diarrhea
-
విశాఖజిల్లా జబ్బార్ తోటలో డయేరియా కలకలం
-
డయేరియా బాధితులకు అండగా YSRCP
-
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ తీరు సిగ్గు చేటు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,అమరావతి : ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శాసన మండలి చర్చలో ‘డయేరియాపై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు సంభవించాయి’అని చిరునవ్వుతో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.శాసన మండలి సమావేశాల సందర్భంగా డయేరియా మరణాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో డయేరియాపై ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం బాధాకరం. మృతులపై ఎంతటి అభిమానం ఉందో మంత్రి నిర్లక్ష్య సమాధానమే చెబుతోంది.మంత్రి సత్యకుమార్ యాదవ్ వెకిలిగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. గత 30 ఏళ్లలో గుర్లలో ఎన్నడూ డయేరియా మరణాలు సంభవించలేదు. సెప్టెంబర్ 20న మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీ నాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేసే వరకు ప్రభుత్వంలో చలనం రాలేదు.చదవండి: డయేరియా మరణాలపై నవ్వుతూ హేళనగా మాట్లాడిన ఏపీ మంత్రి 20 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. పక్క జిల్లాలో కేజీహెచ్ ఉంది. కానీ స్కూల్ బల్లలపై వైద్యం అందించారు. స్కూల్ బల్లలపై డయేరియా బాధితులకు వైద్యం అందించినందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. మృతుల సంఖ్యను తగ్గించడం పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. డయేరియా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు. ఒక్కో డయేరియా బాధిత కుటుంబానికి వైఎస్ జగన్ రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ వెళ్లే వరకూ జిల్లా ఇంఛార్జి మంత్రి వంగలపూడి అనిత..ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వెళ్లలేదు. మృతులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
డయేరియా మరణాలపై నవ్వుతూ మాట్లాడిన ఏపీ మంత్రి
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా ఆయన నవ్వుతూ.. మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స మాట్లాడారు. అయితే ఆ వ్యాఖ్యలకు కౌంటర్గా మాట్లాడే క్రమంలో మంత్రి సత్యకుమార్ నోరు జారారు. ‘‘డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది. 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయి’’ అని చిరునవ్వుతో మాట్లాడారాయన.వెంటనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి’’ అని అన్నారాయన. అనంతరం.. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. -
మరో ఆరుగురికి డయేరియా
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
డయేరియా ఉంది..కానీ మరణాలకు కారణం కాదు..
సాక్షి, నరసరావుపేట/దాచేపల్లి: ప్రజాసమస్యలు వెలుగులోకి రాకుండా ఏదోవిధంగా మాయచేయాలనే కూటమి సర్కారు పెద్దల ప్రయత్నాలు దారుణంగా మారాయి. మరణాలకు కారణాలను కూడా మార్చి చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా ప్రబలి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా అబద్ధాలతో మోసం చేయాలని చూస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగరపంచాయతీ అంజనాపురం కాలనీలో డయేరియాతో బుధవారం రాత్రి ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ కాలనీలో ఇద్దరు డయేరియాతో మరణించలేదని శుక్రవారం అక్కడ పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కాలనీలో మరణించిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అనే యువకుడు కూల్డ్రింక్ తాగి వికటించి మరణించాడని, వృద్ధుడు చినవీరయ్య కిడ్నీ సమస్యతో బాధపడి చనిపోయాడని మంత్రి చెప్పారు. మరోవైపు అంజనాపురం కాలనీలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందన్నారు. 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు. డయేరియా కారణంగానే ఇద్దరు మరణించారని గురువారం గుర్తించిన అధికారులు.. శుక్రవారం మంత్రి మాట మార్చడంతో అవాక్కయ్యారు. వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడు..రోజూ కాలేజీకి వెళ్లే తమ కుమారుడికి అనారోగ్యం ఏమీ లేదని, వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడని మృతుడు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు కృష్ణంరాజు, శివకుమారి చెప్పారు. తమ బిడ్డ కూల్డ్రింక్ తాగి చనిపోయాడని మంత్రి సత్యకుమార్ చెప్పడం దారుణమని వారు శుక్రవారం మీడియా ముందు అవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలతో చనిపోతే కూల్డ్రింక్ తాగి చనిపోయాడని ఏలా చెబుతారని ప్రశ్నించారు. తమ ఇంటికి వచ్చి తమతో మాట్లాడకుండానే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. తమ కుమారుడు బుధవారం రాత్రి 9 గంటలకు వాంతులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విరేచనాలు కావటంతో నీరసించి కాళ్లు పట్టుకుపోయాయని చెప్పారు. నారాయణపురం ఆస్పత్రి నుంచి పిడుగురాళ్ల తీసుకెళితే ఆస్పత్రిలో చేర్చుకోలేదని, అక్కడినుంచి నరసరావుపేట వెళుతుండగా తమ కుమారుడు చనిపోయాడని కన్నీటితో తెలిపారు. కేవలం వాంతులు, విరేచనాల కారణంగానే తమ బిడ్డను పొగొట్టుకున్నామన్నారు. చికిత్సకి సంబంధించిన పేపర్లను తీసుకెళ్లిన అధికారులు వాటిని తిరిగి ఇవ్వలేదని తెలిపారు. చనిపోయిన తమ బిడ్డపై నిందలు వేయవద్దని, న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఇల్లు ఇస్తామని ఆశపెడుతున్నారు.. తన కుమారుడి చావును ప్రభుత్వం తప్పుదోవపట్టించి ఇంటిని నిర్మించి ఇస్తామని ఆశపెడుతున్నారని, తన బిడ్డ చావుకు న్యాయం కావాలని మీడియా ముందు కృష్ణంరాజు వాపోయిన వీడియో వైరల్ అవుతోంది. మృతుల ఇళ్లకు వెళ్లని మంత్రి ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్బాబుతో కలిసి కాలనీలో పర్యటించిన మంత్రి మృతుల ఇళ్లకు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ వైఫల్యంపై బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తారనే భయంతోనే వారి ఇళ్లకు వెళ్లలేదని తెలిసింది. మరణాలకు కారణాల గురించి తమను అడక్కుండానే మంత్రి ఇష్టం వచ్చినట్లు మీడియాతో వ్యాఖ్యానించి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన బోరుని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వ పాపాలే తమకు శాపాలుగా మారాయన్నారు. జగన్ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నట్లుగా డయేరియా మరణాలు సంభవించలేదని చెప్పారు. గత ఐదేళ్లలో 10,30,575 మంది అతిసారం బారినపడగా గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారవ్యాధి వ్యాప్తి చెందితే తాము ఒక్క మరణం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పల్నాడులో మరోసారి డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, నరసరావుపేట, దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 14 మందిని బలితీసుకున్న అతిసారం.. ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి, ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు. జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై, పలువురు మరణించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది. దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం నుంచి వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. వీరిలో బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (21) బుధవారం రాత్రి మృతి చెందారు. వీరిలో చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం వ్యాధి బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. తాగు నీరు కలుషితం అవడంవల్లే..తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్ ట్యాంక్ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు గురువారం అంజనాపురం కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కా>గా, అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు మృతికి కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్కు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. జూలైలో వ్యాధి ప్రబలినా సరైన చర్యలు చేపట్టని సర్కారు జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఆ నెలలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారు. 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో మంత్రి నారాయణ ఒకరోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య నిర్వహణ సరిగాలేకపోవడమే డయేరియాకు కారణమని నిర్ధారణకు వచ్చారు. అయినా, రక్షిత నీరు అందించడానికి, పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందింది. -
ప్రభుత్వం సిగ్గుపడాలి: వైఎస్ జగన్
గుర్ల మండలంలో డయేరియాతో 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందారు. ఇప్పటికీ విజయనగరం జిల్లాలోని గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఏం చేస్తోంది? ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి.. ఎలా కవరప్ చేయాలి.. అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి.. అన్న దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం సాకారమైతే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయనేదానికి ‘గుర్ల’ డయేరియా ఘటనే నిదర్శనమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. బాధ్యత మరచి దాన్ని కప్పిపుచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు. కనీసం తాగునీటి క్లోరినేషన్ కూడా చేయని ఫలితంగా డయేరియా విజృంభించి విజయనగరం జిల్లా గుర్లలో 14 మంది చనిపోయిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గురువారం ఆయన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.మృతికి దారితీసిన పరిస్థితులను, ఇతరత్రా అన్ని వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం కూడా అందలేదన్న వారి ఆవేదన విని చలించిపోయారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ‘వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు అక్కడే నివాసం ఉండే సీహెచ్ఓలు కనిపించే వారు. వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశ వర్కర్లు కనిపించే వారు. విలేజ్ క్లినిక్స్తో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్ను అనుసంధానం చేసి, పీహెచ్సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు ఒకసారి డాక్టర్లు వచ్చే వ్యవస్థ ఉండేది. అదే గ్రామంలో నాడు–నేడుతో బాగు పడిన స్కూళ్లలో పిల్లలు నవ్వుతూ కనిపించే వారు. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి. చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. సకాలంలో పెట్టుబడి సహాయం అందేది. సచివాలయంలో వెంటనే పనులు చేసిపెట్టే ఉద్యోగులు కనిపించే వారు. ఈ రోజు అవేవీ కనిపించడం లేదు. ఆ గ్రామ స్వరాజ్యం ఎంతో దయనీయంగా తయారైందని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ’ అని మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. జగన్ ట్వీట్ చేస్తే వెలుగులోకి.. గుర్లలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. తాగు నీరు బాగోలేక డయేరియా వచ్చి మృతి చెందారు. ఇందుకు సంబంధించి జగన్ అనే వ్యక్తి అక్టోబర్ 19న ట్వీట్ చేస్తే తప్ప ఇక్కడ 14 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పని పరిస్థితి. సెపె్టంబర్ 20వ తేదీన, అంటే 35 రోజుల కిందట ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అలా తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని దుస్థితి. అక్టోబర్ 12 వచ్చే సరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గండ్రేడు, గోషాడ, నాగళ్లవలస గ్రామాల్లో ఉధృతంగా ప్రబలింది. ఏకంగా 14 మంది చనిపోయారు. అక్టోబర్ 19న నేను ట్వీట్ చేస్తే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అయినా ప్రభుత్వం కదిలిందా.. అంటే లేదు. తప్పుడు లెక్కలతో మాయ చేసే ప్రయత్నం గుర్లలో డయేరియాతో కేవలం ఒకరే చనిపోయారని జిల్లా కలెక్టర్ చెబుతారు. మంత్రులు, అధికారులు అదే ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు. తీరా అక్టోబర్ 24 వచ్చే సరికి 14 మంది చనిపోయారని తేలింది. ఇష్యూ పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్ద లేదు. సమీపంలో చంపావతి నది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఈ నది నీటితో నడిచే సమగ్ర సురక్షిత మంచినీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్) పథకానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ రెన్యూవల్ చేయలేదు. దాని ఫిల్టర్లు మార్చారా.. లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా.. లేదా? అన్నది కూడా పట్టించుకోలేదు. స్థానికంగా సచివాలయం సిబ్బంది సహాయ, సహకారంతో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించారు ⇒ ఇక్కడి గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలను బాగు పరచకపోగా, సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్నీ రద్దు చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నెల నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1,800 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి. ⇒ ఆరోగ్యశ్రీని నీరుగార్చింది. గతంలో కేవలం వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక 3,300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్య ఆసరానూ çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ⇒ మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టింది. వాటిలో ఐదు కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం. మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు మంజూరైతే కూడా, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది. ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు...మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేము విపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ తరఫున బాధితులను ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆరి్థక సాయం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్న మేమే సాయం చేయడానికి ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు (చంద్రబాబు) మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండని సూటిగా ప్రశి్నస్తున్నాం. – వైఎస్ జగన్జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడు.. అనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, మా అమ్మ ఫొటోలు పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని మీ స్వార్థం కోసం పెద్దవి చేసి, నిజాలను వక్రీకరించి చూపడం మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చంద్రబాబుకు చెబుతున్నా. మీడియా ముసుగులో చంద్రబాబును మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో పాటు దత్తపుత్రుడిని కూడా అడుగుతున్నా. – వైఎస్ జగన్మెరుగైన చికిత్స చేయించ లేదు ⇒ గుర్ల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకెళ్లలేకపోయారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం 80 కి.మీ దూరంలో ఉంది. పది అంబులెన్సులు ఏర్పాటు చేసి డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి ఎందుకు తరలించ లేదు? అలా రోగులను తరలించకపోవడంతో గుర్లలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ⇒ మన ప్రభుత్వంలో నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో ఇలా స్కూళ్లు బాగు చేసి ఉండకపోతే పరిస్థితి ఏమిటి? ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ (విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ) కూడా వచ్చింది. ⇒ డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ఇదే విషయం వారంతా చెప్పారు. సహాయం చేయకపోగా డయేరియాతో చనిపోయారని చెప్పొద్దన్నారు. అలా చెబితే గ్రామంలో భయాందోళన ఏర్పడుతుందని, గుండెపోటుతో చనిపోయారని చెప్పండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచించాలని కోరుతున్నా.డైవర్షన్ పాలిటిక్సే చంద్రబాబు రాజకీయం ⇒ ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్న్పాలిటిక్స్ చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే దానిని డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది. ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆ రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపింది. అదే ఇక్కడ (గుర్లలో) 14 మంది చనిపోతే హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదు. ⇒ ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవెన్.. అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేశారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం. ⇒ జగన్ గుంటూరుకు వస్తున్నాడు.. గుర్లకు వస్తున్నాడనే సరికి మళ్లీ టాపిక్ డైవర్ట్. మా చెల్లెలు, అమ్మ ఫొటో పెడతారు. అయ్యా చంద్రబాబూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఈనాడు.. టీవీ5.. దత్తపుత్రా.. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? మీ స్వార్థం కోసం నిజాలను వక్రీకరించడం మానుకుని ఇకనైనా ప్రజల మీద ధ్యాస పెట్టండి. ⇒ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి. ప్రభుత్వం మాది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మలు, చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా బాధితులకు క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలి. ఈ ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రారి్థస్తున్నా. బాధ దిగినట్లు అనిపించింది నా భర్త చింతపల్లి అప్పారావు ఇంటికి చేదోడు వాదోడుగా ఉండేవారు. డయేరియాతో మృతి చెందారు. దుఃఖాన్ని దిగమింగుతూ బాధతో గడుపుతున్నాం. ప్రభుత్వం తరఫున వచ్చిన వారంతా ఏదో చెప్పి వెళ్లిపోయారు. వైఎస్ జగన్ మాత్రం మా దగ్గరకే వచ్చి, ఇక్కడే కూర్చుని నా భర్త మృతికి కారణాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిందా.. అని ఆరాతీశారు. బాధ పడవద్దని, మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఆయన మాటతో బాధ దిగినట్లు అనిపించింది. – చింతపల్లి అప్పయ్యమ్మ, గుర్లఎంతో ధైర్యం వచ్చిందిఏం జరిగిందని ప్రతీ విషయాన్ని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మమ్మల్ని అడిగారు. మా మామయ్య సారిక పెంటయ్య ఎలా చనిపోయాడో జరిగిందంతా చెప్పాను. ఆస్పత్రిలో వైద్యం, ఊర్లో తాగునీటి ఇబ్బందుల గురించి అడిగారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించేలా చేస్తామన్నారు. మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దన్నారు. కష్టాలు తీర్చే నాయకుడు మా దగ్గరికే రావడం మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. – సారిక హైమావతి, గుర్లనేనున్నానని ధైర్యం చెప్పారు...డయేరియా మా ఇంట్లో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. నా భార్య కలిశెట్టి సీతమ్మ చనిపోయింది. ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేక నా పెద్ద కొడుకు రవి మనోవేదనతో రెండు రోజులకే చనిపోయాడు. నాకు దిక్కుతోచని పరిస్థితి. చాలా బాధలో ఉన్న సమయంలో జగన్మోహన్రెడ్డి పరామర్శించడంతో కొంత బాధ తగ్గింది. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని ధైర్యం చెప్పడం ఊరట కలిగించింది. – కలిశెట్టి సత్యారావు, గుర్ల -
నా కుటుంబం గురించి తర్వాత.. ముందు రాష్ట్రాన్ని కాపాడండి
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
నేను చూసుకుంటా చెల్లి! జగన్ భరోసా..
-
జగన్తో గుర్ల డయేరియా బాధితులు
-
సెప్టెంబర్లోనే డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్లో కూడా డయేరియా ఔట్బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది.తాగునీరు కలుషితమవడమే కారణంగుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్ఆర్టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది. చంపా నది వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయి. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్ పేలవంగా ఉంది. నీటి నమూనాలలో క్లోరిన్ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగు నీటి ప్రధాన వనరైన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్ చేయాలని, నీటి సరఫరా పైపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మరమ్మతులు చేయాలని కమిటీ సూచించింది. డ్రైనేజీ గుండా నీటి పైపులు వెళ్లకుండా చూడాలని సిఫార్సు చేసింది. విజయనగరం జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున తరచూ నీరు, ఇతర నమూనాల పరీక్షలకు వీలుగా రీజినల్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది’ అని వైద్య శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. -
కలరాతో 15 మంది చనిపోవడం ఈ జిల్లాలో ఎప్పుడు జరగలేదు
-
డయేరియా మరణాలపై సీఎం,డిప్యూటీ సీఎం రాజకీయాలా?.. బొత్స ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ తప్పిదమే కారణమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత, బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. డయేరియాతో మృతి చెందిన 16 మందికి వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధిత గ్రామాలను తక్షణమే రెడ్ జోన్గా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన పరిస్థితులన్నీ చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.డయేరియా మృతులపై ప్రభుత్వం గందరగోళ లెక్కలు చెబుతోందన్న మండలి విపక్షనేత, మరణాల సంఖ్యతో సీఎం, డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. జిల్లా కలెక్టర్ లెక్క మేరకు ఒక్కరు చనిపోగా, చంద్రబాబు లెక్క 8 మంది అని, పవన్కళ్యాణ్ లెక్క 10 మంది అని తెలిపారు. ఎందుకీ గందరగోళం? ఎందుకింత అస్పష్టత? అన్న బొత్స, పాలన చేతకాక, అధికారులపై పట్టు లేకనేనా? అని గట్టిగా నిలదీశారు.రుషికొండ నిర్మాణలపై పవన్కు బొత్స సవాల్గుర్ల పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, రుషికొండ ఎందుకెళ్లారని.. రుషికొండ భవనాలకు, డయేరియా వ్యాప్తికి ఏమిటి సంబంధం అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పవన్కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని, రుషికొండ నిర్మాణాలపై అనుమానాలు ఉంటే, నిరభ్యరంతంగా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై షర్మిల అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న బొత్స, నాడు ఆ మొత్తం పిల్లల తల్లుల ఖాతాల్లో వేసేందుకు (డీబీటీ) ప్రభుత్వం సిద్ధమైతే, కోడ్ పేరుతో కోర్డును ఆశ్రయించింది ఇప్పటి పాలకులే అన్న విషయం షర్మిలకు తెలియదా? అని చురకలంటించారు.ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా?గుర్ల మండంలో కలుషిత నీటి సరఫరాకు కూటమి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందన్న మండలి విపక్షనేత.. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయక నిర్వహణ లోపం అని ఒకసారి, ఫిల్టర్ పాయింట్స్ మార్చలేదని మరోసారి చెబుతూ, ఆ మరణాలపైనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గుర్తు చేశారు. డయేరియా వ్యాప్తి చెందిన ఆ ఏడెనిమిది గ్రామాల్లో వెంటనే ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయడంతో పాటు, మెడికల్ క్యాంప్లు నిర్వహించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోబోతున్నారో సీఎం చెప్పాలని కోరారు. డబ్బుల వసూళ్లకు కక్కుర్తిపడి నీటి సరఫరా పర్యవేక్షణను పూర్తిగా వదిలేశారన్న మండలి విపక్షనేత.. కూటమి నేతలు, అధికారులు వస్తే, నాలుగు నెలలుగా అక్కడి దారుణస్థితిని చూపిస్తానని సవాల్ చేశారు.మేం అడుగుతున్నదేంటి? మీరు చెప్పే సమాధానం ఏంటి?డయేరియా మరణాలపై తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ఈరోజు రుషికొండలో పర్యటించి, అక్కడి భవనాల కోసం రూ.500 కోట్లు ఖర్చు చేశామంటూ విమర్శిస్తున్నారని బొత్స గుర్తు చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, హైదరాబాద్లో సీఎం ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే, ఆ తర్వాత వచ్చిన వారు అక్కడి నుంచే పాలించారని ప్రస్తావించారు. అదే తరహాలో విశాఖ రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. -
డయేరియా కేసులు కారణం ఇదే.. పద్ధతి మార్చుకోవాలి
-
ఎట్టకేలకు కదలిక
సాక్షి, అమరావతి/గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల డయేరియా ఘటనలపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నెల 13న డయేరియా వ్యాప్తి మొదలై 470 మందికిపైగా దీని బారినపడగా.. వారిలో శనివారం నాటికి 11 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరో ఐదు కేసులు నమోదు కాగా, ఎన్.పాపారావు(62) మృత్యువాతపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరించింది. బాధితులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంలో విఫలమైంది. బాధితులకు ప్రభుత్వ పాఠశాలలోని బల్లలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తూ, చికిత్స చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సైతం బాధితుల పక్షాన నిలిచారు. దీంతో ఆదివారం హుటాహుటిన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్తో విచారణకు ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సిరి సైతం ఆదివారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గుర్ల పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా.. డయేరియా ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వైద్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎండగడుతూ నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రోగులకు అవసరమైన బెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలోని జెడ్పీ హైసూ్కల్లో చికిత్స పొందుతూ కోలుకున్న వారిని ఇళ్లకు పంపించేశారు. మిగిలిన బాధితులను గుర్ల పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో అదనంగా 8 బెడ్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేసినట్టు గుర్ల పీహెచ్సీ వైద్యాధికారి చెన్నయ్ తెలిపారు. మరణాలు లేవంటూ బుకాయింపు గుర్లలో డయేరియా మరణ మృదంగం సృష్టిస్తుంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగానే వారం రోజులపాటు వ్యవహరించింది. 470 మందికిపైగా డయేరియా బారినపడినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ వాళ్లు డయేరియాతోనే మృతి చెందారని 12 మంది కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డయేరియా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు ఆదివారం ప్రకటించింది. ప్రతిపక్షం బాధితుల పక్షాన నిలవడంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని విజయనగరం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.నేడు పవన్కళ్యాణ్ పర్యటన గుర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ సోమవారం పర్యటిస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారని పేర్కొంది.నీటి కాలుష్యమే కారణం: వైద్యశాఖ గుర్లలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం తెలిపారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా.. కలుíÙతమైనట్టు తేలిందని పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నెల 13న ఒక కేసుతో ప్రారంభమై 18వ తేదీ వరకూ వరుసగా కేసులు నమోదైనట్టు తెలిపారు. మరణాల సంఖ్యపై వివిధ రకాల వార్తలొస్తున్నాయని, వాస్తవంగా డయేరియాతో ఒక్కరే మరణించగా, ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని వివరించారు. -
అతిసార మరణాలపై వైఎస్ జగన్ హెచ్చరికలు.. దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో అతిసార (డయేరియా) మరణాలపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అతిసార మరణాలు సంభవించిన విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు.గత వారం రోజులుగా విజయనగరం జిల్లా గుర్లలో అతిసార ప్రబులుతుందని, కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని సాక్షి మీడియా పలు కథనాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు అతిసార వ్యాధి తీవ్రతను గుర్తిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహంఅయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. వారం రోజులుగా మరణాలు లేవంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు బుకాయించారు. అయితే ఈ ఘటనపై వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా ఏపీ ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శగుర్లలో అతిసారాతో మరణాలు సంభవించడం, భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు బాసటగా నిలిచారు. గుర్లలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. వ్యాధి గ్రస్తులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారు.ఆదివారం గుర్లలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అతిసారాతో విజయనగరం జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవి సహజ మరణాలు కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం: బొత్స
సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'? -
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
పేదల ప్రాణాలతో చెలగాటమాడటం తగదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేద ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటం సరికాదని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి అప్పలరాజు డయేరియా విజృంభించిన విజయనగరం జిల్లాలోని గుర్ల మండల కేంద్రంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజులుగా ఒకే ఊరిలో 450 మంది అతిసారం బారినపడి బాధపతున్నారని, వారిలో 11 మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా పేదలు మృతి చెందారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వైద్య వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది అప్పగించారని... కానీ చంద్రబాబు ప్రభుత్వం డయేరియా బాధితులకు వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బెంచీలు, కుర్చీలపై రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారంటేనే ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. కనీసం రోగులకు బెడ్ కూడా వేయకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ జగన్ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు–నేడు’ అభివృద్ధి పనుల వల్లే ఇప్పుడీ బెంచీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా సదుపాయాలు కలిగాయని, ఒకవేళ గుర్ల పాఠశాలను ఇలా తీర్చిదిద్ది ఉండకపోతే ఇప్పుడు రోగులను నేలపై పడుకోబెట్టి వైద్యం చేసేవారా...? అని ప్రశ్నించారు. పరిసర ప్రాంతాల్లోని పీహెచ్సీల నుంచి బెడ్స్ తీసుకొచ్చి వేయించడం కూడా తెలియదా..? అని మండిపడ్డారు. ఇవేవీ చేయలేనప్పుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎందుకొచ్చారని, ఫొటోలు తీయించుకోవడానికా అని నిలదీశారు.సీఎం చంద్రబాబు మద్యం మత్తు, ఇసుక మాఫియా నుంచి బయిటకొచ్చి పేదల గురించి పట్టించుకోవాలని అన్నారు. ఆకస్మిక తనిఖీల పేరుతో వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేశ్ పక్కనేవున్న గుర్ల మండలంలో వందల మంది కష్టంలో ఉంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పారిశుద్ధ్యం, రక్షిత నీటి విభాగం శాఖల పూర్తి వైఫల్యానికి నిదర్శనమే గుర్ల విషాదమన్నారు. ఆ రెండు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. వందలాది ప్రజలు డయేరియాతో అల్లాడుతుంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా గ్రామంలో జ్వరాలు వస్తే తక్షణమే ఫీవర్ సర్వే చేయించి కారణాలు తెలుసుకుని నిరోధించే చర్యలు చేపట్టే వారమని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివసరావు చెప్పారు. ఇప్పుడీ ప్రభుత్వం డయేరియా రోగులను స్కూల్ పిల్లల బెంచీలపై పడుకోబెట్టి కర్రలు కట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
డయేరియా గుప్పెట్లో విజయనగరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని ఐదు గ్రామాల్లో గురువారం సాయంత్రానికి 450 మందికిపైగా డయేరియా బారిన పడ్డారు. శుక్రవారం కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. చాలామందికి ఇళ్ల వద్దనే వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు అధికంగా అవుతున్నవారిని గుర్ల జెడ్పీ హైసూ్కల్లో వైద్యశిబిరానికి, గుర్ల పీహెచ్సీ, చీపురుపల్లి, నెలిమర్ల సీహెచ్సీలకు తరలించి చికిత్స చేస్తున్నారు. అవసరమైనవారిని విజయనగరంలోని సర్వజన ఆస్పత్రి, గోషాస్పత్రి, విశాఖలోని కేజీహెచ్లకి తరలిస్తున్నారు. గురువారం నాటికి డయేరియా బారిన పడి ఏడుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుర్ల గ్రామానికి చెందిన పతివాడ సూరమ్మ (68) ఇంటివద్దే చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లి సీతమ్మ డయేరియాతో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై గుర్ల గ్రామానికే చెందిన కలిశెట్టి రవి (28) మృతిచెందాడు. ప్రైవేట్ బోర్లపైకి నెపంమండలంలో గత శనివారం నుంచి డయేరియా పంజా విసురుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరించింది. విజయనగరం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం అలా ముఖం చూపించి వెళ్లిపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వచ్చి గుర్లలో పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టరు, ఇతర అధికారులు రెండు, మూడు రోజులుగా వచ్చి వెళుతున్నారు. చంపావతి నది నుంచి వస్తున్న తాగునీటి వల్లే డయేరియా విజృంభించిందనే సందేహంతో ఆ నీటి నమూనాలకు పరీక్షలు చేయించిన ఆర్డబ్ల్యూఎస్ (రక్షిత మంచినీటి విభాగం) అధికారులు.. ఆ నీటివల్ల సమస్య లేదని తేలిందని చెబుతున్నారు. గ్రామస్తులు మరుగుదొడ్ల వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి వదిలేయడం వల్ల అలా భూమిలో ఇంకి ప్రైవేటు బోర్లలోకి వస్తున్న నీటిని వినియోగించడం వల్లే డయేరియా వచ్చి ఉండవచ్చని జిల్లా ఉన్నతాధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు.ఇంకెన్ని చూడాలో... » గుర్లకు చెందిన మామిడిపాక ప్రవీణ్కుమార్కు ఈ నెల 16న వివాహం జరిగింది. అప్పటికే డయేరియా లక్షణాలు అధికమవడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. » గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి విధులకు వెళ్లకుండా అప్పటి నుంచి ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే శుక్రవారం మృతిచెందాడు. -
డయేరియా డేంజర్ బెల్స్..
-
విజయనగరం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోటగండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్సయ్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి చెందారు. దీంతో గత ఐదు రోజుల్లో డయేరియాతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాములమ్మకు రెండ్రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు గుర్లలోని వైద్య శిబిరంలో చికిత్స అందించడంతో రోగం తగ్గిపోయిందని బుధవారం ఆమెను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. గురువారం ఉదయం మళ్లీ వాంతులు, విరేచనాలు అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగానే మృతి చెందింది. అప్పలనర్సయ్యమ్మకు కూడా మూడు రోజుల క్రితమే డయేరియా సోకింది. ఆమెకు తొలుత గుర్ల పీహెచ్సీలో వైద్యం అందించారు. తర్వాత విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు అక్కడి వైద్యులు రిఫర్ చేశారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గుర్ల మండల కేంద్రంలో ఇప్పటికే 300 మంది ఈ రోగం బారినపడ్డారు. గురువారం కొత్తగా మరో 20 కేసులు నమోదయ్యాయి. గుర్లలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు. పాఠశాలలో బెంచీలపైనే 50 మంది రోగులను పడుకోబెట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయనగరం జిల్లా సర్వజన ఆస్పత్రికి, విశాఖలోని కేజీహెచ్కు పంపిస్తున్నారు. -
ముందు జాగ్రత్తే మందు!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే.. » నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి. »తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. »నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. » తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. »రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి. »తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. »శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి. »దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి. »గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. » నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు.. జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దువిష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్లను రెండు రోజులు వాడి చూడాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ పరిశుభ్రత పాటించాలి వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో డయేరియా
-
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విజృంభిస్తున్న డయేరియా
-
ప్రబలిన డయేరియా
-
తిరుపతి రుయా ఆసుపత్రిలో విషాదం
-
డేంజర్ డయేరియా
-
రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న డయేరియా
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/గూడూరు రూరల్ (తిరుపతి జిల్లా): కలుషిత నీరు, లోపించిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో డయేరియా ముప్పు నానాటికీ అధికమవుతున్నది. జూన్ ఒకటో తేదీ నుంచి 22వ తేదీ మధ్య వివిధ జిల్లాల్లో ఏకంగా 20 డయేరియా ఘటనలు చోటు చేసుకున్నాయి. 634 కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మృత్యువాత పడినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వైద్య శాఖ లెక్కల ప్రకారం కాకినాడ జిల్లా ఎ.వి.నాగారం పీహెచ్సీ పరిధిలో 86 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందగా, ఇదే జిల్లాలోని వేటపాలెం పీహెచ్సీ పరిధిలో 32 కేసులు ఒక మరణం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో 79 కేసులు, ఒక మరణం సంభవించింది. తాజాగా మంగళవారం నాటికి పట్టణంతో పాటు జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో మరో 11 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. జగ్గయ్యపేట పట్టణంలో డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో.. మంగళవారం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (రాజమండ్రి) నాగ నరసింహారావు పారిశుద్ధ్య నిర్వహణపై స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సచివాలయాల్లో సిబ్బందికి డ్రెస్ కోడ్ లేకపోవడంతో ఒకరోజు వేతనం కట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావును ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రికి డయేరియా కేసులు వస్తుండడంతో డీఎంహెచ్వో సుహాసిని పర్యవేక్షిస్తూ.. అవసరమైతే మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. అలాగే మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ధ్యాన్చంద్ మంగళవారం ఆకస్మికంగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా డయేరియా బారినపడిన వ్యక్తులు, మృతుల సంఖ్య అనధికారికంగా ఇంకా అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరడంతో వివిధ శాఖల అధికారులు మంచి పోస్టింగ్లు తెచ్చుకోవడం, ఇప్పటికే ఉన్న పోస్టింగ్ల్లో కొనసాగేలా పెద్దలను ప్రసన్నం చేసుకునే పనుల్లో పడ్డారు. దీంతో క్షేత్రస్థాయిలో పాలన గాడి తప్పింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నది. తొలకరి నేపథ్యంలో నదులు, చెరువులు, బావుల్లోని నీరు కలుషితమై అతిసార వ్యాప్తి చోటు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పూర్తిస్థాయిలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళికతో అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అదుపులోకిరాని డయేరియా
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/దాచేపల్లి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఐదు రోజులుగా దీనికి సంబంధించిన కేసులు ప్రభుత్వాస్పత్రికి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. సోమవారం జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది వాంతులు, విరేచనాలతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అలాగే, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ వృద్ధురాలు కూడా అతిసార బారినపడి మరణించింది. 79 కేసులు నమోదు.. జగ్గయ్యపేట ప్రాంతంలో ఈనెల 19–24 వరకు మొత్తం 79 డయేరియా కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. పట్టణంలో 30, మండలంలో 27, వత్సవాయి మండలంలో 22 కేసులు వచ్చాయని తెలిపారు. ఇందులో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 67 మందికి చికిత్స అందించగా మరో 12 మంది ఖమ్మం, కోదాడ, తదితర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 67 మందిలో 33 మందిని డిశ్చార్జ్ చేయగా మెరుగైన వైద్య నిమిత్తం 10 మందిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 24 మంది జగ్గయ్యపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె చెప్పారు.మరోవైపు.. అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు సుహాసిని తెలిపారు. డయేరియాను అదుపు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని ఆమె కోరారు. అలాగే, అతిసార వ్యాపించిన గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డీసీకే నాయక్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ హరీష్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అరీనా, స్థానిక వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న పారిశుధ్య పనులు.. మరోవైపు.. జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, గండ్రాయి గ్రామాల్లో పంచాయతీ అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. మంచినీటి ట్యాంకులు శుభ్రంచేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు. డ్రెయిన్లలో పూడికతీత, మురుగునీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి బ్లీచింగ్, దోమల వ్యాప్తిని నిరోధించే మందులను పిచికారీ చేస్తున్నారు. దీంతోపాటు.. డయేరియా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు.తాజాగా 11 కేసులు నమోదు.. జగ్గయ్యపేట మండలంలో సోమవారం వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న 11 మందిని గుర్తించినట్లు వైద్యాధికారి అనిల్కుమార్ తెలిపారు. వీరంతా బూదవాడ, ముక్త్యాల, రావిరాల.. వత్సవాయి మండలం మంగొల్లు, వేములనర్వ, పెద్దమోదుగపల్లి.. పట్టణంలోని సీతారాంపురం, చెరువుబజార్కు చెందిన వారు. గండ్రాయిలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ రమణ తాగునీటి ట్యాంకులను పరిశీలించారు. అతిసారతో వృద్ధురాలు మృతి.. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి నాగమ్మ (62) అతిసార బారినపడి చికిత్స పొందుతూ సోమవారం మృత్యువాత పడింది. ఈ గ్రామంలో అతిసార బారినపడి 16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల కిందట నాగమ్మ కూడా ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరింది. వాంతులు, విరేచనాలు అదుపులోకి రాకపోవడంతోపాటు కిడ్నీల సమస్య తలెత్తింది. దీంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఆదివారం తరలించగా.. చికిత్స పొందుతూ మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు.డయేరియా ప్రబలుతుంటే ఏం చేస్తున్నారు?: మంత్రి సత్యకుమార్ ఈ నేపథ్యంలో.. సోమవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ డయేరియాతో పాటు సీజనల్ వ్యాధులు, కీటక జనిత వ్యాధులపై ఏపీ సచివాలయం నుంచి డీఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డయారియా కేసులు పెరుగుతుంటే క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. 27 ఏళ్ల యువకుడు డయేరియాతో చనిపోతే ఏం సమాధానం చెప్తారని ప్రశి్నంచారు. ఈ పరిస్థితి చూసి సిగ్గుపడాలన్నారు. మున్ముందు వైద్యశాఖను ప్రక్షాళన చేసేలా చర్యలుంటాయన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్షీషా, డీఎంఈ డాక్టర్ నరసింహం పాల్గొన్నారు. -
భయం గుప్పెట్లో జగ్గయ్యపేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బిపేట/జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డయేరియా (అతిసార) విస్తరిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన ఆరుగురు ఈ కారణంతో మృత్యువాత పడడంతో జగ్గయ్యపేట పట్టణంతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదుకాగా, ఒక్క జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయి. కొందరు బాధితులు ఖమ్మం, విజయవాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతుండడంతో ఇవి అధికార లెక్కల్లోకి రావటంలేదు. ఇక్కడ ఇప్పటికే ఆరుగురు మృతిచెందినప్పటికీ ఇద్దరు మాత్రమే మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరోవైపు.. ఆదివారం ఒక్కరోజే జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలకు చెందిన11 మంది వాంతులు, విరేచనాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఇప్పటికే 32 మంది చికిత్స పొందుతుండగా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ జాప్యం..జగ్గయ్యపేట పట్టణంతో పాటు, షేర్ మహమ్మద్పేట, మక్కపేట, చిల్లకల్లు, బూదవాడ, అనుమంచిపల్లి, గండ్రాయిల్లో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మృత్యువాత పడిన వారు కూడా ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నిజానికి.. వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల 20నే డయేరియా కేసులను గుర్తించినా అదుపు చేయడంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత అప్రమత్తమై ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసింది. కానీ, అధికారుల హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీరు కలుషితం.. లోపించిన పారిశుధ్యం..ఇదిలా ఉంటే.. డయేరియా సోకుతున్న గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. అలాగే, పారిశుధ్యం కూడా అస్తవ్యస్థంగా ఉందని.. నీటిని సరఫరా చేసే రక్షిత మంచినీటి ట్యాంకులు కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ఉదా.. షేర్హమ్మద్పేట చెరువు ఒడ్డునే తాగునీటి బావి ఉంది. అక్కడ బావి పక్కనే చెత్త చెదారం పేరుకుపోయి ఉంది. పైగా ఆ బావిపైన మెస్ కూడా లేకపోవడంతో నీరు పూర్తిగా కలుషితమవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, అనుమంచిపల్లి, గండ్రాయి, బూదవాడ ప్రాంతాల్లోని పారిశుధ్యం పరిస్థితి కూడా ఇంతే. మక్కపేట ప్రాంతంలో తాగునీటిని ఫిల్టర్ చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం.ప్రత్యేక బృందాల ఏర్పాటు..ఇక డయేరియా సోకుతున్న గ్రామాల్లో శానిటేషన్ మెరుగుదలకు వైద్య, ఆరోగ్యశాఖ 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 45 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మరోవైపు.. జగ్గయ్యపేట ప్రాంతాన్ని ఆదివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆయా శాఖాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు అప్రమత్తంగా ఉండడంలేదని, అలసత్వం వహిస్తున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేచేయాలని, వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, కమిషనర్ వెంకటేశ్వర్, జేసీ సంపత్కుమార్, ఆర్డీఓలు రవీందర్, మాధవి, డీఎంహెచ్ఓ సుహాసిని, వైద్యారోగ్య శాఖ అడిషనల్ ఏడీ సుబ్రహ్మణ్యశ్రీ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.217 చోట్ల నీరు కలుషితం రాష్ట్రవ్యాప్తంగా 168 డయేరియా కేసులు నమోదయ్యాయని.. ఇందులో ఒక్క జగ్గయ్యపేటలోనే 58 కేసులున్నాయని మంత్రి చెప్పారు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటరీ చానళ్లను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీల వల్ల తాగునీటిలో డ్రెయినేజీ మురుగు కలవడం ఇందుకు కారణమన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటికే 30 వేలకు పైగా నీటి వనరులు నమూనాలు పరీక్షించగా 217 ప్రాంతాల్లో నీరు కలుషితమైనట్లు అధికారులు గుర్తించారన్నారు. -
డయేరియాతో ఆరుగురు మృత్యువాత
జగ్గయ్యపేట/జూపాడుబంగ్లా/సామర్లకోట: రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరియా బారినపడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. మూడు జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉంటున్న ఉమ్యినేని రంగయ్య (60), జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన తురక మంగతాయారు (55), బూదవాడ గ్రామానికి చెందిన గుగులోతు జమ్మా (60), వేదాద్రి గ్రామానికి చెందిన పసుమర్తి సత్యవతి (75) వాంతులు, విరోచనాలతో జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 19 మంది డయేరియా బాధితులకు వైద్యసిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో నలుగురు వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. వారిలో నడిపి నాగన్న (45) అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.డయేరియా బాధితుల్లో రంగమ్మ, మరియమ్మ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకులో కొంగపడి చనిపోయి దుర్వాసన వస్తున్నా సిబ్బంది పట్టించుకోలేదని, అందువల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసినా, సరైన చికిత్స అందించకపోవటం వల్లే తన అన్న నాగన్న చనిపోయాడని ఆయన తమ్ముడు చిన్ననాగన్న కన్నీటి పర్యంతమయ్యారు. అదనపు జిల్లా వైద్యాధికారిణి శారదాబాయి మాత్రం నడిపినాగన్నకు చికిత్స అందించామని, ఆయన డయేరియాతో కాకుండా గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు నడిపినాగన్న మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేజే రోడ్డు పక్కన మృతదేహంతో ప్రజాసంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి ఎక్స్గ్రేíÙయో చెల్లించాలని డిమాండ్ చేశారు.వేట్లపాలెంలో మహిళ మృతి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొమ్మోజు సత్యవేణి (42) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, డీఎంహెచ్వో జె.నరసింహ నాయక్, డీపీవో సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పీహెచ్సీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. -
వాళ్ళవి సహజ మరణాలే
-
ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..
ఆస్ట్రేలియా షెగెలోసిస్ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్ విక్టోరియాలో ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్ డోనాల్డ్లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏంటీ షెగెలోసిస్ వ్యాధి.. ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు. అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ: తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం (చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తినేస్తోంది..) -
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్కుమార్తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
టాడ్లర్స్ డయేరియా.. చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు
పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది. అందుకే పాలలో (జ్యూస్ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు. -
హైదరాబాద్లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
డయేరియానా? ఇలా చేసి చూడండి!
ఈ సీజన్లో నీళ్ల విరేచనాలు అయే అవకాశాలు ఎక్కువ. వాటికి మందులు తీసుకునేకంటే ఈ కింది తేలికపాటి చిట్కాలు పాటిస్తే సరి... డయేరియాతో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారంలో అరటిపండు ఒకటి. అరటి పండులో ఉండే పొటాషియం అరుగుదలకి సహకరిస్తుంది. ఇందులో ఉండే పిండిపదార్థం పెద్దపేగులో నుండి నీరు, ఉప్పుని గ్రహిస్తుంది. ఫలితంగా మలం గట్టిపడుతుంది. ఇంకా ఈ పండులో ఉండే ఫైబర్ మోషన్ మామూలుగా అయేలా చేస్తుంది. పెరుగు పెరుగు తేలికగా ఉంటుంది. సులువుగా అరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయాటిక్ మంచి బ్యాక్టీరియాని విడుదల చేస్తుంది. ఫలితంగా అరుగుదల బాగుండి పేగుల కదలికలు ఫ్రీగా మారతాయి. యాపిల్ చెక్కు తీసిన యాపిల్స్ ఈ సమస్యకి బాగా హెల్ప్ చేస్తాయి. యాపిల్స్ ని స్ట్యూ చేసి కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీరు కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్ శరీరంలోని ఖనిజలవణాలను భర్తీ చేస్తాయి. నీళ్ల విరేచనాల ద్వారా నష్టపోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తాయి. జీలకర్ర నీరు ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించండి. తరువాత కొద్ది నిమిషాలు సిమ్ లో ఉంచండి. చల్లారిన తరువాత వడకట్టి తాగేయండి. ఇది ఇరిటేట్ అయి ఉన్న బవెల్స్ని చల్లబరుస్తుంది. బాడీని రీ హైడ్రేట్ చేస్తుంది. మజ్జిగ మజ్జిగ జీర్ణవ్యవస్థను చక్కబరుస్తుంది. మంచి బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపేస్తుంది. అయితే, మజ్జిగా తాజాగా ఉండాలి, ఏ మాత్రం పులుపు ఉండకూడదు. రుచికి చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. మునగాకు కొద్దిగా మునగాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోండి. ఇలా రోజుకి ఒకసారి మించి తీసుకోకూడదు. మునగాకు అరుగుదల సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. కిచిడీ పెసర పప్పుతో చేసే కిచిడీ పొట్టకి తేలికగా ఉంటుంది. త్వరగా అరుగుతుంది. కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఉడికించిన బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపమీద కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల విటమిన్ సీ, బీ6 ని భర్తీ అవుతుంది. ఏం తీసుకోకూడదు..? ∙పాలు, పన్నీర్, చీజ్, బటర్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకూడదు. ∙కాఫీ, టీ తగ్గించగలిగితే మంచిది. ∙వేపుళ్ళు తీసుకోరాదు. మీగడతో కూడిన ఆహారం మానితే మంచిది. ∙పండ్ల రసాలు కూడా మంచివి కావు. ∙బ్రకోలీ, క్యాబేజ్, ఉల్లిపాయ, కాలీ ఫ్లవర్ వంటివి తినకూడదు. ∙ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. -
Health Tips: ప్రయాణాల్లో డయేరియాతో జాగ్రత్త.. ఇవి పాటిస్తే మేలు!
తరచూ ప్రయాణాలు చేసేవారు రకరకాల ప్రదేశాల్లో ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రయాణ సమయాల్లో వారు ఆహారం తీసుకునే ప్రదేశాలూ, అక్కడ దొరికే పదార్థాలూ అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు. దాంతో ట్రావెలర్స్ డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. నిత్యం ప్రయాణాల్లో ఉండేవారికి ఈ ముప్పు ఎక్కువ. కానీ వేసవి సెలవుల్లో పిల్లలు ఏ బంధువుల ఇంటికో వెళ్లేప్పుడు ఒకసారి ప్రయాణం, మరోసారి తిరుగు ప్రయాణంలో వచ్చే ప్రమాదాన్ని ట్రావెలర్స్ డయేరియాతో పోల్చలేనప్పటికీ... జర్నీ సమయంలో విరేచనాలు ఎప్పుడూ చాలా ఇబ్బంది పెడతాయి. అందుకే అది ట్రావెలర్స్ డయేరియా అయినా, లేదా సాధారణ విరేచనాలే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. పాటించాల్సినవి.. 👉🏾ప్రయాణాల్లో దొరికే ఆహారం, నీరు కలుషితమయ్యేందుకు అవకాశాలెక్కువ. అందుకే సాధ్యమైనంతవరకు ఇంట్లో చేసిన పదార్థాలే ప్రయాణంలోనూ తినేలా ప్లాన్ చేసుకుని దానిని అమలు చేయాలి. 👉🏾అలాగే కాచి, చల్లార్చిన నీళ్లను ఇంటినుంచే తీసుకుని, ప్రయాణమంతా వాటినే వాడటం మంచిది. లేదా తప్పనప్పుడు నమ్మకమైన బ్రాండ్కు చెందిన ప్యాకేజ్డ్ నీళ్ల బాటిల్ను తీసుకోవాలి. 👉🏾ట్రావెలర్స్ డయేరియాను నివారించేందుకు ప్రయాణికులు తాము ఎప్పుడూ తీసుకునే సురక్షితమైన, నమ్మకమైన చోటనే ఆహారం తీసుకోవాలి. 👉🏾తినడానికి ముందుగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. 👉🏾ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. 👉🏾ఒకవేళ విరేచనాలు అవుతున్నప్పుడు దేహం ద్రవాలనూ, లవణాలను కోల్పోకుండా నమ్మకమైన ఓఆర్ఎస్ (ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్)ప్యాక్ను తీసుకోవాలి. 👉🏾మరీ ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు ప్రయాణానికి బ్రేక్ ఇచ్చి... ఆసుపత్రిలో సెలైన్ తీసుకోవడం లాంటి చికిత్సతో పాటు డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలి. పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాకే మళ్లీ ప్రయాణం కొనసాగించాలి. చదవండి 👉🏾: Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్ల వల్ల..
Summer Drink- Maredu Juice: మారేడు జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్లోని టానిన్, పెక్టిన్లు డయేరియాను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రపోషిస్తాయి. విటమిన్ సీ, క్యాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్, ఐరన్లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వెంటనే దాహార్తి తీరాలంటే మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈ సమ్మర్ డ్రింక్ను తయారుచేసుకోండి. మారేడు జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు: పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్కు సరిపడా. మారేడు జ్యూస్ తయారీ ఇలా: ►ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి. ►తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్ను పిండుకోవాలి. ►జ్యూస్ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి. ►దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి. ►చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్ వేటు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శనివారం సస్పెండ్ చేశారు. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి.పవన్కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్ సప్లై టర్న్ కాక్ ఎం.ఈరన్నలను సస్పెండ్ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్డీ కె.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎన్.ఉమాకాంత్రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై డీఈవో జి.సురేష్, వాటర్ సప్లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీల నియామకం డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఆర్.శ్రీనాథ్రెడ్డి, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు. -
ఆదిలాబాద్ జిల్లా లో డయేరియా కలకలం
-
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
మెట్టవలసపై డయేరియా పంజా
శ్రీకాకుళం, జి.సిగడాం: మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా పంజా విరిసిరింది. ఒకేసారి 52 మందికి వ్యాధి వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో తోండ్రోతు వైకుంఠం, తోండ్రోతు కన్నారావు, పరశురాం, ఎడ్ల స్వాతి, శ్రావణి, లాభాన పావని, పైల సత్యవతి, చందక విమల, అప్పలరాజుల, భాగ్యలక్ష్మితోపాటు మరో 42 మంది డయేరియా బారిన పడ్డారు. వీరికి స్థానిక వైద్యాధికారి పొన్నాడ హరితశ్రీ వైద్యం అందించారు. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో రాజాం ఆస్పత్రికి తరలించారు. అధికారుల సందర్శన గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి బగాది జగన్నాథరావు, డీపీఓ బి.రవికుమార్తో పాటు తహసీల్దార్ మందుల లావణ్య, ఎంపీడీఓ కె.శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించారు. తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధి ప్రబలి ఉండవచ్చని తెలిపారు. గ్రామంలో 52 మందికి డయేరియా వచ్చినా అధికారులు ఎందుకు గోప్యత పాటించారో తెలీడం లేదు. రెండురోజులుగా గ్రామంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నా బయటకు సమాచారం తెలియనీయలేదు. -
ఆదరం..అతిసారం కలకలం
కేవీబీపురం మండలం ఆదరం పంచాయతీ పరిధిలోని గిరిజన, దళిత కాలనీల్లో అతిసారం విజృంభించింది. ఇప్పటికే 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి మరో ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీకాళహస్తి, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, తాగు నీటి కలుషితం వల్లే అతిసారం ప్రబలినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కూడా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులపాలవడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. -
తినగానే ఈ సమస్యలు ఎందుకిలా?
నా వయసు 45 ఏళ్లు. భోజనం పూర్తికాగానే టాయిలెట్కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లుగా నొప్పి వస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే ►జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ►దీర్ఘకాల జ్వరాలు ►మానసిక ఆందోళన ►కుంగుబాటు ►ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్వాడటం ►జన్యుపరమైన కారణలు ►చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ►పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ►ఒత్తిడిని నివారించుకోవాలి ►పొగతాగడం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ►రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
'డై' యేరియా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డయేరియా (నీళ్ల విరేచనాలు) చాపకింది నీరులా విస్తరిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 3.5లక్షల మంది డయేరియా బారినపడుతుండగా... సగానికిపైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదువుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 41,441 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. సీజన్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడుఆయా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడాదీన్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం డయేరియాతోనే సంభవిస్తున్నట్లు సమాచారం. డయేరియాకు అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నప్పటికీ... రోటావైరస్ ద్వారా సోకే డయేరియా అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. నీళ్ల విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాం తులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 40 శాతం కేసులకు ఈ రోటావైరస్నే ప్రధాన కార ణమని ఇప్పటికే వైద్యుల పరిశీలనలో తేలింది. కలుషిత ఆహారంతో... నగరంలో చాలా వరకు వాటర్ బోర్డు సరఫరా చేసే మంచినీటిపైనే ఆధారపడుతుంటారు. పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. మంచినీటి సరఫరా లైన్ల పక్కనే డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. పైపులకు లీకేజీలు ఏర్పడి చుట్టూ నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ నీరు పైపుల్లోకి చేరడం వల్ల మంచినీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక చాలా మంది ఫాస్ట్ఫుడ్డు సెంటర్లు, హోటళ్లపై ఆధారపడుతున్నారు. కొన్ని హోటళ్లు రాత్రి మిగిలిపోయిన వంటలను ఉదయం వడ్డిస్తున్నాయి. వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఆహారపదార్థాలపై ఈగలు, దోమలు వాలడం, చల్లారిన ఆహార పదార్థాలనే మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కూడా డయేరియా వ్యాపిస్తోంది. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తే వారిలో 150 నుంచి 200 మంది కలుషిత ఆహార బాధితులే ఉంటున్నారు. చిన్నారులకు టీకాలు... డయేరియాను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్తగా రోటావ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది అమలవుతోంది. దేశంలో తొలిసారిగా జాతీయ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టింది. గత పది రోజుల నుంచి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులకు వ్యాక్సినేషన్పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 6, 10, 14 వారాల శిశువులకు 2.5 ఎంఎల్ చొప్పున ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రతి బుధ, శనివారాల్లోనూ ఈ టీకాలను వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. జాగ్రత్తలు అవసరం... కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీటితో డయేరియా వస్తుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ కడుపులోకి చేరిన మూడు రోజుల తర్వాత ప్రతాపం చూపుతుంది. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒంట్లోని నీరు, లవణాల శాతం తగ్గి నీరసంతో స్పృహ తప్పుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి భారి నుంచి కాపాడుకోవచ్చు.– డాక్టర్ రమేశ్ దంపూరి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ -
పెరుగుతున్న అతిసార కేసులు
-
యానల్ ఫిషర్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్ను సంప్రదిస్తే యానల్ ఫిషర్తో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా? దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్ ఫిషర్స్ బారిన పడే అవకాశం ఎక్కువ. ముందుగా ఫిషర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్ కలిగించే వ్యాధులు (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా ఫిషర్స్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 34 ఏళ్లు. ఇటీవల కడుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు: ►బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ►హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ►మద్యపానం, పొగతాగడం ►వేళకు ఆహారం తీసుకోకపోవడం ►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు: ►కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ►ఉండటం, ఆకలి తగ్గడం ►నోటిలో నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు: ►పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి కంటినిండా నిద్రపోవాలి ►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స: గ్యాస్ట్రిక్ అల్సర్కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ పొలుసుల్లా రాలుతున్నాయి..! నా వయసు 39 ఏళ్లు. ఆరు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టూ రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగా లేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో సాధ్యమే. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వణికిస్తున్న డయేరియా
విశాఖపట్నం, కోటవురట్ల(పాయకరావుపేట): గొట్టివాడ గ్రామాన్ని డయేరియా వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన పలువురు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గ్రామంలో 25 మంది వరకు డయేరియా బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక సీహెచ్సీలో పది మంది రోగులు చికిత్స పొందుతుండగా నర్సీపట్నం, తుని, అనకాపల్లి, విశాఖలో ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంత మంది చేరారు. రెండు రోజులుగా డయేరియా విజృంభిస్తుండగా రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గొట్టివాడతో పాటు పక్క గ్రామాల్లో కూడా డయేరియాతో పలువురు బాధపడుతున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీహెచ్సీలో గొట్టివాడలోని ఒకే కుటుంబానికి చెందిన సుంకర అప్పలనాయుడు, నూకరత్నం, చంద్రశేఖర్, ప్రవల్లిక చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు బాలెం గోవిందమ్మ, బండి లక్ష్మి, సమ్మంగి నూకరత్నం, రాజుపేటకు చెందిన మొల్ల నాగేశ్వరరావు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్.ఎస్.సీతారామరాజు సీహెచ్సీకి వెళ్లి రోగులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి డయేరియాను అదుపులోకి తీసుకురావాలని కోరారు. -
తొండంగిలో డయేరియా!
తూర్పుగోదావరి, తొండంగి (తుని): గ్రామంలోని పలువురు విరేచనాలతో బాధపడుతూ తొండంగి పీహెచ్సీలో చేరారు. దీంతో గ్రామంలో డయేరియా జాడలున్నట్టు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. బీసీ కాలనీ, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు విరేచనాలతో గ్రామంలోని పీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. ఒక్కసారిగా ఎక్కువమంది వీటితో బాధపడుతుండడంతో తహసీల్దార్ ఎస్.అప్పారావు, ఎంపీడీవో జీఎస్ఎన్ మూర్తి కలిసి ఆస్పత్రిలో రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యురాలు పావనీని ఆరా తీశారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సుమారు 20 మంది వరకూ ఆస్పత్రిలో చేరడంతో çగ్రామంలోని పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి ట్యాంకులను, వాటర్ను పరిశీలించాలని పంచాయతీ అధికారులు ఆదేశించారు. తాగునీటిని క్లోరినేషన్, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితులపై నివేదించాలన్నారు. గ్రామంలో తాగునీరు, ఆహారపదార్థాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేయాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతోపాటు రక్షిత మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.దీనిపై సమగ్రమైన విచారణ జరిపి, పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు రక్షిత తాగునీటిని సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కేరళకు మరో ముప్పు పొంచి ఉందా?
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది. జ్వరం, డయేరియా మందులు పంపండి కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్టెన్షన్ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పీఎన్ మంజు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఎంఎస్) ఔట్ పేషంట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు. ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు. -
కుమరాంలో డయేరియాతో మహిళ మృతి..!
గరివిడి(చీపురుపల్లి) : గరివిడి మండలం కుమరాం గ్రామంలో మంగళవారం వేకువజామున తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బీంపల్లి కనకమ్మ (43) అనే మహిళ మృతి చెందారు. డయేరియా సోకిన కారణంగానే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె భర్త రాముడు పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు.. వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు తిష్ఠ వేశాయని, ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందరూ చీపురుపల్లి సీహెచ్సీకి, ప్రైవేటు ఆస్పత్రులకు తిరుగుతున్నారని, పట్టించుకోవాల్సిన వైద్యాధికారుల జాడ కానరావడం లేదని స్థానికులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా కానరాని పారిశుద్ధ్య పనులు.. కుమరాంలో నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా పారిశుద్ధ్య పనులను సంబంధిత అధికారులు చేయించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్ బి.రాములమ్మ వయసు పైబడడం, పైపెచ్చు అప్పట్లో దళిత రిజర్వేషన్ కావడంతో ఆమెను అధికార పార్టీ నాయకులు సర్పంచ్ను చేశారు. అక్కడి ఉప సర్పంచ్ జంపాన రవిరాజు పంచాయతీ వ్యవహారాలు అన్ని నడిపిస్తారని, నిధులు, కాంట్రాక్ట్ పనులు అన్ని ఆయన చూసుకుంటారని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు వచ్చే పనులు అయితే చేయిస్తారు తప్ప ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య పనులు వంటివి అసలు పట్టించుకోరని, అసలు నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదేమని అడిగితే సర్పంచ్ను అడగమంటున్నారు.. పారిశుద్ధ్య పనులు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు ఉప సర్పంచ్ను అడిగితే తాను సర్పంచ్ను కాదని, మీరు వెళ్లి సర్పంచ్నే అడగాలని ఆమె మీద నెపం నెట్టివేస్తారని చెబుతున్నారు. సర్పంచ్కు కనీసం చదువు రాదు. పంచాయతీ పనుల్లో అనుభవం లేదు. ఇలాంటి నాయకులను ఎన్నుకుని తాము అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ప్రజలు జ్వరాలతో అవస్థలు పడుతుంటే కనీసం ఏఎన్ఎం కూడా గ్రామానికి రాలేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, లేకుంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
డయేరియా మృతులకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి
పిడుగురాళ్ల: డయేరియాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.5లక్షల నష్ట పరిహారం ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురుజాల నియోజక వర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పిల్లలగడ్డలో గురువారం డయేరియాతో చికిత్స పొందుతూ మృతి చెందిన షేక్ మందుల మహబు(72) మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుమారుడు జానీబాషాను ఓదార్చారు. మహేష్ రెడ్డి మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలో ప్రజలకు కనీసం తాగునీరు అందించలేని దుస్థితిలో పాలన నడుస్తోందని విమర్శించారు. తాగునీరు కలుషితమవుతున్నా స్పందించని పాలకుల తీరును ఎండగట్టారు. వారం రోజులుగా డయేరియాతో పజలు మంచానపడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు. ఇటు వంటి మరణాలను ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలన్నారు. ఇటీవల డయేరియాతో బాధపడుతూ మృతి చెందిన షేక్. మస్తాన్బీ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు షేక్ సైదావలి, జానీబాబు, గనీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బ్యాక్టీరియా వల్లే డయేరియా
మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో ప్రబలిన డయేరియాకు నీటిలో ఉన్న బ్యాక్టీరియానే ప్రధాన కారణమని గుంటూరులోని రీజినల్ ల్యాబ్æ నుంచి శుక్రవారం రిపోర్టులు వచ్చాయి. దీంతో డీటీసీవో డాక్టర్ రమేష్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు, డాక్టర్లు ఎస్. ప్రియాంక, సిబ్బందితో గ్రామంలో ఆయన సమావేశమయ్యారు. బోర్లు, రక్షిత నీటి ట్యాంకుల నీటిలో బ్యాక్టీరియా ఉందని రిపోర్టు వచ్చిందని, నివారణ చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రెయినేజీలో ఉన్న నీటి పైపులను మార్చాలని, శిథిలమైన పైపుల స్థానంలో కొత్తవి వేయాలని, ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్ను ఇంకా మెరుగుపర్చాలని, తర్వాత గ్రామస్తులకు హెల్త్ ఎడ్యుకేషన్పై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే ట్యాంకులు శుభ్రం చేయించామని, గ్రామంలో ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేయిస్తున్నామని, పైపులు కొత్తవి రాగానే మెయిన్ లైన్ మొత్తం మారుస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వర్లు వివరించారు. డ్రెయినేజిలో ఉన్న పైపులను తీసివేసి పాత పైపుల స్థానంలో కొత్తవి వేయడానికి నాలుగైదు రోజులు పడుతుందన్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా క్లోరినేషన్ చేయాలని, ముఖ్యంగా ఇళ్లలో ఉన్న బోరు నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలని సూచించారు. అలా చేయక పోవడం వల్లే కొత్త కేసులు వస్తున్నాయని అధికారులు చెప్పారు. పరిశుభ్రతపై గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్య అధికారులకు డాక్టర్ రమేష్ సూచించారు. ఈ పనులన్నీ పూర్తి చేసి వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని ఆయన కోరారు. మరో మూడు కేసులు నమోదు.. గ్రామంలో శుక్రవారం మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయని వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ ప్రియాంక తెలిపారు. వారి పరిస్థితి అదుపులోనే ఉందని, గ్రామంలోనే చికిత్స అందిస్తున్నామన్నారు. గ్రామంలో చికిత్స పొందుతున్న వారు చాలా వరకు కోలుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారెడ్డి కరుణాకరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆయనకు కిడ్నీ వ్యాధి కూడా ఉండడంతో డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో రోగి బత్తుల పున్నయ్యకు కూడా కిడ్నీ సమస్య ఉండడంతో నరసరావుపేట మహాత్మాగాం«ధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి ఆరోగ్యం మెరుగవుతోందని డాక్టర్లు తెలిపారు. కొనసాగుతున్న నివారణ చర్యలు గ్రామంలో శుక్రవారం నాటికి మూడు ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఏఈ రత్నబాబు తెలిపారు.మూడు బోర్లు ప్లషింగ్ చేశామని మరో నాలుగు చేయాల్సి ఉందని, కొత్త పైపులైన్ వేయడానికి పైపులకు ఆర్డర్ ఇచ్చామని ఐదు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, బోర్లు, బావుల్లో నీటిని ఎవరు తాగవద్దని సూచించారు. -
35కు పెరిగిన డయేరియా బాధితులు
కారంపూడి: మండలంలోని మిరియాల గ్రామంలో డయేరియా బాధితుల సంఖ్య 35కు పెరిగింది. ఆదివారం వరకు 18 మంది వ్యాధి బారిన పడి వాంతులు విరోచనాలతో మంచం పట్టి చికిత్సపొందుతుండగా, సోమవారం నాటికి కొత్తగా మరో 17 కేసులు నమోదయ్యాయి. వారిలో ఏడుగురికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. వీరిలో అలవాల సంధ్యారాణి, కెంటిల్లి సత్యవాణి, ఎం.లక్ష్మిలకు గ్రామంలోనే కారంపూడి పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. నరసారావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న మేకల అఖిల్, కొండా చలమయ్యల పరిస్ధితి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. బత్తుల అరుణ, శ్రీలక్ష్మికి ఇంకా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని డాక్టర్ లక్ష్మీశ్రావణి తెలిపారు. ఇదిలా ఉంటే ఒక వీధికే పరిమితమైన వ్యాధి ప్రస్తుతం గ్రామం మొత్తం విస్తరించింది. అడిషనల్ డీఎంహెచ్ఓ రెడ్డి శ్యామల సోమవారం గ్రామంలోని వైద్య సేవలను పరిశీలించారు. డ్రైనేజిలో ఉన్న మంచి నీటి పైపు లైన్ లీకు కావడం వల్లే వ్యాధి ప్రబలిందని, ముందుగా డ్రైనేజిలో ఉన్న పైపులను తీసి వేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గురజాల ఆర్డీవో మురళి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీవో హీరాలాల్ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి తగిన తక్షణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా అంటువ్యాధుల నివారణ శాఖ అధికారులు కూడా సోమవారం గ్రామంలో పర్యటించి నీటి శాంపిల్స్ సేకరించారు. -
34 గ్రామాల నీటిలో బ్యాక్టీరియా
సాక్షి, అమరావతి బ్యూరో: నగరంలో డయేరియా వ్యాధికి గురై 30 మందికిపై మృత్యువాత పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణాధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు ఏర్పడ్డారు. ఏప్రిల్ 10, 11, 12 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 3124 శాంపిల్స్ సేకరించారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వైల్ ద్వారా నీటి నమూనాలను పరిక్షించారు. అందులో 34 శాంపిల్స్ సురక్షితం కాదని గుర్తించారు. ఈ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నీటిని సూపర్ క్లోరినేషన్ చేశారు. పెదకూరపాడు, వినుకొండ, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి మండలాలలో ఈ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 177 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతుందని, రూ.10.23 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నీటి సమస్య రానివ్వం గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్యాంకర్ల సంఖ్యను పెంచుతున్నాం. పైపులైన్లకు మరమ్మతులు చేపడుతున్నాం.– భాను వీరప్రసాద్, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్, గుంటూరు -
పైడూరుపాడులో డయేరియా
విజయవాడ రూరల్(మైలవరం): విజయవాడ మండలంలోని పైడూరుపాడులో శుక్రవారం డయేరియా విజృంభించింది. 24 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరిని విజయవాడ వైద్యశాలకు తరలించారు. వివరాలు.. తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ లీక్ కావడంతో కలుషిత నీటిని తాగడంతో గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఒకరికి విరోచనాలు కావడంతో డయేరియాగా గుర్తించారు. దీంతో ఇళ్లల్లో తాగునీటిని తాగడం నిలిపివేశారు. అనారోగ్యానికి గురైన వారిలో బోయినపల్లి వెంకటేశ్వరావు, వేముల నారాయణ, వేముల శ్రీన్సూర్య, పగడాల నారాయణ, çమామిళ్ళ పల్లిసుభద్ర, శైలజ, రావు రంగమ్మ, రమాదేవి, మాధవి, బోయినపల్లి పార్వతి, వేముల లక్ష్మీకుమారి, వేములరాణి, మరో 12 మంది ఉన్నారు. అందులో బోయనపల్లి పద్మావతి(58)ని విజయవాడ వైద్యశాలకు తరలించారు. వైద్యశిబిరం.. డయేరియా కేసులు నమోదు కావడంతో కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యశిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ పద్మావతి వైద్యసేవలందించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు బాధితులకు పంపిణీ చేశారు. నమూనాలను సేకరిస్తున్నట్లు వైద్యురాలు తెలిపారు. పైపులైన్ లీకులతో అవస్థలు.. మైలవరం ప్రాజెక్టు నుంచి పైడూరుపాడు గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కృష్ణానది నీరు మైలవరం వచ్చి అక్కడ నుంచి పైపులైను ద్వారా గ్రామంలోని ఓవర్హెడ్ ట్యాంక్ను నింపుతారు. కుళాయిల ద్వారా తాగునీటిని పంచాయతీ సరఫరా చేస్తోంది. సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పైపు లైనుపై భాగంలోడ్రెయినేజీ కాల్వ ఉండటంతో తాగునీటి పైపులైను లీక్ కావడంతో వాటిని తాగిన పడమర బజారుల్లోని ప్రజలు డయేరియా బారిన పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాన్ని తహసీల్దార్ రవీంద్ర, ఎంపీడీఓ కె.అనూరాధ, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, గ్రామసర్పంచి కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు సీతారామయ్య ,మాజీ సర్పంచి రంగినేనినరేంద్ర, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమా ఆరా డయేరియా ప్రభావంతో 24 మంది అస్వçస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అధికారులను గ్రామానికి పంపారు. మెరుగైన వైద్యసదుపాయలు అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా విషయంపై ఆర్డబ్ల్యూ ఎస్ డీఈ సామిని ‘సాక్షి’ వివరణ కోరగా తాగునీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు చెప్పారు. వచ్చిన తరువాత నీటి వలన వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తోందన్నారు. డయేరియా అదుపులోనే ఉంది గ్రామంలో కలుషిత నీరు తాగడంవలన విరేచనాలు అయ్యాయి. పడమర బజారులోని 24 మంది అస్వస్ధతకు గురయ్యారు. వైద్యాధికారులు గ్రామంలో 552 గృహాలను పరిశీలించారు.– రవీంద్ర, తహసీల్దార్ -
అదుపులోకి రాని డయేరియా
బలిజిపేట:మండలంలోని పెదపెంకిలో డయేరియా వ్యాధి అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యసేవలు అందకపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం వల్లే డయేరియా ప్రబలిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన 50 మంది డయేరియా భారిన పడ్డారు. ప్రస్తుతం ఐదు సంవత్సరాల చిన్నారి రామ్శెట్టి లక్ష్మణ్, పచ్చిపులుసు మోహనరావు, తదితరులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బలిజిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే చీకటి రమణమ్మతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పటల్లో వైద్యం పొంది ఇళ్లకు చేరుకున్నారు. ఆర్. లక్ష్మి అనే మహిళకు వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో విజయనగరంలోని ఆస్పత్రికి.. కె.అశ్విని అనే చిన్నారిని బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. వీరే కాకుండా కవ్వాడ మమత, సింగారపు శివ గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంతమంది డయేరియా భారిన పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం గ్రామంలో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో పాటు ఎక్కడబడితే అక్కడే చెత్త,చెదారాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది అంటురోగాలు ప్రబలుతున్నాయి. వీధి కుళాయిలు కూడా కాలువల పక్కనే ఉండడంతో తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. కానరాని వైద్యసేవలు గ్రామంలో డయేరియా ప్రబలినా వైద్యసిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కొత్తపల్లెలో అతిసార కలకలం!
గిద్దలూరు:నగర పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో రోజురోజుకూ అతిసార విజృంభిస్తూ కలకలం రేపుతోంది. బుధవారం 45 మందికి పైగా అతిసార సోకడంతో వైద్యశాలకు పరుగులు తీశారు. అందిన వివరాల మేరకు సోమవారం గ్రామంలో జరిగిన శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అందరూ వారి గృహాల్లోనే బెల్లం పానకం తయారు చేసుకున్నారు. ఆ పానకంను ఆలయం వద్ద ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో కలిపి అందరూ కలిసి పూజలు చేసిన అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. అదే రోజు సాయంత్రం ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలు కావడంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు చేయించుకుని వెళ్లారు. మంగళవారం ఒక్కొక్కరికి పెరుగుతూ ఎనిమిది మందికి చేరింది. ఇలా మూడోరోజు అతిసార బాధితులు 45 మందికి చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు, నంద్యాలల్లోని వైద్యశాలలకు తరలించారు. వీరిలో బలగాని కేశమ్మను కర్నూలు, చంద్రకళ, త్రివేణి, మరో బాలుడిని నంద్యాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. గిద్దలూరు వైద్యశాలలో మరో 10 మంది.. అతిసార వ్యాధితో ప్రజలకు వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయి. మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు రెండు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో కొందరిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 మందికి పైగా స్థానికంగానే చికిత్సలు పొంది కాస్త ఉపశమనం కనిపించడంతో ఉండిపోయారు. పట్టణంలోని పలు ప్రైవేటు వైద్యశాలల్లో మరికొందరు చికిత్సలు పొందుతున్నారు. అతిసార సోకిన వారిలో పోతల శ్రీనివాసులు, బలగాని చైతన్య, సునీత, కమతం రమేష్, పాలుగుళ్ల రామనారాయణరెడ్డి, కుక్కా లింగమ్మ, బోగాని స్వప్న, మారుడి సాయిచరణ్రెడ్డి, పి.సావిత్రి, గోలం లక్ష్మీదేవి, తాటిచర్ల అంకమ్మలు మూడో రోజు అస్వస్థతకు గురికాగా, మంగళవారం నుంచి జానా క్రిష్టఫర్, చక్కా కోటయ్య, అండ్రా ఆనందరావు, కాతా దీపిక, జానా మౌనిక, బందెల స్వేత, బి.చిన్నసుబ్బయ్యలు వైద్యం పొందుతున్నారు. కలుషిత నీటి వలనే అతిసార... గ్రామానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు సమీపంలో ఉన్న కుంటలో బోరు తవ్వించి పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం ఎత్తు పల్లాలుగా ఉండటం వల్ల వీధులన్నింటికీ నీరు ఎక్కాలన్న ఉద్దేశ్యంతో వాల్వ్లు ఏర్పాటు చేశారు. వాల్వ్ల ద్వారా లీకైన నీరు పక్కనే గుంతగా ఏర్పడి మురుగు తయారైంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో మోటారు పనిచేయనప్పుడు వాల్వ్ పక్కనే ఉన్న మురుగునీరంతా పైపుల్లో చేరి తిరిగి నీరు వదిలినప్పుడు కుళాయిలకు చేరుతోంది. ఆ నీటిని పానకంలో కలపడం, పానకం తీయగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ కారకాలు పెరిగి అతిసార కలిగించాయని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ పంచల కిషోర్, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు పి.కాదర్వలిలు వాల్వ్లను పూడ్పించి పైపులు అమర్చారు. బ్లీచింగ్, సున్నం చల్లించి శుభ్రం చేశారు. క్రిష్ణంశెట్టిపల్లె, రాజుపాలెం పీహెచ్సీ వైద్యాధికారులు ఎం.రమీజాభాను, కే.శ్రీలక్షీ, పీపీ యూనిట్ వైద్యులు సాయిప్రశాంతి, వైద్య, ఆరోగ్య సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. రోగులకు నాయకుల పరామర్శనగర పంచాయతీలోని కొత్తపల్లెలో అతిసార వ్యాధితో బాధపడుతూ చికిత్సలు పొందుతున్న రోగులను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డిలు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మెరుగైన వైద్యం కోసం తమ సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించారు. అక్కడి వైద్యాధికారి డాక్టర్ సూరిబాబుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు టీడీపీ నాయకులు రోగులను పరామర్శించారు. డాక్టర్ బి.వి.రంగారావు, కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు కాదర్వలి, శానిటరీ ఇన్స్పెక్టర్ వీరబ్రహ్మం, వీఆర్వో శ్రీనివాసరెడ్డిలు గ్రామంలో పర్యటించారు. -
ఇంకా వీడని భయం
గుంటూరు మెడికల్: నగర ప్రజలు డయేరియా పేరు చెబితే వణికిపోతున్నారు. రోజుకో కొత్త కేసు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నాటికి డయేరియా మహమ్మారి విజృంభించి 20 రోజులు గడిచింది. ఇదే రోజు మరో 13 మంది వైద్య చికిత్స కోసం జీజీహెచ్లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ నెల 3న 21మంది బాధితులు జీజీహెచ్లో చేరగా.. 5వ తేదీ నుంచి మరణాలు సంభవించండం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రోజుకో కేసు.. ఈ 20 రోజుల్లో డయేరియాతో 20 మంది మృతిచెందగా.. 2వేల మంది బాధితులు చికిత్స పొందారు. శుక్రవారం నాటికి గుంటూరు జీజీహెచ్లో మొత్తం 40 మందికి వివిధ వార్డుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, బారాఇమాంపంజా ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో.. డయేరియా వల్ల కిడ్నీ సమస్య తలెత్తి గుంటూరు రమేష్ హాస్పిటల్లో మొత్తం 25 మంది చేరగా.. ప్రస్తుతం 12 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 15న ఈ ఆస్పత్రిలో ప్రభుత్వ ఖర్చుతో చికిత్స పొందుతున్న సింగంపల్లి నూకరాజు, టి.గంగా భవానీలను జీజీహెచ్ వైద్యులు అత్యుత్సాహంతో జీజీహెచ్కు తీసుకొచ్చారు. ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ మరణాలు జీజీహెచ్కు పెద్ద మచ్చగా మిగిలాయి. భయం.. భయం.. ఈ నెల 3న గుంటూరు తూర్పులో కేవలం మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా కేసులు.. నేడు నగరం అంతా వ్యాపించాయి. కార్పొరేష్ కుళాయి నీరు, మినరల్ వాటర్ ప్లాంట్స్ నీరు సైతం కలుషితం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఫలితంగా మినరల్ వాటర్ తాగాలన్నా ప్రజలు జంకుతున్నారు. నగరంలోని పాతగుంటూరు, ఆనందపేట, పొన్నూరు రోడ్డు, సంగడిగుంట, బారాఇమాంపంజా, చంద్రబాబునాయుడు కాలనీ, గాంధీనగర్, బాలాజీనగర్, ఇందిరప్రియదర్శిని కాలనీ, గుంటూరువారితోట, రాజాగారితోట, చౌత్రాసెంటర్, నల్లచెరువు, పొత్తూరివారితోట, హుస్సేన్ నగర్, మంగళదాస్నగర్, శారదాకాలనీ, బుచ్చయ్యతోట, లాలాపేట, విద్యానగర్, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం, సంపత్నగర్, అలీనగర్, కంకరగుంట ప్రాంతాల్లో ఎక్కవ మంది డయేరియా బారిన పడ్డారు. ఆరు రోజులుగావాంతులు, విరేచనాలు.. వసంతరాయపురం 1వ లైనుకు చెందిన తమ్మినేని మహేష్ ఆరు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్లో చికిత్సపొందుతున్నారు. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి ప్రాంతానికి ఆదిపూడి సలోమి రెండు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నారు. గుంటూరు ప్రాంతానికి చెందిన 23 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన 16 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
‘డై’యేరియాకు అడ్డుకట్ట
నగరంపాలెం: నగర ప్రజలకు సౌకర్యాల కల్పనలో ఒత్తిడిలకు లోనుకాకుండా కచ్చితంగా వ్యవహరించి అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకువెళతానని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బాలాజీరావ్ లఠ్కర్ తెలిపారు. గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేలా వచ్చే ఒత్తిడుల్ని సహించేది లేదన్నారు. భవిష్యత్లో డయేరియా పునరావృత్తం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలో డయేరియా ప్రబలడానికి శిథిలమైన పాత పైపులైన్లుతో పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడు కాల్వల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడం, కాల్వల్లో నుంచి మంచినీటి కుళాయిలు ఉండటం తదితర కారణాలుగా పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కూడా పరిశుభ్రతను పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే నగరంలో డయేరియా కేసులూ పూర్తిస్థాయిలో తగ్గాయని, అయినా ముందస్తుగా మెడికల్ క్యాంపులు, సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. బాధిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య స్పషల్ డ్రైవ్ బాధిత ప్రాంతాల్లోని అన్ని డివిజన్లలో ఇతర మున్సిపాల్టీల నుంచి కమిషనర్లను, సిబ్బందిని నియమించి ఐదు రోజులుగా పారిశుద్ధ్యం డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, సైడు కాల్వల్లో పూర్తిస్థాయిలో పూడిక తీసి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆనందపేట, బారాఇమాంమ్ పంజా, ముఫ్తీ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో శిథిలమైన పాత పైపుల స్థానంలో మొదటి విడతగా 23 కి.మీ పైపులైన్లను పది రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో 45రోజుల్లో మరో 80 నుంచి 90 కి.మీ పైపులైన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మురుగునీటి కాల్వల నుంచి వెళుతున్న మంచినీటి పైపులైన్లును పక్కకు మార్చుతున్నామని చెప్పారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న హెడ్ వాటర్వర్క్స్తో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు మంచినీటికి క్లోరిన్, బాక్టీరియా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలైన ఆనందపేట, బారాఇమాంమ్ పంజాలోని కొన్ని ప్రాంతాల్లోనే మార్చి 5,6 తేదీల్లో ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిందన్నారు. ప్రస్తుతం బాధిత ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పరీక్షలలో బాక్టీరియాపై పాజిటివ్ రిపోర్ట్సు రాలేదని తెలిపారు. నగరాభివృద్ధికి కృషి నవ్యాంధ్ర రాజధానిలో భాగమైన నగరాభివృద్ధికి నిధులు మంజూరులో ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు, పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ సానుకూలంగా ఉన్నారన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగేలా రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో సమగ్ర మంచినీటి పథకం పనుల్ని నెలరోజుల్లో పూర్తి చేసి, ప్రస్తుతం నగరానికి వస్తు న్న 90 ఎంఎల్డీ నీటితో పాటు అదనంగా మరో 45 ఎంఎల్డీ నీటిని తీసుకురానున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న యూజీడీ పనులపై పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసి నాణ్యతలోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలో 900 కి.మీ పొడవు ఉన్న రహదారుల్లో యూజీడీ వల్ల 400 కి.మీ వరకు తవ్వడం వల్ల దుమ్మూ, ధూళీ వ్యాపించిందన్నా రు. ప్రధాన రహదారుల్లో యూజీడీ పనుల్ని వేగవంతంగా పూర్తిచేసి పునరుద్ధరణ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతి, ఆక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని లఠ్కర్ హెచ్చరించారు. కమిషనర్కు అభినందనలు నూతన కమిషనర్ శ్రీకేష్ లఠ్కర్ను తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, అదనపు కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డీసీలు ఏసుదాసు, శ్రీనివాసులు, సెక్రటరీ వసంతలక్ష్మి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలి పారు. సిటీ ప్లానర్ చక్రపాణి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చిన్నపరెడ్డి, మేనేజరు వెంకటరామయ్య, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు పి. నమ్రత్ కుమార్, మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్బాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులు కలసి అభినందనలు తెలిపారు. -
ఎస్కే పాలెంలో డయేరియా!
పెరిశేపల్లి (పామర్రు) : మండల పరిధిలోని పెరిశేపల్లి గ్రామ శివారు ప్రాంతమైన సబ్ధర్ఖాన్ పాలెంలో మూడు రోజులుగా డయేరియా వ్యాధి లక్షణాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం రాత్రి గ్రామానికి దగ్గరలో జుఝవరం ఎస్సీ కాలనీలో ఉంటున్న నిల్వ కూలీలు ఎస్కే పాలెంలోని బావి నీరు తాగటం కారణంగా ముగ్గురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అలాగే, సోమవారం ఎస్కే పాలెంలోని ప్రజలు అదే బావి నీటిని తాగడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన జె దినేష్, జె సౌజన్య, కె కళ్యాణి, వీ ఉషారాణి, కె రామ్చరణ్లకు వాంతులు, విరేచనాలు కావడంతో పామర్రులో ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి ఫీజులకు భయపడి స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు గ్రామ ప్రముఖుడు వీరిని తరలించారు. వీరిలో ఉషారాణిని మెరుగైన వైద్యం కోసం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి మొర్ల సరస్వతి, సిరిపురపు సత్యనారాయణ, మొర్ల పైడమ్మలతో పాటు మరో ముగ్గురికి విరేచనాలు అవ్వడం గుర్తించి వారిని కూడా పామర్రులో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరూ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జె దినేష్ అనే చిన్నారిని మంగళవారం వైద్యశాలలో చేర్పించి సాయంత్రం తగ్గిపోయిందని ఇంటికి పంపించారు. అయితే, బుధవారం ఉదయం మరలా విరేచనాలు అవ్వడంతో తిరిగి వైద్యశాలకు తరలించారు. కాగా, పామర్రులోని మరో ప్రయివేటు వైద్యశాలలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కప్పి పుచ్చిన స్థానిక నేతలు మూడు రోజులుగా గ్రామస్తులు డయేరియాతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చారు. ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా మందు బిళ్లలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నారు. కలుషిత తాగునీటి విషయాన్ని ఫుడ్ పాయిజన్గా ప్రచారం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయితే ఓ ఇంటికే పరిమితం అవుతుంది. కానీ, ఇక్కడ గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నారా లోకేష్ దత్తత గ్రామంలో కూడా.. వారం రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ దత్తత గ్రామమైన నిమ్మకూరులోని ఓ రైతు శ్రీకాకుళం నుంచి నిల్వ కూలీలను తీసుకువచ్చారు. వీరిలో కొందరు గ్రామంలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలలో వాడుకోగా మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి తిన్న కారణంగా ఫుడ్ పాయిజనింగ్కు గురై అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆ రైతు కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వారిని అక్కడి నుంచి నిమ్మకూరు రాకుండా శ్రీకాకుళం పంపించి వేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం. నీటి శాంపుల్స్ సేకరణ తాగునీటికి వినియోగించే బావి నీటిని సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యురాలు ఆర్ఎన్ జ్యోత్న్స తెలిపారు. రిపోర్టులు వస్తే కాని ఏ విషయమూ నిర్ధారించలేమన్నారు. నిమ్మకూరు పీహెచ్సీ వైద్యురాలు పద్మజ, పీçహెచ్ఎన్ ఇందిరాకుమారి, ఏఎన్ఎం ధనలక్ష్మి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామంలో తహసీల్దార్ పర్యటన పెరిశేపల్లి (పామర్రు) : గ్రామ శివారు ప్రాంతమైన ఎస్కే పాలెంలో బుధవారం తహసీల్దార్ ఎం. పద్మకుమారి పర్యటించారు. గ్రామంలో వైద్య సిబ్బందితోపాటు ఇంటింటికి తిరిగి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి అనారోగ్యం రావడంతో పామర్రు పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే పరిస్థితి ఎస్కే పాలెంలోని మరి కొందరికి ఏర్పడిందని, వారికి కూడా వైద్య సేవలు అందుతున్నాయని, పరిస్థితి అదుపులో ఉన్నదని తెలిపారు. ఎవరికి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. గ్రామంలోని నూతి నీటిని పరీక్షలకు పంపగా ఏమీ లేదని రిపోర్టు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వణుకుతున్న గుంటూరు ప్రజలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్న ఆలీనగర్ మూడవ లైన్ ప్రియంక గార్డెన్ ప్రాంతానికి చెందిన షేక్ ఇస్మాయేల్(52) సోమవారం మృతి చెందాడు. దీంతో డయేరియా మరణాలు 20కి చేరకున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. జీజీహెచ్ అధికారులు అధికారికంగా ఎనిమిది డయేరియా మరణాలుగా, మరో ఎనిమిది అనుమానిత మరణాలుగా తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం మరణాలు 24 ఉన్నాయి. గుంటూరు రమేష్ హాస్పటల్లో బాధితులు 13 మంది సోమవారం నాటికి చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్పై ఉన్నారు. కిడ్నీ సమస్య తలెత్తి ఒకరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. గుంటూరు జీజీహెచ్లో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా పేరు చెబితే హడల్ గుంటూరు తూర్పులో ఈనెల 3న మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా నేడు నగరం అంతా విస్తరించటంతో ప్రజలు హడలిపోతున్నారు. కార్పొరేషన్ కుళాయి నీరు, మినరల్ వాటర్ ప్లాంట్స్ నీరు సైతం కలుషితం అయినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకున్న నీరు సైతం తాగాలన్నా భయపడిపోతున్నారు. అదుపులోకి రాని వాంతులు, విరోచనాలు రెండు వారాలు దాటినా డయేరియా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఆనంద్పేట మూడోలైన్కు చెందిన షేక్ అల్లాబక్షు రెండు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సోమవారం చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చాడు. వారం రోజుల కిందట అల్లుడు ఇర్ఫాన్ కూడా డయేరియా బారిన పడి చికిత్స పొందినట్లు ఆయన తెలిపారు. వట్టిచెరుకూరు మండలం అనంతరవరప్పాడు గ్రామానికి చెందిన ముదిగంట పార్వతి, వినుకొండకు చెందిన యోహాను, బారాఇమామ్పంజా సెంటర్కు చెందిన ఇబ్సమ్, పాత గుంటూరుకు చెందిన పొట్లూరి నాగరాజుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది సోమవారం డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్లో చేరారు. -
డయేరియా మరణాలపై రాజకీయమా?
ఆమె ఏడు నెలల గర్భిణి.. కడపులో బిడ్డ కాళ్లతో తన్నుతున్నాడంటూ భర్తకు చెప్పి మురిసిపోయేది.. ఇప్పటికే బాబు ఉన్నందున పాప పుట్టాలని ఆ దంపతులు ఇద్దరూ కలలుకనేవారు. ఆ కలలను డయేరియా మహమ్మారి కల్లలు చేస్తూ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఆ గర్భిణికి తీరని కష్టాన్ని మిగిల్చింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు అమ్మా.. నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడంటూ వచ్చీ్చరాని మాట లతో పదే పదే ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుండెలుఅవిసేలా రోదిస్తోంది. గుంటూరు ఈస్ట్: నగరంలోని ఆర్అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పల్లపు రత్తయ్య (38) తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రత్తయ్య గురువారం వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. రత్తయ్య భార్య లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆ దంపతులకు మూడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. రత్తయ్యకు సరైన వైద్యం చేయని కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. డయేరియాకు గురడవానికి ముందు వరకు రత్తయ్య ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పండ్లు విక్రయించి వచ్చే రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్నిపోషించే రత్తయ్య మృతితో భార్య లక్ష్మి భవిష్యత్తు అంధకారంలో పడింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని కుమారుడు అమాయకంగా నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడు అంటూ అడగడంతో ఏ సమాధానం చెప్పాలో లక్ష్మి పొగిలిపొగిలి ఏడుస్తోంది. లక్ష్మి విలపిస్తున్న తీరుతో కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. రత్తయ్య మృతితో తమకు దిక్కెవరంటూ అతని తల్లి తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది. ఆనందపేట 8వ లైన్కు చెందిన పఠాన్ ఫాతిమూన్ (67) డయేరియాతో గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
‘నోటికొచ్చినట్టు మాట్లాడితే.. నేనూ మాట్లాడతా’
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అతిసారంతో చనిపోయిన కుటుంబాలను శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన కలిశారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ‘తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోతే మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం.. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేశాయి. అభివృద్ధి..అభివృద్ది అంటున్నారు, కానీ త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఆస్పత్రిలో రోగులకు సరైన బెడ్లు కేటాయించలేదు. అతిసారంతో 14 ఏళ్ల షేక్ ఫరూక్కు నూరేళ్లు నిండటం కలిచి వేసింది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో ఏమని చూపిస్తారు. రాజధానికి కూతవేటు దూరంలో గుంటూరు ఉంది. ఈ ఘటనపై ఐఏఎస్తో కమిటీ వేయలేదు. ప్రజా ప్రతినిధులకు ఈ సమస్య పట్టడం లేదా? గుంటూరు కార్పొరేషన్కు ఎన్నికలు పెట్టలేదు.. కనీసం ఎన్నికలు పెడితే కార్పోరేటర్లకు సమస్య చెప్పుకునేవారు. ప్రజలు ఎక్స్గ్రేషియా వైపు చూడరు.. పరిహారం ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం మంచి పద్దతి కాదు. కల్తీలకు గుంటూరు అడ్డాగా మారింది. కారంలో రంపపు పొడి కలుపుతారని విన్నాను. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే.. తప్పుచేసిన వారిని నిలదీయండి. ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పదించకపోతే బంద్కు పిలుపునిస్తాం.. అవసరమైతే దీక్షకు కూర్చుంటాం. 20 మంది ప్రజా ప్రతినిధులు చనిపోతే ఎలా ఉంటుంది.. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా. సమాజం డ్రైనేజీలా కుళ్లి పోయింది. అసెంబ్లీలో ఈ అంశంపై తూతూ మంత్రంగా చర్చించారు. ప్రజా సమస్యలకు తుంగలో తొక్కే హక్కు ఎవరికీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నాకూ ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేనూ బలంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై ఏపార్టీకి స్పష్టత లేదు’ అని అన్నారు. -
గుంటూరులో విస్తరించిన డయేరియా
గుంటూరు నగర వాసులను వణికిస్తున్న డయేరియా ఆరోరోజూ అదుపులోకి రాలేదు. ఆస్పత్రులకు రోగుల రాక కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో సైతం డయేరియా కేసులు నమోదవటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అదనంగా మరో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గుంటూరుమెడికల్: రాజధాని నగరం గుంటూరులో ఆరోరోజు కూడా డయేరియా పూర్తిగా అదుపులోకి రాలేదు. పైగా నిన్నటివరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాత్రమే ఉన్న డయేరియా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో సైతం కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం గమనార్హం. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్న బాధితుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో నగర ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో వైద్యులు కూడా తలలు పట్టుకుంటున్నారు. పెరిగిన డయేరియా కేసులు... ఈనెల 3 న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాతగుంటూరు, ఆనందపేట, సంగడిగుంట, చిన్నబజారు, చౌత్రాసెంటర్, ఎల్బీ నగర్, లాంచెస్టర్ రోడ్డు, వడ్డెర కాలనీ, బాలాజీనగర్, ఐపీడీ కాలనీ ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజులుగా ఈ ప్రాంతాల్లో ప్రజలు వెయ్యికి పైగా డయేరియాతో ఆస్పత్రిలో చికిత్స పొందగా 10 మంది డయేరియాతో చనిపోయారు. 20 మంది వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్తో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం డయేరియా మృతి కేసు నమోదవకపోవడంతో డయేరియా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు భావించారు. కాని గురువారం రాత్రి నుంచి మళ్లీ డయేరియా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. తూర్పు నుంచి పశ్చిమకు పాకిన డయేరియా తూర్పు నియోజకవర్గంలో వారం రోజులుగా ఉన్న ప్రాంతాలే కాకుండా గురువారం రాత్రి నూతన ప్రాంతాల్లో సైతం డయేరియా కేసులు నమోదు అవడంతో వైద్యులు, ప్రజలు భయాందోళâ¶నలు చెందుతున్నారు. వల్లూరివారితోట, శారదాకాలనీ, నల్లచెరువు, నెహ్రూనగర్, హుస్సేన్ నగర్, కొత్తపేట,లాలాపేట, రామిరెడ్డితోట తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుళ్ళ, మల్లికార్జునపేట, కేవీపీ కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, నల్లచెరువు తదితర ప్రాంతాల ప్రజలు డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం జీజీహెచ్కు వచ్చారు. తాడికొండ, లాం, పెదకాకాని ఇతర గ్రామాల్లో సైతం డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం పలువురు జీజీహెచ్కు వచ్చారు. కేవలం ఒక్క గుంటూరు జీజీహెచ్లోనే గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఓపీ వైద్య విభాగంలో 56 మంది, ఇన్పేషేంట్ విభాగంలో 36 మంది అడ్మిట్ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ విభాగంలో 42 మంది, ఇన్పేషేంట్ విభాగంలో 32 మంది చికిత్స పొందారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ విభాగంలో 30 మంది, ఇన్పేషేంట్ విభాగంలో 25 మంది చికిత్స పొందారు. అదనంగా వార్డులు ఏర్పాటు జీజీహెచ్లో డయేరియా కేసులు పెరుగుతూ ఉండడంతో శుక్రవారం అదనంగా ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. జీజీహెచ్లో శుక్రవారం 250 మందికి పైగా డయేరియా బాధితులు అడ్మిష¯Œన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరిలో పిల్లలు 56 మంది ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జీజీహెచ్లో మంచినీరు తాగాలంటే భయం ఆస్పత్రిలో వారం రోజులుగా డయేరియా బాధితులు చికిత్స పొందుతూ ఉండడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిలో మంచినీరు తాగాలంటే భయపడిపోతున్నారు. శుక్రవారం ఆస్పత్రిలో డయేరియా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు తెప్పించినా డయేరియా భయంతో వాటిని ముట్టుకోకుండా పక్కన పడేశారు. ఇంటి వద్ద నుంచి కాచి తెచ్చుకున్న నీటినే వైద్య సిబ్బంది తాగుతున్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించడం చాలా ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ... డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో వైద్యాధికారులు ఆస్పత్రిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, ఆర్ఎంఓలు డాక్టర్ ఆదినారాయణ, డాక్టర్ రమేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పావతి, పలువురు సీనియర్ వైద్యులు డయేరియా బాధితులు ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. జూనియర్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందిని పలు వార్డుల నుంచి డిప్యూటేషన్పై డయేరియా వార్డులకు కేటాయించి సత్వరమే వైద్యసేవలను అందేలా చూస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు సైతం అంబులెన్స్ల్లో, ఆటోల్లో వచ్చిన డయేరియా బాధితులను సకాలంలో వార్డులకు చేర్చి వారికి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు. డయేరియా రోగులకు మినరల్ వాటర్ బాటిళ్లను సైతం ఆస్పత్రి అధికారులు అందజేశారు. నన్నపనేని పరామర్శ... రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి శుక్రవారం జీజీహెచ్లో డయేరియా బాధితులను పరామర్శించారు. రోగులకు ఆస్పత్రి సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలను అభినందించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ ట్యాంకుల ద్వారా తాగేందుకు, వంట చేసుకునేందుకు ప్రజలకు నీటిని తక్షణమే అందించాలని కోరారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశుభ్రం చేసి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. -
అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి
గుంటూరు ఈస్ట్: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు, బారాఇమాంపంజా సెంటర్లో వారం రోజులుగా నీటి సమస్య, డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ నిరసనకు వైఎస్సార్ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు, పాతగుంటూరు ఎస్హెచ్వో బాలమురళీకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ర్యాలీగా పాత గుంటూరు పోలీసు స్టేషన్కు చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నినదించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు షేక్ చాంద్బాషా, షేక్ సమీవుల్లా, కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ, స్థానిక నాయకులు మహమ్మద్ షరీఫ్, ఫిరోజ్, హమీద్ మాట్లాడుతూ శనివారం కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోనే వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, కొంత మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధి మరించిందని ఆరోపించారు. ఈప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, అనారోగ్యబారిన పడి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సర్కారీ హత్యలే!
సాక్షి,అమరావతిబ్యూరో: గుంటూరు నగరంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డయేరియా వ్యాధితో పది మంది చనిపోయారని, ఇవి నిస్సందేహంగా సర్కారీ హత్యలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా సమన్వయకర్త, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం పరామర్శించింది. అనంతరం కలెక్టర్ను కలిసి డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజుల నుంచి రోగులు మరణిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉండే ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో అత్యవసర విభాగంలో చిన్నారిని ఎలుకలు కొరి కన ఘటన, సెల్ఫోన్ వెలుగులో శస్త్ర చికిత్సలు చేసిన ఉదంతంతోపాటు కిడ్నీ రాకెట్ కూడా వెలుగు చూడడం సిగ్గుచేటన్నారు. కల్తీలకు కూడా జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు. డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూజీడీ కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి మరో రూ.10 లక్షలు ఇప్పించడంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన రోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధి ప్రబలి ఐదు రోజులు గడిచినా అందుకుగల కారణాలపై అధికారులకు స్పష్టత లేకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం గుంటూరు నగరంలో డయేరియాతో పది మంది చనిపోయారన్న వార్త తెలియగానే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి చలించిపోయారని, వెంటనే తమను వెళ్లి బాధితులను పరామర్శించాలని సూచించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఘటనకు గల కారణాలను ఉన్నతాధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధినేత సూచించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాల వారికి పార్టీ పరంగా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పారన్నారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, వినుకొండ, పెదకూరపాడు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు? గుంటూరు వెస్ట్: ‘కార్పొరేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల ఐదు రోజుల నుంచి 9 మంది చనిపోయారు. వందల మంది చికిత్స పొదుతున్నారు.. కలెక్టర్గారూ అసలు ఏం జరుగుతుంది?’ అంటూ కలెక్టర్ను వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ అగ్రనాయకులంతా గురువారం కలెక్టరేట్ కలెక్టర్ కోన శశిధర్ను కలిసి మరణాలపై తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్ని రోజులు గడుస్తున్నా, ఇంత యంత్రాంగం అందుబాటులో ఉన్నా ఎందుకు సమస్య అర్థం కాలేదని ప్రశ్నించారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆరు వార్డుల్లో ప్రజలు మరణించారని, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఇంకా ప్రారంభించలేదని, డ్రైనేజీ నీరు కలవడానికి అవకాశం లేదని వివరించారు. వీలైనంత వరకు సమస్యలున్న ప్రాంతాల్లో పైపు లైన్లు మారుస్తున్నామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
అతిసార బాధితులకు వైఎస్ఆర్సీపీ చేయూత
సాక్షి, గుంటూరు : మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలించి.. వ్యాధి బారినపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతిసార బాధితులకు వైఎస్ఆర్సీపీ చేయూతనిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు యాభై వేల రుపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటన గురించి తెలిసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చాలా కలత చెందారని పేర్కొన్నారు. జగన్ బాధితులను పరామర్శించమని మమల్ని పంపించారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అతిసార ప్రబలిందని బొత్స సత్యనారాయణ అన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఉమ్మారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గోపి రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గుంటూరులో ఘోరకలి ; ఇప్పటికి 8మంది మృతి
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు. మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం. -
డయేరియా అలజడి
గుంటూరు మెడికల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో డయేరియా వ్యాధి విజృంభిస్తోంది. మూడు రోజుల్లో 200 మంది వ్యాధిపీడితులుగా మారి ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నగరంలో తీవ్ర అలజడి రేగింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే డయేరియా ఒక్కసారిగా విజృంభించడానికి కారణాలు తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తొలుత కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో రోగులు ఆస్పత్రులకు చేరుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు 600 శాంపిళ్లు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నీరు కలుషితమైనట్లు తేలలేదు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ డయేరియా విజృంభణకు కలుషిత నీరు లేదా ఆహారం విషతుల్యంగా మారడమా అనేది తేలాల్సి ఉందన్నారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం పర్యటిం చారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో డీఎంహెచ్ఓ డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ నేతృత్వంలో పది వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులతో డోర్ టూ డోర్ సర్వే చేయించి, బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. నగరంలో ఒక్కరోజు పాటు నీటి సరఫరా నిలిపివేసి, శాంపిళ్లు తీసిన అనంతరం పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేసి తిరిగి నీరు విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసి డయేరియా బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లోనే నేరుగా ప్రత్యేక శిబి రాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. 200 మంది బాధితులు.. ముగ్గురు మృతి నగరంలో డయేరియా బారినపడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్, జ్వరాల ఆస్పత్రిలో సుమారు వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. మిగతా వారంతా ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జ్వరాల ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడంతో వైద్యులు నేలపైనే రోగులకు చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇలా ఉంటే, ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్తున్నారనేది లెక్క తేలాల్సి ఉంది. జీజీహెచ్లో మెడికల్ ఎమర్జెన్సీ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మంగళవారం మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. మూడు రోజులుగా ఆస్పత్రికి డయేరియా బాధితులు వస్తున్నారని, మంగళవారం ఒక్కరోజే 60 మందికి పైగా బాధితులు రావటంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో డయేరియా బాధితుల కోసం మంగళవారం 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటుచేశారు. బాధితులకు వైద్యసేవలను అందించేందుకు స్టాఫ్ నర్సులు, పీజీ వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు, ఆర్ఎంఓలు, జూనియర్ డాక్టర్లను నియమించారు. డ్యూటీ లేని వారిని సైతం విధులకు హాజరుకావాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. బాధితులకు ఆస్పత్రి అధికారులు మినరల్ వాటర్ బాటిళ్లు ఇచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలుపుకొని తాగాలని సూచించారు. భయందోళనలో నగర ప్రజలు గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పది డివిజ న్లలో ఒక్కసారిగా డయేరియా విజృంభించడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారంటూ రోగుల బంధువులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా ప్రాంతాల్లో 600 శాంపిళ్లు తీసి మరీ నీటి పరీక్షలు చేశామని, నీటిలో తేడా ఉన్నట్లు కని పించలేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. పాతగుంటూరు, ఆనందపేట, వినోభానగర్, సంగడిగుంట వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ పరిస్థితి నెలకొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం కావడంతో బాధితుల్లో అధికశాతం మంది చికెన్, మటన్ తిన్నట్లు చెబుతున్నారు. నిల్వ ఉన్న మాంసం తినడం వల్ల ఇలా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇంత పెద్ద ఎత్తున్న డయేరియా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో డయేరియా విజృంభించడంతో నగర వాసులకు కంటిపై కునుకులేకుండా పోయింది. వ్యాధి ప్రబలడానికి కారణం ఏమిటో తెలియకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. -
అతిసారమా.. అలెర్ట్ అవ్వండి!
సాక్షి, తెలంగాణ డెస్క్: డయేరియాను నియంత్రించడంలో ఎంతో ప్రగతి సాధించినా.. వైద్య ప్రమాణాలు చాలా వరకు మెరుగుపడినా.. ఇప్పటికీ దేశంలో చిన్నారుల మరణాలకు డయేరియా ఒక ప్రధాన కారణమట. వివిధ వ్యాధులతో ఏటా మరణిస్తున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో డయేరియా మృతులు రెండో స్థానంలో ఉన్నారట. 2015లో దేశంలో ప్రతి రోజూ సుమారు 321 మంది చిన్నారులు డయేరియాతో మరణించారట. ఈ ఏడాది మేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెలువరించిన ఫ్యాక్ట్ షీట్(వాస్తవపత్రం) ఈ విషయాలను వెల్లడించింది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరుతో డయేరియాను చాలా వరకూ నియంత్రించవచ్చు. కానీ మౌలిక వసతులైన వీటిని ప్రజలకు అందించడంలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. కలుషిత నీటి వల్లే.. కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల సాయంతో డయేరియా వ్యాపిస్తోంది. డీహైడ్రేషన్(నిర్జలీకరణం), పోషకాహారలోపం, విరేచనాల వల్ల కూడా డయేరియా విస్తరిస్తోంది. 2015లో ప్రపంచవ్యాప్తంగా డయేరియాతో 5,25,000 చిన్నారులు మరణించినట్టు డబ్ల్యూహెచ్వో ఫ్యాక్ట్షీట్ వెల్లడించింది. పోషకాహార లోపం, వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం మొదలైన కారణాల్లో 132 దేశాల్లో భారత్ 114వ స్థానంలో ఉందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డయేరియా ఎక్కువసార్లు రావడం వల్ల దీర్ఘకాలంలో చిన్నారుల ఎదుగుదల, సామర్థ్యం, వ్యాధి నిరోధకశక్తిపై ప్రభావం చూపుతోందని, దీనికి పేదరికం కూడా ఒక కారణమని నిపుణులు చెపుతున్నారు. వోఆర్ఎస్తో చెక్ పెట్టొచ్చు సాధారణమైన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (వోఆర్ఎస్), జింక్ ట్యాబ్లెట్లతో డయేరియాను నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్వో ఫ్యాక్ట్షీట్ స్పష్టం చేస్తోంది. వోఆర్ఎస్ అంటే స్వచ్ఛమైన నీరు, ఉప్పు, చక్కెర మిశ్రమం. ఇది శరీరంలో కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్ను భర్తీ చేస్తుంది. జింక్ మాత్రలు డయేరియా ప్రభావిత కాలాన్ని 25 శాతం తగ్గిస్తాయి. వైద్య ప్రమాణాలు పెరిగినా ఇప్పటికీ డయేరియా మరణాలు ఎక్కువే డబ్ల్యూహెచ్వో ఫ్యాక్ట్షీట్లో వెల్లడి ప్రపంచవ్యాప్తంగా 2015లో ఐదేళ్లలోపు చిన్నారుల మృతి 5,25,000 భారత్లో ప్రతి రోజూ మృత్యువాత పడుతున్న చిన్నారులు 321 -
విజృంభిస్తున్న డయేరియా
► రోజురోజుకు పెరుగుతున్న కేసులు ► కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ► గ్రామాలు, పట్టణాల్లో లోపించిన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు ఆసిఫాబాద్: జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో పదుల సంఖ్యలో డయేరియా, విషజ్వరాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 63 మంది డయేరియా చికిత్స పొందగా, మలేరియా, టైఫాయిడ్తో పలువురు చికిత్స పొందారు. వీరితోపాటు ప్రతీరోజు సుమారు 400 నుంచి 500 వరకు ఔట్ పేషెంట్లు నమోదవుతున్నారు. వారం రోజుల్లో మండలంలోని ఆర్ఆర్కాలనీకి చెందిన పాపయ్య, మోతుగూడకు చెందిన అనిత, కొసరకు చెందిన సునీత, చిర్రకుంటకు చెందిన మోహన్, తారకరామానగర్కు చెందిన సునీత, రాకేశ్, జన్కాపూర్కు చెందిన రోహిణి, గుడిసెల కాశమ్మ, లచ్చయ్య, మజీద్వాడికి చెందిన లక్ష్మి, బజార్వాడికి చెందిన భారతి, గొల్లగూడకు చెందిన విజయ, సందీప్నగర్కు చెందిన ఎల్లవ్వ, హడ్కోకాలనీకి చెందిన శివకృష రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన రంగమ్మ, రాంపూర్కు చెందిన రేణుకతోపాటు పలువురు డయేరియా, మలేరియా చికిత్స పొందగా, ఆదివారం మండలంలోని సందీప్నగర్కు చెందిన లత, జన్కాపూర్కు చెందిన తారుబాయి, బెస్తవాడకు చెందిన మారుతి, రెబ్బెన మండలం ఖైర్గాంకు చెందిన అంజలి డయేరియాతో ఆస్పత్రిలో చేరారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయేరియా, జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. లోపిస్తున్న పారిశుధ్యం జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లోని 173 గ్రామపంచాయతీలకు ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.24.32 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో 60 శాతం పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయనున్నారు. గ్రామపంచాయతీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతోపాటు ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పంచాయతీ పాలన పడకేసింది. జిల్లా కేంద్రంలోనే ఎక్కడ చేసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా గ్రామీణ, పల్లె ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చెత్తా చెదారం నిండిపోయింది. అందులో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు పెరిగి జ్వరాల పాలవుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం పాట్లు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాపై నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఏటా వర్షాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోనే రోజుల తరబడి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో, తాగునీటికోసం చేతి పంపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అతిసార కేసులు లేవు
► వ్యక్తిగత పరిశుభ్రత లోపమే అస్వస్థతకు కారణం ► జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ జోగిపేట(అందోలు): అతిసార కేసులు లేవని జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ చెప్పారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 65 మంది అతిసారంతో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. రోగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రశ్నించారు. అక్కడ ఇద్దరు... ఇక్కడ ఒకరు అంటూ 9 మందిని చూపించారు. 65 మంది ఎక్కడ ఉన్నారని సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వెళ్లిపోతున్నారని డాక్టర్ చెప్పడంతో అడిషనల్ డీఎంహెచ్ఓ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందినవారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. 24 గ్రామాలకు చెందినవారు ఒకరిద్దరు చొప్పున ఉన్నారని డాక్టర్ అధికారికి వివరించారు. అనంతరం జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇందులో అతిసారం కేసులు ఏమీ లేవన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడంతో అస్వస్థతకు గురవుతున్నారని స్పష్టం చేశారు. అతిసారం అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నృపేన్ చక్రవర్తి, హెచ్ఈఓ విజయ్కుమార్, సిబ్బంది నర్సింలు, శంకర్లు ఆయన వెంట ఉన్నారు.