో పూర్తి వివరాలు తెలిశాక నిందితులను నేడో, రేపో పోలీసులు అరెస్ట్ చూపనున్నట్టు తెలిసింది. -
రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. మహిళ దారుణహత్య.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
గంగవరం(చిత్తూరుజిల్లా): మండలంలోని కల్లుపల్లె పంచాయతీ మల్లేరులో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. గొంతుకోసి హతమార్చడంపై స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. వివరాలు.. గ్రామానికి చెందిన యాదగిరి, రోజాకు సుమారు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. ఈ క్రమంలో రోజా ఒంటరిగా ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు నగలకోసం హత్య చేశారని భర్త యాదగిరి గ్రామస్తులకు తెలిపాడు. చదవండి: హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డీఎస్పీ గంగయ్య, సీఐ అశోక్కుమార్ ఆదేశాల మేరకు డాగ్స్కాడ్ను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంతలో మృతురాలి కుటుంబీకులు అక్కడకు చేరుకుని తమ బిడ్డను యాదిగిరే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. అతనిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డీఎస్పీ మాట్లాడుతూ హత్య జరిగిన తీరుపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. పకడ్బందీగా దర్యాప్తు చేసి అసలు నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సైకిల్’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్
సాక్షి, చిత్తూరు: ప్రజలను పట్టించుకోకుంటే ఏం జరుగుతుందో ప్రతిపక్షనేత చంద్రబాబుకు ఇప్పుడు అర్థమవుతోంది. కార్యకర్తలను కేవలం మెట్లుగానే ఉపయోగించుకుంటే పరిస్థితి ఎలా తారుమారవుతుందో అవగతమవుతోంది. అభివృద్ధి ఫలాలను అందించకుండా మాయమాటలకే పరిమితమైతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలిసివస్తోంది. కుప్పం కోట చేజారిపోయిందనే బెంగ రోజురోజుకూ పెరిగిపోతోంది. దశాబ్దాలుగా మోసిన తమ్ముళ్లు సైతం జారిపోతుంటే ఆందోళన అధికమవుతోంది. కుదేలైన సైకిల్కు ఎన్ని మరమ్మతులు చేసినా పార్టీ గ్రాఫ్ దిగజారిపోతుండడంతో దిక్కుతోచనిస్థితి ఎదురవుతోంది. ఈ మేరకు గురువారం విజయవాడలో కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. చదవండి: పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కుప్పంలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత పడిపోయింది. ఒకప్పుడు ఏడాదికి ఒకసారి కూడా నియోజకవర్గం వైపు చూడని చంద్రబాబుకు ఇప్పుడు కలలో కూడా కుప్పమే కనిపిస్తోంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోటలా మార్చుకున్న నియోజకర్గం చేజారిపోతుందేమో అనే దిగులు చందబ్రాబును వెంటాడుతోంది. డీలా పడిన టీడీపీ అభివృద్ధి చూడాలంటే కుప్పం రండి అంటూ ఒకప్పుడు చంద్రబాబు జబ్బలు చరుచుకునేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజమైన అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో కుప్పం ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకాలం మాటలతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గంపగుత్తగా గెలిపించారు. ప్రతిపక్షనేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమాత్రం వివక్ష చూపకుండా అభివృద్ధిని పరుగులు తీయిస్తుండడంతో ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,149 కోట్లు మంజూరు చేయడంతో అభిమానం రెండింతలైంది. ఈ క్రమంలోనే సెపె్టంబర్ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభకు ప్రజానీకం తండోపతండాలుగా తరలివచ్చింది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపూ హర్షధ్వానాలతో మద్దతు పలికింది. దీంతో అటు చంద్రబాబుకు, ఇటు స్థానిక టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు విషయం అర్థమయ్యేసరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పరువు కోసం పాట్లు! గత సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. కుప్పంలో తన ప్రభ మసకబారుతోందని అర్థమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటించగానే బాబులో మరింత గుబులు మొదలైంది. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందులో భాగంగానే 25 మంది కుప్పం నేతలను గురువారం విజయవాడకు పిలిపించుని మాట్లాడినట్లు వెల్లడించారు. కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ ఇన్చార్జి పీఎస్ మునిరత్నంపై పలువురు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని, వెంటనే ఇన్చార్జిని మార్చాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనిపై చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలోనే కొత్త ఇన్చార్జిని నియమించనున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. సీఎం వరాలపై జనంలో చర్చ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.66 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలో డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు, నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు మొత్తంగా రూ.1,149 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కుప్పం వాసులు సైతం ముఖ్యమంత్రి కురిపించిన వరాలపై చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి గెలిపిస్తే చంద్రబాబు చేసింది శూన్యమని, మూడున్నరేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు తీయిస్తోందని ప్రశంసిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీతో జట్టుకట్టి.. మా ఆశలను నిలువునా కూల్చేశారు
పాపం కమలనాథులు ఏదేదో ఊహించుకున్నారు.. వాపును చూసి బలుపనుకున్నారు.. జనసైనికుల అండతో సత్తా చాటవచ్చని జబ్బలు చరిచారు.. ఇంతలోనే నమ్ముకున్న పవన్ కల్యాణ్ నట్టేట్లో వదిలేసేసరికి కంగుతిన్నారు.. టీడీపీతో జట్టుకట్టి తమ ఆశలను నిలువునా కూల్చేశారని రగిలిపోతున్నారు.. అనుకూలంగా ఉన్నట్లు నటించి వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు.. చంద్రబాబుతో ముందుకు వెళ్లడమంటే ఓటమిని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. జనసేన అధినేత రాజకీయ అపరిపక్వతకు ఇది నిదర్శనమని విమర్శిస్తున్నారు.. ఏది ఏమైనా ఇన్నాళ్లూ పోటీకి సై అంటూ కాలుదువ్విన నేతలంతా చల్లగా జారుకుంటున్నారు.. పోటీ చేసి పరువు తీసుకోవడం ఎందుకని ప్లేటు ఫిరాయిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఓటు బ్యాంకింగ్ లేకపోయినా.. మీడియా పులులుగా మీసాలు తిప్పుతున్న కమలనాథులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి షాక్ ఇచ్చారు. చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడవటాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ పవన్తో జతకట్టడం వల్ల ఉన్న పరువు కూడా పోయిందంటూ మథనపడుతున్నారు. రాజేసిన మాటలు వైఎస్సార్సీపీ నేతలపై పవన్కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్న నాయకుడు చేసే వ్యాఖ్యలేనా? అని ప్రశ్నిస్తున్నారు. సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈక్రమంలో తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ, జనసేన ఆశావహులు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు పార్టీ టికెట్ వద్దని తేల్చి చెబుతున్నారు. తిరుపతిలో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రస్తుత పరిస్థితిలో ఆలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా మబ్బు దేవనారాయణరెడ్డి, జేబీ శ్రీనివాసులు మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. తిరుపతిలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతో పాటు, పారీ్టలో విబేధాలు, మిత్రపక్షమైన జనసేన శ్రేణులతో వర్గపోరు వీరిని అయోమయంలోకి నెట్టేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జనసేన విషయానికి వస్తే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్రాయల్, మహాలక్ష్మి తిరుపతి అభ్యర్థులుగా పోటీ చేయాలని ఆశపడ్డారు. అయితే వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉంటే.. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు వీరిని భయపెడుతున్నాయి. చంద్రబాబు, పవన్ కలయికతో మదనపల్లె టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న దొమ్మలపాటి రమేష్, జయరాం నాయుడు, బోడిపాటి శ్రీనివాస్ ఆత్మరక్షణలో పడ్డారు. జనసేన నుంచి రామ్దాస్చౌదరి, మహేష్ కూడా పోటీ చేద్దామా? వద్దా? అనే సంశయంతో ఉన్నట్టు తెలిసింది. చిత్తూరు విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేయవచ్చేనే అభిప్రాయం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రస్తావన కూడా రావటం లేదని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉండేది. అయితే వపన్, చంద్రబాబు కలయిక, వారి వ్యాఖ్యలపై జనం నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పరిస్థితి తారుమారు అయినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. మొత్తంగా టీడీపీ, జనసేన జట్టుకట్టడంపై రెండు పార్టీల నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండడం గమనార్హం. బాబు, పవన్ వ్యాఖ్యల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతోనే ఆశావాహులు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకింత దూరం మొన్నటి వరకు బీజేపీతో సఖ్యతగా ఉంటూ.. కమలనాథులకు అండదండలందిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నమ్మించారు. ఆ పార్టీ అధినాయకత్వంతో తరచూ మాట్లాడుతున్నట్టు ఇక్కడి నేతలను బోల్తాకొట్టించారు. అడపాదడపా అధికార వైఎస్సార్సీపీ నేతలపై చిందులేస్తూ బీజేపీ నేతలను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని కమలదళం మురిసిపోయింది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలవడం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పోరాడాలనుకుంటున్నామంటూ వ్యాఖ్యలు చేయడం బీజేపీ కార్యకర్తలను విస్మయంలోకి నెట్టింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పొత్తుతో తిరుపతి అసెంబ్లీ బరిలో పోటీచేయాలని భావించిన బీజేపీ నేతల ఆశలు ఆవిరయ్యాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. -
ఇంతకీ.. ఆ డాక్టర్ సంగతేమిటో!?
చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే ఓ అధికారి ఓ విభాగ అధిపతిగా ఉన్నారు. గతంలో ఓ కాంట్రాక్టు మహిళా వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించి చెప్పుదెబ్బలు తిన్నాడు. తాజాగా ఓ యువతిని లైంగింక వేధింపులకు గురిచేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారంలోకి వచ్చింది. యువతి బంధువులు అతడిని చితకబాదడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ అధికారి.. ఆపై, సెలవు పెట్టి జిల్లా నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన సొంతూరైన ఖమ్మంలో ఓ ప్రైవేటు క్లినిక్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్లు భోగట్టా! ప్రస్తుతం ఇది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్య ఆరోగ్యశాఖలో హాట్ టాపిక్గా నానుతోంది. దీనికి సంబంధించి సేకరించిన వివరాల మేరకు.. ఓ యువతికి (వైద్య సిబ్బంది) పర్మినెంట్ ఉద్యోగం పేరిట వల వేసి, గర్భం చేసినట్లు తెలిసింది. ఇది యువతి కుటుంబీకులు తెలియడంతో తిరుపతిలోని ఆ అధికారి ఇంటికి వెళ్లి చితకబాధినట్లు సమాచారం. ఆ అధికారి బాగోతం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవు పెట్టి తన స్వస్థలానికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఫిర్యాదు అందితే విచారణ చేస్తాం దీనిపై డీఎంఅండ్హెచ్ శ్రీహరిని వివరణ కోరగా..బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
శ్రీవారికి సేంద్రీయ ధాన్యం
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. సేంద్రియ విధానంలో సాగు చేసిన (ఆర్గానిక్) పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారి ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో కూడా సేంద్రియ బియ్యం వినియోగించాలని ఆలోచనతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎంఎస్పీ కంటే పది శాతం ధర అధికంగా ఇచ్చి కొనుగోలు చేయడానికి రైతులను ఎంపిక చేసి ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేక సర్టిఫికెట్ అందజేస్తోంది. వారు పండించిన పంటను మాత్రమే టీటీడీ కొనుగోలు చేయనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువుల రహిత పంటలు పండించేలా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో పండించిన పంటలకు ప్రభుత్వమే నేరుగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. అందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసేలా ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా గతేడాది నాలుగు జిల్లాల్లో శనగ పంటను ఎంపిక చేయగా, ఈ ఏడాది వరి పంటను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్గా జిల్లా ఎంపిక ఈ ఏడాది ప్రకృతి సాగు పద్ధతుల్లో వరి ధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రాష్ట్రంలో వరి అధికంగా సాగయ్యే పలు జిల్లాలను ఎంపిక చేశారు. అందులో భాగంగా మేలు రకం వరి సాగుకు పెట్టిన పేరైన నెల్లూరు జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జిల్లాలో ఈ రబీ సీజన్ నుంచి వరి పంటను సేంద్రియ విధానంలో సాగు పద్ధతులను పాటించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులకు ఈ తరహా సాగు విధానంలో అవగాహన కల్పించేందుకు ఒప్పిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చేవూరులో 25 మంది రైతులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. దీని ప్రకారం రైతులు కచ్చితంగా అధికారులు సూచించిన సేంద్రియ సాగు పద్ధతుల్లోనే పంటలు పండించాలి. ఎటువంటి రసాయనిక ఎరువులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగించాలి. రైతులకు సేంద్రియ ఎరువులను సరఫరా చేయడంతో పాటు సాగులో వారికి ఆ శాఖ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తారు. ఇలా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే ప్రత్యేకంగా మార్కెటింగ్ చేయిస్తుంది. 2,640 టన్నుల ధాన్యం సరఫరాకు టీటీడీతో ఒప్పందం ప్రకృతి సాగు పద్ధతుల్లో పండించిన వరి ధాన్యాన్ని మార్కెటింగ్ కోసం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డుతో ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. జిల్లా నుంచి 2,640 టన్నుల మేలు రకం (సన్నబియ్యం) ధాన్యం సరఫరా చేసేందుకు అంగీకరించారు. ఇందుకు 1,300 ఎకరాల్లో వరిని సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఎకరాకు 2 టన్నుల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 870 ఎకరాల్లో సాగు చేసేలా రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మిగతా విస్తీర్ణానికి రైతులను ఒప్పించి పనిలో అధికారులున్నారు. సన్న రకాలే సాగు రైతుల ద్వారా ప్రధానంగా మూడు రకాలైన సన్న బియ్యం రకాల వరిని పండించనున్నారు. వీటిలో నెల్లూరు సన్నాలు (ఎన్ఎల్ఆర్34449), సాంబమసూరి (బీపీటీ 5204), రాజేంద్రనగర్ సన్నాలు (ఆర్ఎన్ఆర్15048) రకాలను పండించాలి. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతుల్లోనే వరి పంటను ఈ రబీ సీజన్లో సాగు చేయించనున్నారు. ఈ విధంగా పండించిన పంటను ప్రభుత్వం సాధారణంగా ధాన్యానికి క్వింటాకు ఇచ్చే మద్దతు ధర కంటే 10 శాతం అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరించిన ధాన్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద ట్రస్ట్కు సరఫరా చేయనున్నారు. పండించిన శనగ పంటను గతేడాది టీటీడీకి సరఫరా చేశారు. సేంద్రియ వ్యవసాయ రైతులకు సర్టిఫికెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగు చేసే రైతుల ఉత్పత్తులకు గుర్తింపు ఇచ్చేలా ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించిన పంటలను ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధర కంటే అధిక ధర రైతులకు లభిస్తుందని చెబుతున్నారు. అన్ని రకాల పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి వ్యవసాయశాఖ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు. రసాయన రహితంగా ధాన్యం ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల్లో రబీ సీజన్లో ధాన్యం పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన రహిత ధాన్యాన్ని టీడీటీకి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాను ఎంపిక చేశారు. 2640 టన్నుల ధాన్యం ఉత్పత్తి కోసం కొంత మంది రైతులతో ఒప్పందం చేసుకుని మేలు రకం ధాన్యాన్ని జెడ్బీఎన్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో పండించేలా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా సేంద్రియ ఎరువులను వినియోగించి పండించిన ధాన్యా న్ని మాత్రమే తీసుకుంటాం. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – డీ మాలకొండయ్య, జెడ్బీఎన్ఎఫ్, డీపీఎం -
నో ప్లాస్టిక్.. ఓన్లీ క్లాత్! జీవనాదారానికి పట్టాభిషేకం
యాంత్రీకరణ నేపథ్యంలో కుదేలైన నేత పరిశ్రమకు ప్రభుత్వం ఊతమిస్తోంది. కోవిడ్ మహమ్మారి ధాటికి కొడిగట్టిన చేనేత రంగానికి ప్రభుత్వం యూనిఫాం ఆర్డర్లు అందించి ఊపిరి పోసింది. సంక్షేమ పథకాలతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచింది. విద్యుత్ చార్జీల రాయితీలతో మరమగ్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించి, వస్త్ర ఫ్లెక్సీలు వినియోగించాలన్న నిర్ణయంతో చేనేతకు పట్టాభిషేకం చేసింది. సాక్షి, చిత్తూరు: నేతన్నకు మంచి రోజులు వచ్చా యి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన వస్త్రాలతో తయారు చేసిన ఫ్లెక్సీలు వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నేత కార్మికుల్లో నూతనోత్సాహం నింపింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. నగరి నేత పరిశ్రమకు వందేళ్ల చరిత్ర వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నగరి నేత పరిశ్రమలో పదివేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ పరిశ్రమపై ఆధారపడి 40 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా నేతన్నల పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని విన్నవించారు. ఫలితంగా నేత కార్మికుల నుంచి 20 లక్షల మీటర్లు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన యూనిఫామ్ దుస్తుల తయారీ ఆర్డర్ వచ్చింది. దీంతో నగరి నేత కార్మికుల జీవనానికి ఏపీ ప్రభుత్వం ఊతమిచ్చినట్లయింది. కార్మికులు తమకు వచ్చిన ఆర్డర్లను సద్వినియోగం చేసుకుని సకాలంలో దుస్తులు సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. విదేశాల్లో మంచి గిరాకీ ఒకప్పుడు పుష్కలమైన విదేశీ ఆర్డర్లతో నగరి నేత పరిశ్రమ వర్ధిల్లింది. జిల్లాలోని నగరి పరిసర ప్రాంతాల్లో తయారు చేసే చొక్కాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఇటు తమిళనాడు, అటు కర్ణాటక నుంచి టోకు వర్తకులు నగరికి గుంపులు గుంపులుగా వచ్చి కొనుగోలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో క్రమేణా విదేశీ ఆర్డర్లు తగ్గాయి. ప్రత్యామ్నాయంగా స్వదేశంలో తయారు చేసే వస్త్రాల తయారీపైనే నేత కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో వస్త్రాలతో తయారు చేసిన బ్యానర్లనే వాడాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లివెరిసింది. పర్యావరణానికి మేలు ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పర్యావరణ సమతుల్యతకు ఊపిరి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు ప్లాస్టిక్ కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించి, పర్యావరణానికి హానిలేని వస్త్రాలతో తయారు చేసే బ్యానర్లు వాడాలని ఆదేశాలివ్వటం శుభ పరిణామమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేతన్నలకు సర్కారు వెన్నుదన్ను నేత, మరమగ్గం కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఇటు సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా నేతన్న ఉపాధికి ఊతమిస్తున్నాయి. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు, చేనేత పెన్షన్ల కింద 50 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.2,500, చేయూత కింద యేడాదికి రూ.18,750 అందజేస్తున్నారు. తాజాగా బ్యానర్లకు వస్త్రాలు వాడాలని ఆదేశించడంతో నేతన్నలకు ఉపాధి మరింత పెరగనుంది. వస్త్ర బ్యానర్లతో ఉపాధి గతంలో ఆర్డర్లు లేకుండా వివాహ విందులో సప్లయర్లుగా వెళ్లేవాళ్లం. ఈ దశలో ప్రభుత్వం అందించిన యూనిఫామ్ ఆర్డర్లు నా కుటుంబంతో పాటు నేత పరిశ్రమను ఆదుకుంటున్నాయి. వస్త్రాలతో బ్యానర్లు వేయడం ప్రారంభిస్తే, నేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో నేతన్నకు పని దొరుకుతుంది. – ఎజి.దేవన్, నేత కార్మికుడు, సత్రవాడ రక్షణతో పాటు ఉపాధి నేతపరిశ్రమలో ప్రధానమైన డైయింగ్ యూనిట్ల వారికి శాశ్వత పరిష్కారం చూపే ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్వహణకు వచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ చేసి వస్త్ర బ్యానర్లు వేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యావరణ రక్షణకు ఉపయోగపడటంతో పాటు నేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తుంది. – భూపాళన్, ఏకాంబరకుప్పం మంచి నిర్ణయం ప్లాస్టిక్ను నిషే«ధించాలన్న నిర్ణయం మంచిది. ఏటా ప్రతి మనిషి దాదాపు 12 కిలోల ప్లాస్టిక్ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రోజూ నలుగురు క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇప్పటికే ప్రతి ఆవు, చేప కడుపులో ప్లాస్టిక్ ఉంది. మనిషి కడుపులో దాదాపు 20 గ్రాముల వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు తెలుస్తోంది. – మురళి, పర్యావరణ ప్రేమికుడు -
కదలిక గుర్తించి..ఆపద గట్టెక్కించి!
రాత్రీపగలూ కంటిమీద కునుకులేకుండా గ్రామాలపైకి దూసుకొస్తున్న ఏనుగుల మందను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రైతులు, పంటలకు శాశ్వత రక్షణ కల్పించేదిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న బేస్ క్యాంప్లు, ట్రాకర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఏనుగుల సంచారాన్ని గ్రామస్తులు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చని భావిస్తోంది. ఈ మేరకు అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల సంచారం ఎక్కువైంది. రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీంతోపాటు పలువురు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతంలో పలువురు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏనుగుల కదలికలపై ప్రత్యేక దృష్టి ఇటీవల పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలాల్లో ఏనుగుల దాడులు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి, తద్వారా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు, వాటిని గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఐదు, పలమనేరు పరిధిలో నాలుగు, చిత్తూరులో రెండు బేస్ క్యాంపులు ఉన్నాయి. వీటితోపాటు పెద్దపంజాణి, సోమల మండలాల్లో ఆవులపల్లి, పేటూరు ప్రాంతాల్లో కొత్త బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇవి ఏర్పాటు చేస్తే ఒక్కో బేస్ క్యాంప్ సుమారు 40 నుంచి 50 చ.కి.మీ పరిధిలో ఏనుగుల కదలికలు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మూడు బేస్ క్యాంపులకు కలిపి సుమారు 15 మంది ట్రాకర్లు అందుబాటులోకి రానున్నారు. సత్వర చర్యలకు అవకాశం ట్రాకర్ల సహాయంతో ఏనుగుల కదలికలతో పాటు మిగిలిన అడవి జంతువుల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. అదే విధంగా అటవీశాఖ అధికారులు కూడా టపాసులు, డప్పులు లాంటివి సిద్ధం చేసి ఆయా గ్రామాల వైపునకు ఏనుగుల గుంపు వెళ్లకుండా సత్వరచర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం పుంగనూరు రేంజ్లో 20 నుంచి 25 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇందులో 3 మదపుటేనుగులు ఉన్నాయి. అయినా గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయలేదు. ఇక బేస్ క్యాంపుల ఏర్పాటుతో ఏనుగుల బెడద బాగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 80 నుంచి 90 ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏనుగుల కట్టడికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో 6 కి.మీ సోలార్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. మరో 15 కి.మీ. దూరం సోలార్ ఫెన్సింగ్ వేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. జనంలో నుంచి అరణ్యంలోకి.. జనారణ్యంలోకి వచ్చిన ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపేందుకు సత్వర చర్యలు చేపట్టాం. తమిళనాడు, కర్ణాటక నుంచి ఏయే మార్గాల్లో ఏనుగులు వస్తున్నాయో గుర్తిస్తున్నాం. వాటి వల్ల ప్రజలకు, పంటలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాం. బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తున్నాం. -
కుప్పంలో ఎవరు లోకల్? ఎవరు నాన్లోకల్?
