ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే? | Young Woman Commits Suicide Unwilling To Marry In Guntur District | Sakshi
Sakshi News home page

ఇష్టం లేనిపెళ్లి.. నిశ్చితార్థం విషయం తెలిసి యువతి ఏం చేసిందంటే?

Published Sun, Apr 24 2022 10:58 AM | Last Updated on Sun, Apr 24 2022 11:41 AM

Young Woman Commits Suicide Unwilling To Marry In Guntur District - Sakshi

తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

గుంటూరు రూరల్‌: తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ తరంగిణి తెలిపిన వివరాలు.. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోరంట్ల గ్రామానికి చెందిన దమ్ము జయపాల్‌కు ఒక కుమార్తె సంధ్య(19) ఉంది. ఈనెల 25వ తేదీన సంధ్యకు తల్లిదండ్రులు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.

చదవండి👉: మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు 

నిశ్చితార్థం విషయం తెలిసిన నాటి నుంచి పెళ్లి ఇష్టంలేదని తల్లిందండ్రులకు చెప్పలేక మానసిక ఒత్తిడికి గురైంది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement