రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలంలో డయేరియా ప్రబలింది. బొపునారం గ్రామంలో డయేరియాతో గురువారం ఆశన్న(70)చనిపోగా, మరో ఇరవై మంది బాధితులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలంలో డయేరియా ప్రబలింది. బొపునారం గ్రామంలో డయేరియాతో గురువారం ఆశన్న(70)చనిపోగా, మరో ఇరవై మంది బాధితులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కలుషిత నీరు తాగటం వల్లే డయేరియా ప్రబలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానికంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.