కుప్పం పచ్చ కోట కూలిపోతోందా? కుప్పం నా అడ్డా అన్న చంద్రబాబు వేరే దారి చూసుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్ సభ తర్వాత తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాశలో కూరుకుపోయారా? కుప్పంలో పచ్చ పార్టీ పని ముగిసిందని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. కుప్పంలో వైఎస్ జగన్ టూర్ తర్వాత రాజకీయ సమీకరణాల్లో జరిగిన మార్పులేంటి? చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పచ్చ పార్టీకి కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కుప్పంకు నాన్ లోకల్గా పేరుపడ్డ చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. రెవిన్యూ డివిజన్ ఏర్పడింది. కుప్పం మున్సిపాలిటీ అయింది. చంద్రబాబు ఏలుబడి కంటే వైఎస్ జగన్ పాలనలోనే తమ జీవితాలు బాగుతున్నాయని కుప్పం ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్ వచ్చాక జరిగిన స్థానిక ఎన్నికలన్నింటా తెలుగుదేశం దారుణంగా ఓడిపోయింది. ముప్పయి సంవత్సరాలుగా కుప్పం నా అడ్డా అని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఇక కుప్పంలో నిర్మించుకున్న పచ్చ కోటలన్నీ కూలిపోతుండటంతో కళ్ళు తెరిచిన చంద్రబాబు కొంతకాలం క్రితం అక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గూండాగిరీ కూడా చేయించారు పచ్చ పార్టీ నేతలు. కుప్పం ప్రజలు తనను మర్చిపోతున్నారనే భయం, ఆందోళన చంద్రబాబులో మొదలయ్యాయి. వారం క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం టూర్తో టీడీపీ పతనం పరిపూర్ణం అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ సభకు వచ్చినంత మంది ప్రజలు గతంలో ఏనాడూ చంద్రబాబు సభలకు రాలేదని అందరూ ఏకోన్ముఖంగా చెబుతున్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం మాదిరిగా అభివృద్ధి చేస్తానని జగన్ ఇచ్చిన హామీతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం లో సీఎం వైఎస్ జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. కుప్పంలో వారం రోజులుగా ఎక్కడ చూసినా సీఎం సభ గురించే చర్చ జరుగుతుండడం విశేషం. చంద్రబాబు రాజకీయ జీవితంలో కుప్పంలో నిర్వహించిన సభలకు ఎప్పుడూ ఇంత జనం హాజరు కాలేదని టిడిపి కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. కుప్పంతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలి అని టిడిపి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. నియోజవర్గంలోని 4 మండలాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమరోత్సహంలో ఉన్నారట. గతం కంటే సీఎం సభ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుప్పంలో సీఎం జగన్ సభ సూపర్ సక్సెస్ కావడంతో టిడిపి వర్గాల్లో గుబులు ప్రారంభమైంది. చంద్రబాబు అడ్డాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడే పరిస్థితులు కనిపిస్తుండటంతో... చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై టిడిపి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. అందుకే కుప్పంతో పాటు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు వెతుక్కుంటున్నారని పచ్చ పార్టీలో టాక్ నడుస్తోందట. -
అద్వితీయం.. బోయకొండ క్షేత్రం
చిత్తూరు జిల్లాలో కాణిపాకం తరువాత అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ క్షేత్రం నూతన శోభను సంతరించుకుంది. మూడేళ్లలోనే బోయకొండ అతి సుందరంగా రూపుదిద్దుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో వందల కోట్ల రూపాయల నిధులు బోయకొండ అభివృద్ధికి వెచ్చించడంతో, రూపురేఖలు మారిపోయాయి. అత్యాధునిక సదుపాయాల మధ్య అమ్మవారి దసరా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ బోయకొండ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుణ్యక్షేత్రం విశిష్టతపై ప్రత్యేక కథనం. చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వతేదీ వరకు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు రోజూ వారీ సేవల వివరాలను తెలియజేయడానికి పోస్టర్లు ముద్రించి జిల్లాతోపాటు, కర్ణాటక, తమిళనాడులో పంపిణీ చేశారు. ఆలయ చరిత్ర జిల్లాలోని పుంగనూరు పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటి. భారతావని నవాబులు పాలించే సమయంలో పుంగనూరు సంస్థానంపై నవాబుల కన్నుపడింది. గోల్కొండ నవాబు సైన్యం పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాల్లో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టింది. ప్రజలు భయభ్రాంతులై చెల్లాచెదురయ్యారు. పుంగనూరు వైపు వస్తున్న నవాబు పదాథిదళాలు చౌడేపల్లె వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయల, ఏకిల గూడేలలో బీభత్సం సíష్టించాయి. దీంతో బోయలు, ఏకిల దొరలు భయంతో కొండ గుట్టకు వెళ్లి తలదాచుకొని జగజ్జనని మాతను ప్రార్థించారు. వీరిమొర ఆలకించిన శక్తి స్వరూపిణి వృద్ధురాలి రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి. నవాబుసేనలను అవ్వ తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గదాటికి రాతిగుండు సైతం నిట్ట నిలువుగా చీలిపోయింది. (ఇప్పటికీ ఈ రాతిగుండును చూడవచ్చు) నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపచేయడానికి ఒకమేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండాలని ప్రారి్థంచారు. వారి కోరిక మేరకు అక్కడే వెలసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలవడం మొదలైంది. కొండపై హిందువులు కట్టుకున్న సిర్తారికోట, నల్లమందు పోసిన గెరిశెలు, గుట్టకింద అమ్మనీరు తాగిన స్థలం గుర్తులు, గుండ్లకు సైన్యం గుర్తులు, ఉయ్యాల ఊగిన గుండ్లు అమ్మవారి మహిమలకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. పవిత్రమైన పుష్కరిణి తీర్థం కొండపై వెలసిన అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతిపవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థంను సేవిస్తే సకల రోగాలు, పంటలపై తీర్థాన్ని చల్లితే చీడపీడలు, దుష్టసంబంధమైన గాలి భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.కేవలం రూ.20కే బాటిల్తో సహా తీర్థములను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు. అమ్మవారి పుష్ప మహిమ భక్తులు తమ కోరికలు నెరవేరుతాయా లేదా అని తెలుసుకోవడానికి అమ్మవారి శిరస్సుపై మూడు పుష్పములు ఉంచి కోరికలను మనస్సులో స్మరించుకోమంటారు. అమ్మవారికి కుడివైపున ఆ పుష్పము పడినచో కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడినచో ఆలస్యంగా నెరవేరుతాయని, మధ్యలో పడితే తటస్థంగా ఉంటాయని అమ్మవారి మాటగా భక్తులు భావిస్తారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ చైర్మన్ మిద్దెంటి శంకర్నారాయణ తెలిపారు. అమ్మవారి అలంకారాలతో తీర్చిదిద్దిన తొమ్మిది డిజిటల్ హెచ్డీ ఆర్చిలను బోయకొండపై ఏర్పాటు చేశామన్నారు. దసరా మహోత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దుర్గా సప్తశతి చంఢీ హోమం (పౌర్ణమి రోజున) పాల్గొనే ఉభయదారులు రూ.2,116 చెల్లించి ఉభయదారులుగా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. శ్రీఘ్ర ఫలదాయిని పూజలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక పూజలతోపాటు ఊంజల్సేవ, అభిõÙకం, గణపతి, చంఢీహోమములు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉభయదారులకు అమ్మవారి ప్రసాదము, పవిత్రమైన శేషవస్త్రం, చీరతోపాటురవిక, అమ్మవారి కుంకుమ, గాజులు, అమ్మవారి జ్ఞాపిక ఇవ్వనున్నట్లు ఈవో చంద్రమౌళి పేర్కొన్నారు. ఉభయదారుల నమోదుకోసం 79016 42845, 79016 42846ను సంప్రదించాలని కోరారు రవాణా మార్గాలు పుణ్యక్షేత్రమైన బోయకొండ ఆలయానికి చౌడేపల్లె నుంచి 12 కిమీ, పుంగనూరు నుంచి 14 కి.మీ, మదనపల్లె నుంచి 16 కి.మీ దూరం ఉంది. ఈ మూడు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బెంగళూరు నుంచి బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో గతుకుల రోడ్లతో భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డబుల్ రోడ్డు వేయడంతో ప్రయాణం సులభతరంగా మారింది. కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
CM YS Jagan Kuppam Tour: నూతన వెలుగులు..ఉద్యానవనాల అభివృద్ధి
