Young
-
‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్గేట్స్ ఈ సూచన చేశారు.భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్గేట్స్ పేర్కొన్నారు.గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తరచూ బీహార్కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా.. -
ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్ప్రదేశ్లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!యాంటీ ఏజింగ్ టిప్స్లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని చెక్ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు. ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం. జంక్ ఫుడ్కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి. మసాజ్: శారీరక ఆరోగ్యానికి మసాజ్ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు. -
సూపర్గా డ్యాన్స్ చేస్తున్న యువతి..ఒక్కసారిగా..
భోపాల్:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. Madhya Pradesh - A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు. -
యువ డిజైనర్గా రాణిస్తున్న ముప్పిడి రాంబాబు
కష్టే ఫలి.. కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిత మైన సత్యం. చిన్న తనం నుంచే అదే సూత్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. కష్టపడి పనిచేయడానికి అలవాటుపడి యువడిజైనర్గా డాక్టర్ ముప్పిడి రాంబాబు గుర్తింపు సాధించాడు. బొమ్మల తయారీలో కళాకారుడు తన కళకు నైపుణ్యాన్ని జతచేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంతే కాకుండా శిల్పకారుడు, రచయిత, అధ్యాపకుడుగానూ పనిచేస్తున్నాడు. శిల్పకారుల కుటుంబానికి చెందిన ముప్పిడి చెక్క, తాటి ఆకు, జనపనార, రాతి ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అనేక కళాకృతులను రూపొందించడంలో దిట్టగా పేరొందారు. ప్రస్తుతం రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ హైదరాబాద్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఆర్ట్, క్రాఫ్ట్, డిజైన్ ప్రొడక్ట్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్గా గుర్తింపు సాధించారు. – రాయదుర్గంపేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి.. పేటెంట్ పొందిన డిజైన్లను పేద కళాకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలనేదే నా తపన. మాది కళాకారుల కుటుంబం. కళాకారుల పరిస్థితులు నాకు బాగా తెలుసు. పేటెంట్ పొందిన డిజైన్లు ఉచితంగానే అందిస్తా. వాటి తయారీ గురించి వివరిస్తాను. నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీ దారులు కూడా నూతన డిజైన్లలో బొమ్మలు తయారు చేసేలా తగిన సూచనలు అందించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నా.. – డాక్టర్ ముప్పిడి రాంబాబు, ఎఫ్డీడీఐ ఫ్యాకల్టీ రాయదుర్గం మంజూరైన పేటెంట్స్.. 2025లో టేబుల్టాప్ ఆర్టిక్రాఫ్ట్స్, ఫిల్లింగ్ 2024లో లెదర్, వుడ్బర్డ్ టాయ్, ఫిల్లింగ్, వుడ్ పెన్స్టాండ్, ఫిల్లింగ్, డాల్, లెదర్ వాల్ హ్యాంగింగ్, న్యూస్పేపర్ బాస్కెట్, డెకరేటివ్ యాక్సెసరీస్ ఫర్ టేబుల్టాప్ టాయ్స్, ట్రెక్కింగ్ బ్యాక్ప్యాక్, జ్యువెలరీ బాక్స్కేస్. పీహెచ్డీ పూర్తి చేసి.. ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెంలో నిరుపేద కళాకారుల కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి, రెండో తరాలకు చదువులేదు. కానీ మూడో తరం వారు జీవనోపాధి కోసం చేతి వృత్తులు చేస్తున్నా, తండ్రి సూచన మేరకు పీహెచ్డీ పూర్తి చేశారు. రచయిత, కళాకారుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడీ, అకడమిక్ కన్సల్టెంట్, జూట్బోర్డు ప్యానెల్ డిజైనర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వంటి ఉద్యోగాలు చేశారు. కేంద్ర జూట్ బోర్డులో జైనర్గా పనిచేశాడు. ప్రస్తుతం ఎఫ్డీడీఐలో ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. అవార్డులు, పురస్కారాలు.. 2024లో పీహెచ్డీలో గోల్డ్మెడల్ (పోట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీ) 2023లో పికాక్ అవార్డు (తిరుపతి ఆర్ట్ సొసైటీ, ఎక్స్లెన్స్ ఇన్ రివ్యూ అవార్డు) 2018 జాతీయ సంజీవ్దేవ్ అవార్డు2017లో ప్రమోద్ కుమార్ చటర్జీ జాతీయ అవార్డు 2016లో విశిష్ట కళా సేవారత్న, రోటరీ యువజన అవార్డు, గురుబ్రహ్మ అవార్డు.వీటితో పాటు మరికొన్ని అవార్డులు.. పేటెంట్ల సాధనలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఎఫ్డీడీఐ ఫ్యాకల్టీ డాక్టర్ రాంబాబు -
2024: బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూనే అదరగొట్టిన యంగ్ సెన్సేషన్స్ (ఫోటోలు)
-
ఏళ్లు గడుస్తున్నా యంగ్గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!) -
లడఖ్ కళలను పరిరక్షిస్తున్న నూర్ జహాన్
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం వేసవికాలం... నూర్జాహాన్కు మరపురాని రోజులవి. ఆమె కాలేజీలో చదువుతున్న ఢిల్లీ నుండి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. లేహ్ పాత పట్టణం ఆవరణలో కొంతమంది విదేశీయులు తారసపడ్డారు. వారు సమీపంలోని బౌద్ధ దేవాలయంలో పరిరక్షణ పనిని నిర్వహిస్తున్న బృందంలో ఉన్నారు. వారితో మాట్లాడిన కొన్ని మాటలు నూర్జాహాన్ జీవిత గమనాన్ని మార్చేశాయి. నూర్జాహాన్ కళా పరిరక్షణ రంగం గురించి చదవడం ప్రారంభించింది. 2017లో లేహ్లో తన కజిన్ వజీదా తబస్సుమన్తో కలిసి ‘షెస్రిగ్ లడఖ్’ అనే తన స్టూడియోను ప్రారంభించి, లడఖ్లోని మొదటి తరం ఆర్ట్ కన్జర్వేటర్లలో భాగమైంది.‘ఈ రంగంలోకి అనుకోకుండా ప్రవేశించాను. కళ లేదా వారసత్వానికి సంబంధించిన స్పృహ జీవితంలో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఒకసారి అనుకున్నది తారసపడితే గతంలోని చాలా చుక్కలను కనెక్ట్ చేయగలను’ అని భారత జాతీయ ఐస్ హాకీ జట్టుకు గోల్ కీపర్గానూ చేసిన 34 ఏళ్ల నూర్ చెబుతారు.లోతైన పరిశోధన‘‘లడఖ్లో కళల పరిరక్షణను ఎప్పుడూ వృత్తిగా పరిగణించలేదు. స్థానికుల కోసం కాదు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టుల కోసం వచ్చి వెళ్లి΄ోవడం చూస్తుంటాం. అందుకే దీన్నే ఒక సబ్జెక్ట్గా ఎంచుకున్నాం. సుమారు రెండు దశాబ్దాల క్రితం లడఖ్లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టర్గా జీవనోపాధి పొందడం ఇక్కడ ప్రాధాన్యతగా ఉండేది. నేను స్కూల్లో చేరగానే యువత దృష్టి డాక్టర్లు, ఇంజనీర్లుగా మారడం వైపు మళ్లింది. కళల పరిరక్షణ, పునరుద్ధరణ ఎప్పుడూ జీవనోపాధికి సంబంధించిన సాధనంగా పరిగణించబడలేదు. దీంతో ఈ రంగంలో ఎక్కువగా బయటి వ్యక్తులే ఉన్నారు.సవాల్గా నిలిచే రంగంలేహ్ సమీపంలోని సుమ్దా చు¯Œ లోని 13వ శతాబ్దానికి చెందిన గేట్వే స్థూపంపై నెల రోజుల΄ాటు పని చేయడం అంటే, అక్కడి స్థానికులతో కలిసి జీవించడం. గోల్డెన్ టెంపుల్ లోపల పెయింటింగ్స్పై పని చేయడంలో నిచ్చెనపై గంటల తరబడి గడిపేవాళ్లం. డిస్కిట్ సమీపంలోని సన్యాసిని ఆలయాన్ని పునరుద్ధరించడానికి, ఒక లోయలో వారాలు గడపడానికి ముగ్గురు మహిళల బృందం అవసరం అయ్యింది. విరిగిన జనరేటర్, వన్య్రప్రాణుల నుండి ఆహార నిల్వలను కాపాడుకోవడం ప్రతిదీ ఓ సవాల్గా ఉండేది. నా జీవితమంతా పట్టణ వాతావరణంలో జీవించాను కాబట్టి ఈ వాతావరణంలో పని చేస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ డిసెర్టేషన్పై పనిచేస్తున్నప్పుడు సొంత ప్రాక్టీస్ ప్రారంభించాలనుకున్నాను పాత పట్టణం లేహ్లో మా పూర్వీకుల శిథిలమైన ఇంటిని స్టూడియోగా మార్చాను. తంగ్కా పెయింటింగ్లు, పాత పెయింటెడ్ ఫర్నిచర్, చెక్క కళాఖండాలు, పాత గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, మెటీరియల్లను, ముఖ్యంగా గడ్డకట్టే చలికాలంలో విషయావగాహనకు, పరిధిని విస్తరించడానికి ఇటువంటి సౌకర్యం చాలా ముఖ్యమైనది. షెస్రిగ్ లడఖ్ను స్థాపించిన ఐదేళ్ల వరకు ఇంటిని పునరుద్ధరించడం, స్టూడియో పనిని పూర్తి చేయగలిగాం. సంరక్షణ దిశగా పనులుమా బృందంలో నలుగురు ఆడ, ఒక మగ. ఐదుగురం కలిసి లడఖ్ చుట్టుపక్కల ఉన్న స్థానిక కమ్యూనిటీలు, వ్యక్తిగత ఆసక్తి ఉన్నవారిని సంప్రదించాం. నిధులు నిరంతరం సమస్య. ప్రతి ్ర΄ాజెక్ట్కు కొత్త సవాళ్లు ఉండేవి. ఉదాహరణకు,19వ శతాబ్దం మధ్యలో డోగ్రా దండయాత్ర సమయంలో, వారి సైన్యం ముల్బెఖ్ ఆలయంలో స్థావరాన్ని ఏర్పాటు చేసి దానిలో వంట చేసింది. కాబట్టి, సాధారణ పునరుద్ధరణ పనులతో పాటు, పెయింటింగ్స్పై మిగిలి΄ోయిన ధూళిని కూడా మేం శుభ్రం చేయాల్సి వచ్చింది. సంవత్సరాలుగా, వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా అనేక కట్టడాలు శిథిలమయ్యాయి. గత దశాబ్దంలో లడఖ్లో అధిక వర్షపాతం వల్ల సంప్రదాయ మట్టి నిర్మాణాలకు ముప్పు కలిగింది. నిర్మాణ, అభివృద్ధి పనులు కూడా వారసత్వ ప్రదేశాలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. పాత ఆలయాన్ని సంరక్షించడం కంటే కొత్త ఆలయానికి నిధులు సేకరించడం సులభమని గ్రహించిన సందర్భాలూ ఉన్నాయి.కొంతమంది మా పనిని అర్థం చేసుకుంటారు. కానీ పని పూర్తయ్యాక విషయాలు కొత్తగా కనిపిస్తాయని ఆశించే వారు చాలా మంది ఉన్నారు. పరిరక్షణ, పునరుద్ధరణ అంటే చాలా మందికి తెలియదు. కాబట్టి, మేం ఒక ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడల్లా, ఆ కమ్యూనిటీని, ముఖ్యంగా పిల్లలను వచ్చి మమ్మల్ని చూడమని ఆహ్వానిస్తాం. వారసత్వంపై అవగాహన, ప్రజలు దానిని ఎలా గ్రహిస్తారు అనేది రాబోయే కాలంలో ఈ సమాచారం అత్యంత కీలకం అవుతుంది’ అని వివరిస్తారు నూర్. -
వడాపావ్ అమ్ముతూ రోజుకు రూ.40 వేల సంపాదన.. ఎవరీ బ్యూటీ! (ఫోటోలు)
-
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్ను మరో ట్రాక్టర్కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
Jr NTR Unseen Photos: ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేకమైన ఫోటోలు
-
దేశ రాజకీయాల్లో సంచలనం.. ఈ 26 ఏళ్ల కుర్రాడు!
దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాడు రాజస్థాన్కు చెందిన ఓ 26 ఏళ్ల కుర్రాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ యువకుడు.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చక్కని వాగ్ధాటి, అగర్గళమైన, చురుకైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కాదు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నాడు. బార్మర్- పశ్చిమ రాజస్థాన్, ముఖ్యంగా బార్మర్-జైసల్మేర్-బలోత్రా నియోజకవర్గం ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో కేంద్ర బిందువుగా మారింది. ఇది దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 1.9 మిలియన్ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 7 లక్షల మంది జాట్లు, 2.5 లక్షల రాజ్పుత్ ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఇక్కడ ఎన్నికల రణరంగం ముక్కోణపు పోటీని చూస్తోంది. వివిధ రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమేరామ్ బేనివాల్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థి 26 ఏళ్ల రవీంద్ర సింగ్ భాటి పోటీలో ఉండటంతో అందిరి దృష్టి ఈ నియోజక వర్గంపై పడింది. ఆకట్టుకునే ప్రసంగాలు బార్మర్ జిల్లాలోని షియో అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయాన్ని రుచి చూసిన రవీంద్ర, ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే సాంప్రదాయ ద్విముఖ భావాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా భాటి ప్రజాదరణ ఆయన సొంత నియోజకవర్గానికి మించి విస్తరించింది. ఈయన ఆకర్షణ, ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించాయి. ప్రచారం ముమ్మరం కావడంతో భాటి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మక పర్యటనను ప్రారంభించారు. రవీంద్ర భాటి బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడానికి అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. అదేవిధంగా హైదరాబాద్లోనూ ప్రజాదరణ లభించింది. ఆయన విమానాశ్రయానికి రాకముందే జనాలను ఆకర్షించింది. గుజరాత్లోని సూరత్కు చేరుకున్నప్పుడు అతని పేరు కొన్ని మైళ్ల వరకు ప్రతిధ్వనించింది. రవీంద్ర భాటి నేపథ్యం రవీంద్ర సింగ్ భాటి బార్మెర్లోని దుధోడా అనే గ్రామానికి చెందిన రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించిన రవీంద్ర భాటి తన పాఠశాల విద్యను ప్రభుత్వ స్కూల్లో పూర్తి చేశారు. జై నారాయణ్ వ్యాస్ యూనివర్శిటీలో 2019 విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రవీంద్ర భాటి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ నుంచి మొదట టికెట్ను కోరినప్పటికీ, చివరికి తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో అతని విజయం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విశ్వవిద్యాలయం 57 సంవత్సరాల చరిత్రలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవిని గెలుచుకున్న మొదటి స్వతంత్ర అభ్యర్థిగా రవీంద్ర సింగ్ బాటీ నిలిచాడు. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో భాటి రాజకీయ పథం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ఎదుర్కొని భాటి విజయం సాధించారు. సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో లోక్సభ బరిలో నిలిచారు. #संबोधन pic.twitter.com/4CU0fnZTwe — Ravindra Singh Bhati (@RavindraBhati__) April 9, 2024 -
Birthday Special: యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు
గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి. అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్ -
‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది
చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత పాత్ర. ‘గో నిషా గో’ గేమ్లో ప్రధాన పాత్ర. ‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్ గేమ్ ‘గో నిషా గో’ యువ యూజర్లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్ ఇది. డిజిటల్ గేమ్ ప్లాట్ఫామ్ ‘గేమ్ ఆఫ్ చాయిస్ నాట్ చాన్స్’ నుంచి వచ్చిన తొలి గేమ్ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్ నాన్– ప్రాఫిట్ సంస్థ గర్ల్ ఎఫెక్ట్ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ కంట్రీ డైరెక్టర్ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్ మెన్స్ట్రూయెల్ హెల్త్ హెల్ప్లైన్తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా అందుబాటులో ఉంది. అవగాహన పెంచుతోంది... ‘గో నిషా గో’ గేమ్ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఈ ఆట పెంచింది. ఈ గేమ్ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్ డెలాఫీల్డ్ ఇంటర్నేషనల్(హెచ్డిఐ) ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది. హెచ్డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్డిఐ’ కో–ఫౌండర్ సుసాన్ హోవార్డ్. వీడియో గేమ్స్ అంటే పవర్పుల్ వెపన్స్, పవర్ఫుల్ ఫైట్స్ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్... మొదలైన వాటి గురించి అవగాహన కలిగిస్తోంది ఫ్రీ మొబైల్ గేమ్ గో నిషా గో. ఈ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సీరియస్ గేమ్’ అవార్డ్ గెలుచుకుంది...! -
మహిళలకు అసభ్య మెసేజ్లు.. పోకిరిని చితక్కొట్టిన బంధువులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతులను వేధిస్తోన్న ఓ పోకిరిని బాధితుల బంధువులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో పనిచేసే సికిందర్(26) గంజాయికి బానిసయ్యాడు. డయాగ్నొస్టిక్ సెంటర్కు వచ్చే మహిళలు, యువతుల ఫోన్ నంబర్లు తీసుకుని.. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని కొందరు మహిళలు వారి బంధువులకు తెలపడంతో పోకిరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గాయపడిన సికిందర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదీ చదవండి: ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్ -
19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..
చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..? రాజస్థాన్లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది. ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ. ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది. అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది. ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్లోని ఏడు గ్రామాలకు సర్పంచ్గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ. (చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!) -
Vizag: రేవ్ పార్టీలో దారుణం.. మద్యం మత్తులో అమ్మాయి కోసం..
సాక్షి, విశాఖపట్నం: అచ్చుతపురంలో రేవ్ పార్టీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం నుంచి పార్టీ చేసుకోవడానికి కొంత మంది యువతీ యువకులు వచ్చారు. మద్యం మత్తులో అమ్మాయి కోసం జరిగిన గొడవలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఆ యువకుడిని స్విమ్మింగ్ పూల్లో ముంచి స్నేహితులు హత్య చేశారు. మృతుడు సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది? -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్కి సడెన్గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్తో జాన్సన్ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్లో ప్రత్యేక డిజైన్ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్లతో కూడిన బోట్ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్ను, వెను చైన్ను అమర్చారు. పెట్రోల్తో నడిచే ఈ బోట్పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
హైదరాబాద్లో విషాదం.. ఫైనాన్షియర్స్ వేధింపులు తాళలేక..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అత్తాపూర్ సులేమాన్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తౌఫిక్ను రౌడీ షీటర్లతో ఫైనాన్షియర్స్ వహీద్, షకీల్ బెదిరింపులకు గురిచేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తౌఫిక్ను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన రౌడీషీటర్స్ కొట్టడంతో భయంతో ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: పెళ్లి రోజే వరుడి మృతదేహం.. అసలేం జరిగింది? -
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే..
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ మెషీన్లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్టిక్కెట్, ఆధార్ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన పుష్పేంద్ర యాదవ్(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్ యాదవ్ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్ టిక్కెట్తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్.. రాహుల్ యాదవ్ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్లు సాక్షి గులాటీ, నికిత మాథుర్లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్కు సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు?
ఉత్తరప్రదేశ్లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది. కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మద్యం మత్తుకు బానిసలైన సోదరులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
సమయాన్ని చాక్లెట్గా మార్చుకున్నాడు! కోటీశ్వరుడయ్యాడు
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యులు సైతం కోటీశ్వరులు కావచ్చని నిరూపించి చూపిస్తున్నాడు పదహారేళ్ల యువకుడు దిగ్విజయ్ సింగ్. అతడు సమయాన్ని చాక్లెట్గా మార్చుకున్నాడు! కరోనా కారణంగా ఇళ్లలోనే జైల్లోలా కష్టంగా గడిపిన రోజులవి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా హఠాత్తుగా దొరికిన బోలెడంత సమయాన్ని ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితులు. ఉదయపూర్లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఏమి తోచుబాటుగాని ఆ సమయంలో.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాడు. అనుకున్న వెంటనే యూట్యూబ్లో చాక్లెట్స్ తయారీ గురించి చూశాడు. చాక్లెట్స్ తయారీ సులభంగా ఉండడంతో ఇంట్లో తయారు చేశాడు. దిగ్విజయ్ చేసిన చాక్లెట్లు రుచిగా ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో మరిన్ని చాక్లెట్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు మహవీర్ సింగ్కు చెప్పడం, అతనికి ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి చాక్లెట్లు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. గిఫ్ట్బాక్స్ను చూసి... పదహారేళ్ల తన స్నేహితుడితో కలిసి యూట్యూబ్ సాయంతో చాక్లెట్స్, వివిధ రకాల డిజర్ట్లు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచేవాళ్లు. దీపావళికి దిగ్విజయ్ తండ్రి కారు కొన్నాడు. కారు షోరూం వాళ్లు కారుతోపాటు చాక్లెట్ బాక్స్ను గిప్ట్గా ఇచ్చారు. షోరూంలో కారు కొనే కస్టమర్లందరికీ చాక్లెట్ బాక్స్లు గిప్ట్గా ఇస్తున్నారని దిగ్విజయ్కి తెలిసింది. వెంటనే హోటల్, కార్షోరూం యజమానులను కలిసి కాంప్లిమెంటరీగా ఇచ్చేందుకు తాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ ఇస్తానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోవడంతో చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. రెండేళ్లలో రెండుకోట్లు ఒక కార్ షోరూం వాళ్లు వెయ్యి చాక్లెట్స్ కావాలని 2021లో తొలి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే ‘సరామ్’అనే పేరుతో చాక్లెట్ విక్రయాలు ప్రారంభించాడు. చాక్లెట్స్ రుచిగా ఉండడంతో .. విక్రయాలు క్రమంగా పెరిగి ఏడాదిలోనే మంచి ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు టన్నులకు పైగా చాక్లెట్ విక్రయాలు జరిగాయి. దీంతో రెండేళ్లలోనే ‘సరామ్’ రెండు కోట్లను ఆర్జించింది. సరికొత్తగా... సాదా సీదాగా కాకుండా దేశంలో దొరికే రకరకాల పండ్లు, మసాలాలను ఉపయోగించి చాక్లెట్స్ను సరికొత్తగా తయారు చేసి విక్రయిస్తున్నాడు దిగ్విజయ్. కేరళ, తమిళనాడునుంచి కోకోపొడి, చాక్లెట్స్లో వాడే పండ్లను బాగా పండే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నాణ్యమైన రుచికరమైన చాక్లెట్స్ను తయారు చేస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, ఉదయ్పూర్, జైపూర్లలో సరామ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఉదయ్పూర్, జైపూర్లలో స్టోర్లు, ఆఫ్లైనేగాక, ఆన్లైన్లో చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే కోట్లు సంపాదించవచ్చుననడానికి దిగ్విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే ) -
మణిపూర్ ఘటన: అదే రోజు మరో ఇద్దరు యువతులపై దారుణం..
ఇంఫాల్: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో విచారకర ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన రోజే మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్పోక్పి జిల్లాలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో 21,24 ఏళ్ల బాధిత యువతులు కార్ల వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. మహిళల నగ్నంగా ఊరేగింపు ఘటన జరిగిన ప్రాంతానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు వాషింగ్ సెంటర్లో పనిచేస్తుండగా.. కొంత మంది మహిళలతో కూడిన అల్లరి మూకలు వారిపై దాడి చేశారు. బాధిత మహిళలను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయాల్సిందిగా అల్లరి మూకల్లోని మహిళలే ప్రోత్సహించారని ప్రత్యక్ష సాక్షులు టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన ఇంటర్య్వూలో తెలిపారు. గదిలోకి ఈడ్చుకెళ్లిన బాధిత మహిళల ఆర్తనాధాలు తమ చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయని, ఆ భయానక పరిస్థితుల గురించి వెల్లడించారు. ఇదీ చదవండి: Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం.. జనాలకు మణిపూర్ పోలీసుల విజ్ఞప్తి అత్యాచార ఘటనల బాధితులు భయం కారణంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. చివరకు ఓ బాధిత యువతి తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారు కూతురుతో సహా మరో యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఆ బాధిత యువతులు మృతదేహాలు లభ్యం కాలేదు. అల్లరి మూకలు 100 నుంచి 200 మంది వరకు ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మణిపూర్ పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వరిని అరెస్టు చేయలేదు. అయితే.. అల్లర్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్కు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. మణిపూర్లో మే3న అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 125 మంది మరణించారు. 40,000 కుపైగా మంది రాష్ట్రాన్ని విడిచి వెళ్లారు. జాతుల మధ్య వైరంతో రెండునెలలుగా మణిపుర్ రాష్ట్రం భగ్గుమంటోంది. అప్పటి నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో భాగంగానే మే 4న ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు క్రూరత్వానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేపింది. సరిగ్గా అదే రోజు ప్రస్తుత ఘటన జరగడం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: మణిపూర్లో ఆరోజున జరిగింది ఇదే.. బాధితురాలు తల్లి ఆవేదన -
ఆకస్మిక గుండెపోటు మరణాలపై సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రం
ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు. చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్పీ-ఎన్సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం! ఎన్పీ-ఎన్సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్కేర్ డెలివరీ సిస్టమ్లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు. -
యువకునిపై చిరుతపులి దాడి
కర్ణాటక: యువకునిపైన చిరుతపులి దాడి చేసి గాయపరిచిన సంఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని రామేనహళ్ళి బెట్ట తప్పలి వద్ద చోటు చేసుకుంది. రామేనహళ్ళికి చెందిన అనిల్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఊరి బయట మండపం వద్ద కూర్చుని ఉండగా, కొండపై నుంచి వచ్చిన చిరుత అతని మీదకు దూకింది. ఈ దాడిలో అతనికి భుజం, కడుపులో గాయాలయ్యాయి. మిగతావారు గట్టిగా కేకలు వేయడంతో చిరుత పరారైంది. వెంటనే గ్రామస్తులు అతన్ని హుణసూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. హంతక చిరుత బందీ బాలికను బలి తీసుకున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులోకి చిక్కింది. చామరాజనగర జిల్లా కొళ్ళెగాల తాలూకా మదువనహళ్లి సమీపంలోని సిద్దేశ్వర బెట్ట వద్ద చిరుత దొరికింది. కగ్గలిగుందిలో గత నెల 26న ఆరేళ్ల బాలికను చిరుత లాక్కుపోవడానికి యతి్నంచింది, ఈ ఘటనలో బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. అలాగే కంచహళ్ళి గ్రామంలో రైతు పైన దాడి చేసింది. గత 19 రోజులుగా ఈ చిరుత కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు జరిపి బోనులు పెట్టడంతో దొరికింది. అటవీ సిబ్బంది దానిని తీసుకెళ్లారు. -
యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్
ఒక్కోసారి చిన్నచిన్న సరదాలే ప్రాణాలమీదకు తీసుకొస్తుంటాయి. బీహార్లోని గోపాల్గంజ్లో స్నేహితులు చేసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. స్నేహితులు పెట్టిన షరతులకు మించి మూమూస్ తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుని తండ్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తన కుమారునికి విషం ఇచ్చి చంపేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్గంజ్లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్(25) ఛాలెంజ్కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బిపిన్ ఒక మొబైల్ రిపేరింగ్ దుకాణంలో పనిచేస్తుంటాడు. కుమారుని మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే -
Hyderabad: బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
సాక్షి, హైదరాబాద్: హయాత్నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓఆర్ఆర్ పరిసరాలకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి చేరుకున్న బాలికను.. రక్షించిన హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: దూసుకొచ్చిన మృత్యువు క్షణాల్లోనే ఘోరం -
యువకుడి బైక్పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..
సాక్షి, హైదరాబాద్: యువకుడి బైక్పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు. మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్ఘాట్ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం -
హాయ్ చెప్పినందుకు చితక్కొట్టారు..
సాక్షి, కరీంనగర్: మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తి కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్న లక్కీ బార్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సేవిస్తున్న మరో నలుగురు ఫ్రెండ్స్ ఉండగా.. శ్రీకాంత్ హాయ్ చెప్పాడు. అయితే, శ్రీకాంత్ వెటకారంగా నమస్తే చెప్పినట్టు భావించిన ఆ నలుగురు ఫ్రెండ్స్ అప్పటికే మద్యం మత్తులో కూడా ఉండటంతో.. బార్ లోనే శ్రీకాంత్ పై దాడికి పాల్పడ్డారు. నలుగురు కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో.. శ్రీకాంత్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలించారు. బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: హైదరాబాద్లో మహిళా టీచర్ మిస్సింగ్.. అసలేం జరిగింది? -
Viral Video: బాల్కనీ నుండి బోర్లా పడ్డాడు..!
-
వైజాగ్లో కిడ్నాప్.. తాడివారిపల్లెలో హత్య
పొదిలిరూరల్: ఒంగోలు–నంద్యాల రహదారిలో తాడివారిపల్లె చెక్పోస్ట్ సమీపంలో కాలిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధం నేపథ్యంలో బత్తుల దేవధరణి అనే యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుధవారం రాత్రి పొదిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి యువకుడి హత్య కేసు వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరు గ్రామానికి చెందిన బత్తుల దేవధరణి(22) చిన్నప్పటి నుంచి చెడు వ్యవసనాలకు బానిసై తిరుగుతుండేవాడు. మహిళలకు పోన్ చేసి మాట్లాడటం, ఆకతాయితనంగా ఉండటంతో తన అన్న పవన్సాయి విశాఖపట్టణంలో తన దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే ఇంటర్ వరకు చదివించడంతోపాటు ఓ రెస్టారెంట్లో పనిలో చేర్చాడు. చదువు మధ్యలో ఆపేసిన దేవధరణి నిత్యం సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో గంగ అనే యువతి పరిచయం కాగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గంగకు ప్రవీణ్కుమార్ అనే వ్యక్తితో ముందే అక్రమ సంబంధం ఉంది. దీంతో దేవధరణి, ప్రవీణ్కుమార్ మధ్య తరచూ వివాదం నడుస్తోంది. వీరిద్దరితో పవన్సాయి మాట్లాడి సర్దుబాటు చేసినప్పటికీ గంగతో దేవధరణి చాటింగ్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో దేవధరణిని అడ్డు తొలగించాలని ప్రవీణ్కుమార్ పథకం రచించాడు. అహోబిలం వెళ్లేందుకని చెప్పి జనవరి 30న బాడుగకు కారు మాట్లాడాడు. మనోజ్, చాణక్య, శివకుమార్, నరేష్, స్వప్న అనే యువతితో దేవధరణిని నమ్మబలికించి కారులో ఎక్కించారు. మార్గమధ్యంలో దేవధరణికి క్లోరోఫామ్ ఇచ్చి స్పహలో లేకుండా చేశారు. క్లోరోఫామ్ ప్రభావంతో దేవధరణి కారులోనే మలమూత్రాలు విసర్జించడంతో తర్లుపాడు మండలం తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో కారు ఆపి కిందకు దించారు. అటవీ ప్రాంతంలో కత్తితో గొంతు కోసి, పెట్రోల్ పోసి కాల్చి చంపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవధరణి కనిపించకపోవడంతో సోదురుడు పవన్సాయి విశాఖపట్టణం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు చంపడానికి ఉపయోగించిన బాడుగ కారు డ్రైవర్ శివకిరణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నిందితుల్లో ఒకడు అరెస్టయ్యాడని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో పొదిలి సీఐ సుధాకర్రావు, తర్లుపాడు ఎస్సై ముక్కంటి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ విద్యార్థికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ‘ఇంటెల్’లో ఉద్యోగం
ఆత్మకూరు రూరల్(నెల్లూరు జిల్లా): ఆత్మకూరు యువకుడికి యునైటెడ్ స్టేట్స్ ఇంటెల్ సంస్థలో వార్షిక ప్యాకేజీ రూ.1.2 కోట్లతో కొలువు దక్కింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాతజంగాలపల్లికి చెందిన ఈగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వెంకట సాయికృష్ణారెడ్డి ఖరక్పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఈ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్న సాయికృష్ణారెడ్డి వచ్చే మే నెలలో ఈ కోర్సు పూర్తి చేసుకుని, ఆగస్టులో యూఎస్కు వెళ్లి ఉద్యోగంలో చేరనున్నారు. ఈ సందర్భంగా మురళీమనోహర్రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు మాట్లాడుతూ కాయకష్టం చేసి రైతులుగా తాము సంపాదించిన సొమ్మంతా బిడ్డల భవిష్యత్ కోసమే వెచ్చిస్తున్నామని, వారు ఉన్నత స్థాయిలో ఉండడం కంటే తమకు వేరే కోరికలు లేవని భావోద్వేగానికి గురయ్యారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు -
ప్రియురాలు దక్కలేదని.. యువకుడు షాకింగ్ నిర్ణయం
దొర్నిపాడు(కర్నూలు జిల్లా): ప్రేమించిన యువతి దక్కలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలపరిధిలోని చాకరాజువేముల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ తిరుపాల్ తెలిపిన వివరాల మేరకు.. చాకరాజువేముల గ్రామానికి చెందిన జకరయ్య, రత్మమ్మ దంపతులకు ఒక కుమార్తె, ప్రవీణ్కుమార్, ప్రసన్న కుమార్ అనే ఇద్దరు కుమారులు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. ప్రసన్న కుమార్(24) అప్పుడప్పుడు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని పిన్ని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, లక్ష్మీదేవి యువకుడిని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో విషగుళికలు మింగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టం లేక యువతి తల్లిదండ్రులు తమ కుమారుడిని బెదిరించినట్లు ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మహేష్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత.. -
సికింద్రాబాద్: స్నేహితుడు చేతిలో యువకుడి హత్య
-
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
Viral Video: వాగులో పడిన కుక్క.. ప్రాణాలు తెగించి కాపాడిన యువకుడు
-
నడిరోడ్డుపై వేట కొడవలితో మహిళపై దాడి...అంతలో...
కొచ్చి: ఒక వ్యక్తి పట్టపగలే నడిరోడ్డుపై వేట కొడవలితో ఒక మహిళపై దాడి చేసేందుకు తెగబడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ ఘటన కాలూర్లోని అజాద్ రోడ్డుపై పట్టపగలే బహిరంగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు, ఇద్దరు మహిళల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆ యువకుడు వేటకొడవలితో ఒక మహిళ తలపై దాడి చేసేందుకు పలుమార్లు యత్నించగా.. పక్కనే ఉన్న మరో మహిళ గట్టిగా అడ్డుకోవడంతో ఆమె చేతికి త్రీవ గాయలయ్యాయి. ఆ తర్వాత సదరు యువకుడు ఆ కొడవలిని అక్కడే పడేసి మోటార్ బైక్పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని, దాడి చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పారు. పోలీసులు నిందితుడి ఆచూకి కోసం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: గుండెల్ని మెలిపెట్టే విషాద ఘటన.. ‘అమ్మానాన్నను త్వరగా రమ్మని చెప్పండి’..) -
కేక్ కట్ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..? -
యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..
చిత్తూరు అర్బన్: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ -
రూమ్కు తీసుకెళ్లి రోల్డ్గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..
కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్ బర్త్డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్గోల్డ్ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య -
ఏం జరిగిందో.. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే.. అంతలోనే అదృశ్యం
సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మండల పరిధి కడపాయపల్లె గ్రామ పంచాయతీలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సౌమ్య(20) అదృశ్యమైనట్లు తండ్రి నరసింహులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తులసీనాగప్రాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సౌమ్య కడప నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో లేక పోవడంతో గాలించారు. గ్రామంలో కనిపించక పోవడంతో సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ.. -
Vizag: ఏం జరిగిందో..? ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా..
అల్లిపురం(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటికివెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కనకలవీధికి చెందిన దోని చంద్రకళ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ జి.సోమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం దోని జగదీశ్వరి (24) తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది. చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి.. ఈ నెల 10వ తేదీ ఉదయం 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె కోసం నగరంలో పలు ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోను వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన జగదీశ్వరి ఎత్తు సుమారు 155 సెంటీమీటర్లు. చామనఛాయతో, గుండ్రని ముఖం కలిగి ఉందని, నీలం రంగు ఫ్యాంటు, బిస్కట్ కలర్ టీషర్టు వేసుకుని ఉందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 6440796010 ఫోన్ నంబర్లలో తెలియజేయాలని కోరారు. -
వస్త్ర దుకాణంలో పరిచయం... యువతిని నమ్మించి, కోరిక తీర్చుకుని..
కొవ్వూరు(తూర్పుగోదావరి): నమ్మించి, ఓ యువతిని మోసగించిన అభియోగంపై రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కొండ్రు ప్రేమ్కుమార్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాడపల్లికి చెందిన యువతి రాజమహేంద్రవరంలో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, సమీపంలోని స్టూడియోలో ప్రేమ్కుమార్ పనిచేసేవాడు. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటూనంటూ ప్రేమ్కుమార్ ఆమెను నమ్మించి, తన అవసరం తీర్చుకున్నాక మొహం చాటే శాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రేమ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి..
అట్లూరు(వైఎస్సార్ జిల్లా): మండలంలోని లింగాలకుంట ఎస్టీ కాలనీకి చెందిన పేరూరు మధుభారతి (21) అనే యువతి అదృశ్యమైంది. ఎస్ఐ నాగ చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధుభారతి గురువారం కడపలోని తన మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బస్సులో బయలుదేరింది. ఆమె అక్కడికి చేరుకోకపోవడంతో.. బంధువులు, స్నేహితులను కుటుంబ సభ్యులు విచారణ చేశారు. ఎటువంటి ఫలితం లేకపోవడంతో యువతి తల్లి గోపాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి.. ఇలా ఒక్కటయ్యారు.. ఆ పెళ్లిలో ఇదే ప్రత్యేక ఆకర్షణ -
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
ఏడేళ్లుగా ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?
పొదలకూరు(నెల్లూరు జిల్లా): ఏడేళ్లుగా ప్రేమించి, మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లి చేసుకోవాలని కోరితే ముఖం చాటేశాడని ఓ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ ఘటన పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు చేజర్ల మండలం ఏటూరుకు చెందిన యువతి, పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన హరినారాయణ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చదవండి: స్మగ్లింగ్లో ‘పుష్ప’ను మించిపోయాడు.. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని యువతి కోరగా, ఆ యువకుడు స్పందించలేదు. దీంతో బాధితురాలు ప్రియుడు హరినారాయణ తనను నమ్మించి మోసం చేశాడంటూ దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ అరుణ, సభ్యులతో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. తాను ఎస్సీ కులం కావడంతో హరినారాయణ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపింది. పోలీసులు వెంటనే హరినారాయణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. హరినారాయణతోనే తన వివాహం జరిపించాలని విజ్ఞప్తి చేసింది. -
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన
జడ్చర్ల(మహబూబ్నగర్): ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్లో ఉండే వడ్డె వినయ్కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్సీ కృష్ణ తెలిపారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య -
అమ్మాయితో లవ్.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇంతలోనే అబ్బాయి షాకింగ్ నిర్ణయం
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామానికి చెందిన కంసల మహేంద్ర (19) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. ప్రియుడు మోసం చేశాడంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు మహేంద్ర తెలిపాడు. ఇందుకు వారు అంగీకరించలేదు. దీంతో వారం రోజుల క్రితం ఆ యువతిని తీసుకుని బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కులాంతర వివాహానికి పెద్దలు ఎంత మాత్రం అంగీకరించలేదు. అంతేకాక ఇరు కుటుంబాల పెద్దలు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, గ్రామ పెద్దలు ప్రయత్నించి, విఫలమయ్యారు. దీంతో మనస్తాపం చెందిన మహేంద్ర శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే మహేంద్రను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..
పెదగంట్యాడ(విశాఖపట్నం): మండలానికి చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని నడుపూరులో గంపల దాముదమ్మ కుటుంబంతో నివాసం ఉంటున్నారు. చదవండి: గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్స్టర్’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు.. ఈమె కుమార్తె గంపల లలితారాణి (19) ఈ నెల 8న పుట్టినరోజు సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లింది. తర్వాత ఇంటికి రాలేదు. దీంతో యువతి తల్లి, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెదికినా ఫలితం లేకపోవడంతో న్యూపోర్టు పోలీసులను సంప్రదించారు. న్యూపోర్టు హెచ్సీ పీవీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హర్షిణి ఎక్కడున్నావమ్మా.. తండ్రి తిట్టాడని..
హిమాయత్నగర్(హైదరాబాద్): తండ్రి తిట్టాడనే మనస్తాపంలో కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి సమాచారం మేరకు... విఠల్వాడీలో ఉండే మనీష్నాయుడు తన కుమార్తె హర్షిణి(17)ని శనివారం రాత్రి కుటుంబ గొడవల కారణంగా కోప్పాడ్డాడు. చదవండి: జీన్స్ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ దీంతో ఆదివారం ఉదయం బయటికని చెప్పి వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాలేదు. పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా హర్షిణి ఆచూకీ తెలియలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్షిణి ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16314లో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ కోరారు. -
మోటార్బైక్పై దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు యువకుడు
సాక్షి, నెల్లూరు డెస్క్: రోజుకో కొత్త ప్రదేశం.. కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు.. కొత్త రుచులు.. ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలామంది బిజీ లైఫ్లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు నగరానికి చెందిన వెంకట కార్తీక్ తూపిలి ఏడాదిపాటు దేశాన్నే తన ఇల్లుగా చేసుకునేందుకు మోటార్బైక్పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు. చదవండి: గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు? నెల్లూరులోని ఉస్మాన్సాహెబ్పేటలో మల్లికార్జునరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తండ్రిది అరటికాయల వ్యాపారం. తల్లి గృహిణి. కొడుకు కార్తీక్ 2013 సంవత్సరంలో బీటెక్ చేశాడు. సంవత్సరంపాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలంపాటు ఆహా, తదితర చోట్ల వెబ్ సిరీస్లకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కొత్త ప్రపంచంలోకి.. కార్తీక్కు మొదటి నుంచి ప్రకృతి, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లి మనుషులతో మాట్లాడుతుంటాడు. ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా మార్చుకోవడం అలవాటు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఇండియా మొత్తం చుట్టాలని 2021 చివర్లో నిర్ణయించుకున్నాడు. కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మమేకమవడం, మారుమూల పల్లెలకు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?, వారి సంస్కృతి, సంప్రదాయాలేంటో తెలుసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్బైక్పై యాత్రకు శ్రీకారం చుట్టాడు. 400 రోజులపాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 1,50,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ పేరుతో గిన్నీస్బుక్ రికార్డు సాధించాలని కార్తీక్కు ఉన్న మరో లక్ష్యం. అందుకోసం గిన్నీస్ రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు. రోజుకు 350కి పైగా కి.మీ. కార్తీక్ తొలుత మన రాష్ట్రంలో ఐదురోజులపాటు వివిధ ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత తమిళనాడుకి వెళ్లాడు. అలా పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా చుట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. ఈనెల 17వ తేదీ నాటికి 41,200 కిలోమీటర్లు తిరిగాడు. రోజుకు 350 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాడు. తన పర్యటనలో భాగంగా అధికంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. మొదట్లో భయమేసింది కార్తీక్ దేశమంతా బైక్పై తిరుగుతానంటే మొదట్లో భయమేసింది. సంవత్సరానికి పైగా దూరంగా ఉండాలి. ఆలోచించుకోమని చెప్పాం. వాడికి పట్టుదల ఎక్కువ. జాగ్రత్తగా వెళ్తానన్నాడు. ప్రోత్సహించాం. రోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంటాం. – మల్లికార్జునరావు, సుజాత, కార్తీక్ పేరెంట్స్ కుటుంబసభ్యుల సహకారం మోటార్బైక్ యాత్రకు కార్తీక్ కుటుంబసభ్యులు ఎంతగానో సహరిస్తున్నారు. తండ్రి ఆర్థికంగా అండగా నిలిచారు. అమ్మ, చెల్లి, బావ, స్నేహితులు పెళ్లూరు హరీ‹Ù, సూర్యప్రకాష్, సందీప్ (ఇతను 25,000 కి.మీ సైకిల్ యాత్ర చేశాడు.) ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తీక్ చెబుతున్నాడు. ఏం చేస్తాడంటే.. ఉదయం లేచాక ఆరోజు ఎంత దూరం వెళ్లాలి?, చూడాల్సిన ప్రదేశాలేంటి?, ఎక్కడ ఆగాలి? తదితర వివరాలతో కూడిన షెడ్యూల్ను సిద్ధం చేసుకుంటాడు. దారి మధ్యలో గ్రామాల్లో ఆగుతాడు. స్కూళ్లు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతాడు. కొత్త ప్రదేశాలు చూస్తాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి ప్రయాణాన్ని ముగిస్తాడు. ఎవరైనా గ్రామస్తులు, పట్టణవాసులు ఆశ్రయమిస్తే అక్కడుంటాడు. లేకపోతే స్కూల్స్, గురుద్వారాలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి పక్కరోజు ఉదయం మరో ఊరికి ప్రయాణమవుతాడు. ఇవి అందుబాటులో లేనప్పుడు ట్రావెలర్స్ కోసం ఉన్న కౌచ్ సర్ఫింగ్ యాప్ను ఉపయోగించుకుంటాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలో టెంట్ వేసుకున్న సందర్భాలున్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఆరోజు చూసిన విశేషాలు, తీసిన ఫొటోలు తదితరాలను ది ట్రావెలర్ కార్తీక్ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. తిరిగిన రూట్, ఎన్ని కి.మీ ప్రయాణించింది తదితర వివరాలను గిన్నీస్బుక్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఘన స్వాగతం చెబుతున్నారు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అనుమానాలున్నాయి. వెళ్తున్న కొద్దీ అవన్నీ నివృత్తి అయిపోయాయి. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా వెళ్లిన ప్రతిచోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రేమని పంచుతున్నారు. తమిళనాడులోని మల్లిపట్టినం హార్బర్లో టెంట్ వేసుకుని ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఊర్లోకి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అక్కడి విశేషాలు చెప్పారు. మహారాష్ట్రలోని అహ్మద్పూర్కి వెళ్లినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నన్ను చూసి హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాను బైక్పై ట్రావెలింగ్ చేస్తానన్నాడు. ప్రకృతి, ట్రావెలింగ్ జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి. నా ప్రయాణంలో నేను ఎన్నో చూశాను. మా అమ్మా, నాన్న వల్లే ఈ యాత్ర సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడం ఇవ్వాలి. అప్పుడే వారు తమకు నచ్చిన రంగాల్లో రాణించగలరు. – కార్తీక్ -
నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్ను నమ్మించి..
మాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్ వరుని కోసం మాట్రిమోని వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్ సియాన్ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్గా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల లక్ష యూరోలతో వచ్చాడు.. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్ చేయించాడు. ఆమె డాక్టర్తో మాట్లాడుతూ.. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది. దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్ సియాన్ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్ వారు చెప్పిన అకౌంట్కు రూ.19,59,920లను డిపాజిట్ చేశారు. దీని తరువాత వారు ఫోన్లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..
చిల్లకల్లు(జగ్గయ్య పేట):ఎన్టీఆర్ జిల్లా: ఒక్క రోజు ఆగితే.. తాను కోరుకున్న ఉద్యోగంలో చేరిపోయేది. ఏమయ్యిందో ఏమో.. ఈలోపే ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) బీటెక్ పూర్తి చేసి, కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. పలు కంపెనీలకు ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. ఉన్నట్టుండి శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిన శ్వేతా చౌదరి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్ యూ..’ అంటూ తన ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేతా వాయిస్ మెసేజ్ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్ మెసేజ్ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది. ఆన్లైన్ వేధింపులే కారణమా? శ్వేతా చౌదరికి ఇటీవల ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఆమె ఖాతాకు రూ.90 వేలు పంపి, ఆ మొత్తాన్ని మరో వ్యక్తికి పంపాలని విజ్ఞప్తి చేయటంతో శ్వేతా అతను చెప్పినట్లుగానే ఆ డబ్బును మరో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే, ఇదే అదునుగా ఆ వ్యక్తి శ్వేతాను పలు విధాలుగా వేధింపులకు గురి చేశాడు. తన ఖాతాకు రూ.5 లక్షలు పంపాలని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు. అతని వేధింపులు భరించలేకే శ్వేతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సిన తమ కుమార్తె ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులై విలపిస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): ఒక వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ఎ.సురేష్ అనే యువకుడు ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంటికి వెళ్లి, చేయి పట్టుకుని తన కోర్కె తీర్చమని బలవంతపెట్టాడు. చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గతంలో కూడా సురేష్ ఆమెను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్టు, ఆ విషయాన్ని పెద్దలకు తెలిపినా ఫలితం లేకపోయిందని ఫిర్యాదులో వెల్లడించినట్టు పేర్కొన్నారు. -
తెర పై స్మొ ‘కింగ్స్’
రాజేంద్రనగర్కు చెందిన ఓ టీనేజర్ ఒకటి తర్వాత ఒకటిగా ప్యాకెట్ సిగిరెట్లు హాంఫట్ చేశాడు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. కేజీఎఫ్ సినిమాలో హీరోను చూసి ఆ కుర్రాడు ఫాలో అయ్యాడనేది తర్వాత తెలిసిన సంగతి. అయితే ఈ తరహాలో టీనేజర్లపై సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం తీవ్రమవుతోందని, మరింత తీవ్రంగా మారనుందని గతంలోనే నగరం వేదికగా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. ఈ నేపధ్యంలో టీనేజర్ల భవిష్యత్తు ‘పొగ’చూరిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి , హైదరాబాద్: మాస్ మీడియా మరియు ఇంటర్నెట్లోని సెలబ్రిటీల విజువల్స్కు ప్రభావితమైన యువకులు మద్యపానంతో పాటు ధూమపానానికి అలవాటు పడుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ (డిప్యూటీ డైరెక్టర్) మేకం మహేశ్వర్ గతంలో నిర్వహించిన అధ్యయనం దీన్ని నిర్ధారించింది. ‘టీనేజర్స్ డైట్ మరియు హెల్త్–రిలేటెడ్ బిహేవియర్పై మాస్ మీడియా ప్రభావం’ అనే అంశంపై చేసిన సర్వేలో 15 శాతం మంది అబ్బాయిలు సెలబ్రిటీలను అనుకరించడానికే తాము సిగరెట్ తాగామని స్పష్టం చేశారు. సినిమాతో పాటు వెబ్సిరీస్ తదితర సోషల్ మీడియా సెలబ్రిటీలు సైతం వీరిని ప్రభావితం చేశారని తేలింది. మిగతా వయసుల వారితో పోలిస్తే టీనేజర్లపై స్మోకింగ్ సీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఆన్లైన్ లోకం..అవగాహనే శరణ్యం.. ప్రపంచం అంతా ఆన్లైన్ మీదే నడిచే రోజులు వచ్చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల్ని స్మోకింగ్ సీన్స్కి దూరంగా ఉంచడం అంత సులభ సాధ్యం కాదు. అయినా ఆ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ధూమపానం వల్ల కలిగే అనర్ధాలను తరచుగా వారికి వివరించి చెబుతూ ఉండాలని వైద్యులు, మానసిక చికిత్స నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని నియంత్రించడం, వారి అలవాట్లపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. టీనేజీకి...చాలా ప్రమాదకరం గతంలో టీనేజర్స్ స్మోకింగ్కు ఇంట్లో తండ్రో, తాతో, అన్నో.. ప్రభావం కారణమయ్యేది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రభావం సినిమాలు, వెబ్సిరీస్లు చూపిస్తున్నాయి. సిగరెట్లలలో వందల కొద్దీ హానికారక పదార్ధాలు ఉంటాయి. చిన్నవయసులో అలవాటు పడితే అది ఎదుగుదల హార్మోన్లపైనా చెడు ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆస్తమా, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మా పిల్లలకు ఆ అలవాటు కాదులే అనే ధీమాకి పోకుండా...స్మోకింగ్ను పిల్లలకు దూరంగా ఉంచడానికి వారిలో ముందస్తుగానే అవగాహన పెంచడం అవసరం. –డా.రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి (చదవండి: తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు ఉత్తమ ర్యాంకులు) -
ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో..
కంకిపాడు (పెనమలూరు)కృష్ణా జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్న యువకుడిపై కంకిపాడు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ వై. దుర్గారావు కథనం మేరకు.. మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన యువతి (23), గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొండేటి అలెగ్జాండర్ బంధువులు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని అలెగ్జాండర్ నమ్మించాడు. అయితే మరో యువతితో అతను పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు. చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..? -
పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి..
గన్నవరం(కృష్ణా జిల్లా): వివాహితను వేధింపులకు గురిచేస్తున్న మాజీ ప్రేమికుడిపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని దావాజీగూడేనికి చెందిన యువతికి కళాశాలలో చదువుకునే రోజుల్లో కర్నూలుకు చెందిన సహ విద్యార్థి విక్రమ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే పెద్దలు కుదిర్చిన సంబంధం మేరకు ఆ యువతికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో విక్రమ్ గతంలో ఆమెతో దిగిన సెల్పీలు, ఫొటోలను ఆమె అత్తమామల సెల్ఫోన్కు పంపించి వేధిస్తున్నాడు. దీంతో ఆ వివాహిత పోలీసులను ఆశ్రయిం చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. చదవండి: ఏడేళ్లగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్కు ఫోన్ చేస్తే.. -
Ideal Marriage: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు
మాకవరపాలెం(అనకాపల్లి జిల్లా): అన్నీ సక్రమంగా ఉన్నా మనసులు కలవని రోజులివి..దివ్యాంగులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉన్న యువతిని ఓ యువకుడు వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన తల్లి చిన్నప్పుడే మరణించడంతో అప్పటి నుంచి మాకవరపాలెం మండలంలోని కొండలఅగ్రహారంలో ఉన్న ఇమ్మానుయేలు సంస్థలో ఆశ్రయం పొందుతోంది. సంస్థ సంరక్షణలోనే బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన నాగలక్ష్మి వారి జనరల్ ఆస్పత్రిలోనే పనిచేస్తోంది. తామరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, నాగలక్ష్మి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో గురువారం కొండల అగ్రహారం ఇమ్మానుయేలు చర్చిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఈ జంటను సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్ దంపతులు, పెద్దలు ఆశీర్వదించారు. -
‘బుల్లెట్’ బండి కోసం ప్రాణాలు తీసుకున్నాడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): ఫైనాన్స్లో తీసుకున్న బుల్లెట్ బండికి కిస్తీలు కట్టకపోవడంతో కంపెనీ వాళ్లు స్వాధీనం చేసుకోగా.. మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. యువకుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట కోమల విలాస్ ప్రాంతానికి చెందిన బెహర లక్ష్మీ, సోమేష్ దంపతులకు ఇద్దరు సంతానం. కొంత కాలంగా దంపతులు విడివిడిగా ఉంటు న్నారు. చదవండి👉: సాఫ్ట్వేర్ యువతితో ప్రేమ, పెళ్లి.. మరో మహిళ పరిచయం కావడంతో.. లక్ష్మి కూలి పనులు, తల్లి వద్ద ఉంటున్న కుమారుడు కార్తీక్ డేకరేషన్ పనులు చేస్తుంటాడు. కొన్ని నెలల క్రితం కార్తీక్ బుల్లెట్ కావాలని తల్లిని కోరగా.. బంగారు నాన్తాడు అమ్మి రూ.50 వేలు డౌన్ పేమెంట్గా కట్టి బుల్లెట్ కొనిచ్చింది. ఈఎంఐలు కట్టకపోవడంతో శుక్రవారం కంపెనీ సిబ్బంది వచ్చి బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాత్రి అంతా ఇదే విషయాన్ని తల్లికి, స్నేహితులకు చెప్పుకొంటూ మానసిక క్షోభ అనుభవించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు -
ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?
గుంటూరు రూరల్: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. -
నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే?
కాకినాడ క్రైం: నచ్చని పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆదివారం సాయంత్రం కాకినాడ ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయం పైకి ఎక్కి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తుస్తుండగా చూసిన వారు గమనించి ఆమెను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సర్పవరం ఐడియల్ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల దోబా దుర్గాదేవికి ఇంట్లో వారు నచ్చని పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై కొద్ది రోజులుగా ఆమెకు కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. చదవండి: పరువు హత్య కలకలం.. తాళ్లతో కట్టేసి.. తలపై మేకులు కొట్టి.. ఈ నేపథ్యంలో బాబాయి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆదివారం జరిగి ఈ ఘటనతో మనస్థాపం చెందిన యువతి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఉన్న ఆర్అండ్బీ సూపరింటెండెంట్ కార్యాలయంపైకి ఎక్కి కిందికి దూకే ప్రయత్నం చేస్తుండగా అక్కడి వారు గమనించి నిలువరించారు. అవుట్పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను రక్షించి కిందికి దించారు. అక్కడికి చేరుకున్న త్రీ టౌన్ సీఐ కృష్ణ యువతితో మాట్లాడి కౌన్సెలింగ్ కోసం జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ కేంద్రానికి తరలించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆడుకుందామని వచ్చిన ఐదేళ్ల చిన్నారిపై..
పెద్దాపురం(కాకినాడ జిల్లా): ఆడుకుందామని వచ్చిన చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో చోటు చేసుకుంది. దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ బి.అప్పారావు, సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐ రావూరి మురళీమోహన్లు రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు ఇంటి వద్ద విచారణ చేపట్టారు. చదవండి: చదువుకు దూరమై.. బతకడం భారమై.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు చెక్కిడాల రాజా తమ కుటుంబంలో ఉన్న బాలుడితో ఆడుకునేందుకు వచ్చిన ఐదేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పూర్తిగా విచారించగా ఇతడు ఓ వ్యక్తి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. ఘటనకు సంబంధించి చిన్నారి మాటలు, అక్కడ ఉదయం జరిగిన సంఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. -
బీటెక్ ఫెయిలవ్వడంతో.. ఉప్పుటేరులో దూకి..
కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురం వంతెన నుంచి సోమవారం రాత్రి ఉప్పుటేరులోకి దూకిన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు లభ్యం కాలేదు. ఘటనపై జానపురెడ్డి వెంకటరమణ తన కుమారుడు 22 ఏళ్ల దుర్గాప్రసాద్ ఏటిలోకి దూకాడని కాకినాడ వన్ టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. చదవండి: కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో.. బీటెక్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలవ్వడంతో మనోవేదనకు గురయ్యాడని, మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా ద్విచక్రవాహనం దిగి జగన్నాథపురం వంతెన నుంచి ఉప్పుటేరులోకి దూకాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటరమణ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డ్రగ్స్కు బానిసై హైదరాబాద్ యువకుడు మృతి
-
రాష్ట్రంలో తొలి డ్రగ్స్ మరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మితిమీరి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణాలు కోల్పోయాడు. రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి డ్రగ్స్ పెడ్లర్గా మారిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి, విచారించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారికంగా పోలీసు రికార్డుల్లో నమోదైన తొలి డ్రగ్స్ సంబంధిత మరణం ఇదేనని వెల్లడించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ చక్రవర్తి గుమ్మి ఈ వివరాలను వెల్లడించారు. చనిపోవడానికి ముందు సదరు యువకుడి పరిస్థితిని తెలిపే వీడియోను ప్రదర్శించారు. డ్రగ్స్ పెడ్లర్ విచారణలో.. హైదరాబాద్లోని డీడీ కాలనీకి చెందిన ప్రేమ్ ఉపాధ్యాయ మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. తర్వాత డ్రగ్స్ విక్రయించే పెడ్లర్గా మారిపోయాడు. తరచూ గోవాకు వెళ్లి ఎల్ఎస్డీ, ఎక్స్టసీ వంటి డ్రగ్స్ తెచ్చేవాడు. నగరానికే చెందిన లక్ష్మీపతి అనే వ్యక్తి నుంచి గంజాయి సంబంధిత డ్రగ్ హష్ ఆయిల్ కొనేవాడు. సింథటిక్ డ్రగ్ పిల్స్ ఒక్కోటీ రూ.3 వేలకు, ఐదు గ్రాముల హష్ ఆయిల్ రూ.3 వేలకు అమ్ముతున్నాడు. ఇటీవల అలా డ్రగ్స్ విక్రయిస్తుండగా నల్లకుంటలో ‘హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ)’ పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర తరచూ డ్రగ్స్ కొనే రామకృష్ణ (సాఫ్ట్వేర్ ఉద్యోగి), నిఖిల్ జోష్వా (గిటార్ టీచర్), జీవన్రెడ్డి (బీటెక్ విద్యార్థి)లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేద్దామని వెళితే.. ప్రేమ్ వద్ద మరో యువకుడు కూడా డ్రగ్స్ కొనేవాడని తెలిసి అతడి ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు షాకయ్యారు. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ యువకుడు మూడు రోజుల క్రితం చనిపోయాడని వారికి తెలిసింది. దీనిపై వారు ఆరా తీయగా.. సదరు యువకుడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని, ప్రేమ్తో కలిసి గోవా పార్టీలకు వెళ్లేవాడని తెలిసింది. రెండు వారాల క్రితం గోవాలో జరిగిన పార్టీలో సదరు యువకుడు వరుసగా ఎల్ఎస్డీ, కొకైన్, ఎక్స్టసీ పిల్స్, హష్ ఆయిల్ వంటి డ్రగ్స్ తీసుకున్నాడని.. ఓవర్డోస్ కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడని బయటపడింది. కుటుంబ సభ్యులు అతను కొద్దిగా కోలుకున్నాక హైదరాబాద్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. క్లరోసిస్ స్ట్రోక్తో నరాల పటుత్వం కోల్పోయాడని, చికిత్స లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. కొద్దిరోజులు మంచంపైనే ఉన్న అతను.. మూడు రోజుల క్రితం కన్నుమూశాడు. ఆ పార్టీలో మరికొందరు కూడా.. సదరు యువకుడితో పాటు గోవాలో పార్టీకి మరో ఏడుగురు కూడా వెళ్లారని సమాచారం. వారిలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు కాగా, నలుగురు పబ్స్లో పనిచేసే డీజేలని తెలిసింది. వారిలోనూ కొందరు అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. కాగా.. డ్రగ్ పెడ్లర్ ప్రేమ్కు హష్ ఆయిల్ను సరఫరా చేసిన లక్ష్మీపతిని పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సదరు లక్ష్మీపతి ఇప్పటికే మూడుసార్లు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యాడని.. అయినా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. మరో కేసులో.. మరో నలుగురు.. హైదరాబాద్లోని బాపూజీనగర్కు చెందిన వి.రమేశ్ (21) కేజీల లెక్కన హష్ఆయిల్ కొని, చిన్న బాటిళ్లలో నింపి అమ్ముతుంటాడు. దీనిపై సమాచారం అందిన పోలీసులు నిఘా పెట్టారు. గురువారం డెయిరీఫామ్ రోడ్డులో తిరుమలగిరికి చెందిన సాయికుమార్ (25), బాపూజీనగర్కు చెందిన నవీన్కుమార్ (29)లకు హష్ఆయిల్ విక్రయిస్తుండగా.. ‘హెచ్–న్యూ’, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. రమేశ్కు సహకరించిన కె.సాయిప్రకాశ్ (19)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25 గ్రాముల హష్ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద హష్ ఆయిల్ను కొనుగోలు చేసిన మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే..
కర్నూలు: ‘మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేసి మోసం చేయడమే కాక నా పైన, నా కుటుంబ సభ్యులపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టారు. భార్య తరఫు బంధువులు అమీన్బాషా, మాసూంబీ, షేక్షా, షాషా, మైమూన్, ఆశ వేధించారు. వారి సూటిపోటి మాటలు తాళలేకపోతున్నా. నా చావుకు కారకులు వీరే. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయండి’ అంటూ ముదిరాజ్నగర్కు చెందిన షేక్ హుస్సేన్ బాషా (24) సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నబిసాహెబ్ లారీ క్లీనర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు షేక్ హుస్సేన్బాషా ఓ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి కల్లూరు ఎస్టేట్కు చెందిన హుస్సేన్బీ కుమార్తె షాహీన్తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దలు పంచాయితీ చేసి సర్ది చెప్పి కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే షాహీన్ భర్తతో మళ్లీ గొడవపడి మూడు నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇటీవల షాహీన్ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సెలింగ్కు పిలిపించడంతో హుస్సేన్బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. తండ్రి నబిసాహెబ్ తెల్లవారుజామున గుర్తించి ఉరి నుంచి తప్పించి వైద్య చికిత్సల నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య తరఫు బంధువుల వేధింపులు తాళలేకనే తన కుమారుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు నాల్గవ పట్టణ ఎస్ఐ రామయ్య తెలిపారు. సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఫేస్బుక్ పరిచయం.. ఇంట్లో పెళ్లి సంబంధాలు.. యువతి మిస్సింగ్
సూళ్లూరుపేట(నెల్లూరు జిల్లా): ఆ యువతి ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు సూళ్లూరుపేటకు వచ్చింది. కుమార్తె కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే స్పందించి ఆమెను కనిపెట్టి కుటుంబసభ్యులకు అప్పగించారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సర్కిల్ పరిధిలోని పెదవేగికి చెందిన యువతికి (18)కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్ గదికి పిలిచి.. గడిచిన సంవత్సర కాలంగా ఫేస్బుక్లో పరిచయమైన చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం గ్రామానికి చెందిన వేములసాయి కోసం సోమవారం ఉదయం తన ఊరి నుంచి బయలుదేరి సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకుంది. ఉద్యోగం ఇప్పించాలని అతడిని కోరింది. ఉద్యోగం తీసిచ్చేవరకు తడ మండలం కొండూరులోని ఓ హాస్టల్లో ఉండమని సాయి యువతిని వదిలిపెట్టి వెళ్లాడు. సోమవారం సాయంత్రం తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతి ఫోన్ నంబర్ను ట్రేస్ చేసి సూళ్లూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్నట్టుగా కనుక్కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావుకు ఈ విషయంపై సమాచారం ఇవ్వడంతో ఆయన వెంటనే గూడూరు డీఎస్పీ రాజగోపాల్రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సై రవిబాబు, నైట్ బీట్లో ఉన్న సిబ్బంది జార్జి, ప్రదీప్, కిరణ్ సమయస్ఫూర్తితో యువతి ఫోన్ ఆధారంగా లోకేషన్ గుర్తించి హాస్టల్కు వెళ్లారు. అక్కడ వార్డెన్ను విచారించారు. పెదవేగి పోలీసులు అందించిన ఆధారాలతో యువతిని గుర్తించి నిర్ధారించుకుని మహిళా కానిస్టేబుల్ పర్యవేక్షణలో ఆమెను తీసుకొచ్చారు. ఆ యువతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. మంగళవారం బాధిత యువతి తల్లిదండ్రులు, పెదవేగి పోలీసులు సమక్షంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వారికి అప్పగించారు. యువతి ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ చూపించిన ఎస్సై రవిబాబుకు, ఇతర సిబ్బందికి ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డులు ప్రకటించగా వాటిని డీఎస్పీ అందజేశారు. -
అమ్మా నన్ను క్షమించు.. ఈ లోకంలో బతకాలని లేదంటూ..
తోటపల్లిగూడూరు(నెల్లూరు జిల్లా): ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదంటూ’ ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగుచూసింది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం నరుకూరు భీంరావ్నగర్కు చెందిన గూటం ప్రేమ్కుమార్(27) ఏసీలు రిపేరు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమ్కుమార్ తండ్రి గూటం పౌల్ ఇంటి పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వేరుగా కాపురం ఉంటున్నాడు. చదవండి: బీచ్లో దారుణం: ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. యువతిని తోటలోకి లాక్కెళ్లి.. ఈ క్రమంలో బుధవారం రాత్రి ప్రేమ్కుమార్ ఇంట్లో మంటల వ్యాపించడంతో ప్రేమ్కుమార్ సోదరుడు ఆనంద్ స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చి ఇంట్లోకి వెళ్లారు. వంటింట్లో ప్రేమ్కుమార్ తీవ్రగాయాలతో కన్పించాడు. చికిత్సనిమిత్తం అతనిని నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ప్రేమ్కుమార్ చికిత్సపొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రేమ్కుమార్ రాసిన ఓ లేఖను వంటగదిలో పోలీసులు గురువారం స్వాధీనం చేసుకొన్నారు. ‘అమ్మా నన్ను క్షమించు.. నాకు ఈ లోకంలో బతకాలని లేదు.. అందుకే చనిపోతున్నానని’ ప్రేమ్కుమార్ రాసిన లేఖను చూసి అతని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఒకే మహిళతో ఇద్దరికి వివాహేతర సంబంధం.. చివరికి ఏం జరిగిందంటే
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మండలంలోని చిన్న ఓబినేనిపల్లెలో యువకుడి హత్య జరిగినట్లు మార్కాపురం డీఎస్పీ కిశోర్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొడ్డి శ్రీనివాసరెడ్డి తన పొలంలోకి కూలి పనులకు వచ్చే ఓ వివాహితతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే మహిళతో ఎనిమిది నెలల నుంచి గోపు శ్రీనాథరెడ్డి అనే వ్యక్తి కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చదవండి: పిల్లలతో పుట్టింటికి వచ్చి.. ఇంతలో ఏమైందో కానీ.. పొలం పనులకు వెళ్లినప్పుడు ఆమెకు ఖర్చులకు నగదు ఇస్తూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళ తన వద్దకు రాకుండా శ్రీనాథరెడ్డి అడ్డుకుంటున్నాడని అతడిపై శ్రీనివాసరెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం సమయంలో శ్రీనాథరెడ్డి మొక్కజొన్న పొలంలో నీరు పెట్టుకుంటుండగా శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్లాడు. మాటల్లో పెట్టి పొలంలో ముందు వైపున నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనాథరెడ్డి తలపై రంపపు కొడవలితో దాడి చేశాడు. కిందపడిపోయిన వెంటనే గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో కేసును ఛేదించినందుకు ఎస్పీ మలికాగర్గ్ అభినందనలు తెలిపారన్నారు. గిద్దలూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్ఐ మాధవరావు పాల్గొన్నారు. -
సింగిల్ హ్యాండ్ క్యాచ్.. సూపర్మ్యాన్లా డైవ్ చేస్తూ
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫీల్డర్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 79 ఓవర్ వేసిన గ్రాండ్హామ్ బౌలింగ్లో.. జాన్సెన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే బంతి బౌండరీ వెళ్లడం ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యంగ్.. పరిగెత్తుకుంటూ వెళ్లి సింగ్ హ్యండ్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. యంగ్ అద్భుత క్యాచ్తో బిక్కమొహం వేసిన జాన్సెన్ నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కాగా యంగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై దక్షిణాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. 426 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 227 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డివాన్ కాన్వే (92),టామ్ బ్లాండల్(44) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక తొలి టెస్టులో ఘోర ఓటమికి దక్షిణాఫ్రికా బదులు తీర్చుకున్నట్లైంది. చదవండి: Nicholas Pooran: 37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం Will Young takes one of the greatest catches in the cricket history 🔥#NZvSA #NZvsSA pic.twitter.com/klszfnjTJQ — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 28, 2022 -
నన్నే మోసం చేస్తావా.. ప్రియుడిని చితక్కొట్టిన యువతి.. చివరకు
కల్లూరు(కర్నూలు జిల్లా): ఆయన పొలం యాజమాని. ఆ పొలంలోనే ఓ యువతి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఇరువురు ఇష్టపడ్డారు. ఏడాది పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన యువకుడు మొహం చాటేశాడు. దీంతో నన్నే మోసం చేస్తావా అంటూ యువతి బంధువుల ఎదుటే ప్రియుడికి బడితపూజ చేసింది. వివరాలు.. కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన శేఖర్, పెద్దటేకూరు గ్రామానికి చెందిన మునీ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరగా కుటుంబసభ్యులు వద్దంటున్నారని శేఖర్ బదులిచ్చాడు. చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఎందుకు నాన్న.. సీన్ కట్ చేస్తే.. యువతి వినకపోవడంతో పెద్దలందరూ పోలీసు స్టేషన్లో పంచాయితీ పెట్టారు. సదరు యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. నాకు కేసు వద్దు అతనితో పెళ్లి జరిపించాలని యువతి కోరగా శేఖర్ ససేమిరా అన్నాడు. ఇదిలాఉండగా ఇటీవల యువతి ప్రియుడికి ఫోన్ చేసి పిలింపించుకుని తెలంగాణలోని బంధువుల ఊరికి తీసుకెళింది. ఆ ఊరిలో దేవాలయం ముందు పెద్దల సమక్షంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ నిరాకరించిన ప్రియుడిని కర్రతో చితక బాదింది. ఈ ఘటన అక్కడున్న వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ఇదిలాఉండగా సదరు యువతి ప్రేమ విషయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. -
ప్రేమికుడి కోసం యువతి హల్చల్.. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనే
అనంతపురం సిటీ: తాను ప్రేమించిన ఒంగోలు యువకుడితో పెళ్లి చేయాలంటూ అనంతపురంలో ఓ యువతి ‘సఖి’ సెంటర్లో హల్చల్ చేసింది. తల్లిదండ్రులను చూడగానే రగిలిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వాహకులకు సహకరించకుండా దాడికి యత్నించడం, తాను చెప్పిందే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులపై హుకుం చేస్తూ వీరంగం సృష్టించింది. గుంతకల్లు ప్రాంతంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న ఒంగోలు యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాదిగా వారిద్దరి మధ్య చాటింగ్లు కొనసాగాయి. ఇంతలోనే విషయం ఇంట్లో తెలిసి యువతిని పెద్దలు మందలించారు. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనేనని తెగేసి చెప్పి ఒంగోలు వెళ్లింది. అక్కడ ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కు తిరిగొచ్చింది. చదవండి: ‘హాయ్..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు బావ భరతం పట్టిన మరదలు న్యాయం కోసం ‘సఖి’ని ఆశ్రయించి.. ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ యువతి అనంతపురంలోని సఖి సెంటర్ నిర్వాహకులను గురువారం ఆశ్రయించింది. వారు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించలేదు. ప్రేమించినోడితేనే పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ ఆస్పత్రిపై నుంచి దూకేస్తానంటూ పారిపోయేందుకు యత్నించింది. అడ్డుకోబోయిన ఏఎస్ఐ గోవిందమ్మ, సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బందిపై ఎదురు దాడికి దిగింది. రాత్రంతా ఆమెను కాపలా కాయడం వారికి కష్టతరమైంది. చేసేది లేక ఆ అమ్మాయిని ఓ గదిలో పెట్టి గడియ బిగించారు. అంతే ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా తలుపులను గట్టిగా తన్నడంతో గడియతో సహా ఊడొచ్చాయి. ఊహించని ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు గురైన అధికారులు ‘దిశ’ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా కాపలా కాశారు.\ మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం.. ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే ఇక్కడే చస్తానని బెదిరిస్తూ గురువారమంతా నీళ్లు, ఆహారం ఏమీ తీసుకోకుండా నిరసన ప్రకటించింది. శుక్రవారం కూడా ఆహారం తీసుకోలేదు. తనకు సఖి సెంటర్ నిర్వాహకులు న్యాయం చేయడం లేదంటూ మీడియాకు సమాచారం అందించింది. విలేకరులు వచ్చాక రెండు మూడు గంటల తర్వాత నోరు విప్పింది. తనను ఎదురు ప్రశ్నించకూడదని, తను చెప్పింది మాత్రమే రాసుకోవాలని, రికార్డు చేసుకోవాలని విలేకర్లతోనూ వాగ్వాదం చేసింది. తల్లిదండ్రులు కనిపిస్తే కస్సుమంటోంది... తన ప్రేమ భగ్నం కావడానికి తల్లిదండ్రులు, అక్క,బావలే కారణమనే ఆగ్రహంతో ఊగిపోతున్న యువతి.. సఖి సెంటర్ నిర్వాహకుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారిని చూడగానే రగిలిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసింది చాలు. మీరెళ్లండి. నేను మాత్రం మీ వెంట ఇంటికి రానంటూ చీదరించుకుంది. చేతుల నిండా బ్లేడ్ గాయాలే.. ప్రేమించినోడి కోసం ఆ యువతి రెండు చేతులపై కోసుకున్న గాయాలే కనిపిస్తున్నాయి. వాడి కోసం అవసరమైతే చచ్చిపోవడానికైనా సిద్ధమేనంటూ, తన మనస్సు మార్చేందుకు ఎవరూ ప్రయత్నించొద్దంటూ ‘దిశ’ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ ధరణి కిశోర్ సహా మహిళా పోలీసులు, విలేకర్లతో యువతి వాదించింది. దీంతో గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పకు సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీస్ బృందం కూడా బయలుదేరి వచ్చింది. కౌన్సెలింగ్కు సహకరించడం లేదు యువతి మంకుపట్టు పడుతోంది. కౌన్సెలింగ్కు సహకరించడం లేదు. అబ్బాయితో మాట్లాడి, పిలిపిస్తామని చెప్పినా వినడం లేదు. ఎదురు దాడికి దిగుతోంది. నోటికొచ్చినట్లు తిడుతోంది. నేను, ఏఎస్ఐ, మా సిబ్బంది రెండ్రోజులుగా నిద్రాహారాలు మాని ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం. – శాంతామణి, సఖి సెంటర్ నిర్వాహకురాలు చట్టప్రకారమే ముందుకెళ్తాం యువతి మానసిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు పిల్చుకెళ్తాం. వైద్యుడి సర్టిఫికెట్ రాగానే జడ్జి ఎదుట యువతిని హాజరుపరుస్తాం. ఆ తరువాత జడ్జి ఆదేశిస్తే విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రికి తరలిస్తాం. ఏదైనా చట్టం ప్రకారమే ముందుకెళ్తాం. – ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ, అనంతపురం -
ప్రేమపేరుతో బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు
జూపాడుబంగ్లా(కర్నూలు జిల్లా): ప్రేమ పేరుతో ఓ యువకుడు విద్యార్థినిని కిడ్నాప్ చేశాడు. మండలంలోని తంగెడంచ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంగెడంచ గ్రామానికి చెందిన కుర్వమల్లయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మూడో కుమార్తె వాణి జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. చదవండి: కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి.. అదే గ్రామానికి చెందిన మాబాషా కుమారుడు షేక్ ఫరూక్ గౌండపనిచేస్తుంటాడు. ఈ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించేవాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పటంతో వారు ఆ యువకుడిని మందలించారు. అయితే శనివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన వాణిని..ఫరూక్ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పారిపోయాడు. గ్రామస్తులు గమనించి బాలిక తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు వెంటనే జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మారుతీశంకర్ కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
యువతి ఫోన్ నంబర్ తీసుకుని ప్రేమాయణం.. ఓసారి అబార్షన్ కూడా.. చివరకు
సంతమాగులూరు (అద్దంకి)/ప్రకాశం జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మక్కెనవారిపాలెంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమార్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలి పనులకు కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యువకుడు ఆమెతో మాట కలిపాడు. బైకుపై మీ స్వగ్రామం తీసుకెళ్తానని చెప్పి ఆమె ఇంటి వద్ద దింపాడు. చదవండి: ‘నాన్న, చెల్లి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’ ఈ క్రమంలో యువతి ఫోన్ నంబర్ తీసుకున్న బాజీ ఆ తర్వాత ఫోన్ చేయసాగాడు. మాటమాటా కలిసి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఆమెకు గర్భం రావడంతో దాన్ని తీసి వేయించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బాజీ తిరస్కరించాడు. మనస్తాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీసుస్టేషన్కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువతి వైద్యశాలలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివన్నారాయణ తెలిపారు. -
బొమ్మ తుపాకీతో డ్యాన్సులు.. దిమ్మ తిరిగే షాకిచ్చిన పోలీసులు
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): ఇద్దరు యువకులు ఓ బొమ్మ తుపాకీతో సరదాగా చేసిన హడావుడి.. చివరకు వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అమలాపురం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాంబాబు శుక్రవారం సాయంత్రం ఈ వివరాలను విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన పోలిశెట్టి శివ గంగాధర్ ఏడాది కిందట కాకినాడలో ఏర్పాటు చేసిన ఓ క్రాఫ్ట్ బజారులో రూ.1,500కు ఓ బొమ్మ తుపాకీ కొన్నాడు. దానిని అలంకారంగా ఇంట్లో గోడకు తగిలించాడు. గ్రామంలో గురువారం రాత్రి మరిడమ్మ జాతర జరిగింది. ఆ జాతరకు తన అన్న కొడుకైన ఎనిమిదేళ్ల నందన్తో కలిసి శివ గంగాధర్ వెళ్లాడు. ఆ బాలుడి ముచ్చట పడటంతో వెంట బొమ్మ తుపాకీ కూడా తీసుకు వెళ్లాడు. వారికి దగ్గర బంధువైన పోలిశెట్టి నరసింహమూర్తి కూడా కలిశాడు. జాతరలో ఒక స్టేజీపై యువకులు సినిమా పాటలకు అనుగుణంగా డీజేలతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓ పాటకు అనుగుణంగా శివ గంగాధర్, నరసింహమూర్తి కూడా నృత్యాలు చేశారు. ఆ క్రమంలో బొమ్మ తుపాకీ పైకెత్తి చిందులు వేస్తూ సందడి చేశారు. అయితే నిజమైన తుపాకీతో వారు హల్చల్ చేసినట్టు ఒక టీవీ చానల్తో పాటు సోషల్ మీడియాలో శుక్రవారం ఉదయం వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. చల్లపల్లి చేరుకుని లోతైన విచారణ జరిపారు. చివరకు జాతరకు ఓ చిన్న పిల్లాడితో కలిసి వచ్చిన ఆకతాయిలు ఆ బొమ్మ తుపాకీ పట్టుకుని సరదాగా తిరిగారని తేల్చారు. బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకుని, దానితో జాతరకు వచ్చిన శివ గంగాధర్, నరసింహమూర్తిలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. చెక్క, పల్చటి రేకు గొట్టాలతో ఆట»ొమ్మలా తయారు చేసిన ఆ బొమ్మ తుపాకీని డీఎస్పీ విలేకర్లకు చూపించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్బాబు, ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
పెళ్లి చూపులు ఇష్టం లేక.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): పెళ్లి చూపులు ఇష్టం లేక ఓ యువతి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..కొలిమిగుండ్లకు చెందిన కొప్పురపు శ్రీనివాసులు, భారతి దంపతుల కుమార్తె వైష్ణవి(26) అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యం పల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. చదవండి: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు.. అనారోగ్య కారణంతో ఈనెల 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సెలవు పెట్టుకొని ఇంటి వద్దే ఉంటోంది. పెళ్లి చూపులు చూసేందుకు రెండు మూడు రోజుల్లో వస్తున్నారని కుమార్తెకు తల్లిదండ్రులు చెప్పారు. పెళ్లి చూపులు ఇష్టం లేని వైష్ణవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ హరినాథరెడ్డి చెప్పారు. -
నిజామాబాద్ జిల్లా: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులు
-
యజమాని పైశాచికం.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకిన యువకుడు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూర్ లో తాను నర్మదా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని.. వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నానన్నాడు. అయితే అక్కడ ఇష్టంలేక పని మానేయడంతో.. పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ తనను చితకబాదినట్టు యువకుడు వాపోయాడు. -
ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్పేటలో ఉంటున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు తరుణ్ పట్టణంలో ఫుడ్ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..
ఆదోని రూరల్(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది. చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..? పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్ కాలనీకి చెందిన సురేష్(19) తన బైక్ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు. -
శభాష్ బాబు.. ఆయన చిత్రం సజీవ దృశ్యం
సిరిసిల్ల కల్చరల్: అతను చిత్రం గీస్తే సజీవ దృశ్యం అన్న భావన కలుగుతుంది. అత్యంత అలవోకగా గీసే రేఖాచిత్రాల్లో సైతం అరుదైన సృజనాత్మకతను ప్రదర్శించే నైపుణ్యం ఆయనకే సొంతం. పుస్తకాల ముఖచిత్రాలు, లోపల సందర్భానుసారం వచ్చే బొమ్మలు, వివిధస్థాయిల్లోని రాజకీయ నాయకుల చిత్రపటాలు అతని చేతిలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుంటాయి. పసి వయసు నుంచే పెంచుకున్న అభిరుచి అంచెలంచెలుగా పరిణామం చెంది చెయ్యి తిరిగిన కళాకారుడిగా ఎదిగిన ఆయనే దుండ్రపెల్లి బాబు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని గీసి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యం మా ఊరులో ఉన్న సొంత ఇల్లు, కొంత పొలం, మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణం కారణంగా మునిగిపోయింది. చిన్న కుటుంబం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. నా కళే నా పెట్టుబడి. చేతిలో ఉన్న కళనే పూర్తిగా నమ్ముకున్నా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న. ఎప్పటికైనా సరే అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నది నా సంకల్పం. – దుండ్రపల్లి బాబు పేద కుటుంబం నుంచి తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన దుండ్రపెల్లి లక్ష్మి, దుర్గయ్య రెండోసంతానంగా 1988లో జన్మించా డు బాబు. పేద వ్యవసాయ కుటుంబం. ఆర్థిక వనరుల లేమితో చొప్పదండిలోని తన మేనమామ దగ్గర పెరిగా డు.పదోతరగతి వరకు మంథనిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో, రుక్మాపూర్లో ఇంటరీ్మడియట్ పూర్తిచేసి, జెఎన్టీయూ నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా తనకు ఎంతో ఇష్టమైన బ్యాచ్లర్ ఫైన్ ఆర్ట్స్లో చేరిపోయాడు. 2014లో బీఎఫ్ఏ పూర్తి చేసి ఆరో అనే కంపెనీలో ఇలస్ట్రేటర్గా పార్ట్టైమ్ ఉద్యోగం చేశాడు. మరింత నైపుణ్యాల కోసం ఎంఎఫ్ఏలో చేరాడు. ఇదీ.. బాబు ప్రతిభ 2016లో ఎంఎఫ్ఏ పూర్తయ్యాక పుస్తకాలకు వేసే ముఖపత్రాలకు అందమైన ఇలస్ట్రేషన్ ఇవ్వడంతో పేరు తెచ్చుకున్నాడు. ఓ ప్రవాస భారతీయుడి కోరిక మేరకు ‘చిన్ననాటి ఆటలు. జ్ఞాపకాల మూటలు’ అనే పుస్తకానికి సుమారు 100 చిత్రాలు గీసి ఇచ్చారు. కందుకూరి రాము, శివజాస్తితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇచ్చింది. రామాయణం, మహాభారతం సహా అంతర్జాతీయస్థాయి పుస్తకాలకు వేసిన చిత్రాలు ఆదరణ పొందాయి. భారతీయ నేపథ్య వస్త్రాలంకరణతో రూపొందించిన రాజులు, చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నేతలు సుమారు 500 క్యారెక్టర్ల చిత్రాలు మంచి ప్రజాదరణ పొందాయి. మరో వందచిత్రాల రూపకల్పన కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్రాలకు సంబంధించిన స్టోరీబోర్డు వర్క్లో బిజీగా ఉంటున్నాడు. సినిమాకు సంబంధించిన చిత్రానువాద స్క్రిప్ట్తో చిత్రాలకు అక్కడికక్కడే గీసి ఇవ్వడం మనోడి ప్రత్యేకత. -
విషాదం: లండన్ నుంచి వచ్చి.. స్నేహితులతో గడిపి.. అంతలో ఏమైందో..
కడప అర్బన్/చెన్నూరు: కమలాపురం నియోజక వర్గం చెన్నూరు మండలం రామనపల్లెకు చెందిన అటవీశాఖ రాష్ట్ర డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, చంద్రమోహన్రెడ్డి ఏకైక కుమారుడు రామన విష్ణు సాయిరెడ్డి (24) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కడప– కృష్ణాపురం రైలు మార్గంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కడప రైల్వే పోలీసులు తెలిపిన కథనం మేరకు ఆదివారం ఉదయం ఓ యువకుడు రైలు కిందపడి చనిపోయాడని సమాచారం అందింది. రైల్వే ఎస్ఐ రారాజు తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అక్కడ వారికి లభించిన ఆధారాల మేరకు మృతదేహం రామన శ్రీలక్ష్మి, చంద్రమోహన్రెడ్డి కుమారుడు రామన విష్ణుసాయిరెడ్డిదిగా గుర్తించారు. చదవండి: బ్యాంకు ఉద్యోగి వక్రబుద్ధి.. జల్సాలు.. అడ్డదారులు.. చివరికి కటకటాలు తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా రామన విష్ణుసాయిరెడ్డి లండన్లో ప్రస్తుతం చదువుకుంటూ ఉండేవాడు. సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి గడిపాడని, అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. తెల్లారేసరికి విగతజీవుడై కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. అతని మృతికి కారణం తెలియరాలేదు. రామన శ్రీలక్ష్మి కుటుంబానికి నేతల పరామర్శ అటవీశాఖ రాష్ట్ర డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి కుటుంబసభ్యులను నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్బాషా, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డిగారి మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ అధ్యక్షుడు పులి సునీల్కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు మసీమబాబు, ఆర్.వి.ఎస్.ఆర్, వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్రెడ్డి, కడప మార్కెట్యార్డ్ చైర్మన్ జిఎన్ భాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ ముదిరెడ్డి దిలీప్రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్బాబు, ఎంపీటీసీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సొట్టం నారాయణరెడ్డి తమ ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీలక్ష్మి కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. -
పోర్న్ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’..
అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను పోర్న్ భూతం చిదిమేస్తోంది.. అరచేతిలోకి వచ్చిన స్మార్ట్ఫోన్ అశ్లీల సైట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.. కల్లాకపటం ఎరుగని పిల్లల మనసులో కల్మషం నింపుతోంది.. ఆన్లైన్ క్లాసుల కోసం అందించిన సెల్ఫోన్ పసి హృదయాలపై నీలి చిత్రాల విషం చిమ్ముతోంది.. పోర్న్ వీక్షణం లేత వయసులోనే వ్యసనంగా మారుతోంది. బిడ్డల బంగారు భవితను నిర్ధాక్షిణ్యంగా కాలరాచేస్తోంది.. ముఖ్యంగా నూనూగు మీసాల ప్రాయం మహమ్మారికి బానిసగా మారుతోంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత.. పలమనేరుకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 14వ తేదీన ఇద్దరు బాలురు (13, 14 ఏళ్లు) ఓ బాలిక(12)పై లైంగిక దాడికి యత్నించారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేరానికి పాల్పడిన పిల్లలు సెల్ఫోన్లో పోర్న్ వీడియోలను చూసేవారని తేలింది. నీలి చిత్రాల వీక్షించే ఈ బాలురు పెడదోవ పట్టినట్లు తెలిసింది. చిత్తూరు కలెక్టరేట్: నేటి సమాజంపై పోర్న్ సైట్లు విష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువతను బానిసలుగా మార్చుకుంటున్నాయి. కట్టుదప్పిన బాల్యాన్ని సులువుగా లొంగదీసుకుంటున్నాయి. ఈ సైట్లను చూసే వారిలో 20 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. 15 ఏళ్ల లోపు వారిలో 70శాతం మంది పోర్న్ మత్తులో చిక్కినట్లు వివరిస్తున్నాయి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలను మించి నీలి చిత్రాలను చూడడం పెద్ద వ్యసనంగా మారుతోందని పేర్కొంటున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరి యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక వైద్య నిపుణులు కోరుతున్నారు. టీనేజ్లోకి అడుగుపెట్టిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని, ప్రత్యేక గుర్తింపు కోసం తహతహలాడుతుంటారని, స్నేహితులకు అధిక ప్రాధాన్యమిస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో వారికి సెల్ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే పోర్న్సైట్లకు సులువుగా అలవాటు పడతారని హెచ్చరిస్తున్నారు. స్నేహ హస్తం అందించాలి టీనేజ్ పిల్లలు వయసు ప్రభావంతో సహజసిద్ధంగా వచ్చే శారీరక, మానసిక పరిణామాలను అర్థం చేసుకోలేక తీవ్రమైన అలజడికి గురవుతారు. ఈ దశలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలవాలి. వారి సమస్యలను ఓపికగా విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు యత్నించాలి. మాట వినడంలేదని కఠినంగా వ్యవహరించకూడదు. వారి తప్పులను గుర్తించి సున్నితంగా హెచ్చరించాలి. లోపించిన పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం వల్లే పిల్లలు కట్టుదాటుతున్నారు. అశ్లీల చిత్రాలను వీక్షించి విపరీత పోకడలకు అలవాటు పడుతున్నారు. ఉన్నత భవిష్యత్ను పణంగా పెట్టి పోర్న్ మహమ్మారి వలలో చిక్కుతున్నారు. ఆన్లైన్ మాయలో పడి జీవితాన్ని అంధకారబంధురం చేసుకుంటున్నారు. బ్రౌజింగ్ వ్యసనం ప్రస్తుత సమాజంలో యుక్తవయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగకపోవడం పలు అనర్థాలు హేతువుగా నిలుస్తోంది. పిల్లలను చిన్న తరగతుల్లోనే హాస్టళ్లలో చేరి్పంచడం వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లోనూ స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా మారింది. ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల చేతికి ఫోన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా బ్రౌజింగ్ వ్యసనంగా మారింది. తల్లిదండ్రులు ఏమాత్రం అలసత్వం వహించినా అది పిల్లల భవితకు శాపంగా మారే ప్రమాదముంది. నిబంధనలు పాటించాలి ఇంటర్నెట్ సెంటర్లలోపోలీసు శాఖ సూచించే నియమ నిబంధనలను పాటించాలి. మైనర్లను తల్లిదండ్రులు లేకుండా ఇంటర్నెట్ సెంటర్లలోకి అనుమతించకూడదు. ప్రస్తుతం అందరి దగ్గర స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. చిన్నారులు, విద్యార్థులు సెల్ఫోన్లకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేకశ్రద్ధ వహించాలి. అత్యవసరమైతే తప్ప మొబైల్ డేటా వేయకపోతే మంచిది. పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. క్రీడలు, సంగీతం వంటి వాటిపై ఆసక్తిని పెంపొందించాలి. ఫోన్ ఇచ్చేటప్పుడు పిల్లలకు అవసరమైన యాప్లను మాత్రమే అందుబాటులో ఉంచాలి. ఎడ్యుకేషన్ యాప్స్, పిల్లల కథలు, పాటలు వంటి వాటిని మాత్రమే సెట్ చేసి ఇవ్వాలి. యాప్లకు లాక్లు పెట్టి ఇస్తే వారు ఏ ఇతర వివరాలను చూసేందుకు వీలు ఉండదు. అవగాహన లోపంతోనే.. అవగాహన లేకనే పిల్లలు పెడదారి పడుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసుల కారణంగా అందరి దగ్గరా సెల్ఫోన్లు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులకు సోషల్మీడియా చూడడం వ్యసనంగా మారుతోంది. ఈ క్రమంలోనే పోర్న్సైట్లకు సైతం అలవాటుపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్ ఇచ్చేటప్పుడు అన్వాంటెడ్ బ్రౌజింగ్ చేయకుండా లాక్ చేసివ్వాలి. – జయకుమార్, సైకాలజిస్ట్, మదనపల్లె నెట్ సెంటర్లపై నిఘా నెట్ సెంటర్లపై సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో తల్లిదండ్రులు నియంత్రణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్లో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ఫోన్ ఇవ్వకపోవడం మంచిది. ఫోన్లో విద్యార్థులకు అవసరమైన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంచాలి. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. ఇంటి నుంచి తీసుకెళ్లి..
అనంతపురం క్రైం: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం నందమూరి నగర్కు చెందిన నల్లబోతుల రాజేష్ (33), సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. సుందరయ్య కాలనీకి చెందిన గురుమూర్తి, బాలరాజు... రాజేష్కు స్నేహితులు. గురుమూర్తి ఇంటి నిర్మాణ పనులను రాజేష్ పూర్తి చేయించాడు. ఆ సమయంలోనే గురుమూర్తి భార్య, రాజేష్ మధ్య చనువు పెరిగింది. ఈ విషయంగా రెండు నెలల క్రితం రాజేష్తో గురుమూర్తి గొడవపడ్డాడు. చదవండి: పబ్కు మాజీ ప్రియురాలిని పిలిచి.. రాజేష్లో మార్పు రాకపోవడంతో కడతేర్చాలని భావించాడు. శుక్రవారం (ఈ నెల 17న) సాయంత్రం రాజేష్ను ఇంటి వద్ద నుంచి బాలరాజు, గురుమూర్తి కలిసి ద్విచక్ర వాహనంపై పిలుచుకెళ్లారు. చీకటి పడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో సుజాత ఫోన్ చేసింది. తామంతా మందు పార్టీలో ఉన్నామని, త్వరగా ముగించుకుని వస్తానని రాజేష్ తెలిపాడు. రాత్రంతా అతను ఇంటికి చేరుకోలేదు. శనివారం ఉదయం కామారుపల్లి సమీపంలోని లే అవుట్లో వ్యక్తిని చంపి పడేశారన్న అందిన సమాచారం మేరకు ఇటుకలపల్లి సీఐ విజయభాస్కరగౌడ్, రూరల్ ఎస్ఐ మహానంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మెడపై కొడవలితో నరికినట్లుగా గాయాలున్నాయి. విషయం తెలుసుకున్న సుజాత అక్కడకు చేరుకుని మృతదేహం రాజేష్దేనని ధ్రువీకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..
సాక్షి, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్గా గుర్తించారు. చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..! స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొంత కాలంగా హైదరాబాద్కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కొద్దిరోజులుగా ఆ అమ్మాయి నరేష్తో మాట్లాడటం లేదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటి వద్ద బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి..
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వివాహితతో పాటు యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజుల పాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె మరిది పరారయ్యాడు. కౌలంద పోలీసుల వివరాల మేరకు... నంజనగూడు తాలూకాకు చెందిన వివాహితకు కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని.. మూడు రోజుల క్రితం విష్ణు యథావిధిగా వివాహిత ఇంటికి వచ్చాడు. అతను ఇంటిలోకి వెళ్లగానే బయటి నుంచి భర్త తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి వారిని బయటకు తీసుకువచ్చి కరెంట్ స్తంభానికి కట్టేశారు. మూడు రోజుల పాటు ఆహారం, నీరు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశాడు. కొందరు యువకులు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. పోలీసులు వచ్చి స్పృహ తప్పిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. -
బాలికతో ప్రేమ.. సోషల్ మీడియాలో పరిచయమై.. మాయమాటలు చెప్పి..
తిరువళ్లూరు(తమిళనాడు): మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ వ్యవహారం నడిపిన ఓ యువకున్ని తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 18వ తేదీ నుంచి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరువణ్ణామలై జిల్లా దూశీ సమీపంలోని హనుమంత పేటలో బాలిక ఓ యువకుడితో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. ‘ఆ 4 రోజుల్లో ఏం జరిగింది?’ అనంతరం ఆ యువకుడిని విచారించగా తిరువణ్ణామలైకు చెందిన గోపీ(21) అని తేలింది. ఆ యువకుడితో బాలికకు సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు బాలికను తిరువణ్ణామలైకు తీసుకెళ్లినట్లు తెలిసింది. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: ‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను ఉండలేకపోతున్నా’ -
పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): పెళ్లి చేసుకుంటానంటూ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పెజ్జోనిపేటకు చెందిన యువతి ఒక ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తోటి విద్యార్థి సుహృద్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడి చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ యువతి ఒత్తిడి చేయడంతో సుహృద్ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కాల్పుల కలకలం.. ఎయిర్గన్ మిస్ఫైర్
సాక్షి, సిద్ధిపేట: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిన్ గన్ మిస్ఫైర్ కావడంతో వ్యక్తి మృతి చెందాడు. ఫజిల్ అనే వ్యక్తి ఇంటికి హైదరాబాద్ నుంచి స్నేహితులు రాగా, రాత్రి జరిగిన పార్టీలో ఎయిర్గన్ మిస్ఫైర్ అయ్యింది. గోడకు పాయింట్ రంథ్రం ఏర్పాటు చేసిఎయిర్ గన్తో పైరింగ్ చేస్తుండగా, ఎయిర్గన్లో ఒక బుల్లెట్ గోడకు తగిలి తిరిగి రివర్స్లో వెనక్కు వచ్చి యువకుడి తలకు బలంగా తగలడంతో మృతి చెందడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. -
‘క్షమించండి.. నా ఫోన్ అమ్మి అంత్యక్రియలు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ఓ బాలుడు ఆత్మహత్య బహదూర్పురాలో కలకలం రేపింది. వారం రోజుల క్రితం గుండెపోటు రావడంతో తనవాళ్లకు చెబితే భయపడతారని ఆందోళన చెందిన ఆ బాలుడు మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి పూర్తిచేసిన ఆ బాలుడు. చనిపోయే ముందు తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాశాడు. ‘‘అమ్మా, నాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మలి వదిలి వెళ్తున్నాను. నన్ను మర్చిపోండి.. నా ఫొన్ అమ్మి నా అంత్యక్రియలు నిర్వహించండి. అప్పుడే నా ఆత్మకు శాంతి జరుగుతుందంటూ’ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. -
గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు
గుత్తి: పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప(25) అనే యువకుడు వినాయక మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. పట్టణంలోని స్వీపర్స్ కాలనీకి చెందిన ఓబుళమ్మ కుమారుడు పెద్ద కుళ్లాయప్ప శనివారం రాత్రి 11 గంటల సమయంలో స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మంటపానికి వెళ్లాడు. అక్కడే సుమారు గంటన్నర పాటు గడిపాడు. తర్వాత మంటపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయి ఉండొచ్చని మృతదేహాన్ని పరీక్షించిన వైద్యులు తెలిపారు. సీఐ రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి: కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం? -
యువకుడిని కొట్టి చంపిన ఏఆర్ కానిస్టేబుల్
ఆటోనగర్(విజయవాడతూర్పు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలిసి.. ఓ యువకుడిని కొట్టి చంపాడు. బుధవారం తెల్లవారుజామున విజయవాడ అయ్యప్పనగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ముక్కు వెంకటేష్(23), ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు అయ్యప్పనగర్లో ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. వెంకటేష్కు వివాహం కాలేదు. డిస్టెన్స్లో ఎంబీఏ చదువుతున్నాడు. తన భార్య, వెంకటేష్ కలివిడిగా ఉండటాన్ని నాగరాజు గమనించి ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించాడు. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఇంటి యజమాని రత్నసాయి చూశాడు. డ్యూటీలో ఉన్న నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన నాగరాజు, రత్నసాయి కలిసి వెంకటేష్పై రాడ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న వెంకటేష్ను స్థానికులు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు సీఐ రావి సురేష్రెడ్డి తెలిపారు. నాగరాజుతో పాటు, రత్నసాయి, ఆయన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
దిక్కుతోచని స్థితిలో యువతి.. సాయం చేస్తామని చెప్పి..
సాక్షి, విశాఖపట్నం: డ్రాప్ చేయమన్న యువతి వద్ద నుంచి బంగారం, డబ్బులు, సెల్ఫోన్ లాక్కొని పరారైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన జరిగిన ఆరు గంటలలోపే నిందితులను పట్టుకొని వారి నుంచి మొత్తం సొత్తు రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బెంగళూరుకు చెందిన అంజలి బెహ్రా(26) తన ఇద్దరి స్నేహితులతో విశాఖ సందర్శనకు వచ్చింది. వారు ఒక హోటల్లో దిగారు. ఆమె స్నేహితులు శనివారం సాయంత్రం 6.30 గంటలకు వెళ్లిపోయారు. ఈమె రాత్రి 9 గంటలకు విమానంలో బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు ఆమె హోటల్ సిబ్బంది సహాయం కోరింది. అక్కడ పనిచేస్తున్న కళ్యాణ్ బైక్ మీద ఆమెను ఎయిర్పోర్టుకు డ్రాప్ చేశాడు. దారిలో ఆ యువతికి తెలియకుండా తన స్నేహితుడు ఎండీ జాఫర్ను ఎయిర్పోర్ట్కి రప్పించాడు. విమానం మిస్ అవ్వడంతో ఏమిచేయాలో దిక్కుతోచక స్థితిలో ఉన్న ఆమెను తిరిగి హోటల్కి డ్రాప్ చేయమని తన స్నేహితుడికి చెప్పి కళ్యాణ్ వెళ్లిపోయాడు. అతడు అడవివరంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె నుంచి డబ్బులు, బంగారం, సెల్ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఆ రూట్లో వస్తున్న వాహన చోదకులు ట్రాఫిక్ పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ మంతెన భరత్కుమార్రాజు హుటాహుటిన సిబ్బందితో వెళ్లి ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీ పుటేజీల ద్వారా నిందితులను పట్టుకుని క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు వారి నుంచి రూ.10 వేలు, బంగారం గొలుసు, రింగు, సెల్ఫోన్ రికవరీ చేసి యువతికి అందజేశారు. సంఘటన జరిగిన ఆరు గంటలలోనే నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ మనీష్కుమార్ సిన్హా అభినందించారు. నిందితులను గోపాలపట్నం పోలీస్స్టేషన్లో విచారిస్తున్నట్లు సీపీ తెలిపారు. -
పోలీసోడి పాడుపని.. యువతితో పరిచయం పెంచుకుని..
మైసూరు(కర్ణాటక): పోలీసు ఇన్స్పెక్టర్.. యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైసూరు నగరంలోని కృష్ణరాజ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధిత యువతి.. ఇన్స్పెక్టర్ మీద ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం... యువతిపైన లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి విజయపుర (బిజాపుర)లో కేఎస్ఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తాయణ్ణ ధనసాగర్. గతంలో ఎస్ఐగా ఉన్న తాయణ్ణ ఫేస్బుక్ ద్వారా మైసూరుకు చెందిన యువతితో పరిచయం పెంచుకుని ఆమెతో రోజూ చాటింగ్ చేసేవాడు. తరువాత ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడేవారు. గోవాకు విహారయాత్రలు.. కొన్నాళ్లకు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పడంతో యువతి నిజమేనని భ్రమించింది. యువతిని గోవాతో పాటు పలు విహార యాత్రలకు తీసుకెళ్లి శారీరకంగా వినియోగించున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో, నిన్ను పెళ్లి చేసుకోను. నాకు ఇప్పటికే పెళ్లయింది అని చావుకబురు చెప్పాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత యువతి కృష్ణరాజ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నా కుమార్తెనే ప్రేమిస్తావా అంటూ..
హోసూరు(కర్ణాటక): తమ కుమార్తెనే ప్రేమిస్తావా అంటూ యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనో వేదనకు గురై యువతి పురుగుల మందు తాగి ఆస్పత్రిపాలైంది. వివరాలు.. హోసూరు జయశక్తినగర్కు చెందిన యువకుడు హోసూరులోని ప్రైవేట్ కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు. మత్తిగిరి కూడలిరోడ్డుకు చెందిన 18 ఏళ్ల యువతి కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరులోని కళాశాలలో బీకాం చదువుతోంది. వీరిద్దరూ హోసూరులో చదివేటప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఈనెల 11న యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అవమానం భరించలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మనోవేదనకు గురైన యువతి ఈనెల 13న పురుగుల మందు తాగడంతో హోసూరులోని ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
విషాదం: మేమెలా బతికేది నాయనా..?
నగరి(చిత్తూరు జిల్లా): మునిసిపల్ పరిధి, సత్రవాడ దళితవాడకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మృతిచెందారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. దళితవాడు చెందిన సుధాకర్ (25), దళపతి (25) రోజు వారి కూలీలు. బుధవారం రాత్రి అడవికొత్తూరు దళితవాడలో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో భారీ వర్షం వచ్చింది. తలదాచుకోవడానికి అక్కడే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు. అప్పటికే వర్షానికి షెడ్డు పక్కనే ఉన్న స్టే వైరులో విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తీగ తగలడంతో షాక్కు గురయ్యారు. కొంతసేపటి తర్వాత వారు అక్కడే పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుధాకర్కు భార్య, నలుగురు కుమారులు, దళపతికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది. ఎలా బతికేది..? రోజూ కూలికెళ్లినా మహరాజుల్లాగా చూసుకున్నారు. కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఆదుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఇబ్బందీ లేకుండా తోడుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఇక మాకు దిక్కెవరు దేవుడా.. అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విగత జీవులుగా పడి ఉన్న తండ్రులను చూసి పిల్లల మనసు చలించి పోయింది. ఇక మేమెలా బతికేది నాయనా..? అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. -
ఏం జరిగిందో.. ఏమో.. ఉప్పుటేరులో దూకి..
కలిదిండి(కైకలూరు)/కృష్ణా జిల్లా: గుర్వాయపాలెం శివారు మద్వానిగూడేనికి చెందిన మేడే ఝాన్సీ(19) గురువారం గ్రామ సమీపంలోని ఉప్పుటేరు వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కలిదిండి పోలీసులు తెలిపారు. మేడే శేఖర్బాబు, మేరీల కుమార్తె అయిన ఝాన్సీ కైకలూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్
తిరుపతి క్రైం: పెళ్లి పేరుతో యువతి మోసం చేసి తనను దోచేసిందని ఒక యువకుడు అలిపిరి పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ పరమేశ్వర్నాయక్ కథనం మేరకు.. విజయపురం మండలం నారపురాజు కండ్రికగకు చెందిన సునీల్కుమార్ (29) మార్కెట్ జాబ్ చేసుకుంటూ ఐదేళ్లుగా సత్యనారాయణపురంలో ఉంటున్నా డు. అతనికి ఏడీబీ ఫైనాన్స్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎం.సుహాసినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథ అని చెప్పడంతో గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. సునీల్కుమార్ పెద్దలు 20 గ్రాముల బంగారు నగలు సుహాసినీకి తీసిచ్చారు. కొద్దిరోజుల క్రితం తనను చిన్నప్పటి నుంచి చూసుకున్న వారికి ఆరోగ్యం సరిగాలేదని, తాను పెళ్లికి ముందు కొన్ని అప్పులు చేశానని చెప్పి రూ.4 లక్షలు, వాళ్ల మామ వద్ద రూ.2 లక్షలు ఇప్పించుకుంది. ఈ విషయాలు తెలుసుకుని ఈ నెల 7న ఇంట్లో వారు నిలదీయడంతో మరుసటి రోజు నుంచి ఆమె కన్పించకుండా పోయింది. ఆధార్కార్డు ఆధారంగా నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై కుమార్తె ఉన్నట్లు సునీల్కుమార్ గుర్తించాడు. ఇదిలా ఉండగా సుహాసిని ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్నానని, త్వరలోనే డబ్బులు ఇస్తానని, పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరించింది. ఏడాదన్నర క్రితం మరో పెళ్లి కూడా చేసుకున్నట్లు సునీల్కుమార్ సెల్కు ఫొటోలను వాట్సాప్ చేసింది. వీటిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సునీల్కుమార్ అలిపిరి పోలీసులను అశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: గుంటూరులో సైకో వీరంగం దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నేత మృతి
సాక్షి, ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆరుట్ల విక్రమ్రెడ్డి విశేష కృషి చేశారు. యూత్ విభాగాన్ని బలోపేతం చేయడంలో అహర్నిశలు శ్రమించారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందినట్లు తెలియడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చినా విక్రమ్రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదినుంచీ ఆయన వైఎస్సార్సీపీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసేవారు. విక్రమ్రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం ప్రకటించింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలియడంతో హైదరాబాద్కి వెళ్లి ఆమెకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని చెప్పి వచ్చారు. అనూహ్యంగా విక్రమ్రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం కలచివేసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కన్నీటి పర్యంతమయ్యారు. విక్రమ్రెడ్డి స్వగ్రామం పదిరలో తీవ్ర విషాదం నెలకొంది. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సింగిల్విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేశ్గౌడ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నర్సయ్య, తిరుపతిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. స్వగ్రామంలో విక్రమ్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి అన్నారు. చదవండి: తల్లీకొడుకులపై పిడుగు -
ఎవరెస్ట్ ఎక్కిన విశాఖ యువకుడు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ (28) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మార్షల్ ఆర్ట్స్లో ప్రపంచ చాంపియన్ అయిన అన్మిష్ ఈ నెల 1న ఈ ఘనత సాధించాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన ప్రపంచ కిక్ బాక్సింగ్, కరాటే యూనియన్ చాంపియన్ షిప్స్లో 2018 గ్రీస్లోను, 2019 ఆ్రస్టియాలోను గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. 2017లో పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్న అన్మిష్ ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారు. అనంతరం వింటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద –40 డిగ్రీలు ఉన్న సమయంలో లద్దాక్లో మంచు పర్వతాన్ని ఎక్కారు. 2020లో లాక్డౌన్కు ముందు ఆఫ్రికాలోని కిలిమంజారో, దక్షిణ అమెరికాలో అకాన్కాగువా పర్వతాలను అధిరోహించి.. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ(గండికోట) సహకారంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన కల నెరవేర్చుకున్నాడు. చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్ -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి..
అనంతపురం క్రైం: క్రికెట్ బెట్టింగ్.. పేకాట.. ప్రేమ, పెళ్లి ముసుగులో దగా.. 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ.5లక్షల వరకు వసూలు.. గంజాయి వ్యాపారం.. ఇలా ఒకటేమిటి, ఎన్నో విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నియవంచకుడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ గంజాయి, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగరంలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. నగరంలోని భైరవనగర్లో నివాసముంటున్న భరత్ రెడ్డి బీటెక్ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. క్రికెట్ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు. సరిపడా డబ్బులు, సంపాదన లేకపోవడంతో నూతన పంథా ఎంచుకున్నాడు. ఫేస్బుక్, టిండర్ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్ ఐడీలతో అకౌంట్లు సృష్టించాడు. వీటిలో భరత్ రెడ్డి పేరుకు బదులుగా సిద్ధార్థ రెడ్డి అని పేరు.. అతని ఫొటోకు బదులుగా ఓ అందమైన వ్యక్తి ఫొటోను ప్రొఫైల్గా పెట్టుకున్నాడు. అలా అమ్మాయిలను పరిచయం చేసుకుని నిరంతం వాట్సాప్ చాటింగ్, వాయిస్ కాల్స్ కొనసాగించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నగ్న దృశ్యాలు, రికార్డ్లు సేకరించాడు. మోసపోయిన 20 మందికి పైగా యువతులు ఫేస్ బుక్, టిండర్ యాప్, మ్యాట్రిమోనీ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. అమ్మాయిల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బును తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రాబట్టుకున్నాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిలు భరత్ వలలో మోసపోయారు. వీరిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు.. స్టాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం. రహస్యంగా నగ్న వీడియోల చిత్రీకరణ అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. దీంతో పాటుగా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం వన్టౌన్లో కిడ్నాప్ కేసు, టూటౌన్లో గ్యాంబ్లింగ్ కేసులున్నాయి. అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు విచారణలో నయవంచన బాగోతం వెలుగు చూసింది. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదం సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్ల ద్వారా అమ్మాయిలను వంచించడం పరిపాటిగా మారింది. వాట్సాప్ చాటింగ్లు, వాయిస్ కాల్స్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదమని గుర్తించాలి. భరత్ రెడ్డి బాధితులెవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులను సంప్రదించండి. మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ ఎస్ఓఎస్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. – బి.సత్యయేసుబాబు, ఎస్పీ చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి -
నేను చనిపోతున్నా.. కలకలం రేపిన యువకుడి మెసేజ్
ఉరవకొండ: ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు.. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమయస్ఫూర్తితో కదిలారు. గంటపాటు ఉరుకులు పరుగులు తీశారు. ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడి ఆచూకీ కనిపెట్టి రక్షించారు. ఓ కుటుంబానికి మేలు చేశారు. వివరాల్లోకి వెళితే.. విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన పృథ్వీరాజ్ బుధవారం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. అనంతరం తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా మెసెజ్ పంపి సెల్ స్వీచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన యువకుడి తండ్రి వేణుగోపాల్ పాల్తూరు ఎస్ఐ రాజేశ్వరికి ఫిర్యాదు చేశాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని సీఐ శేఖర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన సీఐ వెంటనే పాల్తూరు, ఉరవకొండ, వజ్రకరూరు ఎస్ఐలను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ముగ్గురు ఎస్ఐలు తీవ్రంగా గాలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వజ్రకరూరు మండలం చిన్నహోతూరు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద యువకుడి ఆచూకీ కనిపెట్టారు. అప్పటికే కాలువలో దూకేందుకు సిద్ధంగా ఉన్న యువకుడిని నిలువరించిన ఎస్ఐలు.. అతన్ని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దీంతో సీఐ శేఖర్ యువకుడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత యువకుడికీ నచ్చజెప్పి ఇంటికి పంపారు. ఫిర్యాదు అందిన గంటలోపే యవకుడిని కాపాడిన సీఐ, ముగ్గురు ఎస్ఐలను ఎస్పీ సత్యయేసుబాబు ఫోన్లో అభినందించారు. చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన ఎంతటి విషాదం: నవ దంపతులు కరోనాను జయించారు.. కానీ -
తన చావుకు వారే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి..
సీతానగరం: మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన బేదంపూడి కిరణ్కుమార్ (26) తన అత్తమామలు కొట్టారని కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుధవారం ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఇనుగంటివారిపేటకు చెందిన కిరణ్ కుమార్కు ముగ్గళ్లకు చెందిన పోశివేణితో అయిదేళ్ల క్రితం వివాహం అయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణతో మృతుని భార్య ముగ్గళ్లలోని పుట్టింటికి వెళ్లింది. మంగళవారం కిరణ్కుమార్ తన భార్యను తీసుకువెళ్లడానికి అత్తింటికి వెళ్లగా అత్త నక్కా పోశిరత్నం, మామ వెంకటరత్నం దూషించి, కొట్టారని మనస్థాపంతో ముగ్గళ్ల శివాలయం వద్ద గల చెత్త నుంచి సంపద కేంద్రం వద్దకు చేరుకుని తన చావుకి అత్తమామలే కారణం అంటూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియో వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేశాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా మంగళవారం రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి సమాచారంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధాకర్ తెలిపారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
అగ్గిపెట్టె వివాదం.. హత్యకు దారితీసింది
కావలి(నెల్లూరు జిల్లా): యువకులైన రెండు బ్యాచ్లు వేర్వేరుగా మద్యం సేవిస్తున్నారు. ఒక బ్యాచ్లోని ఒకడు మరో బ్యాచ్ వద్దకు వెళ్లి అగ్గిపెట్టె అడిగాడు. అక్కడ మొదలైన వివాదం, ఓ యువకుడి హత్యకు దారితీసింది. కావలిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు కావలి టూ టౌన్ పోలీసుల కథనం మేరకు.. కావలి పట్టణంలో ఉన్న కో–ఆపరేటివ్ కాలనీలోని తాళాలు వేసి ఉన్న ఓ విద్యాసంస్థల ప్రాంగణంలోకి గోడలు దూకి కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. వారిలో చంద్రశేఖర్ అనే యువకుడు అగ్గిపెట్టె కోసం మరో బ్యాచ్ వద్దకు వెళ్లాడు. వారి మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదంలో షేక్ జమీరుద్దీన్ (25) మరణించాడు. ఈ మేరకు మృతుడి తండ్రి పోలీసులకు తన కుమారుడైన షేక్ జమీరుద్దీన్ను బోగిరి నిఖిల్ పట్టుకోగా, కాకి రాహూల్ బీరు బాటిల్తో గొంతులో పొడిచి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మృతు ని స్నేహితుడై పృధ్వీరాజ్ తీవ్రగాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై టి.అరుణకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి అరెస్ట్ ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
విషాదం: ఐస్క్రీమ్ తిన్న కొద్దిసేపటికే..
సాక్షి, హైదరాబాద్: నాచారంలో విషాదం చోటు చేసుకుంది. ఐస్క్రీమ్ తిన్న కొద్దిసేపటికే సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీ ద్వారా కేజీ ఐస్క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో మరణించాడు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చదవండి: వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు! Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం -
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
పాడేరు: ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్తో పాటు ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు. మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జయకుమార్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి గ్రామానికి చేరుకొని.. కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది.. -
హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి..
టీ.నగర్: నాగర్కోవిల్ టౌన్ రైల్వేస్టేషన్లో గోనెసంచిలో దూరి నిద్రిస్తున్న యువకుడు హత్యకు గురైనట్లు వాట్సాప్లో వ్యాపించిన సమాచారం సంచలనం రేపింది. మొదటి ప్లాట్ఫాంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. రెండో ప్లాట్ఫాంలో మాత్రమే రైళ్లు వచ్చి వెళతాయి. ఉదయాన్నే అనేక మంది ఇక్కడికి వాకింగ్కు వస్తుంటారు. శనివారం ఉదయం వాకింగ్కు రాగా కొంతమంది ఒకటో ప్లాట్ఫాం సమీపంలో పసుపురంగు గోనెసంచిలో శరీరమంతా మూసుకుని ఒకరు కనిపించారు. ఉదయం ఎనిమిది గంటలకు అలాగే పడివుండడంతో గోనెసంచిలో యువకుడి శవం అంటూ వాట్సాప్లో పలువురు షేర్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచిన యువకుడు పక్కనున్న పాదరక్షలు వేసుకుని నడిచివెళ్లాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని నవ్వుకుంటూ వెళ్లారు. వాట్సాప్ సమాచారం ఎంతపని చేస్తాయనుకుంటూ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. చదవండి: మితిమీరిన కారు వేగం.. తెగిపడిన యువకుడి తల ఇండియా బుక్లోకి ‘ఎన్నికల వీరుడు’ -
హత్య కేసు: గుర్తు తెలిపిన తాళం చెవి!
కరప(తూర్పుగోదావరి): నడకుదురు శివారున యానాం బైపాస్ రోడ్డులో హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి వివరాలు వెల్లడైనట్టు తెలిసింది. నడకుదురు – కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామాల మధ్య తుమ్మ చెట్ల గుంపులో గుర్తు తెలియని దుండగులు ఇటీవల ఓ వ్యక్తిని పెట్రోలు పోసి, తగులబెట్టిన విషయం పాఠకులకు విదితమే. సంఘటన స్థలాన్ని, పరిసరాలను పోలీసులు మూడు రోజులుగా జల్లెడ పట్టినా కొంచెం కూడా క్లూ దొరకలేదు. దీంతో ఈ హత్య కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హతుడిని రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పేపకాయల సతీష్కుమార్(35)గా గుర్తించారని తెలిసింది. ‘గుర్తు తెలియని యువకుని హత్య’ శీర్షికన ఈ నెల 17న వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన హతుని భార్య, పిల్లలతో కలసి ఘటనా స్థలాన్ని, హతుని మృతదేహాన్ని పరిశీలించింది. హతుని మొలకు ఉన్న తాళం చెవి ఆధారంగా అతడు సతీష్కుమార్ అని గుర్తించింది. అతడు కాకినాడ వెళ్లి వస్తానని ఈ నెల 15న ఇంటి వద్ద చెప్పి, వెల్ల నుంచి సైకిల్పై బయలుదేరాడు. అదే గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సైకిల్ ఉంచి వెళ్లాడు. అప్పటి నుంచీ తిరిగి రాలేదు. హతుని వద్ద లభ్యమైన తాళం చెవితో అతడి సైకిల్ తాళం తెరచుకుంది. హతుడి చేతిపై పాత గాయాలు, దుస్తుల ఆధారంగా కూడా అతడు సతీష్కుమారేనని గుర్తించారు. అతడు కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతుండడంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అతడికి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని అంటున్నారు. గతంలో అతడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడని చెబుతున్నారు. సతీష్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. అయితే ఈ విషయాలను పోలీసులు ధ్రువీకరించలేదు. ఇంతవరకూ హతుని, హంతకుల వివరాలు తెలియలేదని కరప ఎస్సై డి.రామారావు చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తామని అన్నారు. చదవండి: చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. దారుణం: బాత్రూమ్ గుంతలో మొండెం, కాళ్లు.. -
కవిటం గ్రామం: 24 ఏళ్లకే సర్పంచ్..
పోడూరు (పశ్చిమగోదావరి జిల్లా): కవిటం గ్రామంలో అతిచిన్న వయస్సులో సర్పంచ్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ల పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్లు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు వైఎస్సార్ సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. ఏకగ్రీవం కోసం యత్నించారు. ఎన్నిక అనివార్యమైంది. పూర్ణిమ ప్రత్యర్థి ఉండ్రాజవరపు రత్నకుమారిపై 1,891 ఓట్ల భారీమెజార్టీతో గెలుపొందారు. పూర్ణిమ ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. చదవండి: వీరికి లక్కుంది..! టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన -
వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలో యువకుడి పై దాడి కేసు ఘటనపై రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి, టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. మీడియాలో వచ్చిన రెండు దృశ్యాలు ఇప్పటివి కావని, అందులో ఒకటి గత ఏడాది నవంబర్ నెలలో మార్కెట్ సెంటర్లో జరిగిందన్నారు. రెండో ఘటన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగినట్టు వివరాలు సేకరించామని పేర్కొన్నారు. యువకుడిని చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. శ్రీకాంత్ అనే వ్యక్తి కారు తీసుకొన్న యుగంధర్ అనే యువకుడు డ్యామేజీ చేశాడని, డ్యామేజీ ఖర్చులు చెల్లించని ఆ యువకుడిపై రాజశేఖర్ అనే మరో యువకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడని పేర్కొన్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీలు వెల్లడించారు. -
యువకులే అధికం..
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఇప్పటిదాకా 84 కోవిడ్ (కరోనా) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే..బాధితుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారు. శనివారం దాకా నమోదైన 82 కేసుల్లో 40 ఏళ్లలోపు వారు 47 మంది ఉండడం ఇందుకు బలం చేకూర్చుతోంది. కోలుకునే చాన్స్ ఎక్కువే జిల్లాలో గత నెల సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్కు చెందిన యువకుడి(23)కి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇదే మొదటి కేసు. ఇతనితో పాటు ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో ఎక్కువమంది యువకులే ఉన్నారు. యువకుల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వారు త్వరగానే కోలుకుంటారని వైద్యవర్గాలు చెబుతుండడం ఊరట కల్గించే అంశం. ఐదుగురు మహిళలకూ... కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. కర్నూలు నగరంలోని గనిగల్లి వీధికి చెందిన 45 ఏళ్ల మహిళ, ఆత్మకూరు మున్సిపాలిటీలోని కొత్తపేటలో ఒకరు, పాణ్యం బీసీ కాలనీలో ఒకరు, ఇదే పట్టణంలోని రాచగడ్డ వీధిలో ఒకరు, నంద్యాల మండలం చాబోలులో ఒక మహిళ వైరస్ బారినపడ్డారు. ఇంట్లో వీరితో పాటు ఒక పురుషుడు కూడా కరోనా పాజిటివ్గా ఉండటం గమనార్హం. పురుషుల ద్వారానే వీరికి కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. తాజాగా ఇద్దరికి.. కరోనా విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అందరికంటే ముందుగానే అప్రమత్తమైంది. మొదటి కేసు వెలుగు చూడగానే వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గత నెల 28న ఒక కేసుతో ప్రారంభమైన కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రెండు వారాల్లోనే 84కు చేరుకుంది. శనివారం వరకు 82 కేసులు ఉండగా.. ఆదివారం కర్నూలులో ఒకటి, చాగలమర్రిలో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తం 84 కేసుల్లో 83 ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు, వారితో కలిసి తిరగడం వల్ల, ఇంట్లో ఉండటం వల్ల నమోదైనవే కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అధికారులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. త్వరగానే కోలుకుంటారు యువకుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా నుంచి త్వరగానే కోలుకుంటారు. షుగర్, బీపీ, కిడ్నీ, గుండెజబ్బులు వంటి ఇతరత్రా వ్యాధులు ఉంటే తప్ప యువకులకు కరోనా వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారిలో యువకులే ఉండడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. మన దగ్గర కూడా నొస్సం యువకుడు కోలుకున్నాడు. త్వరలోనే అతన్ని డిశ్చార్జ్ చేస్తాం. –డాక్టర్ కె.నరసింహులు, జనరల్ మెడిసిన్ హెచ్వోడీ, నోడల్ అధికారి, కర్నూలు సర్వజన వైద్యశాల -
20 ఏళ్ల క్రితం తప్పిపోయి..
అరకులోయ : విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో 2000 సంవత్సరంలో తప్పిపోయిన గంగాధర్ అనే గిరిజన యువకుడు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 9ఏళ్ల వయస్సులో గంగాధర్ విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో తప్పిపోయి చెన్నైకి చేరుకున్నాడు. అప్పట్లో గంగాధర్ ఫొటోతో తప్పిపోయిన బాలుడి పేరిట తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే గంగాధర్కు చక్ర సెంట్రల్ ఆర్గనైజేషన్ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. 2015 సంవత్సరం వరకు ఆశ్రమంలోనే వసతితో పాటు చదువు కొనసాగించిన గంగాధర్ 2015లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. ఐటీఐ, కంప్యూటర్ కోర్సులను పూర్తి చేసిన గంగాధర్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో గంగాధర్ 15 రోజుల కిందట అరకులోయకు చేరుకుని తన తల్లిదండ్రులు, గ్రామం కోసం వెతుకుతున్నాడు. చిన్న వయస్సులో వెళ్లిపోవడంతో తనకు గిరిజన మ్యూజియం, సినిమాహాలు, గార్డెన్ ప్రాంతాలు మాత్రమే గుర్తున్నాయని గంగాధర్ తమిళ భాషలో వాపోతున్నాడు. గంగాధర్ తల్లిదండ్రులు, గ్రామం ఆచూకీని తెలుసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గంగాధర్ పోలీసుల ఆదీనంలో ఉన్నాడు. -
జ్ఞాపకశక్తికి దగ్గర దారి.. గీతలే!
ఏ విషయాన్నైనా గుర్తుంచుకోవాలంటే బొమ్మలు గీయడానికి మించిన దగ్గర దారి లేదంటున్నారు వాటర్లూ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. పదేపదే రాయడం ద్వారా బాగా గుర్తుండి పోతుందన్న విషయం చాలాకాలంగా తెలిసినప్పటికీ, బొమ్మలు గీయడమన్నది అంతకంటే మెరుగైన మార్గమని తాము ఇటీవల జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోందని మెలిస్సా మీడ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వయసు మళ్లిన తరువాత బొమ్మలు గీయడం అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి లోపాలు, అలై్జ్జమర్స్, మతిమరపు వంటి సమస్యలను అధిగమించవచ్చునని మెలిస్సా అంటున్నారు. 20 – 80 మధ్య వయసు వారు దాదాపు 50 మందిపై తాము ఈ అధ్యయనం చేశామన్నారు. రెండు గుంపులుగా విడదీసిన వీరికి వరుసగా కొన్ని పదాలు చూపినప్పుడు ఆ పదాన్ని, వివరణను రాయడంతో పాటు బొమ్మకూడా గీయాల్సి ఉంటుంది. కొంత సమయం తరువాత వాటిల్లో వీలైనన్ని పదాలను గుర్తు చేసుకోమని అడిగారు. యువకులు పదాలు బాగా గుర్తుపెట్టుకోగలిగారు. అది అసారణం కాకపోయినా బొమ్మలు గీసిన పదాలను అన్ని వర్గాల వారూ ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం తమను ఆశ్చర్యం కలిగించిందని మెలిస్సా వివరించారు. ఒకేరకమైన సమాచారాన్ని పలు విధాలుగా చూపుతూండటం వల్ల బొమ్మలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయని, పైగా చేతులు కూడా తోడవడం వల్ల మెదడులో సమాచారం మరింత బాగా ముద్రపడిపోతుందని మెలిస్సా తెలిపారు. -
అవధూత కథ
చాలా శతాబ్దాల కిందట ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో ముగ్గురు యువకులు కలసి జీవిస్తుండేవాళ్లు. సత్రాలలో, వేశ్యల ఇళ్లలో విచ్చలవిడిగా ఖుషీ చేస్తూ, రకరకాల వాద్యాలను వాయిస్తూ తైతక్కలాడుతూ, రాత్రింబగళ్లు జూదం ఆడుతూ, అడ్డూ అదుపూ లేకుండా అతిగా మద్యం తాగుతూ వాళ్లు మూర్ఖంగా ప్రవర్తించేవారు. ఆ విధంగా అసహ్యకరమైన రీతిలో దయ్యాల కొంపల్లో విపరీతమైన విశృంఖలత్వంతో దయ్యాల ప్రవర్తనతో బతికేవారు. ఒకనాడు ఆ ముగ్గురూ పెందరాళే సత్రంలో కూర్చుని, మద్యం తాగడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్లకొక గంట చప్పుడు వినిపించింది. ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశానానికి తీసుకుపోతున్నప్పుడు మోగించే గంట శబ్దంలా ఉంది ఆ ధ్వని. ఆ ముగ్గురిలోని ఒకడు అటుగా పోతున్న ఒక పిల్లవాణ్ణి పిలిచి, చనిపోయిన వ్యక్తి పేరేమిటో కనుక్కోమని చెప్పి, ‘‘పేరు తప్పుగా చెప్తే తన్నులు తింటావు సుమా!’’ అని బెదిరించాడు. ‘‘అయ్యా, నన్ను దండించే అవసరం లేదు. మీరిక్కడికి రావటంకన్న రెండు గంటల ముందే నాకు విషయం తెలిసింది. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయిన వ్యక్తి ఒక ముసలివాడు. అతడు బాగా మద్యం తాగిన మత్తులో ఒక బెంచి మీద కూర్చుని ఉండగా హతుడయ్యాడు. చావు అనే పేరు గల ఒక రహస్య దొంగ వచ్చి, ముసలివాడి గుండె రెండు ముక్కలయ్యే విధంగా బరిసెతో పొడిచి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అతడు ఊళ్లోని మనుషులందర్నీ అట్లానే చంపుతాడు. ఇప్పటిదాకా దాదాపు ఒక వేయిమందిని చంపాడు. అయ్యా, అటువంటి శత్రువు మీకు ఎదురుపడక ముందే ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది నాకు. అతణ్ణి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని నాకు మా అమ్మ చెప్పింది.ఇంతకన్నా ఎక్కువగా మరేం మాట్లాడలేను నేను’’ అన్నాడు ఆ పిల్లవాడు. ‘‘ఈ పిల్లవాడు చెప్తున్నది నిజం. ఇక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న పెద్ద గ్రామంలో ఇద్దరు స్త్రీలనూ, ఒక చిన్న పిల్లవాణ్ణీ, ఒక పనిమనిషినీ, ఒక మోసగాణ్ణీ చంపింది ఈ దొంగే. అతడు ఆ గ్రామంలోనే నివసిస్తాడనుకుంటాను. అదుగో అటువైపు పోతే ఆ గ్రామం వస్తుంది. మీకు హాని జరగక ముందే ఈ విషయం తెలియడం మంచిదయింది’’ అన్నాడు ఆ సత్రపు యజమాని.ముగ్గురిలోని ఒకడైన ఆ దురాత్ముడు ఇలా అన్నాడు: ‘‘వాణ్ణి ఎదుర్కోవడం అంత ప్రమాదకరమా? దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను వాణ్ణి రాచమార్గం మీదనో, చిన్న తోవ మీదనో ఎక్కడో ఒక చోట ఎదుర్కొంటాను.వినండి మిత్రులారా! మనం ముగ్గురం సోదరుల్లాగా మారి, చావు అనే మాయ ద్రోహిని చంపుదాం. ఎందర్నో చంపే ఆ దుష్టుడే ఈ రాత్రి మన చేతుల్లో చస్తాడు. దేవుని సాక్షిగా.’’ఆ ముగ్గురూ ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాల్ని బలి పెడతామని ప్రతిజ్ఞ చేసి, సత్రపు యజమాని చెప్పిన దిశగా, తాగిన మైకంలో బయలుదేరారు. ‘చావుగాడిని దొరికించుకుని వధిస్తాం’ అంటూ వాళ్లు ఎన్నో భీకరమైన శపథాలు చేశారు. ఒక మైలు దూరం పోయి కంచెను దాటుతుంటే, ఒక బీద ముసలివాడు వాళ్లకు ఎదురొచ్చాడు. అతడు వాళ్లకు నమస్కరించి, వినయంగా ‘‘అయ్యలారా, దేవుడు మీకు మేలు చేయుగాక!’’ అన్నాడు. ఆ ముగ్గురు దుర్మార్గుల్లో అత్యంత గర్విష్టి అయిన వ్యక్తి ఇలా బదులు పలికాడు. ‘‘ఓ పొగరుబోతూ! ఇవ్వాళ నీ అదృష్టం బాగా లేదు. నీ ముఖాన్ని దాచుకోవడం కోసం ఎందుకలా మొత్తం శరీరానికి ముసుగు వేసుకున్నావు? ఇంత పెద్ద వయసు వచ్చేదాకా ఎందుకు బతికి ఉన్నావు నువ్వు?’’ఆ ముసలివాడు దురాత్ముని ముఖంలోకి పరీక్షగా చూసి, ‘‘ఎందుకంటే నేను భారతదేశం దాకా నడిచి గ్రామాల్లో, పట్టణాల్లో వెతికినా తన యవ్వనాన్ని నాకిచ్చి, నా ముసలితనాన్ని తాను తీసుకునే మనిషెవరూ కనపడలేదు నాకు. కాబట్టి దేవుడు నన్ను ఎంతకాలం ముసలివాడిగా ఉండమని ఆదేశిస్తాడో అంతకాలం దాక ముసలివాడిగానే ఉండాలి నేను. నా దురదృష్టం కొద్దీ చావు రావడం లేదు నాకు. ఆ విధంగా నేనొక దౌర్భాగ్యపు దొంగముండా కొడుకులాగా విరామం లేకుండా తిరుగుతున్నాను. నా తల్లి దగ్గరికి తోవను చూపే ద్వారం అయిన నేలను పొడుగాటి కర్రతో కొట్టి, ‘నా ప్రియమైన మాతా! నన్ను లోపలికి రానివ్వు. నా రక్తమాంసాలూ, చర్మమూ, కండరాలూ ఎంతగా కృశించిపోయాయో చూడు. నాకెప్పుడు విశ్రాంతి దొరుకుతుంది తల్లీ? నా శరీరంలో భద్రమై ఉన్న హృదయాన్ని నీకు కానుకగా ఇచ్చి, నీ లోపలికి చేరుకుంటాను. ఒక గుడ్డలో నన్ను నేను చుట్టుకుంటాను’ అంటూ మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది.అందుకే నా ముఖం పాలిపోయి, వాడిపోయింది. కానీ అయ్యలారా, ఒక ముసలివానితో మీరిట్లా దురుసుగా మాట్లాడటం న్యాయం కాదు, అతడు హద్దులు మీరితే తప్ప. ఈ విషయాన్ని మీరు స్వయంగా మతగ్రంథంలో చదవవచ్చు. ‘ముసలివాడు ఎదురైనప్పుడు వినయంగా, మర్యాదగా లేచి నిలబడు’ అని ఉంది అందులో. అందుకే మీరు ముసలివాడైన నాకు హాని తలపెట్టవద్దని, నేను చెప్పిన ప్రకారం చేస్తే మీరు వృద్ధులయ్యాక ఎవరూ మీకు హాని చెయ్యరనీ సలహా ఇస్తున్నాను. దేవుడు మీకు మేలు చేయుగాక! మీరెక్కడికి పోయినా నేను మాత్రం పోవాల్సిన చోటుకే పోవాలి’’ అన్నాడు.‘‘ఉహు.. నువ్వు పోలేవు నీచుడా! నిన్ను పోనివ్వనని ప్రమాణం చేస్తున్నాను. మమ్మల్ని వదిలి అంత సులభంగా వెళ్లలేవు నువ్వు. ఊళ్లలో మనుషులందర్నీ చంపే ద్రోహి అయిన చావుదయ్యంగాడి గురించి చెప్పావు. నా అనుమానం ప్రకారం నువ్వు వాడి గూఢచారివి. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను చంపుతానని హెచ్చరిస్తున్నాను. యువకుల్ని చంపవలసిందిగా చావుకు అనుమతి ఇచ్చే టక్కరి దొంగగాడివి నువ్వే’’ అన్నాడు ఆ దురాత్ముల్లోని రెండవవాడు. ‘‘అయ్యలారా, చావుగాడిని కనుగొనాలని మీకు అంత కోరికగా ఉంటే, ఆ వంకర దారి మీదుగా పోండి. అతడు ఒక చోట్ల తోపులోని వృక్షం కింద ఉన్నాడని నా నమ్మకం. అక్కడే నివసిస్తాడతడు. ఆ ఓక్ చెట్టు కనబడుతోంది కదా? సరిగ్గా అక్కడే మీరతణ్ణి చూస్తారు. మానవులకు విముక్తిని ప్రసాదించే ఆ దేవుడే మిమ్మల్ని రక్షించి సరిదిద్దనీ’’ అన్నాడు ఆ ముసలివాడు.ఆ ముగ్గురూ అక్కడికి పరుగెత్తారు. వాళ్లు ఊహించినట్టుగానే అక్కడ ఏడు తూముల నాణ్యమైన బంగారు నాణేలు కనిపించాయి వాళ్లకు. అప్పుడు తాము వెతుకుతున్న వ్యక్తి గురించి మరచిపోయారు వారు. విలువైన ఆ బంగారు నిధిని చూసి ఆ ముగ్గురూ ఎంతగా మురిసిపోయారంటే, వాళ్లు దాని పక్కనే కూర్చుండిపోయారు. వారిలో అందరికన్నా చిన్నవాడు ఇలా అన్నాడు: ‘అన్నలారా, నేను చెప్పేది వినండి. నేనెప్పుడూ నవ్వుతూ ఆడుతూ ఉంటాను కానీ, నాకు గొప్ప జ్ఞానం ఉంది. మనం జీవితాలను సంతోషంగా, హాయిగా వెళ్లబుచ్చటం కోసం అదృష్టదేవత మనకు ఇచ్చిన నిధి ఇది. కాబట్టి దీన్ని అనుభవిద్దాం. ఒకవిధంగా ఇది మనకు దేవుడిచ్చిన విలువైన కానుక. ఇంత మంచి అదృష్టం మనను వరిస్తుందని ఎవరం ఊహించాం? ఈ బంగారమంతా మనదే కాబట్టి, దీన్ని నా ఇంటికో, మీ ఇంటికో తీసుకుపోయి గొప్ప సుఖాన్ని అనుభవించగలమా? దీన్ని పగటిపూట తీసుకుపోతే మనం పెద్ద దొంగలమని భావించి పట్టుకుని, మనను ఉరి తీస్తారు. ఈ నిధిని సాధ్యమైనంత వివేకంతో, చాతుర్యంతో రాత్రిపూట తీసుకుపోవాలి.మనం ఒక నాణెపు బిళ్లను ఎగరేసి, అది ఎవడిని సూచించే విధంగా పడితే వాడే వేగంగా రహస్యంగా పట్టణానికి పోయి ఆహారాన్ని, మద్యాన్నీ తీసుకు రావాలి. మిగతా ఇద్దరూ ఈ నిధిని గుట్టుగా కనిపెట్టుకుని ఉండాలి. రాత్రయ్యాక అందరమూ కలసి నిర్ణయించుకున్న చోటుకు దీన్ని తరలించాలి.’’ ఆ నాణెపు బిళ్ల అందరికన్న చిన్నవాడైన దురాత్మునికి అనుగుణంగా పడటంతో అతడు వెంటనే పట్టణం వైపు వెళ్లిపోయాడు. అప్పుడు ఆ మిగిలిన ఇద్దరిలో ఒకడు మరొకనితో ఇలా అన్నాడు: ‘‘నువ్వు నా సోదరుని వంటి వాడివి కనుక నేను చెప్పింది వింటే లాభపడతావు. మనం ముగ్గురం పంచుకోవటానికి పుష్కలమైన ధనం ఉందిక్కడ. వాడు వెళ్లిపోయాడు కదా. ఇది మనిద్దరికే చెందేలా నేనొక ఉపాయాన్ని చెబితే, నేనొక గొప్ప స్నేహితునిలా నీకు సహాయం చేసినవాణ్ణి అవుతానా లేదా?’’‘‘అదెలా సాధ్యమో తెలియదు నాకు. ఈ నిధి దగ్గర మనమిద్దరం కాపలా ఉన్నామని వాడికి తెలుసు. ఏం చేద్దాం? ఏమని చెప్పుదాం?’’ అన్నాడు ఆ రెండవవాడు.‘‘నువ్వు రహస్యంగా ఉంచుతానంటే నీకో విషయం చెప్పనా? మనం ఏం చెయ్యాలో క్లుప్తంగా చెప్తాను విను’’ అన్నాడు మొదటి దురాత్ముడు.‘‘సరే చెప్పు, నిన్ను మోసగించను’’ ‘‘మనమిద్దరం ఉన్నాం కనుక, ఒక్కడి బలం కన్న మనిద్దరి బలమే ఎక్కువ అవుతుంది. వాడొచ్చిన తర్వాత, సరదా కోసం ఆటాడుతున్నట్టుగా వాణ్ణి నువ్వు పట్టుకో. అప్పుడు నేను కత్తితో వాడి ఛాతి పక్కలోంచి పొడుస్తాను. తర్వాత నువ్వు కూడా నీ కత్తితో వాణ్ణి పొడవాలి. అప్పుడు ఈ బంగారాన్నంతా మనమిద్దరమే పంచుకుందాం మిత్రుడా! ఆ తర్వాత మనం బాగా మద్యం తాగుతూ, జూదమాడుతూ ఇష్టమొచ్చినట్టుగా భోగవిలాస జీవితాన్ని అనుభవిద్దాం. వాణ్ణి చంపటానికి మనిద్దరికీ అనుమతి దొరికిందనుకో’’ అన్నాడు మొదటివాడు.పట్టణానికి వెళ్లినవాడి మనసులో ఆ బంగారు నాణాల ఊహే మళ్లీ మళ్లీ కదలాడింది. ‘ఓ భగవంతుడా! ఆ బంగారమంతా నాదే అయిపోతే, ప్రపంచంలో ఎవ్వడూ నా అంత సుఖంగా బతకడు.’ ఇలా ఆలోచిస్తూ దయ్యం వంటి ఆ దురాత్ముడు ఆఖరుకు తన ఇద్దరు సహచరులకు విషం ఇచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. సైతాను ఆ దురాత్ముణ్ణి పూర్తిగా ఆవహించి, భవిష్యత్తులో వాడికి అనంత దుఃఖాన్ని కలిగేలా చేసింది. వాడు వెంటనే ఒక మందుల దుకాణంవాడి దగ్గరకుపోయి, ఎలుకల విషాన్ని ఇవ్వమన్నాడు. తన పెరట్లో పెద్ద పందికొక్కు ఉన్నదనీ, అది తన కోడిని చంపిందని, ఆ పందికొక్కును చంపటం కోసం విషం అవసరమని చెప్పాడు. ఆ దుకాణంవాడు ‘‘నేనిచ్చే విషాన్ని గోధుమ పిండిలో కలిపి పెడితే, దాన్ని తిన్న ఏ ప్రాణి అయినా ఆలస్యం లేకుండా చస్తుంది. అవును, ఎంత తొందరగా అంటే ఒక్క మైలు దూరం నడిచే లోపలే దాని చావు సంభవిస్తుంది’’ అన్నాడు. శాపగ్రస్తుడైన ఆ దురాత్ముడు విషం డబ్బాను గట్టిగా పట్టుకుని, పక్క వీధిలోకి ఉరికి, ఒకడి దగ్గర మూడు సీసాలను అరువు తీసుకున్నాడు. రెండింటిలో విషాన్ని పోసి, మూడవ దాంట్లో తన కోసం కేవలం మద్యాన్ని మాత్రమే పోసుకున్నాడు. ఎందుకంటే శ్రమపడి రాత్రంతా బంగారాన్ని మోసుకు రావాలనుకున్నాడు. తర్వాత తన సహచరుల దగ్గరికి ప్రయాణమయ్యాడు. తర్వాత జరిగిన విషయం గురించి చెప్పాల్సిన అవసరమేముంది? పథకం వేసుకున్న విధంగానే ఆ సహచరులిద్దరూ మూడో దురాత్ముణ్ణి చంపారు. మిగిలిన ఇద్దరిలోని ఒకడు ‘‘ఇక మనం కూర్చుని హాయిగా మద్యం తాగి, ఆ తర్వాత ఈ శవాన్ని పూడ్చేద్దాం’’ అన్నాడు. మద్యపాన కార్యక్రమం మొదలుపెడుతూ వాడు ఒక సీసాలోంచి కొంచెం మద్యం తాగి, మిగిలిన దాన్ని తాగమని అదే సీసాను సహచరునికిచ్చాడు. విధివశాత్తు ఆ సీసాలో ఉన్న మద్యంలో విషం కలిపి ఉంది. ఆ విధంగా వాళ్లిద్దరూ మరణించారు. చనిపోయే ముందు వాళ్లిద్దరూ ఎంత అవస్థపడ్డారు అన్న విషయాన్ని క్రీట్స్ అవిసెన్నా ఏ శ్లోకంలోనూ, ఏ ఆశ్వాసంలోనూ రాయనంత అద్భుతంగా వర్ణించాడు. విషం పెట్టిన దురాత్ముడూ, హంతకులైన ఇద్దరు సహచరులూ ఆ విధంగా ప్రాణాలు వదిలారు. - ఇంగ్లిష్ మూలం : జెఫ్రీ చాసర్ - అనువాదం: ఎలనాగ -
ఇలా చేయండి.. యవ్వనంతో మెరిసిపోండి
సాధారణంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా ఓ మనిషి బలంగా ఉండటం అంత తేలిక కాదు.. ముఖ్యంగా యవ్వన దశ దాటి పోయిన తర్వాత ఓ స్థాయి వరకు స్థిరంగా ఉండి ఆ వెంటనే తిరోగమన దశ మొదలవుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రం ఓ మనిషి బలంగా, మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఎలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటాడట. ఇంతకి ఆ జాగ్రత్త ఏమిటంటే సైక్లింగ్. అవును.. నిత్యం సైక్లింగ్ చేసే అలవాటు ఉండేవారు ఎప్పటికీ యంగ్గా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ ఆధ్యయనం పేర్కొంది. ఏజింగ్ సెల్ అనే జర్నల్లో ఈ అంశాన్ని తాజాగా వెల్లడించారు. సాధారణంగా మధ్యవయసులో, వృద్ధాప్యంలో రోగాలు అలుముకుంటుంటాయి. రోగ నిరోధక శక్తి కుంటుబడుతుంది. అయితే, సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మాత్రం పైన పేర్కొన్న వయసులో ఇలాంటి పరిస్థితి ఉండదట. 55 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారిని మొత్తం 125మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిజాలు గుర్తించారు. ప్రతి వ్యక్తిలో ఉండే థైమస్ గ్రంధి (హృదయానికి సమీపంలో ఉంటుంది) సాధారణంగా రోగ నిరోధక శక్తి కణాలను (వీటినే టీ సెల్స్ అంటారు) ఉత్పత్తి చేస్తుంది. ఇవి సాధారణంగా 20 ఏళ్ల తర్వాత కాస్త మందగించినట్లుగా మారిపోతుంటాయి. అయితే, సైక్లిస్టుల్లో మాత్రం ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యి, రోగ నిరోధక శక్తిని మరింత విస్తృతం చేస్తాయని, దాంతో మరింత యవ్వనంగా ఉండేలా చేస్తుందని, పురుషుల్లో ఇది టెస్టోస్టెరాయిన్ లెవల్స్కు మరింత బూస్ట్ను ఇచ్చినట్లుగా పనిచేస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు, నిత్యం సైక్లింగ్ చేసేవారిలో పురుషులు అయితే, 6.5గంటల్లో 100 కిలోమీటర్లు, 5.5 గంటల్లో స్త్రీలు 60 కిలోమీటర్లు ప్రయాణించగలరని కూడా గుర్తించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మడ్డులపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మడ్డులపల్లికి చెందిన వంగూరి సురేష్(20), అఖిల్(19) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సురేష్ ఓ ప్రేవేటు కళాశాలలో బీటెక్ చదువుతుండగా..అఖిల్ డిగ్రీ పూర్తి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట కాలువలో దంపతుల గల్లంతు
కాలువలో దూకేసిన భార్య ఆమెను రక్షించేందుకు భర్త .. కొత్తపేట : కులాంతర వివాహం చేసుకున్నారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఏ కష్టం వచ్చిందో ఏమో కానీభార్య కాలువలోకి దూకేయగా ఆమెను రక్షించబోయి భర్త తమ కుమార్తెను వదిలేసి కాలువలోకి దూకాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. కొత్తపేట మండలం కండ్రిగ గ్రామానికి చెందిన కముజు శ్రీనివాసరావు (29), భవాని (26) దంపతులు బిళ్లకుర్రు శివారు డేగలవారిపాలెం వంతెన వద్ద భార్యా భర్తలు పంట కాలువలోకి దూకి గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి తండ్రి రాంబాబు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కండ్రిగ శివారు గుబ్బలవారిపాలెం గ్రామానికి చెందిన కముజు రాంబాబు – పుష్పకుమారి దంపతులకు కుమారుడు శ్రీనివాసరావు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు సుమారు ఆరేళ్ల క్రితం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన భవాని అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి పాప జన్మించింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె చెవిటి, మూగ, నడవలేని దివ్యాంగురాలు. శ్రీనివాసరావు ప్రస్తుతం రావులపాలెంలో ఒక ప్రైవేట్ స్కూలులో పీఈటీగా పనిచేస్తున్నాడు. పెళ్లికి బయలుదేరి... ఇదిలా ఉండగా గ్రామంలో మట్టపర్తి సింహాచలం కుమార్తె వివాహం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం విందు కార్యక్రమంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అమలాపురంలో పెళ్లి కుమారుని ఇంటి వద్ద వివాహం కార్యక్రమానికి కుమార్తెను తీసుకుని భార్యాభర్తలిద్దరూ మోటార్ సైకిల్పై రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారు. సమీనపంలోని డేగలవారిపాలెం వంతెన వద్దకు వెళ్లేసరికి ఏమైందో ఏమో గాని భార్య భవాని మోటార్ సైకిలు దిగి పరుగెత్తగా భర్త శ్రీనివాసరావు బండి స్టాండ్ వేసి కుమార్తెను మోటార్ సైకిల్పైనే ఉంచి ఆమె వెంట పరుగెట్టాడు. ఆమె గట్టుపై చెప్పులు వదిలేసి బొబ్బర్లంక–అమలాపురం కాలువలో దూకేసింది. ఆమెను రక్షించేందుకు అతనూ దూకేవాడు. కాలువ అవతల ఉన్న వారు ఎవరో కాలువలో దూకేశారని గ్రహించి కేకలు వేయగా ఆ సమీపంలో నివాసితులు వాకాడ శ్రీనివాసరావు, వాకాడ శేషగోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ ఎవరూ కనిపించలేదు. సమీపంలో మోటార్సైకిలు, దానిపై ఒక పాప ఉంది.అక్కడ సెల్ఫోన్ పడివుంది. అదే సమయంలో గుబ్బలవారి పాలెంకు చెందిన ఓ వ్యక్తి అటు వెళుతూ ఆ పాపను గుర్తించి తన వెంట తీసుకువెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు అప్పగించాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తున్నారు. కొత్తపేట ఎస్సై డి.విజయకుమార్, ఏఎస్సై ఎ.గరగారావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దివ్యాంగ కుమార్తే కారణమా ? కుమార్తె దివ్యాంగురాలు కావడంతో నిత్యం ఆ దంపతులు మదన పడేవారు. పలుమార్లు కుమార్తెతో కాలువలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు. వారి మాటలు విన్న అతడి తల్లిదండ్రులు వారించి అటువంటి పని చేయకండి..వైద్యం చేయిస్తున్నారు కదా..ఆరోగ్యవంతురాలు అవుతుందిలే అని నచ్చచెప్పేవారు. ఆమె అఘాయిత్యానికి పాల్పడగా ఆమెను రక్షించేందుకు వెళ్లి గల్లంతయ్యాడని అతడి తండ్రి రాంబాబు కన్నీటి పర్యతమయ్యాడు. -
యువజంట ఆత్మహత్య
వివాహేతర సంబంధమే కారణం? ప్రేమికుడు పురిగొల్పడంతో వివాహిత ఆత్మహత్య తనపై కేసు పెడతారన్న భయంతో భర్త కూడా.. అత్తింటివారే తన కుమార్తెను చంపారని తండ్రి ఆరోపణ కాకినాడ రూరల్ : భార్యపై అనుమానం, ప్రైవేటు ఉద్యోగం మానేసి, జల్సాలకు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఖర్చు చేయడం, నిత్యం కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు.. దీంతో పాటు వివాహేతర సంబంధం ఉందని భావిస్తున్న ఆటో డ్రైవర్ పౌరుషం ఉంటే చావు అన్న మాటకు పట్టించుకున్న ఓ యువ జంట శుక్రవారం ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ గొడారిగుంట మూడుగుళ్ల సెంటర్ సమీపంలో శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్న బయ్యపురెడ్డి దుర్గా ప్రసాద్ (34), మంగాదేవి (25)లు ఈ ఘటనలో మృతి చెందారు. వీరికి ఏడేళ్ల సాయిలోకేష్, ఐదేళ్ల ధీరజ్ పిల్లలు ఉన్నారు. సామర్లకోటకు చెందిన కె సత్యనారాయణ కుమార్తె మంగాదేవిని, 2010లో కాకినాడ గొడారిగుంటకు చెందిన బయ్యపురెడ్డి దుర్గాప్రసాద్కు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 4 లక్షలు కట్నం, 8 కాసుల బంగారు ఆభరణాలు కట్న కానుకలుగా అందించారు. దుర్గాప్రసాద్ ఎన్ఎఫ్సీఎల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసేవాడు. భార్యపై అనుమానం పెంచుకున్న దుర్గాప్రసాద్ ఏడాదిన్నరగా తాను చేస్తున్న పని మానేసి భార్యను సూటిపోటి మాటలు అంటూ గొడవకు దిగేవాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేయడమే కాకుండా పెళ్లి సమయంలో అత్తింటివారు బ్యాంకులో వేసిన రూ. 1.5 లక్షలను కూడా ఖర్చు చేసేశాడు. తాకట్టులో ఉన్న బంగారు ఆభరణాలను అమ్మేస్తానంటూ భార్యతో గొడవకు దిగేవాడు. మంగాదేవికి స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్ అప్పన్నతో వివాహేతర సంబంధం ఉందని, ఇది తన భర్తకు తెలిసిపోయిందని ఆమె అప్పన్నకు చెప్పిందని, దీంతో అతడు ఆమెను పౌరుషం ఉంటే చచ్చిపో అని ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పాడని, తనపై ఎక్కడ కేసు పెడతారోనన్న భయంతో దుర్గాప్రసాద్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న లక్ష్మణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను జీజీహెచ్కు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. సర్పవరం సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణతో ఎస్ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అభంశుభం తెలియని చిన్నారులు అమ్మా, నాన్నలు ఎక్కడికి వెళ్లారంటూ దీనంగా అడగడం అక్కడివారిని కలచివేసింది. ఏ బాధలున్నా తమకు చెప్పుకుంటే పరిష్కరించేవారమని, కనీసం ఏం జరుగుతోందో కూడా తమ దృష్టికి తేలేదంటూ మంగాదేవి బంధువులు విలపిస్తున్నారు. చనిపోయేటప్పుడయినా పిల్లలు గుర్తుకురాలేదే అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రతిఒక్కరికీ తలలో నాలుకలా ఉండే దుర్గాప్రసాద్ చనిపోయాడంటే జీర్ణించుకోలేకపోతున్నామంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాగా మంగాదేవి తండ్రి కె.సత్యనారాయణ మాత్రం తన కుమార్తెను కావాలనే తన అల్లుడు దుర్గాప్రసాద్ ఉరేసి చంపేశాడని, తన కుమార్తె ఏ తప్పు చేయదని, చనిపోయేంత పిరికిది కాదని, కావాలనే చనిపోయిన వ్యక్తిపై అభాండాలు వేస్తున్నారన్నారు. తన అల్లుడు, అతని కుటుంబ సభ్యులే కావాలని తన కూతుర్ని ఉరేసి చంపేశారన్నారు. కేసు పెడతామన్న భయంతో అతను ఉరేసుకున్నాడన్నారు. తన కుమార్తెను ఎంతో గారాభంగా పెంచుకున్నానని, ఇప్పుడు తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ కన్నీరుమున్నీరుగా మృతురాలి తండ్రి సత్యనారాయణ విలపిస్తున్నాడు. -
చీకట్లో మాయం..శవమై ప్రత్యక్షం
యువతి అనుమానాస్పద మృతి అరటి చెట్టుకు ఉరి హత్యే అంటున్న తండ్రి రాజోలు : పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన దిగుమర్తి దివ్య (17) మండలంలోని ములికిపల్లిలో అరటి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందింది. అరవ నారాయణస్వామి కొబ్బరితోటలోని అరటి చెట్టుకు వేలాడుతున్న దివ్య మృతదేహాన్ని ఇన్ఛార్జి ఎస్సై వెంకటేశ్వరరావు పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్టు వెల్లడించారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం ఈ నెల 16న దివ్య ములికిపల్లిలోని అమ్మమ్మ నూకాలమ్మను చూసేందుకు తల్లిదండ్రులు సత్యనారాయణ, మంగ, చెల్లి జ్యోతి కుమారితో కలసి వచ్చింది. అయితే 17వ తేదీ రాత్రి తండ్రి సత్యనారాయణ సెల్ఫోన్ తీసుకుని బయటకు వెళ్తానని చెప్పి చెల్లెలు జ్యోతికుమారితో వెళ్లింది. అదే సమయంలో కరెంటు పోవడంతో అక్క కనపించకపోవడంతో జ్యోతికుమారి కంగారుగా వచ్చి తండ్రికి చెప్పింది. స్థానికులతో కలిసి తండ్రి ఎంత వెదికినా ఆమె కనిపించలేదు. దీంతో అంబాజీపేటకు చెందిన పెయింటింగ్ వర్క్స్ చేసుకునే చెవిటి, మూగ అయిన ప్రసాద్పై తండ్రికి అనుమానం వచ్చింది. దివ్యను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రసాద్ పెద్దలతో వచ్చి ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. దివ్యను ఉన్నత చదువులు చదివిస్తామని, అప్పుడే పెళ్లి చేయమని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రసాద్పై ఆమె తండ్రి పి.గన్నవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు మృతదేహాం వద్ద లభించిన దివ్య చెప్పులు, దుస్తులను పరీక్షించి కొన్ని ఆధారాలు సేకరించారు. తండ్రి సెల్ఫోన్తో ఫోన్లు మెసెజ్లు ఏమైనా చేసిందాని పోలీసులు పరిశీలిస్తున్నారు. ముమ్మాటికీ హత్యే : తండ్రి సత్యనారాయణ కూతురు దివ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి సత్యనారాయణ రోదిస్తున్నాడు. ఇంటర్ ఫస్టు ఇయర్లో ఆమె మంచి మార్కులు వచ్చాయని విలపించాడు. అరటి చెట్టుకు ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని ఆరోపించారు. దివ్య కాళ్లు భూమి మీదకు ఉన్నాయని, దివ్యను హత్య చేసి అరటి చెట్టుకు వేలాడదీశారని కుటుంబీకులు ఆరోపించారు. దివ్యను హత్య చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. -
లారీ ఢీకొని యువకుడు మృతి
మరో యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం సొమ్మసిల్లిన తల్లి బంధువుల ఆర్తనాదాలు గండేపల్లి (జగ్గంపేట) : కుటుంబ పెద్ద దూరమైనప్పటికీ పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతోన్న ఆమెకు విధి కడుపు కోతకు గురి చేసింది. చేతికి అందివచ్చి, పెళ్లీడుకొచ్చిన కొడుకు పాడెక్కుతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. లారీ రూపంలో మృత్యువు కన్నబిడ్డను కడతేర్చిందని తెలుసుకున్న ఆమె కొడుకు మృతదేహాన్ని చూసుకుని గుండెలు అలిసేలా ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. మండలంలోని మల్లేపల్లికి చెందిన మందపల్లి ఎలీషారాణి, సుందర్రావు దంపతులకు వీరబాబు, ప్రసన్కుమార్ (20), అభినయ పిల్లలున్నారు. వీరి పిన్నవయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి కూలి పనులు చేస్తూ వీరిని పెద్దచేసింది. ప్రసన్నకుమార్ తాపీ పనులకు వెళుతూ కుటుంబానికి అండగా నిలిచాడు. వీరబాబు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాజమహేంద్రవరం వైపు నుంచి మోటార్ సైకిల్పై అతడు ఇంటికి వస్తుండగా గ్రామ శివారు బంకు ఎదురుగా వెనుకనే వస్తున్న లారీ ఢీకొని పైనుంచి వెళ్లిపోయింది. అక్కడికక్కడే ప్రసన్కుమార్ మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న రవికుమార్కు ప్రమాదం త్రుటిలో తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రజనీకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు కొత్త ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ టెక్కీలు పడుతున్న ఆందోళనకు ఐటీ సెక్యురిటీ సంస్థ మెకాఫీ తీపి కబురు అందించింది. తన బెంగళూరు ఐటీ సెంటర్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని యోచిస్తున్నట్టు ఈ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్థానిక బిజినెస్లను మరింత పెంచుకోవడానికి ఇండియాలో పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు. గ్లోబల్ చిప్ మేకర్ ఇంటెల్ గత ఏడాది సెప్టెంబర్ లోనే 51 శాతం షేరుతో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ టీపీజీతో కలిసి మెకాఫీని ఓ ప్రత్యేక సంస్థగా రూపొందించింది. ఈ డీల్ 2017 రెండో క్వార్టర్లో ముగియనుంది. ''ప్రపంచంలో మాకున్న పెద్ద సైట్లలో బెంగళూరు ఒకటి. దానిలో పెట్టుబడులు కొనసాగిస్తాం. అక్కడ కొత్త కార్యకలాపాలను ప్రారంభిస్తాం'' అని ఇంటెల్ సెక్యురిటీ జనరల్ మేనేజర్ యంగ్ చెప్పారు. ఇంటెల్ కింద ఉన్నప్పుడు అది ప్రాథమిక అభివృద్ధి సంస్థగా ఉండేది. కానీ ప్రస్తుతం ఫైనాన్స్, ఐటీ, హెచ్ఆర్ వంటి కొత్త సైట్లను ఏర్పాటుచేసి, కొత్త యూనిట్ కు మద్దతిస్తామని వెల్లడించారు. అయితే ఎన్ని ఉద్యోగాలు సృష్టించబోతున్నారో ఆయన తెలుపలేదు. కొత్త ఉద్యోగాలు వస్తాయని మాత్రమే యంగ్ చెప్పారు. మెకాఫీ, ఇంటెల్ సెక్యురిటీ గ్రూప్ లో ఓ భాగం. 2016 నాటికి ఏడాదికి ఏడాది ఈ కంపెనీ 20 శాతం వృద్ధిని నమోదుచేస్తోంది. 2011లో మెకాఫీని ఇంటెల్ కొనుగోలు చేసింది. -
చాటింగ్ చీటింగ్: యువతులూ తక్కువేం కాదు!
అమీర్పేట్ మధురానగర్కు చెందిన ముమ్మడి కార్తికేయ చిన్న స్థాయి దర్శకుడు. ఇతడికి విశాఖపట్నంలోని శీలానగర్కు చెందిన వివాహిత ఫేస్బుక్లో పరిచయమైంది. చాటింగ్ చేసి ఆమెకు మాయమాటలు చెప్పాడు. సిటీకి రప్పించి నయవంచన చేశాడు. కార్తికేయను మేడిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ జానకి, ట్యాక్స్ కన్సల్టెంట్ యశ్వంత్ కుమార్ ఉదంతం గతేడాది వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన జానకితో సాన్నిహిత్యం పెంచుకొని మోసం చేసిన యశ్వంత్... ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. నగర చరిత్రలోనే తొలి ఫేస్బుక్ మర్డర్గా ఇది రికార్డులకెక్కింది. కేవలం ఈ రెండే కాదు.. ఫేస్బుక్ ఆధారంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు సిటీలో అనేకం ఉన్నాయి. అయితే వీటిలో 10 శాతం కూడా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కట్లేదు. నేరుగా పరిచయం లేకపోయినా ‘ముఖ పరిచయం’తో ముందడుగు వేస్తున్న వాళ్లు నిండా మునుగుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని నగరవాసులు, ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సిటీలో సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్స్పై ప్రత్యేక కథనం.. – సాక్షి, సిటీబ్యూరో అతడో సైబర్ శాడిస్ట్... బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నివసించే అబ్దుల్ మాజిద్ ఫేస్బుక్లో అమ్మాయిల నకిలీ ఖాతాలు తెరిచాడు. సంపన్న వర్గాలకు చెందిన విద్యార్థినుల ప్రొఫైల్స్ను గుర్తించి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పంపించేవాడు. అవతలి వారు అమ్మాయినే కదా అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అసలు కథ మొదలెడతాడు. వారితో స్నేహపూరితంగా చాటింగ్ చేస్తూ వ్యక్తిగత విషయాలు అడుగుతాడు. స్నేహం పెరిగిన తర్వాత వారి ఆంతరంగిక అంశాల్లోకి తలదూర్చుతాడు. విద్యార్థినుల నగ్న చిత్రాలు, వీడియోలు సంగ్రహిస్తాడు. చాటింగ్ ద్వారా అసభ్యకరమైన సంభాషణలు కొనసాగిస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతాడు. ఈ తరహాలో బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి అందినకాడికి దండుకుంటాడు. మాజిద్ను 2015 సెప్టెంబర్ 11న సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడు దాదాపు 80 మందిని వంచించిన్నట్లు ఆరోపణలున్నాయి. జైలు నుంచి వచ్చినా అదే పంథాలో రెచ్చిపోతూ గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. స్నేహం ముసుగులో మోసం.. ‘ఫేస్బుక్ మర్డర్’ జానకి ఉదంతం వెలుగులోకి రావడానికి కొన్ని నెలల ముందే నగరంలో ‘ఫేస్బుక్ రేప్’ ఘటన చోటుచేసుకుంది. టోలిచౌకిలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతడికి సమీప ప్రాంతంలో నివసించే ఓ యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమెతో కొన్ని రోజుల పాటు స్నేహంగా ఉన్న అతడు... గతేడాది ఫిబ్రవరిలో తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. స్వయంగా వెళ్లి కారులో ఎక్కించుకొని వచ్చాడు. ఆమె నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ఈ నయవంచకుడు కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో వంచన.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బాబూరావు ఫేస్బుక్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తాడు. తన ఈ–మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ సైతం అందులో పొందుపరుస్తాడు. దరఖాస్తు చేసుకున్న వారిలో యువతులు, మహిళల్ని ఎంచుకుంటాడు. దరఖాస్తు పత్రాల్లో ఉన్న వారి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలు తీసుకుంటాడు. వీటి ఆధారంగా వారితో చాటింగ్ చేయడం ప్రారంభిస్తాడు. తొలుత ఉద్యోగానికి సంబంధించిన విషయాలే చర్చించే బాబూరావు... కొన్నాళ్లకు వారిని మాయజేస్తూ వ్యక్తిగత అంశాలతో పాటు అభ్యంతరకర, అశ్లీల సందేశాలూ పంపిస్తుంటాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత సదరు యువతి/మహిళకు ఫోన్ చేసి ‘చాటింగ్’ వివరాలను కుటుంబీకులు, సంబంధీకులకు చెప్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. తాను అడిగినంత ఇవ్వాలంటూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటాడు. బాబూరావు చేతిలో మోసపోయిన ఓ నగర విద్యార్థిని ఫిర్యాదుతో సీసీఎస్ అధీనంలోని సైబర్క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. యువతులూ తక్కువేం కాదు.. ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి యువకుల్ని ఆకర్షిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేస్తున్న ఇద్దరు యువతులూ నగరంలో పట్టుబడ్డారు. పాతబస్తీలోని పత్తర్గట్టీ, రికాబ్ గంజ్లకు చెందిన ఇద్దరు యువతులు స్నేహితులు. వీరిద్దరూ తప్పిపోయారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని పట్టుకున్నాక అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఫేస్బుల్లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వీరు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా యువకుల్ని ఆకర్షిస్తూ వారితో స్నేహం, చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దింపారు. ఆ యువకుల నుంచి నగదు, నగలు, కెమెరాలు, ఫోన్లు రాబట్టుకున్నారు. ఆ డబ్బుతో డెహ్రాడూన్, ఊటీ, వైజాగ్లలో జల్సాలు చేస్తుండేవారు. ఈ పంథాలో వీరిద్దరూ 17 మంది యువకుల్ని మోసం చేశారు. పరిచయం లేని స్నేహం వద్దు... కేవలం దారుణమైన నేరాలే కాదు... ఫేస్బుక్ ద్వారా వేధింపులకు సంబంధించిన కేసులు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. యువతుల పేర్లతో ఖాతాలు తెరిచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్మెయిల్ చేయడం వంటివీ ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యువతులు యాక్సెప్ట్ చేయొద్దు. పరిచయం లేని వారితో స్నేహం, చాటింగ్స్ చేయొద్దు. పరిచయమున్న వారితోనూ వ్యక్తిగత, ఆంతరంగిక అంశాలు ప్రస్తావించొద్దు. – సైబర్ క్రైమ్ పోలీసులు -
కళాకారుల ఆశాసౌదం యంగ్మ్న్స్ హేపీ క్లబ్
నేడు క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు కాకినాడ కల్చరల్ : ది యంగ్మెన్స్ హేపీ క్లబ్. చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. దంటు సూర్యారావు తదనంతరం ఆయన సోదరులు దంటూ భాస్కరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి క్లబ్కు జవసత్వాలు అందించారు. ఔత్సాహిక నటీనటులను రప్పించి, శిక్షణ ఇప్పించి ప్రొత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం దంటు సూర్యారావు అధ్యక్షత వహిస్తున్నారు. క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నారు. సినీ, టీవీ, ఇంటర్నెట్లకు పోటీగా రంగ స్థలానికి సాంకేతిక విజ్ఞానాన్ని జత చేసి అద్భుత ప్రదర్శనలు అందించాలనే సంకల్పంతోనే ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్టు దంటు తెలిపారు. -
అరవైలలోనూ... ఇరవైల అందం సాధ్యమే!
అందాన్ని చాలాకాలం పాటు పదిలంగా కాపాడుకునే విషయంలో సెలబ్రిటీలను చూస్తుంటే అబ్బురంగా ఉంటుంది. వాళ్లలో చాలామంది ఐదు పదుల వయసు దాటినవారే అయినా... పైలా పచ్చీస్గా చాలా యంగ్గా కనిపిస్తుంటారు. అదే వయసులో ఉన్న మన ఊళ్లలోని వారిని చూస్తే వయసు పైబడినట్లుగా ఉంటారు. మనమూ యంగ్గా ఉండటం సాధ్యం కాదా? - ఐశ్వర్య, నిజామాబాద్ అందం మీద ఇప్పుడు మన సమాజంలో అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో అందరూ అత్యుత్తమమైన లైఫ్ స్టైల్ క్లినిక్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. ఇవి కేవలం లుక్స్కు మాత్రమే కాదు... ఆరోగ్యానికీ సమానంగా ప్రాధాన్యం ఇస్తాయి. ఫలితంగా మీరు చూడ్డానికి బాగుండటం మాత్రమే కాదు... ఆరోగ్యంగానూ ఉంటారు. బీజీబిజీగా ఉండే సెలబ్రిటీస్, ప్రొఫెషనల్స్, మోడల్స్ లాంటి ప్రముఖులకు అందాన్నీ, ఆరోగ్యాన్నీ సమపాళ్లలో మేళవించి అందించడానికి ‘లీ గార్జస్’ ఏర్పాటైంది. అయితే కేవలం వారికి మాత్రమేగాక సామాన్యులకూ, సాధారణ ప్రజలకూ అదే స్థాయి, అదే ప్రమాణాలతో సేవలందించనుంది లీ గార్జస్. ఇక్కడ అందం, ఆరోగ్యం సమపాళ్లలో అందేలా కాస్మటాలజీ చికిత్స జరుగుతుంది. ఇక్కడి చికిత్సల కోసం ఖరీదైన లేజర్ మెషిన్లు, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్, మరెన్నో రకాల అడ్వాన్స్డ్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. యూకే, యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్ల నుంచి తెచ్చిన అత్యాధునిక ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి. క్లయింట్ను చూసిన వెంటనే వారి వాస్తవమైన వయసు ఎంత, ముఖం ఎంత వయసును చూపిస్తోంది వంటి విషయాలను తెలుసుకుంటారు. ఇక సౌష్ఠవం విషయానికి వస్తే... బాడీ అనాలసిస్ ప్రక్రియ ద్వారా బరువు, కండరాలున్న తీరు, ఎముకల పటిష్టత వంటివి అంచనా వేస్తారు. బీఎమ్ఆర్, విటమిన్లు, మినరల్స్, ఫాట్ డిస్ట్రిబ్యూషన్ లాంటి పలు అంశాలను మెషిన్స్ సాయంతో అంచనా వేస్తారు. ఒక చదరపు సెం.మీ. స్థలంలో ఉండాల్సిన వెంట్రుకలు ఎన్ని? కుదుళ్లు బలంగా ఉన్నాయా వంటి అంశాలను లెక్కవేస్తారు. ఇలా... అన్ని అంశాలనూ పూర్తిగా పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఒక పోతపోసిన విగ్రహంలాంటి శారీరక సౌష్ఠవం, అందం, ఆరోగ్యం ఉండేలా క్లెయింట్ను తీర్చిదిద్దడానికి యత్నిస్తారు. ఇలా కేవలం ఒక చోటే అందం కల్పించడం కాకుండా సంపూర్ణసౌందర్యం కోసం ప్రయత్నిస్తారు. ఉదాహరణకు వెంట్రుకలు రోజుకు 50 - 100కు పైగా రాలిపోతున్నాయంటే అది ఆందోళన కలిగించే అంశమే. కానీ ఇలా జుట్టురాలడాన్ని అరికట్టడానికి అవసరమైన అనేక అధునిక ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ‘‘మొదట అరామో పద్ధతిలో వెంట్రుక పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉపయోగిస్తాం. మీసోథెరపీ, స్టెమ్సెల్స్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఆర్పీ) వంటివి ఈ ప్రక్రియలలో కొన్ని ముఖ్యమైనవి. ఈ చికిత్సలతో జుట్టు రాలుతుందన్న చింతను పూర్తిగా తొలగించుకోవచ్చు. అలాగే మన మేని రంగు నిగారింపు కోసం కూడా అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. చర్మ కాంతిని పెంచడంలో గ్లుటాథియోన్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం వయసు, అనువంశికంగా వచ్చిన లక్షణాలు, మెడికల్, ఎన్విరాన్మెంటల్, లైఫ్స్టైల్ కండిషన్స్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్లుటాథియోన్ థెరపీని అందించాలి. ఇక విజియో మెషిన్... ముఖం మీద ఉన్న మచ్చలు, రంధ్రాలు, ముడుతలు, అతినీలలోహిత కిరణాల వల్ల కలిగిన డ్యామేజీ లాంటి అంశాలను విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణలను పరిగణనలోకి తీసుకొని చేసే గ్లుటాథియోన్ థెరపీ వల్ల కొంతమంది సెలబ్రిటీల్లాగే ఇప్పటి యువతీయువకుల్లోనూ వెలుగులీనే మేనితో మెరిసేలా చేయవచ్చు. ఈ ఆధునిక చికిత్సలన్నీ తాము ఏర్పాటు చేసిన ‘లీ గార్జస్’లో సాధ్యమవుతాయంటారు ఆ సంస్థకు చెందిన చీఫ్ కాస్మటాలజిస్ట్ డాక్టర్ సుమన్. టెండనైటిస్ తగ్గుతుంది! నా వయసు 24 ఏళ్లు. నేను బాస్కెట్బాల్ క్రీడలో ఎక్కువగా పాల్గొంటాను. కొంతకాలంగా చేతిని కదిలించినప్పుడల్లా నాకు భుజంలో విపరీతమైన నొప్పి ఉంటోంది. చేతిని పూర్తిగా పైకి ఎత్తలేకపోవడం, భుజం బిగువుగా ఉండటం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. డాక్టర్ గారిని సంప్రదిస్తే ఇది టెండనైటిస్ సమస్య వల్ల కావచ్చని అంటున్నారు. మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్సతో ఇది పూర్తిగా నయం అవుతుందా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. - యాదగిరిరావు, నల్లగొండ మీరు తెలిపిన వివరాలను బట్టి ఇది టెండనైటిస్ సమస్యగా భావించవచ్చు. క్రీడలలో పాల్గొనేవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అంటారు. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. ఇవి సాగే గుణం కలిగి ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి కండరాలు ముడుచుకునే సమయంలో ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతైనా వీటికి హాని కలిగితే, ఆ అవయవభాగం కదలికలు ఇబ్బందికరంగా మారి, తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండనైటిస్ అంటారు. సమస్య... భుజాలలో, మోచేతులు, మణికట్టు, బోటనవేలు మొదటి భాగం, తుంటి భాగం, మోకాలు, మడమల వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది. ఏ వయసు వారినైనా ప్రభావితం చేసే ఈ సమస్య ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువ. ఆ వయసులో టెండన్స్ సాగే తత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం ప్రధాన కారణం. ఇతర కారణాలు: వయసు పెరగడం గాయం కావడం వృత్తిరీత్యా ఒకేరకమైన కదలికలు ఎక్కువగా కొనసాగించడం (ఉదా: కంప్యూటర్ కీబోర్డు, మౌస్ ఎక్కువగా ఉపయోగించడం, కార్పెంటరీ, పెయింటింగ్ మొదలైన కార్యకలాపాలు నిర్వహించడం) క్రీడలు డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువ కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. లక్షణాలు: టెండనెటిస్కి గురయ్యే ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడల్లా నొప్పి, వాపు, అక్కడ వేడిగా, ఎర్రగా మారడం వంటి లక్షణాలు గమనించవచ్చు కొన్ని సందర్భాల్లో బొబ్బ మాదిరిగా కూడా ఏర్పడవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కంప్యూటర్ కీబోర్డు, మౌస్లను సరైన పొజిషన్లో ఉంచి పనిచేసుకోవాలి పనిలో కొద్ది కొద్ది సేపటి తర్వాత కొంత విరామం తీసుకుంటూ ఉండాలి వ్యాయామాలు చేసే సమయంలో ఒకేసారి అధిక ఒత్తిడికి గురయ్యేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలి క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించాలి. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ విధానంలో రోగి మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం, రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దాన్ని నయం చేయవచ్చు. అంతేకాకుండా టెండన్స్ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయవచ్చు. -
జేన్టీయూకే అధ్యాపకుడికి యంగ్సైంటిస్ట్ అవార్డు
బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం అందజేసే యంగ్సైంటిస్ట్ అవార్డు 2016కు జేఎన్టీయూకే కెమికల్ సైన్స్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్తసైన్స్ స పోటీలలో పాల్గొనగా శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒకరితో పాటు జేఎ¯ŒSటీయూ కాకినాడ వర్సిటీ నుంచి శ్రీనివాసులు కెమికల్ సైన్స్ విభాగంలో ఎంపికయ్యారు. అవార్డును విజయవాడలో సోమవారం జరిగిన సై¯Œ్సకాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైంటిస్ట్ ఏ.వి.రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డుతో పాటు పదివేల రూపాయల బహుమతి తీసుకున్నారు. -
న్యాయం జరగలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన రాజోలు : భార్యపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై పోలీసులకు, కుల సంఘాలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్న మనస్తాపంతో పొన్నమండలోని తుఫాన్కాలనీకి చెందిన ముగ్గు రామకృష్ణ(26) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య నాంచారమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ములికిపల్లికి చెందిన ముగ్గు ఏడుకొండలు(కొండ) ఈ నెల 16, 17 తేదీల్లో రామకృష్ణ లేని సమయంలో, అతడి ఇంటికి వచ్చి నాంచారమ్మపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు, బంధువులకు తెలిపింది. వారు ములికిపల్లికి వచ్చి ఏడుకొండలను నిలదీశారు. ఈ సమస్యను కుల సంఘంలో తేల్చుకోవాలని ఏడుకొండలును పిలిపిస్తే, అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఏడుకొండలును పిలిపించారు. కాగా అతడి పెదనాన్న సత్యనారాయణమూర్తి, చిన్నాన్న పెద్దిరాజు ఈ కేసును తారుమారు చేసేందుకు యత్నించారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. సెటిల్మెంట్ పేరుతో పలుమార్లు పోలీస్స్టేçÙన్కు రప్పించుకోవడం, పెద్దల వద్దకు తిరగడంపై రామకృష్ణ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ క్రమంలో సంఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుడగ జంగాల సంఘ నాయకులు రాజోలు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. మృతుడి భార్య కూడా నిరసన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ క్రిషో్టఫర్ హామీ ఇవ్వడంతో, ఆందోళన విరమించారు. మృతుడి చిన్నాన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ క్రిషో్టఫర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ప్రమాదంలో యువకుడు మృతి
ఉద్యోగం కోసం వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం శోక సంద్రంలో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం క్రైం : కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతూ ఇంటికి చేరాల్సిన యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న వాడే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్ కు చెందిన దాడి శివ(30) హోమ్ గార్డుగా ట్రైనింగ్ పొందేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగ నియమక పత్రంతో ఇంటికి చేరి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. గౌతమి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా సోమవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా రన్నింగ్ లో దిగిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొని వేగంగా వెనక్కు వచ్చి రైలు కింద పడిపోయి ఎడమ చేయి తెగిపోయి తీవ్ర గాయాలపాలైయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వద్ద బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్లు, టికెట్ ఆధారంగా చిరునామా గుర్తించారు. ప్రమా దంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శోక సముద్రంలో కుటుం సభ్యులు మృతుడు దాడి శివకు భార్య, ఒక పాప ఉన్నారు. ఉద్యోగం సంపాదించి తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఉద్యోగ నియామక పత్రం చూపించి తమ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవాలని సంతోషంతో వచ్చిన శివ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి మారుమ్రోగింది. -
యువకుడి మృతి
నకిరేకల్æ: నకిరేకల్లో పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ ఒక యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన ఎండీ.ఖయీముద్దీన్ (30) నకిరేకల్లోనే ఎలక్ట్రికల్ షాప్ నడుపుతూ స్థానిక పోలీస్స్టేషన్ సమీపంలోని పెద్ద మసీద్ పక్కన పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని రోజులుగా పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అద్దెకు ఉంటున్న గదిలోనే మృతి చెందాడు. పైఅంతస్తు కావడంతో ఆ గదిలోకి ఎవ్వరు వెళ్లలేదు. ఆదివారం పైఅంతస్తు గదిలో నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా ఆ గదిలో ఖయీముద్దీన్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా, మృతుడి సోదరి షైనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ యాదగిరిరెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితమే మృతి చెందడం వల్లే మృతదేహం కుళ్లిపోయి ఉందని పేర్కొన్నారు. కామర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారని వివరించారు. -
కొత్తూరులో యువకుడి బలవన్మరణం
రాయపర్తి : ఓ యువకుడు చీరతో ఉరివేసుకొని బల వన్మరణానికి పాల్పడిన మండలంలోని కొత్తూరు లో బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకా రం.. కొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాళ్లం శంకరయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడు ప్రవీన్(32) మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరంగల్లోని రంగశాయిపేటలో భార్యాపిల్లలతో నివాసముండే ప్రవీన్ బుధవారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రవీన్ మరణానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి తల్లిదండ్రులతోపాటు, భార్య స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువ రైతు ఆత్మహత్య
నార్నూర్ : మండలంలోని నాగల్కొండ పంచాయతీ పరిధి దేవాపాటర్ గ్రామానికి చెందిన గోర్సెంగే బాలాజీ(35) అనే యువ రైతు బుధవారం తన చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బాలాజీ ఈ ఏడాది మొదటిసారిగా తనకున్న ఐదు ఎకరాల భూమిలో పత్తి పంట సాగు ప్రారంభించాడు. మొదటిసారిగా విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. పత్తిలో కలుపు మొక్కలు అధికంగా ఉండడంతో రెండు రోజులుగా గడ్డి మందును పిచికారి చేస్తున్నాడు. కలుపు మొక్కలు అధికంగా తయారవడంతో ఇంకా పెట్టుబడి పెట్టలేక చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శశికళాబాయి, నలుగురు పిల్లలున్నారు. రైతు ఆత్మహత్య విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రాణాప్రతాప్ తెలిపారు. -
ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్
యువతులను వేధిస్తున్న ఈవ్టీజర్లపై సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. వేధింపుల నుంచి అమ్మాయిలను రక్షించేందుకు సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ పరిధిలో సెలైంట్గా తమ పని కానిస్తున్న 60 షీ బృందాలు ఈనెల 4 నుంచి 16వ తేదీ వరకు 32 కేసుల్లో 43 మంది ఈవ్టీజర్లను పట్టుకున్నాయి. సైబరాబాద్ ఈస్ట్లో 17 కేసులు, సైబరాబాద్ వెస్ట్లో 15 కేసులు నమోదు చేశాయి. షీ బృందాలకు పట్టుబడిన వారిలో అత్యధికంగా 20 ఏళ్లు పైబడిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరందరికి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని సీఏడబ్ల్యూ హాల్లో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, షీ టీమ్స్ ఇన్చార్జి, ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ ఏసీపీ స్నేహిత తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
రోజూ మూడు గంటలు దానిపైనే!
టొరంటో: యువత స్మార్ట్ ఫోన్ల మత్తులో కొట్టుకుపోతోంది. రోజువారి జీవితంలో వారు స్మార్ట్ ఫోన్తో గడిపే సమయం ప్రతియేటా పెరుగుతోందని గ్లోబల్ వెబ్ ఇండెక్స్(జీడబ్యూఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. యువత రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్కులు 2012లో స్మార్ట్ ఫోన్లతో గడిపే సమయం 1.45 గంటలుగా ఉంటే.. ఇది 2014 నాటికి 2.45 గంటలకు పెరిగింది. ఇటీవల ఇది మరింతగా పెరుగుతూ.. ఒకరోజులో యువత మూడు గంటలకు పైగా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే స్మార్ట్ ఫోన్లు కాకుండా ఇతర తెరలపై వెబ్ సేవలను వినియోగించుకునే సమయం మాత్రం తగ్గిపోతుంది. -
పేదల పొరుగున పెరిగితే...
పేదరికం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనుకబడినవారు నివసించే ప్రాంతాల్లో ఉండే యువతుల్లో ఊబకాయ సమస్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. పేదరికం, ఊబకాయానికి మధ్య పాక్షిక సంబంధం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. తక్కువ ఆదాయం ఉండేవారు నివసించే ప్రాంతాల్లో వ్యాయామ సౌకర్యాలు, ఆరోగ్యకరమైన ఆహారవనరులు లేకపోవడమే కాక, అధిక ఒత్తిడి కూడ ఊబకాయానికి కారణమౌతోందని చెప్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నవారు నివసించే ప్రాంతంలో ఎక్కువకాలం ఉండటం యువతుల జీవితకాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అమెరికా కొలరాడో డెన్వర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ లిప్పర్ట్ తెలిపారు. నేషనల్ సర్వే డేటాలోని ఏడవతరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరిశోధన బృందం 13 సంవత్సరాలపాటు పరిశీలించింది. విద్యార్థులు బాల్యంనుంచి యుక్త వయసులోకి మారుతున్న సమయంలో వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి, వారిలో ఊబకాయం సమస్య సంక్రమిస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడి అయింది. పిల్లలు...బాల్యం నుంచీ యుక్త వయసు వరకూ పేదలు ఉండే ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే వారిలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే యుక్త వయసులోకి మారుతున్న సమయంలో పేదలు ఉన్న ప్రాంతంనుంచీ సంపన్న ప్రాంతానికి మారినప్పుడు ఊబకాయ సమస్య తక్కువగానూ, సంపన్న ప్రాంతంనుంచీ తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతానికి చేరినప్పుడు స్థూలకాయం సమస్య ఎక్కువవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా మురికివాడల్లోనూ, పేదలు నివసించే ప్రాంతాల్లోనూ ఎక్కువకాలం పెరిగిన యువతులు భవిష్యత్తులో ఊబకాయం సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువతులకు సానుకూల వనరులు సమకూర్చడం, నివాస పరిస్థితులు మెరుగు పరచడంవల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంగా కొనసాగే అవకాశం ఉంటుందని లిప్పర్ట్ సూచించారు. -
హోంగార్డు చెంప చెళ్లు మనిపించిన యువతి
-
కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్!
ఆ తర్వాత అనంతపురం, తిరుపతిలో.. - ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధులు రూ. 100 కోట్లు - ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అడ్వైజర్ జె.సత్యనారాయణ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లోని యువ ప్రతిభావంతుల ఆలోచనలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రంలో మరో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ను నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి కాకినాడలో స్టార్టప్ టవర్ను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత అనంతపురం, తిరుపతిల్లోనూ ఒక్కో సెంటర్ను నిర్మిస్తామని చెప్పారు. ఇంటెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేట్ ఫర్ డిజిటల్ ఇండియా చాలెంజ్’కు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధుల కింద రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని, ఇందులో సీడ్ క్యాపిటల్ కింద 15% ఇంక్యుబేషన్ నిర్మాణానికి ఖర్చు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో విద్యా, వైద్యం, టెక్నాలజీ వంటి వివిధ విభాగాలకు చెందిన 107 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరాయన్నారు. ‘ఈ ఏడాది ముగింపు నాటికి వీటి సంఖ్యను 500లకు చేరుస్తాం. 2020 కల్లా ఇందులో సుమారు 5,000 స్టార్టప్స్ ఉండేలా ప్రోత్సాహం అందిస్తాం’ అని వివరించారాయన. డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తుల ఆహ్వానం! మీ సాంకేతిక పరిజ్ఞానంతో... సరికొత్త ఆవిష్కరణతో స్థానిక అవసరాలను తీరుస్తున్నారా? అయితే ఈ పోటీ మీకోసమే. దేశంలో సాంకేతిక వినియోగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇంటెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇన్నోవేషన్ ఫర్ డిజిటల్ ఇండియా పోటీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోటీ విలువ రూ.1.5 కోట్లు. అత్యుత్తమ స్థాయిలో నిలిచే తొలి ముగ్గురు విజేతలకు తలా రూ.20 లక్షలను అందిస్తామని ఇంటెల్ దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు దేవయాని ఘోష్ చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్నోవేట్ఫర్డిజిటల్ఇండియా.ఇంటెల్.ఇన్కు లాగిన్ అయి ప్రాజెక్ట్ను నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఈనెల 22. విజేతలను వచ్చే ఏడాది జనవరిలో ప్రకటిస్తారు. -
నయాదారుల్లో.. చుడీదార్లు
భారతీయ సంప్రదాయాన్ని కొలిచినట్టు చూపగలిగేది చీరకట్టే. చీరల తర్వాత ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. శారీలకు దీటుగా నిలిచిన ఘనత పంజాబీ డ్రెస్లకు దక్కుతుంది. మోడర్న్ లుక్లో కనిపించినా.. ట్రెడిషనల్ ఇంపాక్ట్నూ క్యారీ చేస్తూ.. టీనేజీ యువతుల నుంచి.. నడివయసు నారీమణుల వరకూ అందరికీ నేస్తంగా మారాయివి. ఒంటికి నిండుగా హత్తుకునే ఈ డ్రెస్లో కంఫర్టబుల్ అదనంగా ఉండటంతో.. ఏ తరం వారైనా పంజాబీ డ్రెస్లను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందుకే చుడీదార ్లకు ఎప్పటికప్పుడు మోడర్న్ టచ్ ఇచ్చి.. వెస్ట్రన్ లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ, జంప్ సూట్ స్టైల్ ట్యూనిక్లు యువతుల మనసును దోచుకుంటున్నాయి. కుచ్చుల మ్యాజిక్.. ఫ్యాషన్ మార్కెట్లో లేటెస్ట్ అప్డేట్ జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ. కుచ్చులతో వస్తున్న ఈ డ్రెస్ ఈ తరం అమ్మాయిలకు బాగా నప్పుతుంది. స్లీవ్లెస్ లాంగ్ టాప్ విత్ మల్లీ ప్లేట్స్ (కుచ్చులు)తో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. లెఫ్ట్సైడ్ షార్ట్ లెన్త్లో ఉండే ఈ కుచ్చులు.. రైట్సైడ్కు వచ్చే సరికి ఫ్లోర్లెన్త్గా మారుతాయి. మ్యాచింగ్ ప్యాంట్, చుడీకి పైన కాంట్రాస్ట్ కలర్స్తో అందమైన లాంగ్ జాకెట్ మోడల్ వస్తుంది. మెగా స్లీవ్స్తో ఉండే ఈ లాంగ్ జాకెట్ డ్రెస్కే డిఫరెంట్ లుక్ తెస్తుంది. కాలేజ్ ఈవెంట్లకు, పార్టీలకు ఈ డ్రెస్ కరెక్ట్గా సరిపోతుందని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జంప్ టు రిచ్లుక్.. డిజైనింగ్ కాస్ట్యూమ్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యాషన్ వరల్డ్లో హల్చల్ చేస్తున్నాయి జంప్సూట్ ట్యూనిక్ చుడీలు. ఫుల్ హ్యాండ్స్తో హైనెక్ ప్యాటర్న్ కలిగి ఉన్న ఈ డ్రెస్లు పార్టీవేర్గా మంచి మార్కులు కొట్టేశాయి. తేలికపాటి లేసర్, 60 గ్రామ్స్ ఫ్యాబ్రిక్స్తో ఫ్లోర్లెన్త్ టాప్.. ఫ్రంట్ అండ్ బ్యాక్ సెంటర్ స్లిట్స్తో స్పెషల్ లుక్లో కనిపిస్తాయి. కింది వైపు యాంటిక్, గోల్డ్ కలర్లలో ఫ్లవర్ ఎంబ్రయిడరీ డిజైన్తో రిచ్ లుక్ను కట్టబెడుతుంది. వీటికి బాటమ్గా ఏదైనా స్పన్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. హైనెక్ ఉండే ఈ ప్యాటర్న్ వేర్ మీద చున్నీలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింప్లిసిటీ కోరుకునే వాళ్లకు ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సూటవుతుంది. మెడలో చైన్లు గట్రా వేసుకోవాల్సి పని కూడా ఉండదు. చెవులకు మాత్రం కాస్త పెద్ద సైజు హ్యాంగింగ్స్ ధరిస్తే సరి. పార్టీలో అందరి లుక్కూ మీ మీదే. -
పట్నం వచ్చిన పల్లెక్రాంతి
అరిటి బోదెలు, కొబ్బరి మట్టలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు.. కలాపి చల్లిన లోగిళ్లు.. అందులో నవధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లులు.. పిండి వంటలు, పతంగులు, పట్టు పరికిణీల్లో యువతులు, పంచె కట్టులో యువకులు.. అచ్చంగా పల్లె పండుగ సంక్రాంతి పట్నానికి తరలి వచ్చింది. నగర శివారుల్లోని చిలుకూరు సమీపంలోని నిర్వాణ ప్రాంగణం పల్లెక్రాంతితో వెలిగిపోయింది. నాలుగు రోజులు ముందుగానే సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది. -శిరీష చల్లపల్లి పల్లెలో సంక్రాంతి అనగానే.. తెల్లవారకముందే గంగిరెద్దల మువ్వల సవ్వడి వినిపిస్తుంది. హరిదాసుల గానం పల్లె గాలిలో విహరిస్తుంది. పట్నవాసంలో పండుగంటే హాలిడే అని తప్ప మరో అనుభూతి ఉండదు. ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ పల్లెలో జరిగే పండుగ శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాణ నిర్వాహకురాలు లీల. సిటీవాసులకు సంక్రాంతి ఆనందం పంచడానికి ఏకంగా పల్లెనే పట్నానికి తీసుకొచ్చారు. ముందే వచ్చిన పండుగ... సొంతూళ్లకు వెళ్లలేని సిటీజనులెందరో నిర్వాణ ప్రాంగణంలో ఆదివారం జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. మగువలంతా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు అందులో కొలువుదీర్చారు. పెద్ద మనుషులు వైకుంఠపాళి ఆటతో కాలక్షేపం చేశారు. చిన్నారులు, యువకులు పతంగులు ఎగిరేస్తూ జాలీగా గడిపారు. మహిళలు గచ్చుకాయలు, అష్టాచెమ్మా, వామన గుంటలు ఇలా కనుమరుగవుతున్న పల్లె ఆటల్లో తేలాడారు. మీసం మెలేసిన మగమహారాజులు కోడి పందేల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. చిన్న పిల్లల నుంచి, పెద్దవాళ్ల వరకు అందరూ కల్చరల్ ఈవెంట్లలో పాలుపంచుకున్నారు. జానపద వేడుక... ఈ ఆటపాటలకు తోడు గంగిరెద్దులు ఆడించేవారు, హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, బుర్రకథ చెప్పేవాళ్లు, పిట్టల దొరలు ఇలా జానపద కళారూపాలు పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చిపెట్టాయి. ఔత్సాహిక కళాకారులు ఏక్తారా, సితారా, తంబుర, వీణ వంటి సంప్రదాయ వాయిద్యాలతో తమలో ఉన్న ప్రతిభను చాటుకున్నారు. ధాన్యరాశులు, కలశాలు, అరివేణి కుండలు ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే ఎలా ఉండాలో చూపారు. వింతైన వంటకంబులు... వివాహ భోజనంబును తలదన్నే రీతిలో వంటకాలు వండి వడ్డించారు. దంపుడు బియ్యంతో అన్నం, పొంగలి, పులిహోర, దద్దోజనం, ముద్దపప్పు, ఆవకాయ, గుత్తి వంకాయ కూర లాంటివే కాకుండా పూర్ణాలు, అరిసెలు వంటి తీపి పదార్థాలు, మురుకులు, సకినాలు వంటి పిండి వంటకాలు భోజనప్రియులను కట్టిపడేశాయి. మొత్తానికి పల్లె సందడిని మోసుకొచ్చిన ఈ ప్రాంగణంలో సంక్రాంతితో పాటు భోగి, కనుమలు కూడా కన్నులపండువగా జరిగాయి. సరదాగా సాగింది ఉగాది, సంక్రాంతి తెలుగు పండుగలు. మరచిపోతున్న సంస్కృతిని మళ్లీ పరిచయం చేయడం బాగుంది. ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు భలే సరదాగా అనిపించాయి. నగర వాతావరణానికి పల్లె సంస్కృతిని పరిచయం చేయడం బాగుంది. - లక్ష్మీ పార్వతి నా వంతు ప్రయత్నం ఈ రోజుల్లో మనిషికంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే నా వంతు ప్రయత్నమే నిర్వాణ వేదిక. ఏటా ఇలాంటి భారీ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సారి సంక్రాంతికి ప్లాన్ చేశాం. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఎలాంటి కార్యక్రమాలైనా ఈ ప్రాంగణంలో నిర్వహించవచ్చు. అదీ ఉచితంగానే. - లీల, నిర్వాణ ప్రాంగణం నిర్వాహకురాలు ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
పెన్నూ, గన్నయి పేలిన సుబ్బారావు పాణిగ్రాహి
‘దిక్కుమొక్కు లేని జనం ఒక్కొ క్కరు అగ్నికణం.. సింహకంఠ నాదంతో వస్తారిక కాచుకోండి’ అంటూ తన పాటల్ని విప్లవ రాజ కీయాలతో జోడించిన ప్రజా కవి సుబ్బారావు పాణిగ్రాహి. 1934 సెప్టెంబర్ 8న శ్రీకా కుళం జిల్లా బారువాలో ఒక పూజారి కుటుం బంలో జన్మించాడు. బొడ్డపాడు గ్రామానికి పూజారిగా వచ్చాడు. తామాడ గణపతి, పంచాది క్రిష్ణమూర్తితో కలసి యువకులను ఉద్యమాల్లోకి తెచ్చాడు. తెగింపు సంఘాన్ని పెట్టి ఎందరో యువకులను శ్రీకాకుళ పోరాటంలోకి తీసుకొచ్చాడు. ప్రజల కష్టాలపై ఎన్నో పాటలను, గేయాలను, నాటికలను రాశాడు. ‘ఎరుపంటే కొందరికి భయం, భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం’, ‘కష్టజీవులం మేము కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం’ వంటి ఆయన రాసిన పాటలు శాశ్వతంగా నిలిచి పోయాయి. తామాడ చినబాబుతో కలిసి ఆయన చెప్పిన జముకుల కథ ప్రజలను ఉర్రూతలూపింది. ఆయన రాసిన ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్ శాల్యూట్’ అనే పాట విప్లవకారులు నిత్యం జెండా వందన వేళ పాడుకునే విప్లవగీతం అయింది. శ్రీకాకుళ గిరిజనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొ న్నాడు. చాగంటి భాస్కరరావు, తామాడ గణపతి అమరత్వం తర్వాత సోంపేట ఏరియా పార్టీ కార్యద ర్శిగా పాణిగ్రాహిని ఎన్నుకున్నారు. అనతి కాలంలో నే అంటే, 1969 డిసెంబర్ 22న పాణిగ్రాహిని రంగమటియ కొండల్లో కాల్చి చంపారు. ఆయన జీవించింది 36 ఏళ్లు మాత్రమే. ప్రజాకళలకు జీవం పోసి వాటిని రాజకీయాలతో జోడించి ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. గిరిజనులను నిర్వాసితుల ను చేస్తూ, ప్రజాకళల పోషణ పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ సంస్థల ద్విముఖ దాడిపై కళాకా రులు నేడు ఉద్యమించాలి.. పాణిగ్రాహి లాగా వారి విముక్తి కోసం పనిచేయాల్సిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది. అందుకే పాణిగ్రాహిని స్మరించుకుందాం. (నేడు సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి) సి.వెంకటేశ్వర్లు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ -
అర్ధరాత్రి హల్చల్
మహిళతో అసభ్యప్రవర్తన 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాటేదాన్: బెంగుళూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 9 మంది యువకులను మైలార్దేవ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై లక్ష్మీకాంత్రెడ్డి ప్రకారం... మలక్పేట్, బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు చెందిన జోహెల్(28), డేవిడ్(20), జోహెల్ అహ్మద్(20), సాయికుమార్యాదవ్(18), పుక్రూద్(20), స్వప్లింగ్(25), అబ్దుల్ రెహ్మాన్(20), సాయికిశోర్(20), హష్మి (18) విలువైన స్పోర్ట్స్ బైక్లపై మంగళవారం రాత్రి మాదాపూర్లో జరిగిన విందుకు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే ఫంక్షన్ పూర్తికావడంతో చేసేదిలేక శంషాబాద్ ఎయిర్పోర్టులోని నోవాటెల్ హోటల్లో విందు చేసుకొనేందుకు మాదాపూర్ నుంచి రాత్రి 12 గంటలకు బయల్దేరారు. బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలోని బెంగళూరు జాతీయ రహదారిపక్కనే గల పెట్రోల్పంప్ వద్ద బైక్ల్లో పెట్రోల్ పోసుకునేందుకు వచ్చారు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉండటంతో జాతీయ రహదారిపై బైక్రేసింగ్ నిర్వహించేందుకు యత్నించారు. దారినవెళ్లే ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవరిస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించారు. ఇదే క్రమంలో ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, అల్లరి చేశారు. ఆమె పోలీసు కంట్రోల్ (100)కు సమాచారం అందించింది. కంట్రోల్ రూమ్ సిబ్బంది మైలార్దేవ్పల్లి పోలీసులను అప్రమత్తం చేయడంతో వెంటనే వారు తొమ్మిది మంది యువకులతో పాటు 9 స్పోర్ట్స్ బైక్లను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. బుధవారం ఉదయం యువకుల తల్లిదండ్రులను పిలిపించారు. మరోసారి ఇలాంటి సంఘటనలకు పాల్పడకుంటా పోలీసులు యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరో రోడ్లపై బైక్రేసింగ్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల హామీ మేరకు కౌన్సెలింగ్ అనంతరం యువకులను వదిలిపెట్టారు. -
చిన్నారిని చిదిమేసిన ‘హుదూద్’
చీపురుపల్లి:ఒక్కగానొక్క కొడుకు పెరిగి పెద్దవాడై తమను ఆదుకుంటాడనుకున్న తల్లిదండ్రుల ఆశలను హుదూద్ తుపాను చిదిమేసింది. కన్నకొడుకు తుపాను వర్ష బీభత్సానికి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కుపచ్చలారని విద్యా ర్థి గెడ్డలో కొట్టుకుపోయిన విషయం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికిచెందిన మోపాడ గొల్ల, రామలక్ష్మిల ఒక్కగానొక్క కొడుకు దుర్గాప్రసాద్(10) ఈ నెల 12న ఆవులను మేపేందుకు పొలంలోకి తీసుకెళ్లాడు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలిస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఇటకర్లపల్లి సమీపంలో గల పెద్దగెడ్డలో దుర్గాప్రసాద్ శవమై తేలాడు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి పరుగుపరుగున చేరుకుని భోరున విలపించారు. జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు చిన్నారి మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి శవపంచనామా నిర్వహించి తిరిగి గ్రామానికి పంపిం చారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు చీపురుపల్లి నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఐటీ శాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని చిన్నారి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వ్యాధులతో విలవిల
విశాఖరూరల్: వాతావరణంలో మార్పులతో పరి స్థితి అదుపు తప్పుతోంది. జిల్లా వాసులు వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. విషజ్వరాలు, డెంగ్యూ, చికున్గున్యా విజృంభిస్తున్నాయి. మైదా నంలోని వారిని విషజ్వరాలు, చికున్గున్యా, డెంగ్యూ పీడిస్తున్నాయి. బుచ్చెయ్యపేట మం డలం మండలం రాజుపాలేనికి చెందిన ఎన్.మరియమ్మ(20),మాడుగుల మండలం జాలంపల్లికి చెందిన జి.వసంతకుమారి(16),రావికమతం మండలం ఎల్.కొత్తూరుకు చెందిన బి. వరలక్ష్మి డెంగ్యూకు గురయ్యారు. బుచ్చెయ్యపేట మండలం పెదమదీనాలో ఎం.మరిడిబాబు(14),ఎం. కనకరాజు, వై.నాగేశ్వరరావు(10),ఎ.అప్పారావు చికున్గున్యాతో బాధపడుతున్నారు. ఇవి విశాఖ కేజీహెచ్ వైద్యాధికారులు నిర్ధారించినవే. పాడేరు మండలం మారుమూల జోడుమామిడి గ్రామం లో వారం వ్యవధిలో చిన్నారావు, మంగి అనే ఆదివాసీ యువకులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. రావికమతం మండలం కన్నంపేటలో మాయదారి జ్వరాలు వారం రోజుల్లో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న విషయం మరువక ముందే ఇదే మండలం గరిణకంలో ఓ యువకుడు డెంగ్యూ లక్షణాలతో ఈ నెల 23న చనిపోయాడు. ఆనందపురం పంచాయతీ పొడుగుపాలేనికి చెందిన బంటుబిల్లి శంకర రావు(29) ఇదే లక్షణాలతో మృతి చెందాడు. హుకుంపేట మండలంలో ఇటీవల ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మలేరియాతో చనిపోయిన విషయం తెలిసిందే. చోడవరం మండలం అంకుపాలెం పంచాయతీ గోవిందమ్మ కాలనీలో జ్వరంతో బాధపడుతూ తబ్బి తరుణ్(9) ఈనెల 24న ఉదయం చనిపోయాడు. ఇలా రోజురోజుకు జిల్లాలో ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కశింకోట మండలం నూతన గుంటపాలెంలో 5,రాంబిల్లి మండలం దిమిలిలో 2 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇటీవల 402 మంది అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షించగా 42 మందికి డెంగ్యూ ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పలు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు అదుపులోకి రావడం లేదు. -
క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన
ఆర్కేపురం: ‘సాక్షి’ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రైస్తవ వివాహ పరిచయ వేదికకు అపూర్వ స్పందన లభించింది. పెళ్లికోసం తగిన జోడిని వెతుక్కోవడం కష్టతరమైన ఈ రోజుల్లో యువతి, యువకులు పెళ్లికోసం పరిచయ వేదికలపైన ఆధారపడాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ క్రమంలో కొత్తపేటలోని బాబుజగ్జీవన్రావ్ భవన్లో సాక్షి నిర్వహించిన క్రైస్తవ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు జంటనగరాల నుంచి భారీ సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యారు. సాక్షి ఆధ్వర్యంలో ప్రతి నెలా వివాహ పరిచయవేదికలు నిర్వహించడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా అనేక జంటలు ఒకటయ్యాయని సాక్షి అడ్వర్టైజ్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం. సంతోష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ భరత్కిషోర్, ప్రముఖ యాంకర్ వేటూరి కాంతి పాల్గొన్నారు. ‘సాక్షి’ వారు నిర్వహించిన ఈ వివాహ పరిచయ వేదిక వల్ల క్రిస్టియన్ కమ్యూనిటీలోని పెళ్లి కావాల్సిన వధూవరులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో సౌలభ్యంగా ఉంది. వేర్వేరు చోట ఉన్న వారు ఒకే వేదికపై కలవడం వల్ల వారి అభిప్రాయాలు ఒకరికి ఒకరు పంచుకోవడం సులభమవుతుంది. ఇటువంటి వివాహ వేదికలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలి. (అబ్రహం- ఇండియన్ క్రిస్టియన్ మ్యాట్రిమోని డాట్ కామ్ సంస్థ అధినేత) భాగస్వామి ఎంపికకు దోహదం ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. క్రైస్తవ అమ్మాయిలు, అబ్బాయిలకు ఎంతో సులువుగా వారి వారి భాగస్వాములను ఎంచుకునేందుకు ఎంతో దోహద పడుతుంది. ‘బైబిల్ ప్రకారం వివాహం అన్నిటిలో ఘనమైంది. -రెవరెండ్ డా. బి.పి.శామ్యూల్ సంబంధాలు త్వరగా కుదురుతాయి క్రైస్తవ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినందుకు సాక్షి వారికి ధన్యవాదాలు. రిస్క్ లేకుండా ఒకే వేదికపై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల సంబంధాలు త్వరగా కుదురుతాయి. - కాపర్తి ప్రణీత -
బాధ్యత తీసుకోండి
ప్రేరణ ఎవరి జీవితం ఎలా ఉంటుందనేది వారి పనులను బట్టే ఉంటుంది. ఎవరి భవితవ్యానికి వారే బాధ్యత వహించాలి. మరెవరో బాధ్యత తీసుకోవడం కష్టమైన పని. నా జీవితం ఇలా కావడానికి ఫలానా వ్యక్తులు, పరిస్థితులే కారణమంటూ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నష్టపోయేది ముమ్మాటికీ మీరే. ఇతరులపై నిందలేయడం సరి కాదు. ముళ్ల పొదల్లా గజిబిజిగా ఉన్న జీవితాన్ని సుందర నందనవనంగా మార్చుకోవాలి. ఒకేరకమైన పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు కుర్రాళ్లు వాటిని తమ జీవితానికి ఏ విధంగా అన్వయించుకున్నారో తెలుసుకుందాం.. పేద కుటుంబం, నాన్న తాగుబోతు ఓ నగరంలో ఓ యువకుడు చిన్న నేరం చేసి పోలీసులకు దొరికాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో చిన్నచిన్న నేరాలు చేస్తూ బతుకుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఎందుకు మారావని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. నన్ను, మా తమ్ముడిని చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పెరిగిన నేను దొంగను కాక ఇంకేమవుతాను? నేను ఇలా మారిపోవడానికి కచ్చితంగా మా నాన్న, నేను పుట్టి పెరిగిన పరిస్థితులే కారణం’’ అంటూ.. చెప్పాడు. ఈ యువకుడి వాదన ఇలా కొనసాగుతుండగా ఇక్కడికి సమీపంలోనే ఓ సన్మాన కార్యక్రమం జరుగుతోంది. విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నా.. మురికివాడలో పుట్టి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన యువకుడిని అక్కడ సన్మానిస్తున్నారు. అతడికి పూల దండలేసి, శాలువాలు కప్పి గొప్పవాడంటూ పొగిడారు. ఇదంతా ఎలా సాధించావో చెప్పాలని కోరగా ఆ యువకుడు ఇలా ప్రసంగించాడు.. ‘‘మాది చాలా పేద కుటుంబం. రెండు పూటలా కడుపు నింపుకోవడానికి కూడా డబ్బు లేదు. మా నాన్న తాగుబోతు. మద్యం మత్తులో నన్ను, మా అన్నను చావ బాదేవాడు. చదువుకుందామంటే డబ్బుల్లేవు. మాది చిన్న ఇల్లు. అందులో చదువుకోవడానికి అనువైన వాతావరణం లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి, మంచి జీవితం గడపాలంటే బాగా కష్టపడాలని అర్థం చేసుకున్నాను. నా జీవితానికి నేనే బాధ్యత తీసుకున్నాను. నా విధిని, తలరాతను నేనే నిర్దేశించుకున్నాను. రాత్రింబవళ్లూ శ్రమించి అనుకున్నది సాధించాను’’ అని చెప్పాడు. మనం ఎలా స్పందిస్తున్నాం? ఇప్పుడు మీరు ఊహించింది నిజమే. వారిద్దరూ సొంత అన్నదమ్ములే. కారణం చిన్నదే.. అన్న తన జీవితానికి ఇతరులను బాధ్యులను చేసి, చిల్లర దొంగగా మారిపోయాడు. తమ్ముడేమో బాధ్యతను తన భుజాలపైనే వేసుకొని, బతుకును బంగారంగా మార్చుకున్నాడు. మనకు ఏం జరిగింది అనే దాన్ని బట్టి కాకుండా.. జరిగిన దాని పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనేదాన్ని బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇతరులను, పరిస్థితులను నిందించడం, సాకులు చెప్పడం ద్వారా మనం బాధ్యత నుంచి తప్పుకుంటున్నాం. తద్వారా జీవితాలను మార్చుకొనే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నాం. నిమ్మరసం చేయడం నేర్చుకోవాలి ‘జీవితం నీకు నిమ్మకాయ ఇస్తే.. దాంతో నిమ్మరసం చేసుకోవడం నేర్చుకో..’ అనే సామెత ఉంది. నిమ్మకాయలో చేదు కూడా ఉంటుంది. చేదు తగలకుండా రసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పరిస్థితులు కూడా అలాంటివే. వాటిలో చెడును వదిలేసి, మంచిని గ్రహించడం మన చేతుల్లోనే ఉంది. నిందలు, సాకులు మానేయండి పరిస్థితులపై నిందలేయడం, సాకులు వెతకడం ఈరోజే మానేయండి. అదృష్టం, తలరాత, తల్లిదండ్రులు, టీచర్లు, యజమానులు.. మీ జీవితానికి వీరిని బాధ్యులను చేయకండి. మిమ్మల్ని మీరే బాధ్యులను చేసుకోండి. అనుకున్నది సాధించి చూపండి. మీ మనస్సు అనే కాక్పిట్లో ఒకే సీటు ఉంది. అందులో ఏ పైలట్ను కూర్చోబెడతారు. బాధ్యత నుంచి తప్పించుకొనే సాకునా? లేక బాధ్యతనా? నిర్ణయించుకోవాల్సింది మీరే. -‘కెరీర్స 360’ సౌజన్యంతో.. ప్రకాశ్ అయ్యర్, ఎండీ, కింబర్లీ- క్లార్క్ లీవర్