chittoor district
-
పేపర్ కట్టు... లాభాలు పట్టు!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులకు ఆదాయం వచ్చే పంట మామిడే. మామిడి తోటల్లో కాయలకు కవర్లను కట్టే విధానం గత రెండు మూడేళ్లుగా కొందరు రైతులు అవలంభిస్తున్నారు. దీంతోపాటు కొందరు కర్ణాటకకు చెందిన రైతులు ఇక్కడి రైతుల మామిడి తోపులను లీజుకు తీసుకొని క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ విధానాలతో తోటలను సస్యరక్షణ చేసి నిమ్మకాయ సైజులో మామిడి కాయలున్న దశలోనే వాటికి పేపర్ను కట్టడం ద్వారా కాయల దిగుబడిలో నాణ్యతను పెంచుతున్నారు. ఈ పేపర్ మ్యాంగోకు మార్కెట్లో ఎక్కువ ధర పలికి మంచి లాభాలను గడిస్తున్నారు. దీన్ని గమనించిన ఇక్కడి మామిడి రైతులు సైతం తోటల్లోని కాయలకు పేపర్ను చుట్టడాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు. కవర్లతో కాయలకు రక్షణసా«ధారణంగా మామిడి కాయలు కోతకొచ్చే ముందు కాయలు నిమ్మసైజులోకి రాగానే కవర్లను కట్టుకో వాల్సి ఉంటుంది. దీంతో కాయలపై సూర్యరశ్మి పడ కుండా, ఎలాంటి క్రిమికీటకాలు సోకకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. దీంతోపాటు కాయల సైజు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా కాయ రంగు, షైనింగ్ వస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, తెగుళ్ళు, బంకపేను లాంటివి కాయపై కనిపించవు. దీంతో వీటిని ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు సైతం అధిక ధరలకు కొనేందుకు అవకాశం ఉంటుంది. వీటికి మార్కెట్లోనూ మంచి ధర పలుకుతోంది.హెక్టారుకు పది వేల కవర్లుఉద్యానవనశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. కవర్ ధర రూ.2గా ఉంది. హార్టికల్చర్ శాఖ కవర్కు రూపాయి రాయితీ ఇస్తోంది. అంటే హెక్టారుకు పదివేల కవ ర్లకు రూ. 20వేలు అయితే రైతులు సంబంధిత రైతు సేవాకేంద్రంలో రూ.10వేలను చెల్లించి రిజిస్టర్ చేయించుకొంటే దానికి ప్రభుత్వం రూ.10వేలను కలిపి హెక్టారుకు పదివేల కవర్లను ఆ రైతుకు అందిస్తుంది. ప్రస్తుతం కవర్లకోసం ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు మొదలైయ్యాయి. రైతులు ప్రైవేటుగా కావాలనుకుంటే ఇండియామార్ట్, అమెజాన్లాంటి ఆన్లైన్లోనూ పొందవచ్చు. వీటిని మ్యాంగో ప్రొటెక్షన్ గ్రోత్ పేపర్ కవర్లుగా పిలుస్తారు. కవర్లు కట్టిన రైతులకు పండగే.మామిడి సీజన్ ముగుస్తున్న దశలో మార్కెట్కు వచ్చే నీలం మామిడికి ఏటా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. జిల్లాలోని మొత్తం మామిడి సాగులో 20 శాతం మాత్రమే నీలం మామిడి సాగవుతోంది. ఇది మామిడిలో ఆఖరు సీజన్ ఫ్రూట్గా పేరుంది. ఇక్కడి రైతులు సహజ పద్ధతులతో మామిడిని సాగుచేయడమే కాకుండా కాయలకు కవర్లను కట్టడంతో సరుకు నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ అధిక ధరకు మామిడిని కొంటుండడంతో ధరలు ఆశాజనంగా మారాయి. గతేడాది నీలం రకానికి కవర్లు కట్టినందున టన్ను ధర రూ.లక్షను దాటింది.ఇక్కడి తోపులు లీజుకు పెట్టుకొని..కవర్లు్ల కట్టడం ద్వారా నాణ్యమైన సరుకును పొందే విధానంపై ఎక్కువ అవగాహన కలిగిన కర్ణాటక వ్యాపారులు, రైతులు ఇక్కడి మామిడి తోపులకు లీజుపెట్టుకుంటున్నారు. ఆపై వీరే తోపుల సస్యరక్షణ చేసి కాయలకు పేపర్లు కట్టి ఎక్కువ ధర దక్కేలా బయటి దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని గమనించిన ఉమ్మడి జిల్లా రైతులు సైతం ఈ విధానాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నారు.కొమ్మఅంటు (టాప్వర్కింగ్) కూడా..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడిì కాయలు పల్ఫ్కోసం కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తూ... గ్యారెంటీ మార్కెటింగ్ ప్రయోజనం పొందుతున్నారు. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్వర్కింగ్ జూలై, ఆగస్టునెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్దతులు ప్రత్యామ్నాయంగా మారాయి.రైతులను ప్రోత్సహిస్తున్నాంజిల్లాలోని మామిడి రైతులకు కవర్లను కట్టడంపై అవగాహన కల్పిస్తున్నాం. మామిడి సాగు చేస్తున్న రైతులకు ఏటా సమావేశాలను నిర్వహించి కవర్లను కట్టడం ద్వారా కలిగే మేలును వివరిస్తున్నాం. హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం రైతు రూ.10వేలను చెల్లిస్తే మా శాఖ రూ.10వేలను కలిపి కవర్లను అందిస్తున్నాం. అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. – మధుసూదన్రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ అధికారికాయ నాణ్యత బాగుంటుందిగిట్టుబాటు ధర లభించాలంటే మామిడి రైతులు కాయలకు పేపర్ బ్యాగులను అమర్చాలి. దీంతో కాయల నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర వస్తుంది. – నయాజ్, మామిడి వ్యాపారి, పలమనేరుటాప్వర్కింగ్తో భారీ లాభాలు...టాప్వర్కింగ్తో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఉన్న తోటల్లో కాయలకు కవర్లను కట్టడం ద్వారా సరుకు నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయి. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్ఫెన్సింగ్ను 40 కి.మీ మేర ట్రెంచ్లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్ఫెన్సింగ్ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
పెళ్లెప్పుడవుతుంది బాబూ!
కొడుకంటే మమకారం.. వంశోద్ధారకుడు కావాలన్న ఆశయం.. ఫలితం సమాజంలో తగ్గుతున్న అమ్మాయిల జననం.. దీనికితోడు గొంతెమ్మ కోర్కెలు.. సాఫ్ట్వేర్లు.. మన కనుసైగల్లో మసలుకునే వారు కావాలన్న ఆశలు.. కూతురు, అల్లుడు ఒంటరిగా ఉండాలన్న వధువు తల్లిదండ్రుల షరతులు.. వెరసి పలువురు యువకులు పెళ్లికానీ ప్రసాద్లుగా మారుతున్నారు.పలమనేరు: అబ్బాయికి ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి వందలాది సంబంధాలు చూస్తున్నారు..అయినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ఏ ళ్లు దాటిపోతోందని, అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. గతంలో అమ్మాయి తరఫువారే వరసైన వారికి పెళ్లి చేయించేలా పెద్దలు మాటిచ్చేవారు. ఇక బావా, మరదళ్లు అయితే చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. కట్నకానుకలపై పెద్దగా పట్టింపులుండేవి కాదు. కానీ రెండు దశాబ్ధాలుగా వ్యవస్థ మారిపోయింది. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు కుదరడం ఆషామాషీ కాదు. అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్ అకౌంట్లో సేవింగ్స్ ఎంత, సొంతంగా సైట్ లేదా సొంత ఇ ల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్బుక్, ఇన్స్ట్రా, ఎక్స్తోపాటు జీమెయిల్లో సెర్చింగ్ ఆధారంగా గర్ల్ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది. 5 వేల మంది పెళ్లిళ్ల పేరయ్యలు మ్యాట్రిమోనియల్ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లుతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5వేల మందికిపైగా పెళ్లిళ్ల పేరయ్య లున్నారు. వీరందరూ తమ వద్ద వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిల ఫ్రొఫైళ్లు పెట్టుకుని ఇరువర్గాలకు చూపుతున్నా పెళ్లిళ్లు మాత్రం సెట్ కావడం లేదు.కర్షకుడా..? అయితే వద్దులే! సేద్యం చేసుకునే వారికి ఆడబిడ్డ దొరకడం చాలా కష్టంగా మారింది. మరికొన్ని వృత్తి పనులు చేసేవారికి సైతం ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని ఉన్నత కులాల్లోనూ అమ్మాయిల దొరకడం కష్టంగా మారింది. ఇంకొందరికి జాతకాలు సెట్కాలేదనే కారణం కనిపిస్తోంది. గతంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లింగవివక్ష కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిల సగటు తగ్గుతోంది. నిఘా వర్గాలతో కొన్ని సంబంధాలు విఫలం తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్వేర్ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది. మూడు పదులు దాటిన పెళ్లి కాలే!గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మా ట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది.చదవండి: ‘లైవ్’ కోడి స్పెషల్!పెళ్లిళ్లు సెట్ చేయడం చాలా కష్టం గతంలో ఎన్నో పెళ్లిళ్లు సెట్ చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎన్నో షరతులు పెడుతున్నారు. గతంలో అబ్బాయి, అమ్మాయి ఫొటోలు చూసి పెళ్లికి ఒప్పుకొనేవారు. ఇప్పుడలా కాదు ఇరువర్గాలు మొత్తం విచారించుకుని, నచ్చితేనే ఓకే అంటున్నారు. నేడు పెళ్లి కుమా ర్తె డిమాండ్లను తీర్చడం ఆషామాషీ కాదు. –త్యాగరాజులు, ఎస్ఎల్వీ మ్యారేజి లింక్స్ నిర్వాహకులు, పలమనేరుఅమ్మాయిల సంఖ్య తక్కువ అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి కావాల్సిన మేరకు అ మ్మాయిలు దొరకడం లేదు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఒ ప్పుకుంటే పెళ్లి ఠక్కున జరిగేవి. ఇప్పుడలాకాదు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ఎన్నో డిమాండ్లు పెడుతోంది. అంతా సాఫ్ట్వేర్లే కావాలంటున్నారు. సేద్యం చేసుకునే వాడిని పెళ్లి చేసుకొనేవాళ్లెవరో అర్థం కాలేదు. గొంతెమ్మ కొర్కెలతో ముదిరిపోతున్నారు. – లక్ష్మీపతినాయుడు, మ్యారేజి బ్రోకర్,బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం -
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్ను తప్పించబోయి డివైడర్ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
ఇంటి పన్ను కడితేనే పింఛన్!
గుడిపాల: ఇంటి పన్నుకు, పింఛన్లకు కూటమి సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో మంగళవారం 27 పంచాయతీల్లో ఇదే తంతు నడిచింది. పైనుంచి ఆదేశాలొచ్చాయంటూ..సచివాలయాల సిబ్బంది, వీఆర్ఓలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటి పన్ను వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను చెల్లిస్తామని చెప్పిన తర్వాతే పింఛన్ సొమ్ము అందజేశారు. అయితే పన్ను చెల్లించిన వారికి ఎక్కడా కూడా రశీదులు ఇవ్వలేదు. ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదని, ఇలా బలవంతం చేయడం తగదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పింఛన్ డబ్బులిచ్చేటప్పుడే ఇంటి పన్ను వసూలు చేయండి. తర్వాత అయితే డబ్బులు లేవు అని చెబుతారు. ఇప్పుడైతే డబ్బులు లేవు అని చెప్పడానికి వారికి ఆస్కారం ఉండదు. ఇది ఇయర్ ఎండింగ్ అని చెప్పండి’ అని ఒక ప్రజాప్రతినిధి అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయమై స్పందించడానికి అధికారులెవరూ ఇష్టపడలేదు. -
కొడుకును చంపించిన తండ్రి
-
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
మహిళా ‘సూపర్’ మార్ట్
చిత్తూరు యాసలో వినిపించే ‘పుష్పా–2’ డైలాగ్....‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేసనల్’ బాగా పేలింది.చిత్తూరు జిల్లా తవణంపల్లె మహిళా మార్ట్కు కూడా ఈ డైలాగ్ను అన్వయించుకోవచ్చు.‘మా మహిళా మార్ట్ అంటే స్టేట్ అనుకుంటివా... ఇప్పుడు నేషనల్... రేపు ఇంటర్నేషనల్’ఆనాటి వై.ఎస్.జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత’ నినాదంతో పురుడు పోసుకున్న ‘మహిళా మార్ట్’లు ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదిగి పోయాయి.కార్పొరేట్ సూపర్ మార్కెట్లతో సమానంగా సత్తా చాటుతున్నాయి.తాజాగా... చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె ‘మహిళా మార్ట్’ జాతీయస్థాయిలో పురస్కారం పొందింది.చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నోవిధాల ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్లకు దీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళల ‘మహిళా మార్ట్’లు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు ‘మహిళా మార్ట్’ల పుణ్యమా అని వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు.‘ఇది మా వ్యాపారం. మా టర్నోవర్ ఇంత...’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో మండల సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే రెండో ‘చేయూత మహిళా మార్ట్ ను తవణంపల్లెలో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మండలంలోని 1,431 స్వయం సహాయక సంఘాల్లోని 14,889 మంది సభ్యుల వాటా ధనం రూ.26 లక్షలతో ‘చేయూత మహిళా మార్ట్’(ప్రస్తుతం వెలుగు మహిళ మార్ట్గా పేరు మార్చారు)ను ్రపారంభించారు.ఆర్థిక అవగాహన, పొదుపు, అప్పుల రికవరీలు, సిఐఎఫ్ చెల్లింపులు. స్త్రీనిధి, పారదర్శక నిర్వహణ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలతో తవణంపల్లె మహిళా మార్ట్ ముందంజలో ఉంది. మండల సమాఖ్య ద్వారా సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ మహిళా మార్ట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ యూసఫ్గూడలోని నేషనల్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత సర్టిఫికేట్, షీల్డు, ్రపోత్సాహక నగదు (రూ.75 వేలు) అందుకున్నారు.‘ఇది ఒకరిద్దరి విజయం కాదు. ఎంతోమంది మహిళల సామూహిక విజయం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అంటున్నారు రేఖ, అనిత.– తగీరు జగన్నాథం, సాక్షి, తవణంపల్లె, చిత్తూరు జిల్లా.పారదర్శకత... మా బలం‘అన్నీ తెలిసిన వారు లేరు. ఏమీ తెలియని వారు లేరు’ అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవరూ ఉండరు. మనకు తెలిసినదాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏదీ అసాధ్యంగా అనిపించదు. ‘మహిళా మార్ట్’ అనే బడిలో వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఏ వ్యాపారానికి అయినా పారదర్శకత అనేది ముఖ్యం. ఆ పారదర్శకత వల్లే జాతీయ గుర్తింపు వచ్చింది. మహిళా సంఘాలు ‘వెలుగు మహిళా మార్ట్’ను పారదర్శకంగా నిర్వహించడంతో జాతీయ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.– అనిత మహిళా సమాఖ్య మండల కార్యదర్శిఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందివ్యాపారంలో ఫలానా మహిళ ఉన్నత స్థాయికి చేరింది... లాంటి ఎన్నో విజయగాథలను వినేవాళ్లం. అలాంటి ఒక స్థాయికి ఏదో ఒకరోజు చేరుకోగలమా అనిపించేది. ‘మహిళా మార్ట్’ ద్వారా మమ్మల్ని గొప్ప అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ముందుకు నడిపించింది. ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అడిగే వాళ్లకు నేను చెప్పే జవాబు... ‘నేను సాధించగలను’ అనే నమ్మకం. ఆ నమ్మకానికి కష్టం, అంకితభావం తోడు కావాలి. తవణంపల్లెలోని వెలుగు మహిళా మార్ట్లో సభ్యులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డ్వాక్రా సభ్యులు మార్ట్లోని వస్తువులే కొంటున్నారు.– రేఖ మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు -
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్ఎన్పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
తిరుపతి, చిత్తూరు జిల్లాల YSRCP అధ్యక్షుడిగా భూమన బాధ్యతలు
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
9న పుంగనూరుకు వైఎస్ జగన్
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.అంజుమ్ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైఎస్ జగన్ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఇదీ చదవండి: తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు, మరో లారీ డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. టెంపో-మినీ లారీ ఢీ
సాక్షి, చిత్తూరు జిల్లా: బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద మీనీ లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ నెల 13 న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో మొగిలి ఘాట్ రోడ్డులో హైవే ప్రమాదాలు నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్స్పై వేగంగా వెళ్లడంతో ఈ రోజు మరో ప్రమాదం సంభవించింది. -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, చిత్తూరు జిల్లా: రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ షాప్పై టీడీపీ నేతలు దాడి చేశారు. షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఓబులేసుపైనా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఓబులేసుకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతల వేధింపులకు మహిళ మృతిమరో ఘటనలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మహిళ మృతిచెందింది. కుప్పం కేజీబీవీలో ఆయాగా పనిచేస్తున్న సెల్వమ్మను పనికిరావద్దని టీడీపీ నేతలు చెప్పడంతో మనస్తాపానికి గురైంది. వాటర్ సంపులో పడి ఆయా సెల్వమ్మ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతికి టీడీపీ నేతలే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో 50 కోట్ల స్కాం..
-
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
కుమ్మపల్లిలో టీడీపీ నేతల అరాచకం
-
కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాచకం
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు. -
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు -
అన్నా, ఊరికే కనిపిద్దామని..!
చిత్తూరు అర్బన్ : జిల్లాలో పుంగనూరు తప్ప మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కై వశం చేసకున్న విషయం తెలిసిందే. పుంగనూరులో టీడీపీ ఇన్చార్జ్తో కలిపి మిగిలిన ఆరు చోట్ల కూడా నాయకులు తమకు అనుకూలంగా ఉన్న సీఐలు, ఎస్ఐల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఇప్పటికే జాబితా సిద్ధం చేయగా, మరికొందరు తమకు పోలీసుశాఖలో ఉన్న పరిచయాల ఆధారంగా గతంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులు ఎక్కడున్నారో అంటూ ఆరా తీస్తున్నారు. పలమనేరు, పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లో పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఆయా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తమకు ఇక్కడ పోస్టింగ్ ఇప్పించాలని నేరుగా కోరకుండా.. పూలబొకే చేతికి అందించి ‘అన్నా, ఊరికే కనిపిద్దామని వచ్చాను’ అని చెబుతున్నారు. గతంలో తాము పనిచేసిన స్థాయిని వివరిస్తూ, అప్పట్లో చేసిన అనుకూల ఘటనలను ఉదహరిస్తున్నారు.కుప్పంలో కార్యదర్శులు..కుప్పంలో పోస్టింగుల విషయమై చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శులు పలువురి పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపతున్నట్లు సమాచారం. పూతలపట్టులో ఎమ్మెల్యే కొత్తకావడంతో ఐదు మండలాల్లోని టీడీపీ నేతల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పూర్తిగా తనకు నచ్చిన అధికారులను నియమించుకునేలా ఎమ్మెల్యే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కూడా పూర్తిగా ఎమ్మెల్యేనే నేరుగా పోలీసు అధికారుల నియామకంపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.బయటి జిల్లాల నుంచే..ఎక్కువ శాతం పోలీసు అధికారులు బయటి జిల్లాల నుంచి చిత్తూరుకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో తిరుపతి పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్న ము గ్గురు సీఐ స్థాయి అధికారులు పలమనేరు, బంగారుపాళ్యం స్టేషన్లను అడుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అటాచ్మెంట్లో ఉన్న ఓ డీఎస్పీ పలమనేరు పోస్టింగుపైనే పట్టుగా ఉన్నారని, ఇందుకు మాజీ మంత్రి సైతం పచ్చ జెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. సీఐడీ విభాగంలో డీఎస్పీ ఒకరు నగరిపై గురి పెట్టినట్లు సిబ్బందే చెప్పుకుంటున్నారు. తిరుపతి ట్రాన్స్కో సీఐ ఒకరు చిత్తూరు వెస్ట్ కావాలని, గతంలో చిత్తూరులో పనిచేసి డీటీసీలో ఉన్న సీఐకి చిత్తూరు వన్టౌన్పై హామీ లభించినట్లు సమాచారం. కర్నూ లు జిల్లాలోని లూప్లైన్లో ఉన్న మరో సీఐ పలమనేరుకు వస్తున్నట్లు సమాచారం.ఎస్బీకి తీవ్ర పోటీ..లా అండ్ ఆర్డర్ విషయం పక్కన పెడితే ఈసారి స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభాగానికి సైతం తీవ్ర డిమాండ్ నెలకొంది. ఎస్పీకి దగ్గరగా పనిచేస్తూ, ఇదే సమయంలో పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడానికి ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ స్థాయి అధికారులు కర్చీఫ్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎస్బీలో పనిచేసిన అనుభవాన్ని, సామాజికవర్గాన్ని చూపించి కొందరు నేతలను పోస్టింగులు అడుగుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే వారంలో ఎస్ఐలు, సీఐల బదిలీలు.. పది రోజుల్లో కిందిస్థాయి సిబ్బందికి స్థానచలనం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
ఏపీ వ్యాప్తంగా ఆగని టీడీపీ దాడులు
-
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
కుప్పంలో టీడీపీ గూండాయిజం
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీ బరితెగించింది. టీడీపీ నేతలు గూండాయిజంతో చెలరేగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వైస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.టీడీపీ నేతల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ పరామర్శించారు. -
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
-
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
బాబు ఇంతేకదమ్మ!
బీసీ సామాజికవర్గాన్ని చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆ సామాజిక వర్గం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమకు మొండిచెయ్యే చూపుతున్నారని రగిలిపోతున్నారు. టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కేవలం రెండు సార్లే బీసీలకు సీట్లు ఇవ్వడం చూస్తుంటే తమ సామాజికవర్గంపై బాబుకు ఎంత పగ ఉందో అర్థమవుతోందని పలువురు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బీసీలకు మారుపేరుగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారని చర్చించుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ తన కుటిల బుద్ధి చూపి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన సామాజిక వర్గానికి నాలుగు సీట్లు కట్టబెట్టి.. తమకు ఒక్క సీటూ ఇవ్వలేదని లోలోపలే రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో బాబును ఓడించి తీరుతామని పలువురు నేతలు తెగేసి చెబుతున్నారు. సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 33,59,457 మంది బీసీలు ఉన్నారు. ఇందులో బీసీ ఓటర్లే సుమారు 11 లక్షలు. ఓసీ ఓటర్లు సుమారు 8 లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్న లెక్కలు. ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గానికి టీడీపీ కానీ జనసేన, బీజేపీ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి మాత్రం ఏకంగా నాలుగు సీట్లు కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఇద్దరు బీసీ సామాజికవర్గం వారికి టికెట్లు ఇచ్చి వారి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంది. ఆ ఇద్దరిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా భరత్కృష్ణ ఒకరైతే.. పలమనేరు నియోజకవర్గానికి వెంకటేగౌడ్కి టికెట్ ఇచ్చి బీసీలను గౌరవించింది. మూడన్నర దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కుప్పం మొదటిది. అటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక్క శాతం కూడా లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కబ్జా చేశారు. గత 35 ఏళ్లుగా కుప్పంలో బీసీలకు ఎమ్మెల్యే పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు. బీసీల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుంటూ బీసీలను దగా చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 48.23 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉంటే.. అందులో 23.29 శాతం ఓట్లు వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం వారివే. టీడీపీ పుట్టినప్పటి నుంచి కేవలం వెయ్యి ఓట్లు కూడా లేని కమ్మ సామాజికవర్గం కుప్పాన్ని ఆక్రమించుకుని బీసీలను అణగదొక్కుతూ వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కుప్పంలో బీసీలకే పెద్దపీట వేస్తూ వస్తోంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్కృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీలను గౌరవించింది. సీఎంగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హైదరాబాద్, అమరావతికే పరిమితమైనా.. కుప్పంలో పెత్తనం కూడా కమ్మ సామాజిక వర్గం వారికే అప్పగించారు. టీడీపీ పురుడు పోసుకున్నప్పటి నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒకసారి శ్రీకాళహస్తి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలకు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. అంతకుమించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ బీసీలకు టికెట్లు ఇచ్చి గౌరవించిన దాఖలాలు లేనే లేవు. బాబు కులస్తులకే పెద్దపీట కుప్పం మొదలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేస్తూ వచ్చారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులను పరిశీలిస్తే.. కుప్పం అభ్యర్థిగా చంద్రబాబు, చిత్తూరు అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ (కమ్మ), నగరి నుంచి గాలి భానుప్రకాష్ (కమ్మ), వెంకటగిరి అభ్యర్థిగా లక్ష్మీసాయి ప్రియ (కమ్మ) వారిని చంద్రబాబు ప్రకటించారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, నగరి, వెంకటగిరి నియోజక వర్గాల నుంచి బీసీలు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. టీడీపీ పుట్టినప్పటి నుంచి జెండా మోస్తున్న నరసింహయాదవ్ (తిరుపతి) టికెట్ కోసం ప్రతి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నించినా చంద్రబాబు కరుణించిన దాఖలాలు లేవు. నగరి టికెట్ కోసం మొదలియార్లు, వెంకటగిరి అసెంబ్లీ కోసం చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ టికెట్ ఆశించినా చంద్రబాబు పట్టించుకోకపోగా ఆయన సామాజికవర్గం వారికే కట్టబెట్టి “కమ్మ’టి ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు బ్యాంకింగ్గా మార్చుకుంటూ పబ్బంగడుపుకుని వదిలేస్తున్న చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తీరుతామని బీసీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. -
భీరకుప్పంలో రోజా ఎన్నికల ప్రచారం
-
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా..
సాక్షి, చిత్తూరు/నెల్లూరు: మేమంతాసిద్ధం 8వ రోజు గురువారం (ఏప్రిల్ 4) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేటలో నుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. ఇదీ చదవండి: చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్ -
ఉమ్మడి చిత్తూరు జిల్లా: ఏప్రిల్ 2, 3 తేదీల్లో బస్సు యాత్ర
సాక్షి, తిరుపతి: ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. గతంలో సిద్దం సభలు విజయవంతంగా జరిగాయన్నారు. ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, నంద్యాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. మార్చి 30 గుత్తిలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏప్రిల్ 1న కదిరిలో ఇఫ్టార్ విందు, ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాలో ‘మేము సిద్దం’ సభలు నిర్వహిస్తామన్నారు. సభలు విజయవంతం చేసేందుకు అన్ని నియోజక వర్గాలు నాయకులు, కార్యకర్తలు సిద్దం గా ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
YSRCP చిత్తూరు జిల్లా అభ్యర్థులు వీళ్లే
చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్పోర్ట్ టౌన్కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట. చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..! -
చిత్తూరు జిల్లాలో కుప్పంను ముద్దాడిన కృష్ణాజలాలు
-
మహానేతపై తరగని అభిమానం
బంగారుపాళెం(చిత్తూరు జిల్లా): దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డిపై ప్రజాభిమానం తరగలేదు. బంగారుపాళెం మండలంలోని తగ్గువారిపల్లెకు చెందిన జిల్లా వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రఘుపతిరాజు వైఎస్సార్ వీరాభిమాని. చనిపోయిన తన తల్లిదండ్రుల చిత్ర పటాలతో పాటు తాను అమితంగా అభిమానించే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటం ముందు సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త బట్టలు పెట్టి పూజలు నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు. బంధువులు, స్నేహితులను పిలిచి మధ్యాహ్నం అన్నదానం చేశారు. రాజశేఖర్రెడ్డి మృతి చెందినప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎందరో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. -
జల్లికట్టు.. గిత్తను పట్టు
చంద్రగిరి/గుడివాడ టౌన్: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు. ముగిసిన బండలాగుడు పోటీలు కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు. -
వద్దు బాబూ..మీకో దండం!
సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చిత్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు. గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్కు అంజనం వేసినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. సర్వేలో బహిర్గతమైన ఓటమి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు. కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. మాజీ మంత్రికి ఓటమి భయం పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్ వైఎస్సార్సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్నాథ్రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్ ఇప్పించేందుకు బాబు స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల కోసం అన్వేషణ గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు. చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. తిరుపతిలో పలాయనమే.. తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. వెంకటగిరిలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్బోర్డు చైర్మెన్ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పేరు వినిపిస్తున్నా, ఆయన గతంలో వైఎస్సార్సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
జొన్న కురుకుల గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం
-
చిత్తూరు జిల్లా: దళితులపై టీడీపీ వర్గాల దాడి
గంగవరం(చిత్తూరు జిల్లా): దళితులపై టీడీపీకి చెందిన అగ్రవర్ణాలవారు దాడులకు పాల్పడిన ఘటనలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం మీడియా ఎదుట బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ మబ్బువారిపేట దళితవాడలో దాదాపు 30 ఇళ్లలో ప్రజలు నివాసం ఉంటున్నారు. వీళ్లందరికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ అంటే అమితమైన అభిమానం.దీన్ని జీర్ణించుకోలేని ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన అగ్ర కులస్థులు నిత్యం కులం పేరుతో దూషించడం, అవమానించడం వంటివి పరిపాటిగా సాగిస్తున్నారు. బుధవారం రాత్రి వారు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటుండగా.. టీడీపీకి చెందిన అల్లరిమూకలు దుర్గ, గోవర్ధన్, రాకేష్ మరి కొంతమంది అనుచరులతో వెళ్లి అక్కడ గొడవలు సృష్టించారు. ఇంతలో రవి అనే వ్యక్తి అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అందరూ కలిసి అతనిపై పైశాచికంగా దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళల పైనా దాడులకు పాల్పడి కులం పేరుతో దూషించినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు దళితులపై దాడి విషయాన్ని ఎమ్మెల్యే వెంకటేగౌడ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇదీ చదవండి: మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం -
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
-
పలమనేరులో మిన్నంటిన సాధికార నినాదం
సాక్షి, చిత్తూరు/పలమనేరు: సాధికార నినాదంతో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మార్మోగింది. నియోజకవర్గంలోని పలమనేరు, పెద్దపంజాణి, వీకోట, బైరెడ్డిపల్లి మండలాల నుంచి భారీగా తరలి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలతో శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఘనంగా జరిగింది. యాత్రలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు తొలుత గంగవరం వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిం చారు. ఆనంతరం భారీ జనసందోహం మధ్య యాత్ర బయల్దేరింది. ఈ యాత్రకు అడుగగడునా ప్రజలు నీరాజనాలు పలికారు. జై జగన్ అని నినదిస్తూ పూలు జల్లుతూ యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం అశేష జన సందోహం మధ్య సామాజిక సాధికార సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జగనే కావాలి అంటూ ప్రజలు నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సన్నగా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా సభను విజయవంతం చేశారు. జగనన్నతోనే సామాజిక న్యాయం: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. సామాజిక న్యాయమంటే ఏమిటో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దారని, అందరికీ సొంతింటి కలను నిజం చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. రాజకీయ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారన్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నింటిలోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. సీఎం జగన్ చలవతో నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారని అన్నారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. సీఎం జగన్ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 అభివృద్ధి నిరోధక శక్తులని పేద పిల్లల చదువుల కోసం ట్యాబ్లిస్తే వాటి కారణంగా ఎంతో నష్టమంటూ రామోజీరావు తప్పుడు కథనం రాశారని, ఆయన మనవడు మాత్రం ట్యాబ్లు వాడొచ్చా అని ప్రశ్నించారు. రూ.700 కోట్లతో పలాసలో ఫిల్టర్ నీళి్చచ్చి, కిడ్నీ ఆస్పత్రిని కట్టినా ఎల్లోమీడియా కడుపు మంటతో తప్పుడు రాతలు రాసిందన్నారు. ప్రతిపక్షానికి బాధగా ఉంది: మంత్రి జయరామ్ బీసీలకు పెద్దపీట వేసింది సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. మన బిడ్డలు బాగా చదివి బాగుపడుతుంటే ప్రతిపక్షానికి చాలా బాధగా ఉందని అన్నారు. వాల్మీకి కులస్థుడైన తన తలరాతను మార్చింది కేవలం జగనన్నే అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరగాలంటే జగనన్న రావాల్సిందే మాజీమంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నాఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనారిటీ అని చెప్పే వ్యక్తి సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పనులు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ ఇంటి ముందుకెళ్లి నిలబడాలని, అదే వైఎస్ జగన్ ప్రభుత్వంలో పథకాలే ఇంటి ముందుకొస్తున్నాయని తెలిపారు. పక్క రాష్ట్రంలో 8 చోట్ల పోటీ చేసినా డిపాజిట్లు దక్కని దత్తపుత్రుడు ఇక్కడకొచ్చి తాటతీస్తా.. తొక్కతీస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరో శ్రీలంక అని విషప్రచారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు పలమనేరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధికి రూ.2,200 కోట్లు ఖర్చు చేశారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు భరత్, రమేష్ యాదవ్, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు గోపాలపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర దేవరపల్లి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు, వారిని సామాజిక సాధికారత వైపు నడిపించిన వైనాన్ని వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఆదివారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది. -
శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు
సాక్షి, తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్చినట్లు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. డిసెంబరు 16వ తేదీ నుంచి తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపింది. దేశ విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ నుంచి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేయనున్నారు. ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలన్నారు. చదవండి: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల చెక్ అందించిన సీఎం జగన్ -
ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
'Michaung' Cyclone: దిశమార్చుకున్న మిచౌంగ్.. తీవ్ర తుపానుగా..
cyclone michaung Live Updates.. ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్ ప్రచండ గాలులతో విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ తీరం దాటిన తర్వాత కూడా కొనసాగనున్న తుపాను ప్రభావం తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పలువురు.. సహాయక చర్యలందించేందుకు రెడీ చెన్నై-నెల్లూరు రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను బీభత్సం సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదనీరు తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు బారికేడ్లతో జాతీయ రహదారి మూసివేత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచన మిచౌంగ్ ఒంగోలు హెల్ప్లైన్ నెంబర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో హెల్ప్ లైన్ 1. 9949796033 2. 8555931920 3. 9000443065 4. 7661834294 5. 8555871450 ఎలాంటి సమస్య వున్నా హెల్ప్.లైన్.నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పిలుపు చెన్నై నగరంలో వర్ష బీభత్సం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం నగరంలో ఎటు చూసినా నీరే. నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తుపాను తీవ్రతకు సరిపోలేదని వ్యాఖ్య తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందన్న తమిళనాడు మంత్రి ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించినట్లు వెల్లడి చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి కాళంగి నది ఉధృతి ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల తిరుపతిలో స్కూళ్లకు సెలవు మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ధాన్యం నష్టపోకుండా.. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ ) తుపాన్ ఎఫెక్ట్తో గన్నవరం నుంచి విమానాలు రద్దు ముంచుకొస్తున్న ముప్పు అల్లకల్లోలంగా సముద్రం రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్ నెల్లూరు 120 కి.మీ. దూరంలో! రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం కుంభవృష్టి వర్షాలతో ఆక్మసిక వరదలు తప్పవని హెచ్చరిక తీవ్ర తుపాను నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు తీవ్రతుపాన్గా మారిన మిచౌంగ్ అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు అనకాపల్లి : 08924 - 221698 తుని : 08854 – 252172 సామర్లకోట : 08842 - 327010 రాజమండ్రి : 08832 – 420541 తాడేపల్లిగూడెం : 08818 – 226162 ఏలూరు : 08812 – 232267 భీమవరం టౌన్ : 08816 – 230098; 7815909402 విజయవాడ : 08862 – 571244 తెనాలి : 08644 – 227600 బాపట్ల : 08643 – 222178 ఒంగోలు : 08592 – 280306 నెల్లూరు : 08612 – 345863 గూడూరు : 08624 – 250795; 7815909300 కాకినాడ టౌన్ : 08842 – 374227 గుంటూరు : 9701379072 రేపల్లె : 7093998699 కర్నూల్ సిటీ : 8518220110 తిరుపతి : 7815915571 రేణిగుంట : 9493548008 కమర్షియల్ కంట్రోల్ రూమ్స్ సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112 హైదరాబాద్ : 9676904334 కాచిగూడ : 040 – 27784453 ఖాజీపేట్ : 0870 – 2576430 ఖమ్మం : 7815955306 దిశమార్చుకున్న మిచౌంగ్ హఠాత్తుగా దిశ మార్చుకున్న మిచౌంగ్ తుపాను ప్రస్తుతం నెల్లూరు సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం ఇప్పటికే జలదిగ్బంధంలో సూళ్లూరుపేట రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం.. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కలువాయి, నెల్లూరులో ఈదురు గాలుల బీభత్సం ఇవాళ అర్ధరాత్రి లోపు నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశం మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు బాపట్లలో హైఅలర్ట్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో బాపట్ల చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు 14 పునరావస కేంద్రాలకు 800 మందిని తరలించిన అధికారులు మండలానికి ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీములు ఏర్పాటు 350 మంది గజ ఈతగాళ్ళను సిద్దం చేసిన అధికారులు 43 తుఫాను పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండో చోట్లా బస్సుయాత్ర వాయిదా మిచౌంగ్ ఎఫెక్ట్తో డిసెంబర్ 5వ తేదీ రెండు చోట్ల వైఎస్సార్సీపీ బస్సు యాత్ర వాయిదా రేపు చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన యాత్ర భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాయిదా అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా కొనసాగనున్న యాత్ర వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం తెలంగాణపైనా మిచౌంగ్ ఎఫెక్ట్ ఏపీతో పాటు తెలంగాణ పైనా మిచౌంగ్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు.. హాస్టల్ విద్యార్థులు బయటకు రావొద్దని హెచ్చరికలు సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు 1077, 9063211298 ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ తీవ్రతుపానుగా మారిన మిచౌంగ్ తీరప్రాంత గ్రామాల్లో పెరిగిన గాలుల తీవ్రత , వర్షం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఎదురుమొండి దీవుల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఏటిమొగ గ్రామంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం రాబోయే రెండు రోజుల్లో.. చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తరుముకొస్తున్న మిచౌంగ్ అధికార యంత్రాగం అప్రమత్తం తిరుపతిలో.. రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు.. వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం.. రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేసిన అధికారులు.. మిచౌంగ్తో.. నాలుగు రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను కారణంగా 4 రైళ్లు పూర్తిగా రద్దు 3 రైళ్లు పాక్షికంగా రద్దు తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం బాపట్ల – కాటమనేని భాస్కర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి తూర్పుగోదావరి – వివేక్ యాదవ్ కాకినాడ – యువరాజ్ ప్రకాశం – ప్రద్యుమ్న నెల్లూరు – హరికిరణ్ తిరుపతి – జె.శ్యామలరావు వెస్ట్గోదావరి – కన్నబాబు చెరువును తలపిస్తున్న చెన్నై విమానాశ్రయం చెన్నై విమానాశ్రయంలోకి భారీగా చేరిన వరద నీరు. వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 వర్షపు నీటిలో మునిగిపోయిన వాహనాలు.. #ChennaiRains Hi Chennai! The same old chennai with not a single improvement. This is happening every year & still no one cares about it. All they need is big apartments & for that they cut down the trees, demolish the lakes. Hence, the suffering!!!#CycloneMichuang #CycloneAlert pic.twitter.com/L0yo94nwBD — Bala Harish (@balaharish25) December 4, 2023 నీట మునిగిన పలు కాలనీలు.. It's Aishwarya Nagar, Madambakkam, Chennai-126 (@TambaramCorpor ) It's a scary day... Seems like ocean. #ChennaiFloods #Chennai #ChennaiCorporation #chennairains pic.twitter.com/rBgvF6CQig — CommonHuman (@voiceout_m) December 4, 2023 ఈదురు గాలులతో భారీ వర్షం.. location: sholinganallur wipro. #ChennaiRains #ChennaiFloods pic.twitter.com/GMuHc9NqS6 — ワル.🍭🍿 (@itz_shivvvuuu) December 4, 2023 పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు.. Despite this much rain TNEB power is still going. So that I can use Twitter. Hats off to vidiyal arasu. #ChennaiRains #Guduvacheri pic.twitter.com/hcyTrj26Kr — Kabilan Shan (@ksrsk92_) December 3, 2023 கடவுளை கொஞ்சம் கருணை காட்டு பா.... தண்ணி ஏறிக்கிட்டே வருது... 😰😰😰#ChennaiRains #CycloneMichaung https://t.co/d0D3HjnqiU pic.twitter.com/7wTG4zr8xy — Ravi (@ajuravi) December 4, 2023 SAD!!!!!Next to Apollo hospitals at Teynampet be safe #chennairains #chennairains #ChennaiRains #ChennaiFloods #ChennaiFloods #DunkiTrailer #DunkiDrop4 #Yash19DAMNNN@Portalcoin#CycloneMichuang pic.twitter.com/GrkHTzLwtS — Jussu ❤️ Memecoin | jitu123sahani.bnb (@Jussu26237885) December 4, 2023 తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ వీడియో కాన్పరెన్స్లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్గా ఉండాల్సిన అనుభవం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి కృష్ణాజిల్లా: మిచౌంగ్ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి రైతులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడల రేవు సముద్రతీరంలో ఎగసి పడుతున్న అలలు 8 మీటర్ల మేర కోతకు గురైన సముద్రతీరం అధికారిక యంత్రాంగం అప్రమత్తం నక్కపల్లి నుండి వేటకు వచ్చిన 30 మంది మత్స్యకారులను నక్కా రామేశ్వరం తుఫాన్ పునారావాస కేంద్రానికి తరలింపు... మిచౌంగ్ ప్రభావంతో ఐదు జిల్లాలకు అలర్ట్.. మచిలీపట్నం చేరుకున్న 25 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అవనిగడ్డ చేరుకున్న 37 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తణుకులో మంత్రి కారుమూరి పర్యవేక్షణ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన కారుమూరి మిచౌంగ్ తుపాన్కు రైతులు ఎవరూ అదైర్యపడవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని మీకు అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలి ఆప్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించాం. ఏ మిల్లర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తుపాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించాము. ఏ ఒక్క రైతు నష్టపోకుండా మనమే చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం.. తుపాన్ ఎఫెక్ట్తో పలు విమానాలు రద్దు.. ఐదు విమానాలను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన తమిళనాడు అతలాకుతలం.. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours#ChennaiRains #CycloneMichaung pic.twitter.com/QNu8LPNkqL — Memer Aspirant (@MemerAspirant) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid heavy rainfall in Chennai city, severe water logging witnessed in several areas of the city. (Visuals from the Pazhaverkadu Beach area) pic.twitter.com/dQpvK0e5VA — ANI (@ANI) December 4, 2023 పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Tamil Nadu: As cyclone 'Michaung' approaches Chennai coast, accompanied by heavy rainfall, several trains are delayed and a few have been cancelled. (Visuals from Egmore Railway Station) pic.twitter.com/5SfV1Xr81L — ANI (@ANI) December 4, 2023 Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours #ChennaiRains @Portalcoin #CycloneMichaung pic.twitter.com/fMUerahj2v — M.N.K (@Nithin1833) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షం, కూలిన చెట్లు.. #WATCH | Tamil Nadu: Amid heavy rainfall, trees uprooted near the Ambattur area, Chennai. pic.twitter.com/XU2Tihh9PO — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 కాకినాడలో అప్రమత్తం.. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణ పరిస్ధితులు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానలు తుపాన్ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు వేటను నిలిపివేసిన మత్స్యకారులు భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచన ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం. యుద్ద ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా 16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు ఉప్పాడ జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు. హోప్ ఐలాండ్ మత్స్యకారుల తరలింపు. తుపాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. కలెక్టరేట్.. 18004253077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం 9701579666 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం 9949393805 నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు నేడు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా నేడు, రేపు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు. తుపాను ఎఫెక్ట్ నేడు పలు రైళ్లు రద్దు.. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు. Cancellation of Trains pic.twitter.com/JpRBLoj5Cx — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Cancellation of Trains pic.twitter.com/JtoUYobINh — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Diversion/Restoration of Trains pic.twitter.com/EgdyrWLBX7 — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు.. రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీరు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. #WATCH | Tamil Nadu | Heavy rainfall in Chennai causes massive waterlogging in parts of the city. Visuals from Vadapalani area of the city. pic.twitter.com/nBNE5oDW25 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Several parts of Chennai receive heavy rainfall as cyclone 'Michaung' approaches the coast. pic.twitter.com/SXeeGaCaH0 — ANI (@ANI) December 4, 2023 మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాన్ రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్ దీని ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం తీరం వెంబడి గంటకు 80 -100 కి.మీ సాయంత్రం నుంచి గంటకు 90-110 కి.మీల వేగంతో గాలులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. #ChennaiRains to continue till noon #ChennaiRain#CycloneMichaung is 110 kms E-NE of #Chennai as it slowly moves North closer to the coasts of North Tamil Nadu & South Andhra Pradesh. North TN will see heavy rains till noon. Coastal AP will see heavy rains post late noon with… pic.twitter.com/N3IggzlHz6 — Karnataka Weather (@Bnglrweatherman) December 4, 2023 విజయవాడ: దక్షిణమధ్య రైల్వే హెల్ప్ డెస్క్.. మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు ఒంగోలు - 08592-280306 కాకినాడ టౌన్ - 0884-2374227 తెనాలి - 08644-227600 గూడూరు - 08624-250795; 7815909300 నెల్లూరు - 0861-2345863 ఏలూరు - 08812-232267 బాపట్ల - 08643-222178 భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402 సామర్లకోట - 0884-2327010 గుడివాడ - 08674-242454 విజయవాడ - 0866-2571244 తుని - 0885-4252172 రాజమండ్రి - 0883-2420541. విశాఖ, అనకాపల్లిలో సెలవు.. ►మిచౌంగ్ తుపాన్ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. -
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
అన్ని రంగాల్లో సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్
-
నిరసనల పేరుతో టీడీపీ నేతల సంబరాలు!
కుప్పం(చిత్తూరు జిల్లా): చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ నేతలు నిరసనల పేరిట చేపట్టిన కార్యక్రమాలు.. సంబరాల్నే మించిపోతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో అమ్మవారి జాతరలో సంబరాలు జరుపుకొంటారు. మారెమ్మ, గంగమ్మ వేషధారణలతో వేపాకు చేతపట్టి.. అమ్మవారి రికార్డింగ్ పాటలతో డ్యాన్స్లు వేసి భక్తులను అలరింపజేస్తారు.అదే తరహాలో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా కుప్పంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న శిబిరం వద్ద.. తెలుగు మహిళలు వేపాకు చేతబట్టి.. అమ్మవారి వేషధారణలో రికార్డు డ్యాన్స్లతో మురిపింపజేశారు. అటువైపు వెళుతున్న బాటసారులు ఆసక్తిగా వారి డ్యాన్సులను తిలకిస్తూ ముచ్చటపడ్డారు. స్థానికులు మాత్రం ఇదంతా నిరసన చేసినట్టు లేదని, సంబరాలు, విందు భోజనాలు చేస్తున్నట్టుందంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. చదవండి: స్కిల్ కార్పొరేషన్కు, టీడీపీకి ఒకరే ఆడిటర్ -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
చిక్కిన మదపుటేనుగు..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గుడిపాలలో భయోత్పాతం సృష్టించిన ఒంటరి మదపుటేనుగు ఎట్టకేలకు అధికారులకు చిక్కింది. తమిళనాడు అటవీ ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి వచ్చిన ఏనుగుల గుంపులో ఓ ఏనుగు తప్పిపోయి.. బుధవారం చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో వెంకటేశులు, సెల్వి అనే భార్యభర్తలను తొక్కి చంపిన ఏనుగు, కార్తిక్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచింది. బుధవారం రాత్రి గుడిపాలలో అటవీప్రాంతాల్లోకి వెళ్లిపోయిన ఏనుగు తమిళనాడు రాష్ట్రంలోకి వెళ్లిపోయింది. గురువారం తెల్లవారుజామున తమిళనాడు రాష్ట్రం పెరియ బోడినత్తం గ్రామంలోకి వెళ్లిపోయి అక్కడ వసంత (54) అనే మహిళను తొండంతో ఎత్తి కిందకేసి కాలితో తొక్కి చంపేసింది. ఒంటరి ఏనుగు బీభత్సంలో ఓ మేక కూడా చనిపోయింది. అక్కడి నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చేరుకుంది. ఒంటరి ఏనుగు 197–రామాపురం గ్రామంలోకి రావడంతో మళ్లీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు జాడ గుర్తించిన అటవీశాఖ అధికారులు అప్పటికే కుమ్కీ ఏనుగులతో సిద్ధంగా ఉంటూ మదపుటేనుగును వెంబడించి డప్పులు కొడుతూ, టపాకాయలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తిరుపతి జూ పార్కు నుంచి వచ్చిన వైద్యుల సాయంతో మదపుటేనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది కిందపడిపోయింది. తాళ్ల సాయంతో ఏనుగును బంధించి తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఈ మొత్తం ఆపరేషన్లో చిత్తూరు అటవీశాఖ అధికారి చైతన్యకుమార్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఏనుగు దాడిలో మృతిచెందిన దంపతులకు అంత్యక్రియలు నిర్వహించగా, ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. -
చిత్తూరు: ఏనుగు బీభత్సం.. భార్యభర్తల మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: గుడిపాల మండలం ‘190 రామాపురం’లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడి చేయడంతో ఇద్దరు మృతిచెందారు. మృతులను రామాపురం హరిజనవాడకు చెందిన దంపతులు వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. భార్యభర్తలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగులు వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పంలో సమీపంలో కూడా అడవి ఏనుగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: హైదరాబాద్లో ‘కంత్రీ’ బాబా.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి.. -
మాటిచ్చారు.. నెరవేర్చారు
నగరి: చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణంలో నగరి డిగ్రీ కళాశాల హెలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.షణ్మోహన్కు ఆదేశాలిచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు యంత్రాంగం గంటల వ్యవధిలోనే ఆయా సమస్యలను పరిష్కరించింది. మానవత్వంతో ఆదుకున్నారు నగరి మండలం మిట్టపాలెంకు చెందిన ఎ.నాగరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన కిడ్నీలు పని చేయడం లేదని.. డయాలసిస్ చేయించుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన ముస్లిం మహిళ తన ఆరేళ్ల కుమారుడు రెహమాన్తో సీఎం జగన్ను కలిసింది. తన కుమారుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని.. వైద్యం కోసం ఖర్చయిన బిల్లులను మంజూరు చేయాలని వేడుకుంది. కార్వేటినగరం గొల్లకండ్రిగకు చెందిన చందు అనే బాలిక తన తండ్రితో వచ్చి సీఎం జగన్ను కలిసింది. తాను బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానని.. వైద్యం కోసం వెచ్చించిన బిల్లులను మంజూరు వేడుకుంది. శ్రీకాళహస్తి మండలం తూకివాకం గ్రామానికి చెందిన ఐశ్వర్య సీఎం వైఎస్ జగన్ను కలిసి తన ఇద్దరు బిడ్డల ఆరోగ్య సమస్యను వివరించి ఆదుకోవాలని కోరింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించాలని.. వైద్య ఖర్చుల కోసం వెచ్చించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. తక్షణం స్పందించిన కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఎ.నాగరాజుకు రూ.లక్ష, రెహమాన్కు రూ.లక్ష, ఎం.చందుకు రూ.50 వేలు, ఐశ్వర్యకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం విజయపురం మండలం పన్నూరుకు చెందిన కె.షణ్ముగం, నగరి మండలం నెత్తం కండ్రిగకు చెందిన గజేంద్ర, మత్తయ్య అనే దివ్యాంగులతోపాటు ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు హరిజనవాడకు చెందిన ఎన్.సుమిత్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. స్వయం ఉపాధి నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో షణ్ముగంకు రూ.లక్ష, ఎం.గజేంద్ర రూ.50 వేలు, జి.మత్తయ్య రూ.50 వేలు, ఎన్.సుమిత్ర రూ.లక్ష చొప్పున చెక్కు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు. -
పుంగనూరు అల్లర్లు.. బయటపడ్డ చంద్రబాబు కుట్ర
సాక్షి, చిత్తూరు జిల్లా: పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు కుట్ర బయటపడింది. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఎదుట చల్లా బాబు అనుచరులు నరీన్కుమార్, దూవల అమర్నాథ్, పెద్దన్న సుబ్రహ్మణ్యం నేరం ఒప్పుకున్నారు ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్కో స్కెచ్ వేసింది. పుంగనూరు హైవేపై చంద్రబాబు మీటింగ్ ఉంటే పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం వేశారు. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో రెచ్చిపోవాలని ప్లాన్ చేశారు. అల్లర్లపై పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు వచ్చాయి. అంగళ్లు, పుంగనూరులో గొడవల పథకాన్ని వాంగ్మూలంలో చల్లా బాబు అనుచరులు స్పష్టంగా చెప్పారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ -
పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు
పుంగనూరు (చిత్తూరు జిల్లా): పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు -
ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు: మధుసూదన్రెడ్డి
-
పథకం ప్రకారమే పోలీసులపై దాడి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): చంద్రబాబు పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై దాడిచేసి గాయపరచి, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.శ్రీలక్ష్మి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె పుంగనూరులో పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ అశోక్కుమార్తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో రూట్మ్యాప్ను కాదని పుంగనూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను నివారించినందుకే రాళ్లు, మద్యం బాటిళ్లు, కర్రలతో దాడి చేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతం చేసి, సీసీ çఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు చేసిన వారిలో 62 మందిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలిస్తున్నామన్నారు. పోలీసులను రెచ్చగొట్టి.. తద్వారా కాల్పులు జరిగేలా చేయాలన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం అని తేలిందన్నారు. అవసరమనిపిస్తే పోలీసులను చంపాలని, ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరిపితే టీడీపీ వారు చనిపోతే తద్వారా ఇమేజ్ పొందేలా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2న రొంపిచెర్లలో వ్యూహ రచన చేశారన్నారు. ఆయన పీఏ గోవర్దన్రెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయం వెల్లడైందన్నారు. దీంతో ప్రస్తుతం చల్లా రామచంద్రారెడ్డిని ఏ–1 నిందితునిగా కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడన్నారు. -
‘మరణ’హోమమే లక్ష్యం! కనీసం ఇద్దరు పోలీసులనైనా..?
చిత్తూరు అర్బన్: టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు శనివారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మారణహోమమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం ఇద్దరు పోలీసులను చంపాలని దుర్మార్గపు ఆలోచనలు చేశారు. బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ మొత్తం రూపొందించారు. పుంగనూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఈనెల 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణహోమ వ్యూహాన్ని రచించారు. అతని వ్యక్తిగత కార్యదర్శి గోవర్దన్రెడ్డిని పోలీసులు విచారించగా, పూసగుచ్చినట్లు విషయం అంతా వివరించాడని తెలిసింది. ఇది విన్న పోలీసులు షాక్కు గురవ్వడంతోపాటు, ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీడీపీ నేతలు రూపొందించిన వ్యూహాలు ఇలా ఉన్నాయి. ప్లాన్–ఎ: పోలీసు కాల్పులు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజు రోజుకు జనాదరణ పెరిగిపోయి హీరో అయిపోతున్నాడని చల్లా బాబు తరచూ పార్టీ నేతల వద్ద అక్కసు వెళ్లగక్కేవారు. ఇదే పుంగనూరులో పెద్దిరెడ్డిని జీరో చేయాలని, అదే సమయంలో రాష్ట్రం మొత్తం పుంగనూరు వైపు చూసేలా మారణహోమం జరగాలని సంకల్పించారు. ఈ మేరకు విషయాన్ని పార్టీ పెద్దకు చేరవేసి, ఆయన ఆశీర్వాదం పొందారని తెలిసింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు బైపాస్ రోడ్డు వద్దకు వచ్చినప్పుడు.. పుంగనూరు పట్టణంలోకి రావాలని పార్టీ శ్రేణులు పట్టుపట్టాలని, పోలీసులు దీనికి అంగీకరించరని నిశ్చయించుకున్నారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును పోలీసులే లక్ష్యంగా విసిరేలా కొందరికి బాధ్యత అప్పగించారు. ఇందులో భాగంగా మొత్తం 30 నిమిషాల పాటు దాడి కొనసాగించేందుకు సరిపడా రాళ్లు, ఇతర వస్తువులను పరిసర ప్రాంతాల్లో ఉంచారు. తొలి మూడు నిమిషాల్లో చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరితే పోలీసులు తేలిగ్గా తీసుకుంటారని, ఇదే అదునుగా పోలీసుల ఊహకు అందని విధంగా రాళ్లు, టపాసు బాంబులు, మద్యం బాటిళ్లతో పది నిముషాలు దాడులు చేయాలని, ఇందులో ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్లేదనే వ్యూహానికి పదునుపెట్టారు. ఇదే కనుక జరిగితే వెంటనే పోలీసులు కాల్పులు ఓపెన్ చేస్తారని, ఈ కాల్పుల్లో కనీసం 30 మంది వరకు టీడీపీ శ్రేణులు మరణిస్తారు.. అప్పుడు దేశం మొత్తం పుంగనూరు వైపు చూస్తుంది.. రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతుంది.. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల ద్వారా ఆందోళనలతో ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని భారీ కుట్ర పన్నారు. తర్వాత జరిగే ఎన్నికల్లో సానుభూతి వల్ల టీడీపీ ఆటోమేటిక్గా గద్దెనెక్కడం ఖాయం అని భావించారు. ప్లాన్–బీ: అల్లకల్లోలం సృష్టించడం ఏ కారణాల వల్లయినా ప్లాన్–ఏ అమలుకాని పక్షంలో టీడీపీ నేతలు ప్లాన్–బీ కూడా రూపొందించుకున్నారు. పోలీసులు చనిపోకపోయినా, వాళ్లు ఫైర్ ఓపెన్ చేయకపోయినా ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా పుంగనూరు పట్టణంలోకి చొరబడి ఎక్కడికక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్లెక్సీలు చింపడం, పెట్రోలు పోసి నిప్పంటించడం చేయాలి. వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిస్పందిస్తాయి. దీంతో చెలరేగే అల్లర్లలో వైఎస్సార్సీపీ శ్రేణులను ఒకరిద్దరిని మట్టుబెడితే.. వాళ్లు చేసే దాడుల్లో ఆస్తుల విధ్వంసంతో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలూ చనిపోతారు. దీనికంతటికీ కారణం ప్రభుత్వంపై నెట్టేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలి. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రాష్ట్రం మొత్తం ఈ ఘటనలతో హోరెత్తిపోయి శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టాలని అనుకున్నారు. ఈ రెండు ప్లాన్ల గురించి టీడీపీలోని ప్రధాన వ్యక్తులకు తప్ప, పార్టీ కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తెలియడానికి వీల్లేదని తీర్మానం చేశారు. ఎక్కడా ఈ ప్లాన్ల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకూడదని అత్యంత గోప్యత పాటించారు. ఈ అల్లర్లకు అవసరమయ్యే వారిని మదనపల్లె, మొలకలచెరువు, సదుం, సోమల నుంచి రప్పించాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా రంగంలోకి దించారు. పోలీస్ ప్లాన్ భళా.. టీడీపీ డీలా.. టీడీపీ నేతలు రూపొందించిన మారణహోమ ఉచ్చులో పోలీసులు చిక్కుకునే ఘటన దాదాపు అమలైపోతుందని టీడీపీ పెద్దలు భావించారు. అయితే అల్లర్ల సమయంలో అక్కడ బందోబస్తులో ఉన్న ఓ పోలీసు అధికారి చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫోన్ చేశారు. పోలీసులు రక్తమోడుతుండటం చూసిన ఆ అధికారి చలించిపోయి.. గద్గద స్వరంతో ఎస్పీతో మాట్లాడుతూ.. ‘సర్, పరిస్థితి చేయి దాటిపోతోంది. డీఎస్పీల తలలు పగిలిపోతున్నాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ఇక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు. మనం ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే మీరు కలెక్టర్తో మాట్లాడి ఫైర్ ఓపెన్ చేసేలా ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. లేకుంటే మనవాళ్లు చనిపోతారు..’ అంటూ బతిమిలాడినట్లు సమాచారం. అప్పుడు టీడీపీ మూకలు రాళ్లు, బాటిళ్లు విసురుతున్న తీరు, వాటి నిల్వల వివరాలు ఆరా తీసి.. పోలీసులు వెంటనే 300 మీటర్లు వెనక్కు వచ్చేయాలని ఎస్పీ సూచించినట్లు తెలిసింది. దీంతో టీడీపీ శ్రేణులు రాళ్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వస్తారని.. అప్పుడు టీడీపీ శ్రేణులను చెదరగొట్టడానికి స్వల్పంగా లాఠీచార్జ్, బాష్ప వాయువు ప్రయోగించాలని ఆదేశించినట్లు సమాచారం. తాను పుంగనూరుకు బయలుదేరానని, తాను అక్కడికి వచ్చే వరకు ఒక్క బుల్లెట్ కూడా తుపాకీ నుంచి బయటకు రావడానికి వీల్లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రక్తమోడుతున్నప్పటికీ ఎస్పీ ఆదేశాలను అమలు చేశారు. అల్లరి మూకల్ని దగ్గరకు రప్పించి లాఠీలతో చెదరగొట్టారు. దీంతో టీడీపీ నేతల కుతంత్రాలు, కుట్రలు పటా పంచలయ్యాయి. -
ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ..
చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. దీంతో మనుగడ కొల్పోతామన్న భయంతో టీడీపీ హింస రాజకీయాలకు తెరతీస్తోంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక్షస మనస్తత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారు. పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే ఎందుకు వేశారో సమాధానం లేదు. ఇదిలా ఉండగా, పుంగనూరు అభివృద్ధిపై ఆ ప్రాంత వాసి పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ►పుంగనూరుకి వస్తున్నట్టు ఉన్నావ్.. వచ్చేటప్పుడు అలా నువ్వు నీ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేసి నిలిపివేసిన నేతి గుట్లపల్లి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కావాలంటే కొంత సేవు ఈతకొట్టు.. ►పుంగనూరు శాశ్వత తాగు, సాగునీటి అవసరాల కోసం 95 శాతం పూర్తయిన ప్రాజెక్ట్ను అడ్డుకోవాలని చూస్తున్న నీ వక్రబుద్ది తెలుస్తుంది ►అలాగే ముందుకు వస్తే రూ.40 కోట్ల రూపాయలతో పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైంది ఒక్కసారి చూడు ►ఇంకొంచెం ముందుకు వస్తే పెద్దిరెడ్డి గారి సహకారంతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ ఉంటుంది తలపైకి ఎత్తి చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే ఒక్క కారు బస్సు వెళ్లాలంటే ఇబ్బంది పడే మినీ బైపాస్ ఇప్పుడు ఎంత విశాలంగా సర్వాంగా సుందరంగా ఉందో చూడు ►ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు అధికారంలో ఉండగా అడ్డుకున్నా ఆర్టీసీ డిపో.. నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్యారేజ్తో మా పెద్దాయన నిర్మించిన ఆర్టీసీ డిపో కనిపిస్తుంది చూడు. ►ఇంకొంచెం ముందుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతోంది.. దాని వెనకాల కడుతున్న భవనాలను చూడు.. ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా మారి ప్రజల అన్ని సౌకర్యాలు తీర్చడనికి రూపుదిద్దుకున్న తీరును చూడు.. ►ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సొంత నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ని చూడు ►ఇంకొంచెం ముందుకు వెళ్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనబడుతుంది.. కావాలంటే కొంతసేవు గట్టుపై సేదదీరు ►ఈ మధ్య సమ్మర్ స్టోరేజ్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పుంగనూరుకి విద్యుత్ అందించనున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకో ►ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంపీ మిథున్ రెడ్డి గారి డ్రీమ్ బైపాస్ రోడ్డు కనబడుతోంది చాలా బాగుంటుంది ►అలా బోయకొండ వెళ్తే కోట్ల రూపాయలతో బోయకొండను బంగారు కొండగా మార్చిన తీరును చూస్తే ఆశ్యర్యం కలగక మానదు.. ►ఇదంతా పుంగనూరు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే కేవలం 4సంవత్సరాల లొనే పెద్దాయన ఇంత చేస్తుంటే.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కుప్పానికి ఏమి చేశావు అని మాత్రం ఆలోచించకు చంద్రబాబూ.. -
రక్తపాతం లక్ష్యంగా చంద్రబాబు స్కెచ్.. రాజంపేట టీడీపీ అభ్యర్థి నరహరి కారులో గన్
చంద్రబాబుది మొదటి నుంచి హింసావాదమే. ప్రాజెక్టుల పర్యటనల ముసుగులో హింసకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టి ప్రజల్లో విభజన తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహం రచించారు. పలమనేర్ బై పాస్లో వెళ్లకుండా.. పుంగనూర్కు రూట్ ఎందుకు మార్చాడు.. చంద్రబాబు రూట్ మార్చడం వెనుక భారీ కుట్ర ఉంది. కావాలనే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చంద్రబాబు చేశారు. చిత్తూరు అర్బన్/ బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా నరహరి కారు డ్రైవర్ గుర్మిత్ సింగ్(38)పై ముదివేడు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు కథనం ప్రకారం.. చంద్రబాబు పర్యటన సమయంలో కడప వైపు నుంచి అంగళ్లుకు నరహరి కారు వేగంగా వచ్చింది. కడప రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన ఎంపీటీసీ మహేష్పైకి దూసుకొచ్చింది. మహేష్ హెచ్చరికతో కారు ఆగింది. అంత వేగమెందుకని మహేష్ నిలదీయగా.. ఆగ్రహించిన గురుమిత్సింగ్ కారులోంచి డబుల్ బ్యారల్ గన్ తీసి కాల్చుతానంటూ బెదిరించారు. దీంతో మహేష్ ముదివేడు పోలీసులకు చెప్పగా వారు కారును తనిఖీ చేశారు. చదవండి: ‘పచ్చ’మూకలకు ఎదురొడ్డి.. పేకాట పెట్టెలు, వెనుకవైపు కింద డబుల్ బ్యారల్ గన్, సీటు కవర్లో ఎనిమిది తూటాలు కలిగిన ప్యాకెట్ లభించాయి. వీటితోపాటు కారును స్వా«దీనం చేసుకుని ముదివేడు పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గుర్మిత్సింగ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అంతా వ్యూహాత్మకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఎస్జీ కమాండోల రక్షణలో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ఎక్కడైనా పర్యటించాలంటే 24 గంటల ముందుగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో) నుంచి ఇంటెలిజెన్స్ విభాగానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పుడు జిల్లా పోలీసుశాఖ ముందుగా రూట్ మ్యాప్లో ఉన్న కల్వర్టులు, శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), ఆర్మ్డ్ రిజర్వు దళాలు చంద్రబాబు కార్యక్రమం జరిగే రూట్ మ్యాప్లో భద్రతా చర్యలు, ముందస్తు తనిఖీలు చేపడతారు. కానీ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి చంద్రబాబు నుంచి పోలీసులకు అందిన రూట్ మ్యాప్ ఒకలా ఉంటే.. దాన్ని కాదని పుంగనూరులోకి పర్యటనను మారుస్తూ మరో దారిని ఎంచుకోవడం రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహమేనని స్పష్టమవుతోంది. మదనపల్లె నుంచి పుంగనూరు బైపాస్ మీదుగా చంద్రబాబు నాయుడు చిత్తూరు శివారుల్లోని బాన్స్ హోటల్కు వెళతారని బుధవారం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి నుంచి పోలీసులకు సమాచారం అందింది. గురువారం రాత్రి కూడా పర్యటనలో మార్పులు చేస్తూ.. పుంగనూరు బైపాస్ మీదుగానే వెళ్లిపోతారని చెప్పారు. తీరా శుక్రవారం సాయంత్రం పుంగనూరులోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేస్తూ విధ్వంసం సృష్టించారు. -
పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ ఆదేశం
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. ‘‘రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించాం. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదు’’ అని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. కేసు నమోదు.. పుంగనూరు పీఎస్లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. చదవండి: టీడీపీ రాక్షస క్రీడ -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతోన్న బంద్
-
టీడీపీ విధ్వంసాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో చంద్రబాబు అను చరగణం సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ వైఎస్సార్సీపీ బంద్కు పిలుపునివ్వడంతో శనివారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాగా, అంగళ్లు కూడలిలో శుక్రవారం వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ దాష్టీకంపై పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్కా స్కెచ్తో అగ్గి రాజేశారు. టీడీపీ గూండాలను రెచ్చగొట్టి.. పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడులు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర రక్త గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. -
చిత్తూరుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన, షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి -
చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీ ఇంచార్జ్లు కరువు!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్లు లేరట. చంద్రబాబు పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయిందని టాక్. నాయకులే లేకపోవడంతో అసలు పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? చిత్తూరు జిల్లా పూతలపట్టులో తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఆ పార్టీ నాయకత్వం చాలా సంవత్సరాలుగా ఆశ పడుతోంది. 2009 నుంచి ఇప్పటివరకు అక్కడ టిడిపి జెండా ఎగరలేదు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆ తర్వాత పచ్చ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జినే నియమించలేదు. మాజీ మంత్రి, టిడిపి నేత గల్లా అరుణకుమారి ఈ నియోజకవర్గానికి చెందినవారే. ఆమె కుటుంబానికి పూతలపట్టు నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయితే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గల్లా కుటుంబం కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ నియోజకవర్గంలో నాలుగేళ్ళుగా పచ్చ జెండా పట్టుకునేవారే కరువయ్యారు. ఉన్నవాళ్ళలో కొంతమంది ఇన్చార్జి పదవి ఆశిస్తున్నా వాళ్లకు చంద్రబాబు ఓకే చెప్పడంలేదు. ఈ టాపిక్ మీదే ఇప్పుడు పూతలపట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇన్చార్జి లేకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతాయని పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న వారిలో సప్తగిరి ప్రసాద్, సప్తగిరి, ముత్తులతోపాటు తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఈ జర్నలిస్టు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ద్వారా తన ప్రయత్నాలు చేస్తున్నారట. ఇన్చార్జిగా ఎవరూ లేకపోవడంతో కార్యకర్తలు సైతం టీడీపీకి దూరం దూరంగానే ఉంటున్నారు. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చు భరించేది ఎవరంటూ పచ్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగితే గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని పసుపు కేడర్ ఆందోళన పడుతోంది. గడచిన మూడు ఎన్నికల్లో గెలవని పార్టీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎలా గెలుస్తుందని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. అసలు పూతలపట్టులో టీడీపీ అనే పార్టీ ఉన్న విషయాన్నే ప్రజలు మర్చిపోయేట్టు ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. -నరేష్బాబు, సాక్షి వెబ్డెస్క్ -
ఇదేందయ్యా ఇది.. టీడీపీ నేతల ఓవరాక్షన్
పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు -
టీడీపీ అల్లరిమూకల పైశాచికత్వం
గంగవరం (చిత్తూరు జిల్లా): వైఎస్సార్సీపీ నేత, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అల్లరిమూకలు దాడులకు తెగబడిన ఘటన చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. ఘటనపై బాధితులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగవరం మండలంలోని మార్జేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత, గ్రామ సచివాలయ కన్వినర్ చిన్నరెడ్డెప్ప కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత శంకరప్ప కుటుంబ సభ్యులైన ఆ పార్టీ కార్యకర్తలు 20 మందికి పైగా దాడి చేశారు. శనివారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంతమంది చిన్నరెడ్డెప్ప ఇంటి ముందు టపాసులు కాల్చడంతో పశువులు బెదిరాయి. దీంతో కాస్త పక్కన కాల్చుకోవాలని చిన్నరెడ్డెప్ప కోరాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ‘మాకు నువ్వేంది చెప్పేది.. టపాసులు ఇక్కడే పెడతాం’ అంటూ చిన్నరెడ్డెప్పపై దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు సునీల్, చరణ్, విశ్వేశ్వరయ్య, యువరాజు, భాను, బాలరాజు, అశోక్, అమర్నాథరెడ్డి, కార్తీక్, మరికొంతమంది కలిసి చిన్నరెడ్డెప్ప, అతని భార్య సుభద్ర, తండ్రి శ్రీరాములు, తల్లి మునివెంకటమ్మ, సమీప బంధువులు రత్నారెడ్డి, యశ్వంత్, చంద్రప్పపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు విసరడంతో కిటికీలు, తలుపులు పగిలిపోగా కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్నవారిని తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులు ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, గతంలో టీడీపీ కార్యకర్త చరణ్ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నరెడ్డప్ప, యువతి బంధువులు చరణ్ను మందలించారు. దీంతో కక్షగట్టిన చరణ్.. యువతి అన్నపై అప్పట్లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ నేపథ్యంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే చరణ్, ఇతర టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు చెప్పారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రతాప్రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటనపై విచారించారు. శంకరప్పతో సహా దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన అశోక్ను అదుపులోకి తీసుకున్నారు.