మాటల్లో చెప్పలేని ఆనందం సొంత నియోజకవర్గంతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తుండడం చాలా సంతోషం. ఈ పనులను ప్రారంభించేందుకు స్వయంగా ఆయనే వస్తుండడంతో మాటల్లో చెప్పలేని ఆనందం ఉంది. మా ప్రాంతంలో ప్రధానంగా తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది. సీఎం చొరవతో ఇప్పటికి పరిష్కారం లభించనుంది. – చిలకమ్మ, కుప్పం అభివృద్ధి చేసి చూపుతున్నారు మాటల్లో చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపుతోంది. పథకాల కోసం ఎక్కడెక్కడో తిరిగే పని లేకుండా వలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి సేవలందిస్తున్నారు. ప్రతీ విషయంలో జవాబుదారీ ఉంటోంది. గతంలో పట్టణమంతా సమస్యలే. ఇప్పుడు కోట్లాది రూపాయల పనులు చేస్తుండటంతో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగింది. – జయమ్మ, కుప్పం ప్రజల అమాయకత్వాన్ని టీడీపీ అధినేత ఓట్లుగా మలుచుకున్నారే కానీ.. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదు. సమస్యలు పరిష్కారమైతే ఎక్కడ ప్రజలు తమ చేయి జారిపోతారోనని ఆ ఊసెత్తకుండా ‘రాజకీయం’ అనే గంప కిందనే ఉంచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పాలన పారీ్టలు, కులమతాలకు అతీతంగా సాగుతోంది. సీఎం తన సొంత నియోజకవర్గం తరహాలోనే ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నా.. బాబుకు ఇటీవల ఎన్నికల్లో ఓటమే ఎదురైంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.66కోట్లతో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చనుండటం విశేషం. కుప్పం: మూడేళ్లలోనే 30 ఏళ్లకు సరిపడా అభివృద్ధి కుప్పం సొంతమవుతోంది. ఇప్పటి వరకు సంక్షేమం ఎరుగని ప్రజలకు ఇప్పుడు ఇంటి తలుపుతడుతున్న పథకాలను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని రోజులు తాము ఎలా మోసపోయామో తెలుసుకున్న ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత రాజకీయ చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నా స్థానికులు అభివృద్ధికే ఆకర్షితులు అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి.. కుప్పం విషయంలోనూ తనదైన మార్కు కనపరుస్తున్నారు. మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్గా మార్పు చేశారు. తాజాగా పట్టణాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించేందుకు ఏకంగా రూ.66కోట్లు కేటాయించడంతోపాటు పనుల ప్రారం¿ోత్సవానికి స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానుండడంతో కుప్పం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నూతన వెలుగులు పట్టణం వేగంగా విస్తరిస్తున్నా ఆయా ప్రాంతాల్లో సరైన వీధి దీపాలు లేకపోవడంతో చాలా చోట్ల చీకటి కమ్ముకుంది. నూతన లేఅవుట్లలోని ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలతోపాటు మెర్క్యూరీ బల్బుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.5 కోట్లు కేటాయించింది. ఈ పనులతో పట్టణం వెలుగులు సంతరించుకోనుంది. ఉద్యానవనాల అభివృద్ధి పట్టణంలోని రాజావారి పార్కుతో పాటు దళవాయికొత్తపల్లి పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రూ.2.55 కోట్లతో వీటిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం చెరువు నిండి మొరవ పారుతుండడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక్కడ పార్కు అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం, సెలవుల సమయాల్లో పట్టణ ప్రజలు, పిల్లలకు అభివృద్ధి చేయనున్న పార్కులు ఊరట కల్పించనున్నాయి. మున్సిపాలిటీకి నూతన భవనం స్వాతం్రత్యానికి ముందు నిర్మించిన పురాతన భవనంలోనే ఇప్పటికీ మున్సిపాలిటీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజల రాకపోకలు, అధికారుల బాధ్యతలు రెట్టింపయ్యా యి. ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.3 కోట్లు కేటాయించింది. శ్మశాన వాటిక ఆధునీకరణ పట్టణ నడిఒడ్డున ఉన్న శ్మశాన వాటికను ఆధునీకరించేందుకు రూ.1.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక షెడ్లు, నీటి సమస్యతో పాటు ఈ ప్రాంతం రూపురేఖలు మార్చనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అంగన్వాడీ మహిళ కమ్యూనిటీ భవనాలకు ప్రభుత్వం రూ.69 లక్షలు కేటాయించింది. పట్టణంలోని 4 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించనున్నారు. అదేవిధంగా మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీ హాలు నిర్మించనుండటం విశేషం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. శాశ్వత పరిష్కారం దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డికే పల్లి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. పట్టణ పరిధి పెరగడంతో చుట్టుపక్క గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా రూ.3.67 కోట్లతో నూతన బోరు డ్రిల్లింగ్, పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. డీకే పల్లి చెరువుతో పాటు అనిమిగానిపల్లి, తంబిగానిపల్లి, పరమసముద్రం, చీగలపల్లి, కమతమూరు గ్రామాల్లో నూతన డ్రిల్లింగ్తో పాటు ట్యాంకుల నిర్మాణంతో తాగునీటిని అందించనున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డుకు ప్రాధాన్యం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అధిక శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ఏకంగా రూ.43.5 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయనుండటం విశేషం. పట్టణంలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. తాజా పనులతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి. మున్సిపాలిటీలో కొత్తగా 8 పంచాయతీల్లోని గ్రామాలను చేర్చారు. వీటన్నింటికీ మహర్దశ రానుంది. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం పారదర్శక పాలనకు సీఎం వైఎస్ జగన్ నిదర్శనం. అభివృద్ధి విషయంలో ఆయనకు పక్కా ప్రణాళిక ఉంది. ముఖ్యంగా కుప్పం విషయంలో చూపుతున్న చొరవ ఎనలేనిది. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినా, కోట్లాది రూపాయల నిధులతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. సీఎం అడుగుజాడల్లో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – డాక్టర్ సుధీర్, చైర్మన్, కుప్పం మున్సిపాలిటీ -
Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన
కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. చిత్తూరు కలెక్టరేట్/కుప్పం: సంక్షేమ పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి రూ.2,500, దివ్యాంగుడు హనీష్కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది. గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. -
వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్ నిర్ణయం
కుప్పం రూరల్(చిత్తూరు జిల్లా): కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వానగుట్టపల్లెకు చెందిన సుమియా (33), చింపనగల్లు గ్రామానికి చెందిన రిజ్వాన్ ఏడేళ్ల క్రితం ప్రేమించి, మతాంతర వివాహం చేసుకున్నారు. భార్య పేరు సుమియాగా మార్చుకున్నాడు రిజ్వాన్. వీరి కాపురం అప్పుడప్పుడు గొడవలు, కలహాల మధ్యనే సాగింది. చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..! వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. శుక్రవారం రాత్రి.. రిజ్వాన్కు వేరే మహిళలతో అక్రమ సంబంధం కారణంగా భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన సుమియా ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సుమియా తల్లి మునెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శనివారం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటకం.. ప్రగతిపథం
కడపజిల్లాలో మెరుగైన ఆదాయం ఉమ్మడి కడప జిల్లాలో టూరిజానికి చెందిన ఐదుచోట్ల పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు నిర్వహణలో ఉన్నాయి. వీటికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 ఏప్రిల్, మే, జూన్, జూలై నాలుగు నెలలకే రూ.1.56 కోట్ల ఆదాయం లభించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత ఏడాదికి మించిన ఆదాయం రానుంది. ఇందులో ప్రధానంగా కడప హోటల్, గండికోట యూనిట్ల ద్వారా లభించనుంది. బి.కొత్తకోట: కోవిడ్ కష్టాలు, నష్టాలను అధిగమిస్తూ పర్యాటకశాఖ ఆదాయం వైపు పరుగులు తీస్తోంది. 2020 ఏప్రిల్ నుంచి 2021 ఆగస్టు వరకు టూరిజం పడకేసింది. బొటాబోటి ఆదాయంతో యూనిట్లు నెట్టుకొచ్చాయి. పలుచోట్ల కోవిడ్ ఆస్పత్రులకు భోజనం సరఫరా చేయడంతోనే సరిపోయింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి పర్యాటక పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయి. పర్యాటకుల సందర్శనలు మొదలయ్యాయి. దీనితో టూరిజం అధికారులు అప్రమత్తం అయ్యారు. కోవిడ్తో అవస్థలు పడిన ప్రజలు సేదతీరేందుకు పర్యాటక ప్రాంతాలవైపు చూడటం గమనించిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు, సురక్షిత చర్యలు చేపట్టారు. అన్ని చర్యలు తీసుకొని సందర్శకులకు భరోసా ఇవ్వడంతో పర్యాటకం పుంజుకొంది. ఫలితంగా ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దీనితో ఆదాయంలో పర్యాటక యూనిట్లు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు లక్ష ఆదాయం చూడని యూనిట్లు ఇప్పుడు లక్షల్లో ఆదాయం తెస్తున్నాయి. ఉరకలేస్తున్న చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టూరిజం యూనిట్లు ఆదాయం వైపు ఉరకలేస్తున్నాయి. టూరిజం యూనిట్లలో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ మొదటి వరసలో ఉంది. ఉమ్మడిచిత్తూరు, కడపజిల్లాలో అత్యధిక ఆదాయం దీనిదే. 2020–21లో రూ.2.36 కోట్ల ఆదాయం వస్తే..2021–22లో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2020–21లో టూరిజం యూనిట్లకు రూ.6.26 కోట్ల ఆదాయం లభించగా, తిరుపతి రవాణా విభాగం ద్వారా రూ.7.22 కోట్ల ఆదాయం సమకూరింది. 2021–22 లో యూనిట్ల ద్వారా రూ.11.58 కోట్ల ఆదాయం వస్తే, రవాణా విభాగం ద్వారా అత్యధికంగా రూ.36.19 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యాటక ఆదాయం రూ.50 కోట్లకు మించనుంది. ప్రణాళికాబద్ధంగా కృషి పర్యాటకశాఖ ఆదాయం పెంచుకునేందుకు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు టూరిజం ఎండీ కన్నబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. టూరిజం కేంద్రాల ఆధునికీకరణ, స్టార్హోటళ్ల స్థాయి సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు చేసింది. అతిథిగృహాల్లో సందర్శకులకు సౌకర్యాలను మెరుగుపర్చాం. దానికి తగ్గట్టుగా ఆదాయం పెంచుకొంటున్నాం. –మడితాటి గిరిధర్రెడ్డి, డివిజనల్ మేనేజర్, ఉమ్మడి చిత్తూరు, కడపజిల్లాలు -
పేపర్పై రాసిస్తే చాలు.. పోగొట్టుకున్న మొబైల్.. మీ ఇంటికే!
మొబైల్ మిస్సయిందా..? బస్సులో కూర్చున్న వ్యక్తి చోరీ చేశాడా..? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను చిత్తూరు పోలీసుశాఖ ట్రాక్ చేసి.. దేశంలో ఎక్కడ ఉన్నా వాటిని రూపాయి ఖర్చులేకుండా తీసుకొచ్చి బాధితులకు అందజేస్తోంది. ఇందుకోసం టెక్నికల్ అనాలసిస్ వింగ్ (టీఏడబ్ల్యూ) పేరిట ఓ ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది. సాక్షి, చిత్తూరు: ఇటీవల ఫోన్ చోరీ కేసులు పెరిగాయి. ఏదో ఒక చోట తరచూ మొబైల్ ఫోన్లు కనిపించకుండా పోతున్నాయి. పోలీస్ స్టేషన్లకు ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఈ కేసులు ఛేదించడం తొలుత పోలీసులకు పెను సవాల్గా మారింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెడుతూ మాయమైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి పట్టుబడితే వారిని పోలీసులు కటకటాలపాలు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట్ల మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకుంటారు. ఇలాంటి మొబైల్స్ ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? పోగొట్టుకున్న ఫోన్ ఎవరు వాడుతున్నారు..? అనే వివరాలను ఛేదించడానికి చిత్తూరు పోలీసు శాఖలో టీఏడబ్ల్యూ విభాగం పనిచేస్తోంది. ఇక్కడ 30 మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, బిహార్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్ను స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మొబైల్స్ రికవరీ చేయడంలో టీఏడబ్ల్యూ బృందం ఇప్పటికే పలు రివార్డులు, అవార్డులు అందుకుంది. ►గతేడాది డిసెంబరు నెలలో రూ.75 లక్షల విలువ చేసే 506 సెల్ఫోన్లను చిత్తూరు పోలీసులు పలు ప్రాంతాల నుంచి తెప్పించారు. వీటిలో కొన్ని చోరీకి గురైనవిగా నిర్ధారించి 17 మందిని అరెస్టు చేశారు. మరికొన్ని పోగొట్టుకోగా, వాటిని ఉపయోగిస్తున్న వాళ్లకు ఫోన్చేసి చిత్తూరుకు తెప్పించి బాధితులకు అందజేశారు. ►అదే ఏడాది మే నెలలో రూ.60 లక్షలు విలువ చేసే 405 సెల్ఫోన్లను చిత్తూరుకు తెప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చలామణి అవుతున్న మిస్సింగ్ మొబైల్స్ను మన పోలీసులు ఎలాంటి ఖర్చులేకుండా తీసుకొచ్చి వాటి యజమానులకు అప్పగించారు. ►2020లో రూ.40 లక్షలు విలువచేసే 277 సెల్ఫోన్లను సైతం పలు ప్రాంతాల నుంచి తెప్పించగలిగారు. ►తాజాగా రెండు రోజుల క్రితం రూ.30 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన చిత్తూరు పోలీసులు వాటిని యజమానులకు అప్పగించారు. ఇలా చేస్తే సరి.. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆలస్యం చేయకుండా బిల్లు, మొబైల్ కొన్నప్పుడు ఇచ్చిన బాక్సును తీసుకెళ్లి సమీపంలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా రసీదు ఇస్తారు. స్టేషన్కు వెళ్లలేనివాళ్లు పోలీస్ సేవా యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చు. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్ ఎక్కడుంది..? ఎవరు ఉపయోగిస్తున్నారో పోలీసులు తెలుసుకుంటారు. వాళ్లతో మాట్లాడి ఫోన్లు తెప్పించి.. బాధితులకు సమాచారం ఇచ్చి ఫోన్లను అందచేస్తున్నారు. పేపర్పై రాసిస్తే చాలు.. మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఓ పేపర్పై ఫిర్యాదు రాసి స్టేషన్లో ఇస్తేచాలు. 90 శాతం కేసుల్లో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేస్తున్నాం. మిగిలినవి తప్పక కనిపెడతాం. కొద్దిగా సమయం పడుతుంది. మీరు ఫిర్యాదు ఇవ్వకుంటే ఆ ఫోన్లతో ఏదైనా క్రైమ్ చేసినపుడు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోండి. –వై.రిషాంత్రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
మస్కట్లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..
ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా): ‘నేను ఏజెంట్ చేతిలో మోసపోయా. ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్ నుంచి సెల్ఫీ వీడియో పంపింది. తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది. చదవండి: పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్ -
22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన
కుప్పం(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ స్థలాలను గురువారం పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు. చదవండి: చంద్రబాబు 420.. లోకేశ్ 210 -
ఉధృతంగా కైగల్ జలపాతం.. అజాగ్రత్తగా ఉంటే అంతే..
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమపనేరు నియోజకవర్గంలోని కైగల్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కైగల్ నది ప్రవహించి బైరెడ్డిపల్లె మండలంలో హోరెత్తుతోంది. దీంతో పర్యాటకులు కైగల్ జలపాతాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. వరుసగా మూడేళ్లపాటు నది ప్రవహిస్తుండడంతో రాళ్లు చాలా నునుపుగా మారి పాచిపట్టాయి. అడుగు పెడితే ఎప్పుడు జారుతుందో తెలియదు. కైగల్ వాటర్ఫాల్స్లోని మృత్యుకోనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. ఇక్కడ నీరు గుండ్రంగా చుట్టుకుంటూ వెళ్లి ఓ రాతి గుహలోకి చేరుతోంది. ఇందులో పడిన వ్యక్తి ఈత వచ్చినా పైకి రావడం కష్టమే. మొన్నటిదాకా కైగల్ జలపాతంలోకి పర్యాటకులు వెళ్లకుండా బైరెడ్డిపల్లె పోలీసులు నిషేధం విధించారు. కానీ అడవిలో పలు మార్గాల నుంచి పర్యాటకులు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ జాగ్రత్తగా లేకపోతే విహారం కాస్తా విషాదంగా మారిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (క్లిక్: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే?) -
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుతపులి కలకలం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో చిరుతపులి కలకలం సృష్టించింది. పాతపేటలోని సోమేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించిన చిరుత అక్కడ కొంతసేపు సంచరించినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున ఆలయం తలుపులు తెరవడానికి వెళ్లిన పూజారికి చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన పూజారి అక్కడి నుంచి బయటకొచ్చేశారు. అదే సమయంలో చిరుత గుడిలో నుంచి గోడదూకి పారిపోయినట్లుగా పూజిరి చెప్తున్నారు. ఆలయంలో చిరుత పులి పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చదవండి: (ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి) -
సత్యప్రమాణాల దేవుడికి బ్రహ్మోత్సవాలు
దేశంలోని గణపతి క్షేత్రాల్లో కాణిపాకం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా వెలసింది. ఇక్కడ వెలసిన గణపతి సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. బాహుదా నదీతీరంలోని ఈ స్థలపురాణానికి సంబంధించి ఒక గాథ ప్రచారంలో ఉంది. బాహుదా నదీతీరాన విహారపురంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, ఇంకొకరు మూగవాడు, మరొకరు బధిరుడు. వారికి ‘కాణి’ భూమి ఉండేది. ‘కాణి’ అంటే, పావు ఎకరం. అందులోనే వాళ్లు వ్యవసాయం చేసుకునేవాళ్లు. ఒకసారి కరవు వచ్చి, ఆ భూమిలోని బావి ఎండిపోయింది. నీటికోసం ఆ బావిని మరింత లోతుగా తవ్వేందుకు ముగ్గురు అన్నదమ్ములూ పలుగు పారలు తీసుకుని, అందులోకి దిగారు. తవ్వుతూ ఉండగా, ఇసుకపొరలో రాయి అడ్డు వచ్చింది. దానిపై పలుగుపోటు పడగానే, దాని నుంచి నెత్తురు చిమ్మింది. ఆ రక్తస్పర్శతో ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలూ తొలగిపోయాయి. వారి ద్వారా సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని, బావిలోని ఇసుక తొలగించారు. అందులో వినాయక విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చారు. వారు కొట్టిన టెంకాయల నీటితో ‘కాణి’ విస్తీర్ణం ఉన్న పొలమంతా తడిసిపోయింది. ‘కాణి’ నేలలో నీరు పారినందున తమిళంలో దీనికి ‘కాణిపారకం’– (‘పారకం’ అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చింది. కాలక్రమేణా జనుల నోట ఈ పేరు కాణిపాకంగా మారింది. ఇదీ చరిత్ర కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. మొదటి కుళోత్తుంగ చోళుడు పదకొండో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో విజయనగర రాజులు దీనిని మరింతగా అభివృద్ధిపరచారు. ఈ క్షేత్రంలో చోళ, పాండ్య, గంగవంశ రాజులు వేయించిన శాసనాలు బయటపడ్డాయి. కాణిపాకం వినాయక ఆలయ ప్రాంగణంలోనే వరదరాజ, మణికంఠేశ్వర, వీరాంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వివాహం చేసుకోవడం శుభకరమని భక్తుల విశ్వాసం. ఇటీవలి కాలంలో ఇక్కడ వివాహాలు పెరుగుతున్నందున, దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏడు కళ్యాణ మండపాలను నిర్మించారు. (క్లిక్: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి!) వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకునికి ఏటా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత పన్నెండు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణరథం ఉంది. -
వెయ్యేళ్ల చరిత్ర.. 31 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవం
యాదమరి(కాణిపాకం): దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కాణిపాక దేవస్థానం ఒకటి. సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాక వినాయకుడికి పేరు. అలాంటి వరసిద్ధి వినాయకస్వామికి ఈనెల 31వ తేదీ (చవితి)నుంచి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి పన్నెండు రోజులపాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ చరిత్ర చిత్తూరు జిల్లాలో బాహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడైతే, మిగతా ఇద్దరు మూగ, చెవిటివారిగా పుట్టారు. కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు కమ్మేసింది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంత లోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు. పరుగు పరుగున గ్రామ ప్రజలు బావి వద్దకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పారకమ్ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది. విగ్రహంలోనూ ఎదుగుదల బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహంలోనూ ఎదుగుదల ఉండడం విశేషం. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 65 ఏళ్ల క్రితం బహుకరించిన వెండికవచం, 2000, 2002, 2006, 2007 సంవత్సరాల్లో భక్తులు ఇచ్చిన తొడుగులు స్వామికి ఇప్పుడు సరిపోక పోవడం విగ్రహం వృద్ధికి నిదర్శనంగా చెబుతారు. ఈ కవచాలను భక్తుల దర్శనార్థం ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించి ఉన్నారు. సత్యప్రమాణాల దేవుడిగా.. వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామి ఎదుట తప్పుడు ప్రమాణాలు చేస్తే శిక్షపడుతుందని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు ఇక్కడ ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని నమ్మకం. దీంతోపాటు రాజకీయ ప్రమాణాలు సైతం చేస్తుండడం విశేషం. అసెంబ్లీలో నాయకులు సైతం ఆరోపణలు వచ్చిన సమయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? అంటూ సవాళ్లు విసురుకోవడం గమనార్హం. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఆలయంలో విద్యుత్ లైట్లు కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ఆలయంలోని అలంకార మండపంలో దేవతా మూర్తులను అమర్చారు. ఆలయంలో అలంకార మండపంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల కటౌట్లు ఏర్పాటు చేయడానికి విద్యుత్ లైట్ల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. -
కుప్పంలో అసలు ఏం జరిగింది?.. చంద్రబాబు హై డ్రామా ఆ భయంతోనేనా..?
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నిజ స్వరూపం బయట పెట్టుకున్నారు. కుప్పంలో తెలుగుదేశం గూండాల దాడులకు అనుగుణంగా చంద్రబాబు వీరంగం ఆడారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎలా కాపురాలు చేస్తారో చూస్తానని బెదిరించారు. పార్టీ శ్రేణులను శాంతియుతంగా ఉండాలని తాను చెప్పలేనని పార్టీ నేతలు యోధుల్లా ధైర్యంగా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సహా మంత్రులను ఉద్దేశించి ఖబడ్దార్ దమ్ముంటే కుప్పం రండి తేల్చుకుందాం అంటూ తొడగొట్టారు. రాజకీయాల్లో అర్ధ శతాబ్ధిగా ఉన్న నాయకుడు ఇటువంటి నేలబారు రౌడీ భాష మాట్లాడ్డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘కుప్పంలో టీడీపీ అరాచకం.. చంద్రబాబే ప్రథమ ముద్దాయి’ కుప్పం నియోజక వర్గం తన చేజారిపోతోందేమోనన్న భయంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల్లో కుప్పం ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడంతో ఆయన తట్టుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకూ ఎదురుగాలి తప్పదని కంగారు పడుతోన్న వేళ కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించడంతో చంద్రబాబు వెన్నులో చలిమొదలైంది. ఈనేపథ్యంలోనే కుప్పంలో టీడీపీ శ్రేణుల చేత గూండాగిరీ చేయించిన చంద్రబాబు వారికి వత్తాసుగా తాను కూడా వీరంగం ఆడేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిపైనా, పోలీసులపైనా నోటికొచ్చింది అనేశారు. సీనియర్ పొలిటీషయన్ అని చెప్పుకునే చంద్రబాబు భాష చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ముఖ్యమంత్రీ ఖబడ్దార్.. ఏయ్ డీజీపీ జాగ్రత్త.. ఎస్పీ...ఏమనుకుంటున్నావ్? తమాషాగా ఉందా?. కుప్పంలో కాపురాలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. పోలీసుల కతలు రెండు నిముషాల్లో తేల్చేస్తా. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. అందరి అంతు చూస్తాం. ఇవీ నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్ర మూటకట్టురకున్న పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడి నేలబారు మాటలు. టీడీపీ కార్యకర్తలకూ కోపం వస్తుంది. ఓ స్థాయి దాటితే ఆ కోపాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. కార్యకర్తలను పిరికిగా ఉండమని చెప్పలేను ప్రతీ కార్యకర్తా ఒక యోధుడిలా తయారు కావాలి. యువత ముందుకు రావాలి. ఇవీ హుందాగా మెలగాల్సిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఈ చౌకబారు రౌడీ భాష అంతా కూడా చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గం అయిన కుప్పంలోనివే. విషయం ఏంటంటే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. మరో పక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కుప్పం నియోజక వర్గంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు నడుం బిగించింది. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్గా ప్రకటించి కుప్పం తలరాత మార్చారు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్ననే కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆ అభివృద్ధి పథకాలు పూర్తి అయితే కుప్పం ప్రజలు తనని అటకెక్కించేస్తారని కంగారు పడుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కుప్పం నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చాలా కష్టమని తేలినట్లు సమాచారం. ఆయన ఆ టెన్షన్లో ఉంటే.. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంలో భాగంగా కుప్పం నియోజక వర్గంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇక కుప్పం కూడా తనకు మిగలదన్న భయం చంద్రబాబు నాయుడికి కొద్ది రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో తరుచుగా పర్యటిస్తోన్న చంద్రబాబు బుధవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు వీధి గూండాల్లా ఊరిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డొచ్చిన వారిని చితక బాదారు. రాళ్ల దాడి చేశారు. మొత్తం మీద రచ్చ రచ్చ చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడి సమక్షంలోనే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తోంటే చంద్రబాబు నాయుడు వారించలేదు. తమాషా చూశారు. ఈ సమయంలోనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది. టీడీపీ గూండాయిజానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ పార్టీ శ్రేణుల దాడులను చూస్తూ గడిపిన చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడులు చేశారని గగ్గోలు పెట్టారు. కుప్పంలో ఎన్నడైనా రౌడీయిజం చూశామా? ఎన్నడైనా ఇలాంటి దాడులు చూశామా? అంటూ బుగ్గలు నొక్కుకుంటూ చంద్రబాబు హై డ్రామా నడిపారు. టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయి దాడులు చేస్తోంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో చంద్రబాబు కోపం అంతా పోలీసులపై పడింది. పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు చంద్రబాబు. మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? నేను తలచుకుంటే మీ ఇంటిని కొట్టలేనా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతాయని పరోక్షంగా హెచ్చరించారు. ‘మీ ఇళ్లు కూలిస్తే .. మీ కుటుంబ సభ్యులను నడి రోడ్డుపై అవమానిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ‘ అంటూ తన స్థాయి మరిచి హెచ్చరించారు. ఈ పోలీసులకన్నా బ్రిటిష్ వాళ్లే నయం అంటూ చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు కొవ్వెక్కిపోయిందన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో నేను వీధుల్లోకి వస్తా ఎవరొస్తారో చూస్తా అంటూ వీధి రౌడీలా సవాల్ చేశారు. మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఇంటికి వస్తా వేలమందిని వేసుకుని వస్తా మీ అంతు చూస్తా అంటూ బాలయ్య సినిమా టైప్ డైలాగ్ వదిలారు చంద్రబాబు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారిని పరోక్షంగా రెచ్చగొట్టారు చంద్రబాబు. ‘ మీకూ కోపం వస్తుంది. దాన్ని నేను కూడా కంట్రోల్ చేయలేను. ఆ విషయాన్ని పోలీసులు గుర్తుంచుకుంటే వారికే మంచిది అని హెచ్చరిక స్వరంతో అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రభుత్వ సలహాదారులంతా దమ్ముంటే కుప్పానికి రండి అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. అందరి అంతూ తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. అందరికీ కాలం చెల్లిందంటూ దిగజారుడు భాష ప్రయోగించారు. అసలు కుప్పంలో మీరంతా కాపురాలు ఎలా చేస్తారో నేనూ చూస్తా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలను హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తోంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్ధం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన వాడిన భాష చూస్తోంటే ఆయనకు మతి స్థిమితం తప్పలేదు కదా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. ఆయన పరుష పదజాలాన్ని చూస్తోంటే ఆయన ఎంతకైనా దిగజారగలరని అర్ధం అవుతోందని వారంటున్నారు. రౌడీయిజం చేసింది తెలుగుదేశమే. హింసాయుత ఘటనలతో బీభత్సం సృష్టించింది ఎల్లో గూండాలే. వారిని రెచ్చగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్పై దాడులు చేయించింది చంద్రబాబే. అన్నీ వారే చేసి కుప్పంలో ఏదో జరిగిపోతోందన్నట్లు హై డ్రామా ఆడుతోందీ చంద్రబాబే అంటున్నారు పాలక పక్ష నేతలు. తన స్థాయికి కానీ తన హోదాకు కానీ తగని విధంగా చిల్లరగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదంటున్నారు వారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేసి ప్రజల నుండి నిరాకరణకు గురయ్యారని అందుకే ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్వకుండా మరింత పాతాళానికి దిగజారుతున్నారని వారు దుయ్యబడుతున్నారు. చదవండి: చంపడానికి టీడీపీ గూండాలు వచ్చారు.. ప్రాణహాని ఉంది: ఎంపీపీ అశ్విని -
Pallipattu Nagaraju: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..
జీవితాన్ని కాచి వడబోసిన అనుభవం.. అడుగడుగునా కనిపించే వివక్ష నుంచి రగిలిన అగ్ని కణం.. కనుచూపు మేరలో కనిపించే అణచివేతను కూకటి వేళ్లతో పెకలించాలనే ఆక్రోశం.. పేదల పక్షాన పోరాటమై.. పీడిత జన పిడికిలై.. కవిత్వమే ఆయుధమై.. అక్షర సూరీడయ్యాడు.. నేను, నా కుటుంబం కాకుండా, మనం.. సమాజం అనుకొని ఎక్కుపెట్టిన ఆ కలం చైతన్య తూటాలను పేల్చింది.. నవ సమాజ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా అక్షర యుద్ధం చేస్తున్న పల్లిపట్టు నాగరాజును కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఇదే తొలి పురస్కారం కావడం విశేషం. తిరుపతి కల్చరల్/శాంతిపురం: నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన భూలక్ష్మి, రాఘవయ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పల్లిపట్టు నాగరాజు పాఠశాల విద్యను వెంకటాపురంలో పూర్తి చేసి, సత్యవేడు జూనియర్ కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ(స్పెషల్ తెలుగు) చదివారు. కర్నూలు ఐఏఎస్ఈ కాలేజీలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు. తిరుపతి ఎస్వీయూలో ఏంఏ తెలుగు ఉత్తీర్ణులై.. ప్రస్తుతం ఆచార్య మేడపల్లి రవికుమార్ పర్యవేక్షణలో విల్సన్ సుధాకర్ రచనలపై పీహెచ్డీ చేస్తున్నారు. 2016 జూన్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలంలోని 64.పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పటి నుంచే రచనలపై ఆసక్తి తల్లిదండ్రుల కష్టంతోపాటు చుట్టుపక్క ప్రజల జీవన శైలి నాగరాజు రచనలపై ఎనలేని ప్రభావం చూపింది. సమాజంలో సగటు మనిషి బాధలే తన బాధగా కవితలను అక్షరీకరించాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో పీడిత జనానికి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని అక్షరాలనే ఆయుధంగా మలుచుకున్నాడు. శ్రీశ్రీ, తిలక్ రచనల స్ఫూర్తితో తనదైన శైలిలో పల్లె భాషకు జీవం పోస్తూ సామాన్య పదాలతో అసామాన్య కవితలకు జీవం పోశాడు. అవ్వ చెప్పిన ఆ కథలే.. చిన్నప్పుడు అవ్వ మంగమ్మ చెప్పే జానపద కథలు, బుర్ర కథలు, దేవుళ్ల కథలు, దెయ్యాల కథలు, బూతు కథలు, నీతి కథలు, తమాషా కథలు.. నాగరాజు ఊహకు పదునుపెట్టాయి. బహుజనుల శ్రమతత్వం కవితకు ప్రేరణ కలిగించాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్న చిన్న కవితలు, పాటలకు పేరడీలు రాసేందుకు సన్నద్ధం చేశాయి. ఏదో చేయాలని.. పోరాటంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం. కొందరు తుపాకీ పడతారు, కొందరు శాంతి బాట పడతారు. ఇంకొకరు ఇంకొకటి.. ఇలా నాగరాజు ఎంచుకున్న బాట కవిత్వం. అక్షర శక్తి తెలిసిన వ్యక్తిగా పీడిత జనం పక్షాన నిలిచి అక్షర సేద్యం చేశారు. ఇలా రూపుదిద్దుకున్నదే ‘యాలైపూడ్సింది’. తొలి వచన కవితా సంపుటి 2021, జనవరి 31న కవి సంగమం ప్రచురణల ద్వారా తిరుపతిలో ఆవిష్కృతమైంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిది సామాన్య శ్రమజీవుల జీవన విధానాలను అక్షరాలుగా పేర్చి కూర్చిన తొలి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. తొలి రచనకే అనూహ్యంగా యువ పురస్కారం రావటం నా బాధ్యతను తెలియజేస్తోంది. సామాన్యుల కష్టాలు, వారి నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులే కథావస్తువులుగా రచనలు కొనసాగిస్తాం. ఇది నా తల్లిదండ్రుల శ్రమకు తగిన ఫలితం. శ్రమ జీవులు, బహుజనుల జీవితాల సంఘర్షణకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. తల్లిదండ్రులకు ఈ అవార్డును అంకితమిస్తా. – పల్లిపట్టు నాగరాజు -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం