శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో బోల్తా పడింది.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కంచిలి సమీపంలో రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టింది. అనంతరం స్కార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. రహదారిపై ఉన్న స్కార్పియో వాహనాన్ని పక్కకు తీసి... ట్రాఫిక్ను పునరుద్ధించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.