ఆటో - లారీ ఢీ: ఒకరి మృతి | one killed in road accident in Guntur district | Sakshi
Sakshi News home page

ఆటో - లారీ ఢీ: ఒకరి మృతి

Published Tue, Jan 19 2016 10:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

one killed in road accident in Guntur district

గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement