చిత్తూరు జిల్లాలో అతిసార ప్రబలి ఒకరు మృతి | One killed in diarrhea in Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో అతిసార ప్రబలి ఒకరు మృతి

Published Tue, Jun 16 2015 1:22 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

One killed in diarrhea in Chittoor District

చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 24 పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని మంచినీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావడంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు.

దాంతో గత రాత్రి దాదాపు 15 మంది ఆసుపత్రుల్లో చేరారు. మంగళవారం మధ్యాహ్నం కనకమ్మ ( 80) పరిస్థితి విషమించి చనిపోయింది. మరో వ్యక్తి మునెస్ప (55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement