ఆదరం..అతిసారం కలకలం | People Suffering With Diarrhea in Chittoor | Sakshi
Sakshi News home page

ఆదరం..అతిసారం కలకలం

Published Tue, Feb 4 2020 11:22 AM | Last Updated on Tue, Feb 4 2020 11:22 AM

People Suffering With Diarrhea in Chittoor - Sakshi

కేవీబీపురం మండలం ఆదరం పంచాయతీ పరిధిలోని గిరిజన, దళిత కాలనీల్లో అతిసారం విజృంభించింది. ఇప్పటికే 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి మరో ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీకాళహస్తి, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నెలకొన్న  పారిశుద్ధ్య లోపం, తాగు నీటి కలుషితం వల్లే అతిసారం ప్రబలినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ కూడా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులపాలవడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement