Thailand
-
నేరం చేసేలా ఒత్తిడి చేస్తారు..తప్పు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు
సాక్షి, హైదరాబాద్ : ‘థాయ్లాండ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరిట నన్ను బ్యాంకాక్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి మయన్మార్లోని కేకేపార్క్ ప్రాంతంలోకి జాంటు అనే కంపెనీకి ఒక చైనీయుడు నన్ను తీసుకెళ్లాడు. అక్కడున్నవారు నన్ను సైబర్ మోసాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వారే సైబర్ మోసాలు ఎలా చేయాలి? ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి? వారితో నమ్మకంగా ఎలా మెలగాలి? చివరకు ఎలా మోసగించాలి? ఇలా అన్నింటికి సంబంధించి శిక్షణ ఇచ్చారు. తర్వాత నాకు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసాలు చేసే పని అప్పగించారు’ అంటూ మహమ్మద్ అర్బాజ్ బిన్బా బేజర్ తన ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పారు. నగరానికి చెందిన మహమ్మద్ అర్బాజ్ బిన్బా బేజర్ ఉద్యోగం కోసం థాయ్లాండ్కు వెళ్లి సైబర్ నేరగాళ్ల ముఠా చేతికి ఎలా చిక్కాడు..ఎలా బయటపడ్డారో టీజీ సైబర్సెక్యూరిటీ బ్యూరో అధికారులకు గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఏజెంట్ రూ.60,000 తీసుకొని...ఫలక్నుమాలోని మీ సేవ కేంద్రంలో డేటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేసే తనకు థాయ్లాండ్లో అదే ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ బషీర్ రూ. 60,000 తీసుకొని తనను 2025 జనవరి 1న బ్యాంకాక్ పంపినట్టు మహమ్మద్ అర్బాజ్ చెప్పాడు. ‘బ్యాంకాక్ విమానాశ్రయంలో ఒక చైనీయుడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత ఒక ట్యాక్సీలో థాయ్లాండ్లోని మే సాట్లోని ఒక హోటల్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను నన్ను మే సాట్లోని నది పాయింట్కు తీసుకెళ్లి, చిన్న పడవలో నదిని దాటించి మయన్మార్లోని మైవాడికి, ఆ తర్వాత కారులో కేకే పార్క్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్రిప్టోకరెన్సీలో పెట్టుబడుల పేరిట మోసాలు చేసే పని అప్పగించారు. ఆ ముఠావారు ముందు నకిలీ వివరాలతో ఒక ఫేస్బుక్ ఖాతా తెరిపిస్తారు. దానిలో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టాలి. స్పందించిన వ్యక్తులతో ఫొటోలు, శుభాకాంక్షలు పెడుతూ, వారి అభిరుచులు, అలవాట్లపై చర్చిస్తూ పరిచయం పెంచుకోవాలి. అలా వారి నమ్మకాన్ని పొందిన తర్వాత, టీమ్ లీడర్ మాకు నిజమైన యూఎస్ వాట్సాప్ నంబర్ ఇస్తాడు. వాట్సాప్లో సంభాషణను కొనసాగిస్తూ, చైనీయులు నిర్వహించే వెబ్సైట్ ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని, నాకు కూడా మీరు పెట్టే పెట్టుబడిలో ఒక శాతం కమీషన్ అందుతుందని ఒప్పించాలి.ఎదుటి వ్యక్తికి అనుమానం వస్తే వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేము వీడియో కాల్ చేస్తాం. ఇలా పెట్టుబడులు పెట్టించి మోసగించాలి. నేను ఇలా ఒకటిన్నర నెల పనిచేసిన తర్వాత, నాకు అప్పగించిన టార్గెట్ చేరుకోలేదని నా జీతం తగ్గించారు. భారత్తోపాటు ఎన్నో దేశాల వారు అక్కడ పనిచేస్తున్నారు. ఇటీవల మాలాంటి వారిని అక్కడి సైన్యం కాపాడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు మా కంపెనీ వారు మమ్మల్ని పిలిచి..ఆసక్తి లేనివారు కంపెనీని విడిచి వెళ్లిపోవచ్చని చెప్పారు. 2025 ఫిబ్రవరి 23న సైన్యం మా కంపెనీ కార్యాలయానికి వచ్చింది. అప్పుడు నేను సైనిక బృందంతో భారత రాయబార కార్యాలయానికి వచ్చి, 2025 మార్చి 11న భారత్కు చేరుకున్నాను’ అని టీజీసీఎస్బీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు బషీర్, ఇతరులపై కేసు నమోదు చేసిన టీజీసీఎస్బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. -
మాతృభూమికి తెలుగువారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొలువుల కోసం వెళ్లి.. సైబర్ ఫ్రాడ్ కంపెనీల్లో చిక్కుకున్న వారి తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది. మంగళవారం థాయ్లాండ్లోని మై సోట్ నుంచి రెండో ఆర్మీ విమానం 270 మంది భారతీయులతో భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. దీంతో థాయ్లాండ్ కేంద్రంగా సాగిన మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న బందీలందరికీ విముక్తి లభించినట్టయ్యింది.రూ.లక్షల వేతనం పేరిట ఆశచూపి తీరా వెళ్లాక, మన భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తున్న విషయాన్ని ‘సాక్షి’దినపత్రిక వెలుగులోకి తీసుకురావడం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో కేంద్రం వీరిని అక్కడి ఆర్మీ సాయంతో వారిని కాపాడింది. ఏకంగా రెండు విమానాలు పంపి సొంత ఖర్చులతో ఇండియాకు తీసుకొచ్చింది. అసలేం జరిగింది? కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన మధుకర్రెడ్డి ఉద్యోగం వచ్చిందంటూ థాయ్లాండ్ వెళ్లాడు. అక్కడ మానవ అక్రమ రవాణా చేసే ముఠా అతన్ని మయన్మార్లోని మైవాడీ జిల్లాలోని చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీకి 3,000 డాలర్లకు విక్రయించింది. అతను, తనతోపాటు బందీలుగా ఉన్న పలువురు భారతీయుల దయనీయ పరిస్థితిని సాక్షికి ఫిబ్రవరి 16న వివరించాడు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకున్నాడు.‘సాక్షి’దినపత్రిక కూడా పలుమార్లు మయన్మార్లోని భారత దౌత్యకార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. భారత్ సహా అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో మయన్మార్ తన ఆర్మీతో ఫిబ్రవరి 22న భారతీయులను రక్షించి ఆశ్రయం కల్పించింది. కేంద్ర దౌత్యం ఫలించడంతో సోమవారం ఉదయం తొలివిమానం భారతీయులను ఇండియాకు తీసుకొచ్చింది. రెండో విమానంలో మంగళవారం మిగిలిన వారిని థాయ్లాండ్లోని మై సోట్ మీదుగా ఇండియాకు తరలించింది. దీంతో రిపాట్రియేషన్ ప్రక్రియ ముగిసింది. నేడు హైదరాబాద్కు తెలుగువారు బాధితుల్లో తెలంగాణకు చెందిన 23 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 19 మంది మొత్తం 42 మంది తెలుగువారు ఉన్నారు. 270 మందితో కూడిన విమానం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. విమానం దిగిన వెంటనే బాధితులను అందరినీ.. సీబీఐ అదుపులోకి తీసుకుంది. మీరు ఫారిన్ ఎలా వెళ్లారు? ఎవరి సాయంతో వెళ్లారు? అర్ధరాత్రి దాటినా బాధితుల నుంచి సీబీఐ స్టేట్మెంట్ తీసుకుంటూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.సాక్షి చొరవ భేష్ 578 మందిని మా ప్రభుత్వం సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నారు. థాయ్లాండ్ కేంద్రంగా జరిగిన ఈ ఉదంతాన్ని సాక్షి దినపత్రిక మా దృష్టికి తీసుకురావడం, బాధితుల కోసం పోరాడిన తీరు, ఆ చొరవ అభినందనీయం. మనవారిని ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చాం. – కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ఇది మాకు పునర్జన్మ వాస్తవానికి మేం థాయ్లాండ్కు ఉద్యోగానికని వెళ్లాం. మాకు తెలియకుండా మాలో కొందరిని మయన్మార్కు అక్రమంగా పంపారు. అక్కడ పాస్పోర్టు లాక్కొని, మాతో నేరాలు చేయించడానికి ప్రయతి్నంచారు. కానీ, నేను మా బావ సాయంతో సాక్షిని ఆశ్రయించాను. మమ్మల్ని వెనక్కి రప్పించడంలో బండి సంజయ్, సాక్షి దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మాకు పునర్జన్మ. – మధుకర్రెడ్డి -
ఐస్క్రీమ్లో పాము పిల్ల!
ఐస్క్రీమ్ అంటే కొందరికి చాలా ఇష్టం. బడలిక తర్వాత నచి్చన ఐస్క్రీమ్ తింటే ప్రాణం లేచొచినట్లు అనిపిస్తుంది. కానీ పొరపాటున ఈ ఐస్క్రీమ్ గనుక తింటే ప్రాణాలు పోవడం ఖాయం. ఇది స్నేక్ ఐస్క్రీం మరి! థాయిలాండ్లో మియాంగ్ రాచ్బురీ రాష్ట్రంలోని పార్క్ థో జిల్లాలో రేబాన్ నక్లెంగ్బూన్ అనే వ్యక్తి స్థానికంగా తన ఫేవరెట్ ‘బ్లాక్బీన్’ పాప్సికిల్ ఐస్క్రీం కొన్నాడు. ఆత్రంగా రేపర్ తీయగానే చచ్చిన పాము పిల్ల కనిపించడంతో ఠారెత్తిపోయాడు. దాన్ని ఫొటో తీసి ‘ఫేస్బుక్’లో పెట్టాడు. నలుపు, పలుసు రంగుల్లో ఉన్న పాము పిల్ల ఐస్క్రీమ్లో గడ్డకట్టుకుపోని కనిపిస్తోంది. ‘‘దాని కళ్లు తెరిచే ఉన్నాయి! ఇంకా బతికే ఉందా?’’ అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది ఓ మాదిరి విషముండే గోల్డెన్ ట్రీ రకం పాము పిల్ల అని కొందరు నిర్ధారించారు. ఆ ఐస్క్రీంను ఏ అర్ధరాత్రో చిమ్మచీకట్లో రోడ్సైడ్ బండిపై కొని చప్పరిస్తే ఈపాటికి టపా కట్టేవాడంటూ కొందరు జోకులు పేల్చారు. ‘‘ఏ కోటిలో ఏ ఒక్కరినో ఇలాంటి అదృష్టం వరిస్తుంది. ఓసారి టేస్ట్ చేసి చూడు’’ అని ఇంకొదరు పోస్టులు పెట్టారు. – బ్యాంకాక్ -
ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!
చిన్న చిన్న కష్టాలకే చాలామంది దిగాలుగా జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారందరూ ఒక్కసారి ఫొటోలో కనిపిస్తున్న ఈ చేపను చూస్తే, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి అని ఈ చేప బాగా నమ్మినట్లు ఉంది. అందుకే, సముద్రం నుంచి చేపల వలలో చిక్కినా; ఫిషింగ్ మార్కెట్కు తరలించినా; ఆఖరుకు తన శరీరంలోని సగభాగాన్ని కత్తిరించినా ఈ చేప తన జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. తోకతో పాటు తన శరీరంలో సగభాగం కోల్పోయినా, అది కుళ్లిపోయినా ఈ చేప సుమారు ఆరు నెలల పాటు సజీవంగానే ఉంది. ఇటీవలే థాయ్లాండ్ చేపల బజారులో కనిపించిన ఈ చేపను వాచారా చోటె అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. చేప ఆత్మవిశ్వాసాన్ని మెచ్చి, దానికి ‘ఐ హాఫ్’ అని పేరు పెట్టి, జాగ్రత్తగా ఈ చేపను పెంచుకుంటున్నాడు. ‘ప్రస్తుతం దానికి తగిన చికిత్స అందిస్తున్నాను. ఒకవేళ చేప మరణిస్తే, దానికి పూర్తి గౌరవ మర్యాదలతోనే అంత్యక్రియలు నిర్వర్తిస్తాను’ అని చోటె చెప్పాడు.(చదవండి: శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..) -
ఆసియాపసిఫిక్ దేశాలకు టారిఫ్ ముప్పు
న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో పలు ఆసియా పసిఫిక్ దేశాలకు అధిక టారిఫ్ల రిస్క్ లు నెలకొన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. భారత్, దక్షిణ కొరియా, థాయ్ల్యాండ్ తదితర దేశాలకు ముప్పు ఉందని ఒక నివేదికలో పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే తైవాన్, వియత్నాం, థాయ్ల్యాండ్, దక్షిణ కొరియాలాంటివి అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందువల్ల టారిఫ్లు విధిస్తే ఆర్థికంగా వాటిపై ప్రభావం పడుతుందని వివరించింది. భారత్, జపాన్లో దేశీ మార్కెట్ కాస్త భారీగా ఉండటం వల్ల టారిఫ్ల ప్రభావం నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చని వివరించింది. భారత్ సహా వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార టారిఫ్లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా పసిఫిక్లోని కొన్ని దేశాలు తమ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలకన్నా అత్యధికంగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్నాయని నివేదిక వివరించింది. ప్రతీకార టారిఫ్ చర్యల కోసం సదరు దేశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది. -
స్వదేశానికి చేరుకున్న థాయ్ బందీలు
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది. కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
థాయ్లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
థాయ్ వెర్షన్ రామాయణం
ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య. దీనిని థాయ్లాండ్ కళాకారులు మన ఇతిహాసాన్ని తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్ థాయ్ ఎంబసీ ఖోన్ థాయ్ మాస్క్డ్ డ్యాన్స్ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లోని భీమ్ హాల్లో జరుగుతుంది.థాయిలాండ్ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. వారియర్ హనుమాన్ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్ ది మైటీ వారియర్ అనే ఎపిసోడ్ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది. చారిత్రక సంబంధాలుఖోన్ థాయిలాండ్ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్ థాయ్ ఎంబసీ, ఐసీసీఆర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. -
స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్లో గురువారం అమల్లోకి వచ్చింది. దీంతో, మొదటిరోజే వందలాదిగా జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్లోని ఓ షాపింగ్ మాల్లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్ ప్రభుత్వం పౌర స్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించగా, దేశవ్యాప్తంగా ఒక్క రోజే నమోదైన వివాహాలు 1,448 మార్కును దాటే అవకాశముందని అధికా రులు తెలిపారు. దావోస్లో ఉన్న ప్రధానమంత్రి షినవత్రా ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్జీబీటీక్యూ వర్గం ఇంద్ర ధనస్సు జెండా థాయ్లాండ్పై రెపరెపలాడుతోంది’అంటూ ఫేస్బుక్ పేజీలో కామెంట్ పెట్టారు. జిల్లా మ్యారేజీ కార్యాలయాల్లో అధికారులు కొత్త జంటల కోసం పార్టీలు, ఫొటో బూత్లను ఏర్పాటు చేశారు. కప్ కేక్లను పంచిపెట్టారు. మొదటిగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న వారికి విమాన ప్రయాణ టిక్కెట్లను సైతం ఆఫర్ చేశాయి కొన్ని కంపెనీలు. ఇలాంటి మధుర క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు కొన్ని జంటలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వలింగ వివాహం చట్టం ద్వారా ఏకమయ్యే వారు ఇకపై ఆస్తులను నిర్వహించుకోవచ్చు, వారసత్వంగా పొందొచ్చు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి అనారోగ్య పాలైతే వైద్య సదుపాయాలను వర్తింప జేసుకోవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. గతేడాది జూన్లో ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సెప్టెంబర్లో థాయ్ రాజు దీనిపై సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశం థాయ్ల్యాండ్. ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్, తైవాన్ చట్టాలు మాత్రమే గుర్తించాయి. థాయ్ పౌరస్మృతిలోని 70 సెక్షన్లు మార్చారు. మగ, ఆడ, భర్త, భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి, భాగస్వామి అనే వాటిని చేర్చారు. అయితే, స్వలింగ జంటలు సరోగసీ ద్వారా కుటుంబాలను కలిగి ఉండాలంటే చట్టాల్లో మరో డజను వరకు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
ఫ్రెండ్స్తో థాయ్లాండ్ బీచ్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
‘‘వావ్.. బ్యూటీఫుల్!’’.. థాయ్లాండ్లో అత్యంత అందమైన ప్రాంతాలివిగో (చిత్రాలు)
-
థాయ్లాండ్ ప్రధాని షినవత్రకు రూ.3,431 కోట్ల ఆస్తులు
బ్యాంకాక్: థాయ్లాండ్ ప్రధానమంత్రి పెటాంగ్తర్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకు 400 మిలియన్ డాలర్ల (రూ.3,431 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు థాయ్లాండ్ జాతీయ అవినీతి నిరోధక కమిషన్(ఎన్ఏసీసీ)కు శుక్రవారం డిక్లరేషన్ సమర్పించారు. షినవత్రకు దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్థిరచరాస్తులతోపాటు అత్యంత ఖరీదైన హ్యాండ్బ్యాగ్లు, చేతి గడియారాలు, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద 200కుపైగా డిజైనర్ హ్యాంగ్బ్యాగ్లు ఉన్నాయి. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు(రూ.17.15 కోట్లు). అలాగే 75 లగ్జరీ చేతి గడియారాల విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.42.88 కోట్లు). షినవత్ర 2023 సెప్టెంబర్లో 37 ఏళ్ల వయసులో థాయ్లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత పిన్నవయసు్కరాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి థక్సిన్ షినవత్ర సహా కుటుంబంలో నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. థక్సిన్ థాయ్లాండ్లో అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు. -
వీసా లేకున్నా 60 రోజుల అనుమతి
న్యూఢిల్లీ: భారతీయ పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసాలేకున్నా థాయిలాండ్లో గరిష్టంగా 60 రోజులపాటు ఉండేందుకు అనుమతి మంజూరుచేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది. ఇందుకోసం 2025 జనవరి ఒకటో తేదీ నుంచి భారత్లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)(ఈ–వీసా) విధానం అమల్లోకి తెస్తామని పేర్కొంది. థాయిలాండ్యేతర జాతీయులు https:// www. thaievisa. go. th వెబ్సైట్లో సంబంధిత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని థాయిలాండ్ ఎంబసీ బుధవారం ప్రకటించింది. ఆఫ్లైన్ మోడ్లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహయసహకారాలు అందుతాయని వెల్లడించింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైనా వీసా దరఖాస్తు ఫీజు అనేది తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ–వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలి. దౌత్య, అధికారిక వీసా కోసం డిసెంబర్ 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈటీఏలో పలు ప్రయోజనాలున్నాయి. ఒకసారి ఈ–వీసా తీసుకుంటే గరిష్టంగా 60 రోజులపాటు అక్కడే ఉండొచ్చు. అత్యయిక, అవసరమైన సందర్భాల్లో సందర్శకులు మరో 30 రోజులు అక్కడే ఉండొచ్చు. ఈటీఏ అనుమతులు సాధించిన ప్రయాణికులు చెక్పాయిట్ల వద్ద ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీ తదితర సోదా తంతు అత్యంత వేగంగా పూర్తవుతుంది. ఈటీఏపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు పూర్తి వివరాలు అక్కడే అధికారులకు త్వరగా అందుబాటులోకి వచ్చి ప్రయాణికుడికీ సమయం చాలా కలసి వస్తుంది. వీసా మినహాయింపు పొందిన విదేశీయులు తమ దేశంలో ఎన్నాళ్ల నుంచి సక్రమంగా, అక్రమంగా ఉంటున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు థాయ్ ప్రభుత్వానికి అందుతాయి. గడువు దాటి అక్కడే ఉంటే రోజుల లెక్కన జరిమానా విధిస్తారు. -
థాయ్ యువతుల స్పెషల్! మసాజ్ ముసుగులో..
లక్ష్మీపురం: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ సుప్రజ, అరండల్ పేట సీఐ వీరాస్వామి ప్రత్యేక బృందాలుగా శుక్రవారం దాడులు నిర్వహించారు. నలుగురు థాయిలాండ్కు చెందిన వారితోపాటు ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేపీహెచ్బీ మెట్రో: పది మంది మహిళల అరెస్ట్ -
థాయ్లాండ్లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా థాయ్లాండ్లో అసెంబ్లీ ప్లాంటును ప్రారంభించినట్లు ఐషర్ మోటార్స్ బుధవారం తెలిపింది. విడిభాగాలను దిగుమతి చేసుకుని ఈ కేంద్రంలో వాహనాల అసెంబుల్ చేస్తారు.‘అపారమైన వృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ విస్తరణ వ్యూహాన్ని కలిగి ఉండటమే మా వ్యూహాత్మక ఉద్దేశం. థాయ్లాండ్ అసెంబ్లీ ప్లాంట్ ఈ విజన్ను అందిస్తుంది’ అని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి.గోవిందరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జెంటీనా, కొలంబియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, నేపాల్లో ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్కు ఇటువంటి అసెంబ్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. నూతన ఫెసిలిటీ థాయ్లాండ్లో మిడ్–సెగ్మెంట్ మార్కెట్ను వృద్ధి చేయడంలో సహాయపడుతుందని విశ్వసిస్తున్నామని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.అలాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్ను సమర్ధవంతంగా తీర్చడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్లాంట్ సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను అసెంబుల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. థాయ్లాండ్ మార్కెట్తో ప్రారంభించి దశలవారీగా ఈ ప్రాంతంలో విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
ఎంజాయ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న నటి
చావు అనేది ఎప్పుడు ఎలా ఎందుకు వస్తుందో చెప్పడం కష్టం, ఊహించడం అంతకంటే అసాధ్యం. ఓ నటి కూడా సరదాగా ఎంజాయ్ చేద్దామని తనకు బాగా అచొచ్చిన ఓ టూరిస్ట్ ప్లేసుకి వెళ్లింది. కానీ విధిని మార్చలేక ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ విషయం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)రష్యన్ నటి కమిల్లా బెల్యట్సకయా.. రీసెంట్గా థాయ్లాండ్లోని కోహ్ సముయి అనే టూరిస్ట్ ప్రాంతానికి ప్రియుడితో కలిసి వెళ్లింది. ఎప్పటికప్పుడు ఇక్కడికి వెళ్లడం ఈమెకు అలవాటు. కాకపోతే ఈసారి అలా యోగా చేస్తుండగా.. భారీ రాకాసి అలలు వచ్చాయి. అవి ఈమెని సముద్రంలోకి లాక్కుపోయాయి. 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్ వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితుల వల్ల ఫలితం లేకుండా పోయింది. చాలా కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం లభ్యమైంది.గతంలో ఇదే ప్రాంతాన్ని తన ఇల్లు, భూమ్మీదే బెస్ట్ ప్లేస్ అని సదరు నటి కమిల్లా చెప్పుకొచ్చింది. ఇప్పుడే అదే చోటులో ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?) View this post on Instagram A post shared by Daily Mail (@dailymail) -
థాయ్లాండ్లో కోతులకు ఒక రోజు
-
భారీ విజయంతో భారత్ బోణీ
మస్కట్ (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్ సింగ్ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.దిల్రాజ్ సింగ్ (21వ నిమిషంలో), ముకేశ్ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్ తివారీ (10వ నిమిషంలో), రోహిత్ (29వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (8వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడుతుంది. -
ఆ స్కూల్లో ఫీజు తీసుకోరు
మామూలుగా అయితే స్కూల్లో టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్తారు. హోంవర్క్ రాసుకురమ్మని చెప్తారు. పరీక్షలు పెట్టి మార్కులు వేస్తారు. పైగా ఇవన్నీ చేసినందుకు ప్రైవేటు స్కూళ్లలో ఫీజు తీసుకుంటారు. అయితే థాయ్లాండ్లో ఉన్న ‘మెషై పట్టానా స్కూల్’(mechai pattana school) లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ బడినే ప్రపంచవ్యాప్తంగా "Bamboo Sc-hool' అని కూడా అంటారు. ఇక్కడ పిల్లలకు పాఠాలతోపాటు సేవ చేయడం నేర్పిస్తాను. సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తారు. తోటివారిని ఎలా గౌరవించాలో, వృద్ధులతో ఎలా నడుచుకోవాలో, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఇవన్నీ నేర్పిస్తారు. ఇవన్నీ నేర్పినందుకు వారు ఫీజేమీ తీసుకోరు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి 400 చెట్లు నాటితే చాలు. థాయ్లాండ్కు చెందిన మెషై విరవైద్య అనే ప్రముఖ సామాజిక కార్యకర్త, న్యాయవాది 2008లో ఈ పాఠశాలను ్రపారంభించారు. స్కూళ్లలో పెరుగుతున్న పేద, ధనిక తారతమ్యం, పాఠశాలలు కేవలం పుస్తకాలు బట్టీ వేసే ప్రదేశాలుగా మారిపోవడం వంటివి గమనించి తాను ఈ స్కూల్ని స్థాపించినట్లు ఆయన వివరిస్తారు. బడిలో అందరూ ఒకచోట చేరి సంస్కారాన్ని, సామాజిక సేవనీ, పౌరబాధ్యతలనూ నేర్చుకోవాలని అంటారు. దానికి తగ్గట్టే ఈ పాఠశాల విధివిధానాలను ఆయన రూపొందించారు. ఇక్కడ మామూలు తరగతులతోపాటు కూరగాయలు పండించడం, పశువుల్ని పెంచడం, కళాకృతులు తయారు చేయడం, వంటలు చేయడం వంటివి నేర్పిస్తారు. దీంతోపాటు విద్యార్థులను బృందాలుగా ఏర్పరిచి, వారికొక నాయకుణ్ని నియమిస్తారు. వారిని సమన్వయం చేసుకుంటూ, వారిలో స్ఫూర్తి నింపుతూ సాగేలా అతనికి తర్ఫీదు ఇస్తారు. ఇక్కడ బాధ్యతలన్నీ విద్యార్థులే తీసుకుంటారు. కొత్తవారిని స్కూల్లో చేర్చుకోవడం, కొత్త టీచర్లను విధుల్లోకి తీసుకోవడం వంటి పనుల కోసం ‘స్టూడెంట్ బోర్డ్’ పని చేస్తుంది. స్కూల్కి కావాల్సిన వస్తువులు కొనడం, ఇచ్చిన నిధుల్ని సక్రమంగా ఖర్చుచేయడం కూడా వారి బాధ్యతే. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారు ఫీజు చెల్లించనవసరం లేదు. అయితే పాఠశాలల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి విద్యార్థి ఏడాదిలో 400 గంటలు సమాజ సేవ చేయాలి. అది ఇక్కడ కచ్చితమైన నిబంధన. స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలి, వారి మానసిక పరిస్థితి, శారీరక ఇబ్బందులేమిటనే అంశాలపై ఇక్కడి విద్యార్థులకు ప్రత్యేక తరగతులుంటాయి. దీనివల్ల వారిలో తోటివారి పట్ల అవగాహన, ఆత్మీయత పెరుగుతాయని మెషై విరవైద్య వివరిస్తున్నారు. -
నవజంట కలల పంట..థాయ్లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్లాండ్కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్లాండ్కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్లో నీలి రంగు సముద్రంతో బీచ్లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్స్టార్ హోటల్స్లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
ఎలి.. ఎంత తెలివైన స్టూడెంటో కదా!
థాయ్తో పాటు అమెరికాకు చెందిన కుస్తీ వీరులు.. పదునైన పళ్ళతో ఉన్న మొసళ్ళ దవడ మధ్య వాళ్ల తలను దూరుస్తూ కనిపించారు. “ఖచ్చితంగా ఆ జంతువులు శిక్షణ పొందినవి కదూ?” అని నేను రోమిని అడిగా నమ్మలేకపోతూ. అయితే ఆ విన్యాసంలో వారిని అవి నమిలేయకుండా ఉండేంతగా కుస్తీ వస్తాదులు మొసళ్ళని భయపెడతారని రోమ్ అనుకున్నారు. మనం అంగీకరించాల్సింది ఏమిటంటే?.. మొసళ్లకి శిక్షణ ఇవ్వలేము కానీ మచ్చిక చేసుకోవచ్చు. ఇండోనేషియా పడమర పపువాలో రోమ్ ఒక న్యూ గిని మంచినీటీ మొసలి ఒక చెక్క ఇంట్లో ఉండటం చూసాడు. ఆ మొసలి పొదిగిన పిల్లగా ఉన్నప్పటి నుంచి పిల్లల, మనుషులతో ఓ పెంపుడుకుక్కలా పెరిగి ఇప్పుడు ఐదడుగుల పొడుగయ్యింది. చల్లటి వర్షాకాలం రాత్రులలో అక్కడి సభ్యులతో కలిసి అది చలికాచుకుంటూ ఉంటుంది కూడా.మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ డైరెక్టర్గా 2008వ సంవత్సరం మధ్యలో కొద్దికాలం పాటు పనిచేసిన రాల్ఫ్ సామెర్లడ్.. జర్మనీలో ఓ తోటమాలి దక్షిణ అమెరికా రకమైన కెమన్ అనే మొసలిని పెంచుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తోటమాలి మోకాళ్లపై కూర్చున్నప్పుడు, కుక్క పిల్లలా ఆ మొసలి అతని తలకూ, భుజాలకూ రాసుకునేదట. రాల్ఫ్ మద్రాస్ మొసళ్లకి శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమానికి నాంది పలికాడు. అప్పట్లో అసిస్టెంట్ క్యూరేటర్ అయిన సోహం ముఖర్జీ.. మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా, ఆ ఆలోచనను రాను రాను ఎంతో సరదాగా, ఆకర్షణీయమైన కార్యక్రమంగా అభివృద్ధి చేశారు.ఎలి చిన్నపిల్లగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది, కానీ, అది పెద్దయినప్పటి నుంచి ఆ అభ్యాసం ఇవ్వడం తగ్గించేశారు. ఎలికి తన పేరు ఇంకా గుర్తుంది. శిక్షణ పునః ప్రారంభించాడానికి ఇది ఒక మంచి విషయం. తను ఒక ఆదేశం పాటించిన ప్రతీసారి ఒక మాంసం ముక్క బహుకరించేవారు. అచ్చం ఒక కుక్కకి శిక్షణ ఇచ్చినట్లుగా. ఏటొచ్చి ఇది ఒక పెద్ద పోలుసులు కలది. అంతే. ఒక వారం తరువాత, ఎలికి శిక్షణ ఇస్తున్నప్పుడు, వెనుకన ఉన్న ఒక మగ్గర్ మొసలి ఆదేశాలకి చక్కగా స్పందించడం సోహం గమనించారు. ఆ మొసలి ఏ బహుమతి సహాయం లేకుండా, చూసి నేర్చుకుంటోంది. సోహం దానికి పింటూ అని పేరు పెట్టాడు. ఆ మొసలి వెంటనే ఆ కార్యక్రమంలో భాగమైంది. కాలక్రమేణా మరి నాలుగు మొసళ్లు చేరాయి. ప్రతీ మధ్యాహ్నం మూడింటికి శిక్షణ మొదలయ్యేది. దానికి పది నిముషాల ముందే ఆ ఆరుగురు శిష్యులు కొలను అంచున, సోహం గొంతు నుంచి విలువడే అతి చిన్న శబ్దం కోసం ఆత్రంగా ఎంతో అప్రమత్తతతో వేచి చూసేవి. అతను వచ్చాక వాటి ఆనందం మాములుగా లేదు. ఆ మొసలి శిష్యులకి వాటిని ఏ వరుసలో పిలుస్తారో తెలుసు. ఇక వారి వంతు కోసం ఎంతో సహనంతో వేచి ఉండేవి. ఆచ్చం నా కుక్కలలాగే వాటికి ఆదేశల వరుస ఎంత బాగా తెలుసంటే, అవి ముందస్తుగానే ఆ విన్యాసాలు చేసేసేవి. కనుక సోహం ఆదేశాలను తారుమారు చేయాల్సొచ్చేది. ఆ మొసలి శిష్యులు వారంలో ఏ రోజు శిక్షణ నుంచి సెలవు వస్తుందో కూడా తెలుసుకున్నాయి. పింటూ లాగే, వేరే మోసళ్లు కూడా శిక్షకుడి ఆదేశాల పట్ల ఎంతో శ్రద్ధ వహించి, చూసి నేర్చుకున్నాయి. త్వరలోనే కొమోడో, థాయ్ సాయమీస్, ఉప్పు నీటి మొసలి మిక్, మారియు నైల్ మొసలి అబూ, అన్ని జాతుల రంగురంగుల మొసళ్ళ కలగంపగా ఆ శిక్షణ పాఠశాలకు హాజరు అయ్యాయి. ఆఖరికి వయసులో పెద్దదైన మగ్గర్ రాంబో కూడా ఆ కార్యక్రమంలో చేరి, కొత్త విన్యాసాలు నేర్చుకోవడానికి వయసు అవరోధం కాదని నిరూపించింది. కానీ గారాల కూచి ఎలి మాత్రం రా, ఉండు, పైకి, కూర్చో, తిరుగు, నోరు తెరు వంటి పన్నెండు ఆదేశాలు తెలిసిన అత్యుత్తమ విద్యార్థి. ఒకసారి ఎలి శిక్షణ రాంప్ పై సగం దూరం వెళ్ళాక, సోహం తనని ‘గెంతు’ అని ఆదేశించారు. ఒక జారెడు బల్ల వంటి రాంప్ పైనుంచి గెంతటం ఎంత కష్టమో మీరు ఊహించగలరు, కానీ ఎలి బహుమతి పొందే అవకాశం వదులదలచలేదు. రాంప్ వదలకుండా ఎలి తన కాలివేళ్లపై నుంచుని పొట్ట కిందకి ఆంచి, మెల్లగా గెంతడానికి సిద్ధమవుతున్నట్టు అనుకరించింది. ఎంతో ఆశ్చర్యకరం. ఆ పాఠశాల, ఎనిమిది నెలల నుంచి నలభై ఏళ్లు ఉన్న వేర్వేరు జాతులకు చెందిన ముప్పై మొసళ్ళ ఉండేంతగా పెరిగి పెద్దదయ్యింది.కెమన్ బల్లులు, అల్డబ్రా తాబేళ్లను కూడా శిష్యులుగా చేర్చుకోవడానికి వీలుగా ఉండేలా ఆ పాఠశాల పేరును రెప్టైల్ పాఠశాలగా మార్చారు. పాములు, మానిటర్ బల్లులు, తాబేళ్ళు పాఠశాలలో చేరడానికి వేచి ఉన్న జాబితాలో ఉన్నాయి. మరి స్పష్టంగా, గవర్నమెంట్ నిబంధనలకు కట్టుబడి, విద్యార్థులు చేరడానికి నిర్ణీత రుసుము కూడా లేదు! ::జానకి లెనిన్ రాసిన దానికి రోహిణి చింత అనువాదం(చదవండి: యంగ్ టాలెంట్: బహుముఖ ప్రజ్ఞతో సత్తా చాటుతున్న చిచ్చర పిడుగులు) -
దీపిక ఐదు గోల్స్... సెమీస్లో భారత్
రాజ్గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్డుంగ్ (30వ నిమిషంలో), నవ్నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్తో థాయ్లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్లాండ్తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో థాయ్లాండ్కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో చైనా 2–1 గోల్స్తో జపాన్పై, మలేసియా 2–1 గోల్స్తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
బెస్ట్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఓరీ.. థాయ్లాండ్లో రచ్చ (ఫొటోలు)
-
సోనూసూద్కు అరుదైన గౌరవాన్ని కల్పించిన 'థాయిలాండ్' ప్రభుత్వం
బాలీవుడ్ నుంచి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడు సోనూసూద్.. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసినప్పటికీ రియల్ లైఫ్లో హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే నెటజన్ల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఆయనకు తాజాగా థాయిలాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. దీంతో సోనూసూద్ అభిమానులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.థాయ్ల్యాండ్ పేరు వింటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి గుర్తుకొచ్చేది టూరిజం. సీజన్ ఏదైనా కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రేదేశాల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో భారత్ నుంచి కూడా చాలామంది థాయిలాండ్కు వెల్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం సోనూసూద్కు అరుదైన గౌరవాన్ని కల్పించింది. తమ దేశ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఆయన్ను నియమించింది. ఇదే సమయంలో ఆయనను టూరిజం అడ్వైజర్గాను ఆ దేశం ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని సోషల్మీడియా ద్వారా సోనూసూద్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.2000 సంవత్సరంలో హ్యాండ్సప్ అనే చిన్న సినిమా ద్వారా సోనూసూద్ తెలుగువారికి పరిచయం అయ్యారు. అయితే, సూపర్,అతడు,అరుంధతి చిత్రాలతో భారీగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ సమయంలో వేలాది మందికి తన వంతుగా సాయం చేసి అండగా నిలిచారు. తన అమ్మగారి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి చదువుకోవాలని తపించే పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు.Honoured and humbled at being appointed as the Brand Ambassador and Advisor for Tourism , Thailand 🇹🇭. My first international trip was to this beautiful country with my family and in my new role I am excited to advise and promote the country’s stunning landscapes & rich cultural… pic.twitter.com/0slsWp9efd— sonu sood (@SonuSood) November 10, 2024 -
థాయ్లాండ్ ట్రిప్లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
థాయ్లాండ్లో దీపావళి వేడుక వేరే లెవల్! చూసి తరించాల్సిందే!
వెలుగుల పండుగ దివాలీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. భారతదేశంలో పాటు ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో దీపావళిని వేడుకగా నిర్వహించు కుంటారు. ముఖ్యంగా మిరుమిట్లు కొలిపే దీపకాంతులతో థాయ్లాండ్ మెరిసి పోతుంది. నింగిలోనూ, నీటిలోనూ లాంతర్ల వెలుగు, దీపాలతో థాయలాండ్లో దీపావళి వేడుక ఒక రేంజ్లో జరుగుతుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!థాయ్లాండ్లో నవంబర్ నెలలో లాయ్ క్రాథోంగ్, యి పెంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు . అరటి ఆకులతో చేసిన దియాలు (దీపాలు) ప్రత్యేక ఆకర్షణ. ఈ దీపాలు తామరపువ్వు ఆకారాల్లొ నదిపై తేలియాడుతూ అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దీపాలపై ఒక నాణెం, ధూపంతో పాటు కొవ్వొత్తులనూ ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు .లాయ్ క్రాథోంగ్ (లాంతర్ల పండుగ)దీన్నే "ఫ్లోటింగ్ బాస్కెట్ ఫెస్టివల్" అని పిలుస్తారు. loi అంటే 'ఫ్లోట్' అని, క్రాథాంగ్ అనేది పూలతో అలంకరించబడిన బుట్ట అని అర్థం. థాయ్లాండ్ లైట్స్ ఫెస్టివల్ అని పిలువబడే లాయ్ క్రాథాంగ్ ఫెస్టివల్, థాయ్ చంద్ర క్యాలెండర్లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు , పువ్వులతో అలంకరించిన తామరపువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదులు మరియు జలమార్గాలపై విడుదల చేయడం ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపుకు గుర్తుగా , శీతాకాలాన్ని స్వాగతించే వార్షిక వేడుకగా కూడా భావిస్తారు. మంత్రముగ్ధం చేసే ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనలు , నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు నిజంగా అద్భుతంగా ఉంటుంది. లాయ్ క్రాథాంగ్ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటే, ఉత్తర థాయిలాండ్లో, యి పెంగ్ అని చియాంగ్ మాయిలో ఈ లాంతరు పండుగ నిర్వహస్తారు. యి పెంగ్స్కై లాంతర్ ఫెస్టివల్ యి పెంగ్: రాత్రివేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లను ఎగువేవేస్తారు. చియాంగ్ మాయిలో మాత్రమే ఈ రెండు పండుగలను ఒకే రోజు జరుపు కుంటారు.దురదృష్టాన్ని గాల్లోకి వదిలి, అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా ఈ వేడుక ఉంటుంది. ఈ కార్యక్రమంలో బౌద్ధసన్యాసులు, స్థానికులు, పర్యాటకులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాములతో సందడిగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్లోని జలంధర్లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్స్టాగ్రామ్లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్లాండ్లో జరిగింది. 12మంది ఫుట్బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్డ్రాప్లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
బీచ్ వెడ్డింగ్, అందమైన లవ్స్టోరీ లెహంగా : వధువు ఫోటోలు వైరల్
భారతదేశంలో పెళ్లిళ్లు అంటే వేదమంత్రాలు, బాజా భజంత్రీలు, మూడు ముళ్లు,ఏడడగులు మాత్రమే కాదు. అంతకుమించి పెద్ద సందడే ఉండాలి. విశాలమైన వెడ్డింగ్ హాల్స్, జిగేల్ మనిపించే డెకరేషన్, నోరూరించే వంటకాలు, మెహిందీ, సంగీత్, బారాత్..నాచ్గానా మినిమం ఉండలి. ఇక వీటన్నింటికి మంచి వధువు డిజైనర్ దుస్తులు, ధగధగలాడే ఆభరణాలతో అదిరిపోవాలి. ఇదీ లేటెస్ట్ ట్రెండ్. తాజాగా బీచ్ వెడ్డింగ్ ఇంటర్నెట్లో వైరల్గా మారింది.విశేషం ఏమిటంటే.. ఈ పెళ్లిలో వధువు తన లహంగాను స్వయంగా తానే డిజైన్ చేసింది. ఆమె పేరే కాశీష్ అగర్వాల్. పారిశ్రామికవేత్త అసీమ్ ఛబ్రాతో థాయ్లాండ్లోని ఒక బీచ్లో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్ బాగా వైరల్అవుతున్నాయి. ముఖ్యంగా వైట్ లెహంగా స్కర్ట్లో రాధా-కృష్ణల ప్రేమకథను పిచ్వాయ్ పెయింటింగ్స్తో తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. తన పిన్ని, వృత్తిరీత్యా డిజైనర్ షాగున్ పాఠక్ సహాయంతో దీన్ని అద్భుతంగా అపురూపంగా తయారు చేసిందట కాశీష్. ఇక భారీ చోకర్ నెక్పీస్, మ్యాచింగ్ చెవిపోగులు, చూడామణి, చేతి నిండా గాజులు, అంగుళీయంతో మెరిసిపోతున్న పెళ్లికూతురు వైపునుంచి చూపు తిప్పుకోలేకపోయారట అతిథులు వీరి లవ్స్టోరీకరోనా సమయంలో పెద్దల ద్వారా వీరి పరిచయం సాగింది. కరోనాతో తమ్ముడిని కోల్పోయిన బాధలో కాశీష్, వ్యాపార నష్టాలతో ఉన్న అసీమ్ మానసికంగా బాగా దగ్గరయ్యారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలైనప్పటికీ ఒకర్ని ఒకరు గౌరవించుకుంటూ వీర ప్రేమికులుగా మారి పోయారు. ఎట్టకేలకు పెళ్లికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. మెహందీ, సంగీత్, ఇలా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్కు గ్రాండ్గా నిర్వహించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కాబోయే వధూవరులను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. -
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
125 మొసళ్లను షాకిచ్చి చంపేశాడు..!
బ్యాంకాక్: థాయ్ల్యాండ్కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని ఆయన ఊహించారు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చారు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను కరెంటుషాకిచ్చి చంపేశారు. జనం కోసం తన సొంతలాభాన్ని త్యాగం చేసిన నత్థపక్ ఖుంకడ్(37)ను అందరూ ‘కోకడైల్ ఎక్స్’గా పిలుచుకుంటారు. లుంఫున్ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్ అనే అరుదైన రకం మొసళ్లను ఈయన పెంచుతున్నారు. వీటిని చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్ల్యాండ్తోపాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఏమైందంటే.. సెప్టెంబర్ 21వ తేదీన థాయ్ల్యాండ్ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్క్లోజర్ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లో ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్ ఆందోళన చెందారు. మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు మర్నాడు మొత్తం 125 మొసళ్లను విద్యుత్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతిపెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్ మొసలి ‘అయి హర్న్’కూడా ఉంది. నత్థపక్ నిర్ణయం ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. నత్థపక్ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగుడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్క్లోజర్లో గడపటం వంటి మొసళ్లతో చేసే విన్యాసాలతో ఈయన వీడియోలు ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయ్యాయి కూడా. థాయ్ల్యాండ్లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో 1,100 మొసళ్ల పెంపకందారులున్నారు. -
స్వలింగ వివాహాలకు థాయ్లాండ్ చట్టబద్ధత
బ్యాంకాక్: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్లాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కలి్పంచే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్లాండ్ రాజు మహా వజ్రలాంగ్కర్ణ్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచి్చన తొలి దేశంగా థాయ్లాండ్ నిలిచింది. 2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థాయ్లాండ్లో మొదటినుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత బిల్లు జూన్లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. ‘‘చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది’’అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.ఆసియాలో మూడో దేశం తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కలి్పంచిన మూడో దేశంగా థాయ్లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. -
నెట్టింట్లో తెగ వైరల్.. ఈ బుజ్జి హిప్పోకు ఎందుకందరూ ఫిదా!
మూ డెంగ్.. రెండు నెలల వయసున్న ఆడ పిగ్మీ హిప్పో అదరినీ అలరిస్తోంది. థాయ్లాండ్లో చోన్ బురిలోని జంతుప్రదర్శనశాలలో ఇది నివసిస్తోంది. దీని ఫోటోలు ఇన్స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్లైన్లోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.మూ డెంగ్’ అంటే థాయ్లో ఎగిరిపడే పంది మాంసం అని అర్ధం. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి. ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు. ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. ప్రపంచంలో 2,000 నుంచి 2,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.กินคลีน ☘️#hippo #PygmyHippo #ขาหมูแอนด์เดอะแก๊ง #หมูเด้งจะเด้งกี่โมง pic.twitter.com/gOn2s5Fb57— Khamoo.andthegang (@and_khamoo) September 10, 2024 ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్క్లోజర్ క్యూలో ఉండి దీనిని చూస్తున్నారు. కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణి చేసి మరి దానిని సందర్శించేందుకు వస్తున్నారు. జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.pic.twitter.com/SSUHf775RW— X (@X) September 15, 2024 అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూ డెంగ్ను చూడటానికి వచ్చే వారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు. -
థాయ్ల్యాండ్కు ఎయిర్ ఏషియా మరిన్ని సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: థాయ్ ఎయిర్ ఏషియా తాజాగా భారత్ నుంచి థాయ్ల్యాండ్కు డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులను విస్తరించింది. కొత్త రూట్లలో హైదరాబాద్–బ్యాంకాక్, చెన్నై–ఫుకెట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సరీ్వసులు అక్టోబర్ 27న, చెన్నై నుంచి ఫ్లయిట్స్ అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్ కింద హైదరాబాద్–బ్యాంకాక్ రూట్లో వన్–వే టికెట్ చార్జీ రూ. 7,390గా ఉంటుంది. వచ్చే నెల 27 నుంచి 2025 మార్చి 29 వరకు ప్రయాణాల కోసం సెపె్టంబర్ 22 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద బుక్ చేసుకోవచ్చు. కొత్తగా 2 సర్వీసుల చేరికతో భారతీయ మార్కెట్లో తాము సరీ్వసులు నిర్వహించే రూట్ల సంఖ్య 14కి చేరుతుందని థాయ్ ఎయిర్ఏషియా హెడ్ (కమర్షియల్) తన్సితా అక్రారిత్పిరోమ్ తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
ఏ దేశమేగినా... బొజ్జ గణపయ్యే!
నేడు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాల్లో విజయం సిద్ధించాలని కోరుకుంటూ గణనాథుడికి పూజలు చేస్తాం. ఆసేతుహిమాచలం మాత్రమే కాదు భారతదేశానికి ఆవల సైతం పూజలందుకుంటున్న అతికొద్ది మంది దేవుళ్లలో వినాయకుడు సైతం ఉన్నాడు. థాయిలాండ్ మొదలు కాంబోడియా, జపాన్, చైనా ఇలా ఎన్నో దేశాల్లో బొజ్జ గణపయ్య ఘనంగా పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏటా గణేష్ చతురి్థని జరుపుకుంటూ మహదానందం పొందుతున్నాడు ఆయా దేశాల ప్రజలు. వాణిజ్య, ధారి్మక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతలను పూజించడం పరిపాటి. భారత్లో మాదిరే వరసిద్ధి వినాయకుడు విదేశాల్లోనూ చక్కని పూజలందుకుంటున్నాడు. అయితే గణపతిని ఆయా దేశాలు వివిధ రూపాల్లో కొలుస్తుండటం విశేషం. విఘ్ననాయకుడిని విశేష రూపాల్లో ఏ దేశం? ఎలా ఆరాధిస్తుందో ఓసారి పరికిద్దాం.. థాయిలాండ్లో.. థాయిలాండ్ బౌద్ధులకు వినాయకుడూ ఆరాధ్య దైవమే. క్రీ.శ 550–600 ప్రాంతంలో థాయిలాండ్లో లంబోదరుని విగ్రహాలు వెలిశాయి. థాయిలాండ్లో మన మోదకప్రియుడిని ఫిరా ఫికానెట్గా కొలుస్తారు. విజయానికి చిహ్నంగా, అడ్డంకులను తొలగించే శక్తిగా భావిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, వివాహం సందర్భంగా మహాగణపతిని పూజిస్తారు. గజాననుడి ప్రభావం థాయ్ కళ, వాస్తుశిల్పంలోనూ స్పష్టంగా గోచరిస్తుంది. గణపతి ఆలయాలు దేశవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కాంబోడియాలో ఆగ్నేయాసియా అంతటా మన విఘ్నరాజును పూజిస్తారు. ఈ సంప్రదాయ ఈ ప్రాంతానికి ఎలా వచి్చందనేది మాత్రం తెలియడం లేదు. ఐదు, ఆరో శతాబ్దాలకు చెందిన గణాధ్యక్షుడి శాసనాలు, చిత్రాలు ఆగ్నేయాసియాలో ఉన్నాయి. కంబోడియాలో గణా«దీశుడు ప్రధాన దైవం. ఏడో శతాబ్దం నుంచి ఆయనను దేవాలయాలలో పూజించారు. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ దేవుడికి ఉందని ఇక్కడ నమ్ముతారు. టిబెట్లో టిబెట్లోనూ మన మంగళప్రదాయుడిని బౌద్ధ దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ మహారక్త గణపతిగా, వజ్ర వినాయకుడిగా విభిన్న రూపాల్లో ఆరాధిస్తారు. భారతీయ బౌద్ధ మత నాయకులు అతిసా దీపంకర శ్రీజ్ఞ, గాయధర వంటివారు క్రీస్తుశకం 11వ శతాబ్దంలో టిబెట్ బౌద్ధమతానికి వినాయకుడిని పరిచయం చేసినట్లు చరిత్ర చెబుతోంది. గణేశుడిని టిబెట్, మంగోలియాలో ఉద్భవించిన బౌద్ధమత రూపమైన లామాయిజం పుట్టుకతో ఈ దేశ పురాణాలు ముడిపడి ఉన్నాయి. ధర్మ రక్షకుడిగా, చెడును నాశనం చేసే శక్తిగా, అడ్డంకులను తొలగించే మూర్తిగా వినాయకుడిని బౌద్ధం బోధిస్తోంది. అందుకే ఇక్కడి గణపతి విగ్రహం దృఢంగా, బలమైన కండరాలు, కవచం, దంతాలు, ఆయుధాలతో అలరారుతుంటాయి. ఇతర టిబెటన్ దేవతల మాదిరిగా కోపం కొట్టొచి్చనట్లు ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో విగ్రహాలు కనిపిస్తాయి. ఇండోనేసియాలో.. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో కృతనాగర మహారాజు మాంత్రిక కర్మలలో అడ్డంకులను తొలగించే తాంత్రిక దేవతగా వినాయకుడిని పూజించారు. ఇది క్రీ.శ 14–15 వ శతాబ్దాల నాటికి ఇక్కడ అభివృద్ధి చెందిన తాంత్రిక బౌద్ధం, శైవ మతాల కలయికగా గణపతిని ఇక్కడ ఆరాధిస్తారు. పుర్రెలు ధరించి పుర్రెల సింహాసనంపై కూర్చున్న రూపంలో వినాయకుడు పూజలందుకుంటున్నారు. భారత్లో సాధారణంగా కనిపించే విగ్రహరూపాల్లోనూ గణపతిని ఇక్కడ పూజిస్తారు. తూర్పు జావా ప్రాంతంలోని తెన్గెర్ సెమెరూ జాతీయ వనంలోని బ్రోమో పర్వతం ముఖ ద్వారం వద్ద 700 సంవత్సరాలనాటి గణనాథుని విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని పేరు మీద ఈ పర్వతానికి బ్రోమో పేరు వచి్చంది. అగి్నపర్వతాల విస్ఫోటం నుంచి ఈ విగ్రహం తమను రక్షిస్తుందని స్థానికులు నమ్ముతారు.చైనా, అఫ్గానిస్తాన్లలో.. చైనాలో లంబోదరుడిని ‘హువాంగ్ సీ టియాన్’అని పిలుస్తారు. ఆయనను ఒక విఘ్నంగా భావిస్తారు. అఫ్గానిస్తాన్ రాజధా ని కాబూల్ సమీపంలోని గార్డెజ్లో క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దంలో చెక్కిన ప్రసిద్ధ వినాయ క విగ్రహం బయలి్పంది. గార్డెజ్ గణేశుడుగా పిలువబడే ఆయనను జ్ఞానం, శ్రేయస్సునందించే దేవుడిగా స్థానికులు ఆరాధిస్తారు. జపాన్లో.. గణాలకు అధిపతి అయిన వినాయకుడిని జపాన్లో కంగిటెన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక్కడి వాణిజ్యవేత్తలు, వ్యాపారులు, జూదగాళ్ళు, నటులు, ‘గీషా’లుగా పిలవబడే కళాకారి ణులు ఎక్కువగా గణేషుడిని కొలుస్తారు. అయితే ఇక్కడ కొందరు ప్రత్యేకమైన రూపంలో ఉన్న వినాయకుడిని ఆరాధిస్తారు. ఈ వినాయక విగ్ర హంలో స్త్రీ, పురుష రూపాలు ఆలింగనం చేసుకు ని ఉంటాయి. జపనీస్ వినాయక రూపాల్లో ఒక రూపం నాలుగు చేతులతో, ముల్లంగి, మిఠాయి పట్టుకొని ఉండటం విచిత్రం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హాలీడే టూర్ : బుద్ధుని చెంత ప్రశాంతంగా బిగ్బాస్ ఫేమ్ వితికా షేరు (ఫోటోలు)
-
చేపపై యుద్ధం
ఎక్కడి జీవి అక్కడ ఉంటేనే ప్రకృతి సమతుల్యత సజావుగా ఉంటుంది. ఆఫ్రికా జలాశయాల్లో జీవించే చిన్నపాటి బ్లాక్చిన్ తిలాపియా చేప ఇప్పుడు థాయిలాండ్కు చుక్కలు చూపుతోంది. అక్కడి చిన్న చేపలు, రొయ్యలు, నత్త లార్వాలను గుటకాయ స్వాహా చేస్తోంది. అలా దేశ మత్స్య పరిశ్రమకు భారీ నష్టాలు తెచి్చపెడుతోంది. దాంతో వాటిపై థాయ్లాండ్ ఏకంగా యుద్ధమే ప్రకటించింది. తిలాపియా చేప అంతు చూసేందుకు రంగంలోకి దిగింది. వాటిని పట్టుకుంటే కేజీకి రూ.35 చొప్పున ఇస్తామంటూ జనాన్నీ భాగస్వాములను చేసింది. దాంతో జనం సైతమంతా తిలాపియా వేటలో పడ్డారు. గ్రామీణులు ప్టాస్టిక్ కవర్లు, వలలు చేతబట్టుకుని మోకాలి లోతు జలాశయాల్లో తిలాపియా వేటలో మునిగిపోయారు. దీనికి తోడు చెరువులు, కుంటలు, సరస్సుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసిన తిలాపియా చేపలను తినే ఆసియాన్ సీబాస్, క్యాట్ఫి‹Ùలనూ ప్రభుత్వం వదులుతోంది. ఆడ తిలాపియా చేప ఒకేసారి 500 పిల్లలను పెడుతుంది. దాంతో వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఘనా నుంచి దిగుమతి! జంతువుల దాణా, రొయ్యలు, పౌల్ట్రీ, పంది మాంసం వ్యాపారం చేసే ఓ సంస్థ దిగుమతి చేసుకున్న తిలాపియా చేపలు చివరికిలా దేశమంతటినీ ముంచెత్తినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఏం చేసినా ఒక చేప జాతిని సమూలంగా అంతం చేయడం దాదాపు అసాధ్యమని స్థానిక జలచరాల శాస్త్రవేత్త డాక్టర్ సువిత్ వుథిసుథిమెథవే అంటున్నారు. ‘‘వేగవంతమైన పునరుత్పత్తి వ్యవస్థ ఉన్న చేపలను పూర్తిగా అంతం చేయడం మరీ కష్టం. బాగా ప్రయతి్నస్తే మహా అయితే వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అని అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!
హోటల్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అలకరించింది. అంతేగాదు జస్ట్ 37 ఏళ్లకే ప్రధాని అయిన మహిళగా చరిత్ర సృష్టించింది కూడా. ఎవరామె? ఆమె సక్సెస్ జర్నీ ఏంటంటే..ఆమె పేరు పేటోంగ్టార్న్ షినవత్రా. అతి పిన్న వయస్కురాలైన థాయి రెండో ప్రధానిగా చరిత్ర సృష్టించింది. గత ప్రధాని స్రెట్టా థావిసిన్ నైతిక ఉల్లంఘనలపై పదవీచ్యతుడు కావడంతో థాయ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె కొత్త ప్రధానిగా నామినేట్ అయ్యారు. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబ హోటల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత ఫ్యూ థాయ్ ఇన్క్లూజన్ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కమిటీ చీఫ్గా 2021లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉంగ్ ఇంగ్ అనే మారుపేరుతో పిలువబడే షినవత్రా తన కుటుంబంలో ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన మూడొవ కుటుంబ సభ్యుడు. అంతేగాదు ఆమె పార్టీ, దాని మిత్రపక్షాలు 493 సీట్లలో 319 కైవసం చేసుకోవడంతో పార్లమెంటులో భారీ విజయం సాధించారు. ఆమె 2023లో కూడా ప్రధాని మంత్రి పదవికి పోటీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా రవాణా ఛార్జీలను తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరింపజేయడం , కనీస రోజువారీ వేతనాన్ని రెట్టింపు చేస్తాం వంటి హామీలు ఇచ్చింది. అంతేగాదు తన తండ్రి పాలనలో అనుసరించిన విధానాలకు కొన్ని మార్పులు తీసుకురావాలనే దృక్పథంతో పనిచేయాలనుకుంటోంది షినవత్రా. ఆమె రిలాక్స్డ్ వ్యయ విధానాలతో వృద్ధిని పెంచి దేశ ఆర్థిక సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయనున్నట్లు తెలిపింది. ఇక ఆమె వాణిజ్య పైలట్ అయిన పిడోక్ సూక్సావాస్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ షినవత్రా అంకితభావంతో తన కుటుంబ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించడమే కాకుండా దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలన్నా ఆకాంక్ష ఆమెను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆ క్రమంలో కెరీర్పరంగా, వ్యక్తిగతంగా పలు సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!) -
థాయిలాండ్ ప్రధాని పీఠంపై పేటోంగ్టార్న్!
బ్యాంకాక్: థాయిలాండ్ రాజకీయాల్లో షనవత్రల మరో కుటుంబ వారసురాలు ప్రధాని పీఠాన్ని అధిష్టించడానికి రంగం సిద్ధమైంది. నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తరఫున అభ్యరి్థగా నిలబడిన నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర ఓటింగ్లో సాధారణ మెజారిటీకి కావాల్సిన 247 ఓట్లను దాటేశారు. దీంతో పేటోంగ్టార్న్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. దీంతో షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర ప్రధానమంత్రులుగా చేశారు. 37 ఏళ్లకే ప్రధాని పదవి చేపడుతున్న నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అతి పిన్క వయసు్కరాలిగా, రెండో మహిళగా రికార్డ్నెలకొల్పనున్నారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్ను ఆ పదవి నుంచి బుధవారం థాయిలాండ్లోని రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం విదితమే. -
థాయ్లాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ ఖరారు!
బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది. శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్టార్న్ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే. -
నైతిక ఉల్లంఘన: థాయ్లాండ్ ప్రధాని తొలగింపు
బ్యాంకాక్: థాయ్లాండ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రిపై వేటు వేస్తూ.. రాజ్యాంగ న్యాయ స్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. నైతిక ఉల్లంఘన కేసులో స్రెత్తా తవిసిన్ను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. గతంలో జైలు శిక్ష అనుభవించిన న్యాయవాదిని మంత్రివర్గంలో నియమించటంతో థావిసిన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని కోర్టు న్యాయమూర్తి పుణ్య ఉద్చాచోన్ అన్నారు. విచారణ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు తవిసిన్ను ప్రధాని పదవి నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరోవైపు.. తక్షణమే తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన దేశ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పిచిత్ చుయెన్బాన్ను ప్రధాని కార్యాలయ మంత్రిగా తవిసిన్ నియమించారు. అయితే ఆయన 2008లో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు సంబంధించిన న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. ఏప్రిల్లో పిచిత్ మంత్రిగా నియామకం జరిగిన నెల రోజుల తర్వాత దేశ మిలిటరీ నియమించి 40 మంది మాజీ సెనేటర్ల బృందం నైతిక ఉల్లంఘిన కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తొలిగించిన అనంతరం కేబినెట్ తక్షణమే రద్దు చేయబడదని, థాయ్లాండ్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు కేర్ టేకర్ ప్రధాని ఉంటారని అధికారులు పేర్కొన్నారు. -
Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు
మహిళల ఆసియా కప్ 2024లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. థాయ్లాండ్తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.బంగ్లా బౌలర్ల విజృంభణటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్ నహార్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ బూచాథమ్ (40), లవోమీ (17), రోస్నన్ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్ 17, ఇష్మా తంజిమ్ 16 పరుగులు చేశారు. థాయ్ బౌలర్లలో పుత్తావాంగ్, ఫన్నిట మాయా తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్లో మలేషియాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి గ్రూప్ టాపర్గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. -
శ్రీలంక, థాయిలాండ్ విజయం
దంబుల్లా: మహిళల ఆసియా కప్ టోరీ్నలో శనివారం శ్రీలంక, థాయిలాండ్ జట్లు విజయాలు నమోదు చేశాయి. మాజీ చాంపియన్ బంగ్లాదేశ్ను 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (59 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం లంక 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 114 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విష్మీ గుణరత్నే (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా...హర్షిత సమరవిక్రమ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు) రాణించింది. మరో మ్యాచ్లో థాయిలాండ్ 22 పరుగుల తేడాతో మలేసియాపై విజయం సాధించింది. ముందుగా థాయిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ననపట్ కొంచరోంకయ్ (35 బంతుల్లో 40; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించింది. ఆ తర్వాత మలేసియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేయగలిగింది. వాన్ జూలియా (53 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించినా మిగతావారంతా విఫలమయ్యారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నేడు జరిగే తమ రెండో మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ తలపడుతుంది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తమ తొలి పోరులో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. -
థాయ్లాండ్లో పాట
హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ థాయ్లాండ్లో చిందేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై అక్కడ ఓ పాటని చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘జనతా గ్యారేజ్’(2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్ని థాయ్లాండ్లో ప్లాన్ చేశారు కొరటాల శివ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై ఓ సాంగ్తో పాటు ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్, ఈ నెల 16న ముంబై నుంచి జాన్వీ కపూర్ థాయ్లాండ్కి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ‘పఠాన్, వార్, ఫైటర్’ వంటి చిత్రాల్లో మంచి స్టెప్స్ను కంపోజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకి నృత్యరీతులు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశారు బాస్కో మార్టిస్. హై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం మొదటి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరు«ద్. -
చలో థాయ్లాండ్
హీరో ఎన్టీఆర్ థాయ్లాండ్కి పయనమయ్యారు. ‘దేవర’ మూవీ తాజా షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘దేవర’ కీలక షెడ్యూల్ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ చేరుకుంది చిత్రబృందం. తర్వాతి షెడ్యూల్ కోసం సోమవారం ఎన్టీఆర్ హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ ప్రయాణం అయ్యారు.ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్, భార్గవ్ కూడా ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ‘దేవర’ షూటింగ్లో పాల్గొనేందుకు జాన్వీ కపూర్ కూడా ఆదివారం సాయంత్రం థాయ్లాండ్కు బయలుదేరారు. అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ పాటతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట కొరటాల శివ. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర’ తొలి భాగం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
థాయిలాండ్లో అద్భుతం
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. థాయిలాండ్లోని అయూథలా ప్రావిన్స్లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది. ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్థోంగ్టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
హనుమాన్ నటి పెళ్లి.. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్!
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్కుమార్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం నికోలాయ్ సచ్దేవ్ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇటీవల కోలీవుడ్ ప్రముఖలను కలిసి వెడ్డింగ్ కార్డ్స్ సైతం పంపిణీ చేస్తోంది. రజినీకాంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది.వరలక్ష్మి, నికోలాయ్ సచ్దేవ్ వివాహం థాయ్లాండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. జూలై 2న ఈ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థాయ్లాండ్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ను చెన్నైలో నిర్వహించనున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా.. గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్తో వరలక్ష్మి శరత్ కుమార్ దాదాపు పదేళ్లుగా పరిచయం ఉంది. -
భారత్లో జెన్జెడ్లు..థాయ్లాండ్ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్లాండ్కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్బీఎన్బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్లు థాయ్లాండ్లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్లాండ్ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్లాండ్కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్బీఎన్బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్బీఎన్బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో జెన్జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్లాండ్తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్బీఎన్బీ జనరల్ మేనేజర్ అమన్ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్లాండ్లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్బీఎన్బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
థాయ్లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.ఈ సందర్భంగా థాయ్లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్లాండ్ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్లాండ్కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు. -
మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు
ఇటీవల కంటి నుంచి పురుగులు పడటం, పొట్టలో పురుగులును గుర్తించి తీయడం విన్నాం. అంతవరకు బాగానే ఉంది. కలుషిత ఆహారం లేదా శుభ్రత పాటించకపోవడం వచ్చిందని అన్నారు వైద్యులు. కొందరూ కొన్ని రకాల జంతువులను తినడం వల్ల కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. కానీ ఇక్కడొక మహిళ ముక్కులో ఒకటి రెండు కాదు ఏకంగా వందలకొద్ది పురుగులు బయటపడ్డాయి. వైద్యులు సైతం విస్తుపోయారు. ఈ భయానక ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..థాయిలాండ్కి చెందిని 59 ఏళ్ల మహిళ ముక్కు మూసుకుపోయి విపరీతమైన బాధని అనుభవించింది. ఒక వారం రోజుల నుంచి ముక్కు నుంచి రక్త కారడంతో భయపడి థాయిలాండ్లోని చియాంగ్ మాయిలోని నాకోర్న్సింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దుమ్ముకు సంబంధించిన ఎలర్జీగా భావించి సైనసైటిస్కు చికిత్స ఇవ్వడం జరిగింది. అక్కడ నివాసితలు అలెర్జీలు, రినిటిస్ వంటి శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల ఆ సమస్యగానే భావించి చికిత్స అందించారు. అందులో భాగంగానే ముక్కుకి స్కానింగ్ చేయగా..వందలకొద్ది పురుగులు కనిపించాయి. ఒక్కసారిగా వైద్యులు సైతం కంగుతిన్నారు. వెంటనే సదరు మహిళకు ఎండోస్కోపి ద్వారా ఆ పురుగులన్నింటిని తీసేశారు. ప్రస్తుతం ఆ మహిళ కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఒక వేళ వీటిని సకాలంలో గుర్తించి తొలగించనట్లయితే మెదడు వరకు ఈ పురుగులు వలసపోయి తీవ్రమైన సమస్యలు తలెత్తి మరణానికి దారితీస్తుందని అన్నారు. ఇలాంటి సమస్య సరైన శుభ్రత పాటింకపోవడం వల్లే వస్తుందని అన్నారుఆమె రెండు నాసికా కుహరాల్లో వందలకొద్ది పురుగులు ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ఎక్స్రే తీసినప్పుడూ ఆమె ఎడమ జెగోమాటిక్ సైనస్లో తెల్లటి మచ్చ ఉండటంతోనే పురుగులు ఉన్నాయన్న అనుమానం వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి అరుదైన కేసు 2022లో పోర్చుగల్లో నమోదయ్యింది. అక్కడ ఒక వృద్ధుడి చెవిలో మాంసంతినే పురుగులును గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. (చదవండి: అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!) -
కరుడుగట్టిన స్క్రాప్ మాఫియా డాన్, ప్రియురాలి అరెస్ట్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానా, అతని గర్ల్ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు థాయ్లాండ్లో అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో గ్యాంగ్స్టర్. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అతని కోసం నోయిడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎట్టకేలకు రవి కానా, కాజల్ ఝా థాయ్లాండ్లో పట్టుబడ్డాడు.నోయిడా పోలీసులు థాయ్లాండ్ పోలీసులతో నిత్యం టచ్లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. రవీంద్రనగర్లో 16 మంది గ్యాంగ్స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన రవి కానా.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి అనాతి కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాపింగ్కు సంబంధించిన అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను గ్యాంగ్స్టర్ కార్యకలాపాలకు ఉపయోగించుకున్న రవి కానా గ్యాంగ్లోని ఆరుగురు ఇప్పటకే అరెస్ట్ అయ్యారు.ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన రు.100 కోట్ల బంగాళాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దక్షిణ ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉంది. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.ఉద్యోగం కోసం గ్యాంగ్స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు. -
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్ల్యాండ్లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
థాయిలాండ్లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!
థాయిలాండ్లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే. మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.. పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్. థాయిలాండ్లోని మరో అయోధ్య.. థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి. "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు. థాయిలాండ్లో నేటికి రామరాజ్యం .. థాయిలాండ్లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది. థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం. థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి.. మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్ మీటర్. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి. (చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?) -
బ్యూటీ క్వీన్గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..
ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్ 2023లో ఉండక్ న్గడౌ జోహోర్ టైటిల్ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్లాండ్లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్ విమర్శలపాలయ్యింది. ఈ వార్త కాస్త కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్ అవ్వుతూ ఆమె ఆ టైటిల్ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్ ఫిగర్. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎవ్వరూ యత్నించరని కిటింగన్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్ న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్లో పేర్కొంది. అందాల భామ వీరూ నికా టెరిన్సిప్. (చదవండి: రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!) -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘థాయ్లాండ్’.. బీజేపీ విమర్శల దాడి
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్లాండ్ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. 'రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానం థాయిలాండ్' “కాంగ్రెస్ మేనిఫెస్టోలో నీటి నిర్వహణపై ఓ చిత్రం ఉంది. ఈ చిత్రం న్యూయార్క్లోని బఫెలో నదికి సంబంధించినది. తమ సోషల్ మీడియా ఛైర్పర్సన్ ట్విటర్ నుండి ఎవరు ట్వీట్ చేస్తున్నారో వారు ఇప్పటి వరకు దీన్ని గుర్తించలేకపోయారు. కానీ వారికి ఈ చిత్రాన్ని ఎవరు పంపారు? పర్యావరణ విభాగం కింద, రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానమైన థాయ్లాండ్ నుండి ఒక చిత్రాన్ని పెట్టారు. వీటన్నింటినీ తమ మేనిఫెస్టోలో ఎవరు పెడుతున్నారు?’’ అని సుధాన్షు త్రివేది అన్నారు. 'విదేశీ ఫొటోలను అరువు తెచ్చుకుంటున్నారు' “తప్పు ఫోటోలు ఉపయోగించడం పెద్ద సమస్య కాదు. అయితే ఈ ఫోటోలు విదేశీ సంస్థలకు సంబంధించినవి. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి భారత్, ప్రధాని నరేంద్ర మోదీ పరువు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వారు తమ మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలను అరువు తెచ్చుకుంటున్నారు" అని విమర్శించారు. Looks like the Congress forgot that it is preparing a manifesto for India and not putting together a holiday itinerary for Rahul Gandhi! What else explains using picture of Thailand under the Environment section? It shouldn’t be a surprise if Rahul Gandhi dashes off to Thailand,… pic.twitter.com/5MsNTCjFuc — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 5, 2024 'రాహుల్ గాంధీ హాలిడే టూర్లా ఉంది' రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ మరో నేత అమిత్ మాల్వియా విరుచుకుపడ్డారు. "భారతదేశం కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని, రాహుల్ గాంధీ కోసం హాలిడే టూర్ షెడ్యూల్ను రూపొందించడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది" అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ మరో హాలిడే ట్రిప్ కోసం థాయ్లాండ్కు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని మాల్వియా ‘ఎక్స్’ పోస్ట్లో రాశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. మేనిఫెస్టోను రూపొందించడానికి విదేశీ ఏజెన్సీని నియమించారా అని ప్రశ్నించారు. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్లాండ్లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్లాండ్లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్లాండ్లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్లాండ్కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్లాండ్కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్లాండ్కు పంపుతున్నారు. రెండోసారి థాయ్లాండ్కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్లాండ్కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్లాండ్కు పంపారు. -
థాయ్ మాజీ ప్రధానికి పెరోల్
బ్యాంకాక్: జైలు శిక్ష అనుభవిస్తున్న థాయ్లాండ్ మాజీ ప్రధాని తక్షిన్ షినవత్ర(76) పెరోల్ మీద విడుదలయ్యారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వం అతడిని పెరోల్పై విడుదల చేసింది. మరో ఆరు నెలల్లో షినవత్ర శిక్ష ముగియనుంది. 15 ఏళ్ల ప్రవాసం వీడి గతేడాది దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఆయనను జైలుకు తరలించారు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి వెంటనే పోలీస్ ఆస్పత్రికి తరలించి నిర్బంధంలో ఉంచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షినవత్రకు అవినీతి ఆరోపణలపై 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం థాయ్లాండ్లో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో షినవత్ర కుటుంబ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. 70 ఏళ్లు దాటి అనారోగ్యం బారిన పడినందున మిగిలిఉన్న జైలు శిక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదీ చదవండి.. కనీసం చివరిచూపు చూసుకోనువ్వండి -
కొంపముంచిన స్టంట్: ఏకంగా 29వ అంతస్థు నుంచి
సోషల్ మీడియాకోసం చేసిన ఒక యువ స్కైడైవర్ సాహసం విషాదాంతమైంది. 29 అంతస్తుల అపార్ట్మెంట్ బ్లాక్ పైకప్పు నుండి డైవింగ్ చేస్తూన్న క్రమంలో 33 ఏళ్ల బ్రిటీష్ బేస్ జంపర్ ప్రాణాలను కోల్పోయాడు. థాయ్లాండ్లోని పట్టాయాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంబ్రిడ్జ్షైర్కు చెందిన నాథీ ఓడిన్సన్ (33) శనివారం రాత్రి 29 అంతస్తుల భవనంపై నుంచి దూకాడు. ఈ సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో ముందు చెట్టును బలంగా ఢీకొట్టి, ఆ తరువాత నేలపై పడి దుర్మరణం పాలయ్యాడు. సోషల్ మీడియా కోసం చేసిన ఈ స్కై డైవింగ్ వీడియో స్టంట్ తీరని విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు ఈ ఘటనపై ఫారెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. నేథన్ మృతి గురించి పోలీసులు బాంకాక్లోని బ్రిటన్ ఎంబసీకి సమాచారం అందించారు. నేథన్ కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సాహసోపేత వీడియోలను నాతీస్ స్కై ఫోటోగ్రఫీ పేరుతో ఇన్స్టా, ఫేస్బుక్ పేజీల్లో గతంలో చాలానే షేర్ చేశాడు. అంతేకాదు ఇలాంటి సాహసాలు చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు కూడా. స్కైడైవింగ్లో ఎన్నోఏళ్ల అనుభవం ఉన్న ఓడిన్సన్ దుర్మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేశారు. నిబంధనల్లో నిర్లక్ష్యం వహిస్తే.. జరిగేది రామోజీ ఫిలిం సిటీ ఘటనే ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రమాదం తీవ్ర నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో దుర్మరణం పాలయ్యారు. లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్స్ ఆసియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలను గ్రాండ్గా ప్లాన్ చేశారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భద్రతా ఏర్పాట్ల కొరత కారణంగా టెక్ సంస్థ సీఈవో సంజయ్ షా ప్రాణాలు పోయాయి. అలాగే ఈ సంస్ధ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథ్ అలియాస్ ఆసుపత్రి పాలైనారు. సమయానికి అంబులెన్స్ కూడా అందుబాటులోలేదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి : రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు) View this post on Instagram A post shared by Nathy (@nathyskyphotography) -
థాయ్ రాచరికంపై విమర్శలు.. 50 ఏళ్ల జైలు
బ్యాంకాక్: దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయ్ల్యాండ్ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయ్ల్యాండ్లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్కు చెందిన మొంగ్కొల్ తిరఖోట్(30) ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ 2023లో కోర్టు ఈయనకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్ల్యాండ్లో అమలవుతున్నాయి. రాజు, రాణి, వారసులను విమర్శిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. -
థాయ్లాండ్ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బ్యాంకాక్: థాయ్లాండ్లోని సుప్రాన్ బురీ ప్రావిన్స్లోని బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కారి్మకుల మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఘటన జరిగినపుడు ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం వరిపొలాలకు పెట్టిందిపేరు. పచ్చని పొలాల మధ్య బుధవారం మధ్యాహ్నంవేళ దట్టమైన నల్లని పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలను ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్చేసింది. చైనీయుల నూతన సంవత్సరం వచ్చే నెలలో థాయిలాండ్లోనూ ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాణసంచాకు భారీగా డిమాండ్ పెరగడంతో పెద్దమొత్తంలో బాణసంచాను హడావుడిగా తయారుచేస్తుండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
థాయ్లాండ్లో భారీ పేలుడు.. 18 మంది మృతి
బ్యాంకాక్: సెంట్రల్ థాయ్లాండ్లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 18 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని తెలుస్తోంది. పేలుడు కారణమేంటన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సహాయక చర్యలు చేపడుతోంది. ఇదీచదవండి.. కెనడానకు తగ్గిన భారత యువత -
విషాదం: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
బ్యాంకాక్: థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్లో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చెట్టును ఢీకొట్టిన బస్సు రెండుగా విడిపోయింది. ఈ ఘటనలో బస్సు శిథిలాల్లో చిక్కుకుని ప్రయాణికులు మృతి చెందారు. శిథిలాల్లో చిక్కుకున్న భాధితులను బయటకు తీశారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇదీ చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
థాయ్లాండ్లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం!
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య మాదిరిగానే థాయ్లాండ్లో కూడా అయోధ్య ఉంది. ఈ ప్రదేశానికి అయోధ్య అని పేరు పెట్టడమే కాకుండా ఇక్కడి రాజులను రాముని అవతారంగా భావిస్తారు. థాయ్లాండ్లోని ‘అయుతయ’ నగరానికి ప్రాచీన భారతీయ నగరమైన అయోధ్య పేరు పెట్టారు. ఇక్కడి రాజవంశంలోని ప్రతి రాజును రాముని అవతారంగా భావిస్తారు. థాయ్లాండ్ ‘అయోధ్య’కు సంబంధించిన వివరాలను 22 ఏళ్లుగా బోధనావృత్తి సాగిస్తున్న డాక్టర్ సురేష్ పాల్ గిరి వివరించారు. తాను థాయ్లాండ్లోని మతపరమైన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. థాయ్లాండ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమని అన్నారు. మొదట్లో హిందూ ప్రాబల్యం ఉన్న ఈ దేశంలో కాలక్రమేణా బౌద్ధం ప్రవేశించి, దానిలోని అంశాలు హిందూమతంతో కలిసిపోయాయన్నారు. భారతదేశంలోని అయోధ్య , థాయ్లాండ్లోని అయోధ్య మధ్య గల పోలికల గురించి సురేష్ తెలియజేస్తూ.. భారత పూర్వీకుల సంప్రదాయాలు మరచిపోలేనివి అని అన్నారు. ఇప్పటికీ థాయ్లాండ్ ప్రజలు శ్రీరాముని పూజిస్తారన్నారు. ఇక్కడి రాజు ఈ నగరంలో కొన్ని హిందూ దేవాలయాలను కూడా నిర్మించారని తెలిపారు. ‘అయుతయ’కు 35 కిలోమీటర్ల దూరంలో విష్ణువు, బ్రహ్మ, శంకరుని ఆలయం ఉంది. ‘అయుతయ’ రాజు 'రామతిబోధి' (రాముడు) అనే బిరుదును కలిగి ఉండేవాడు. అయోధ్య రామాయణంలో శ్రీరాముని రాజధాని వర్ణనలో ‘అయుతయ’ పేరు కూడా కనిపిస్తుంది. అయుతయను 1767లో బర్మీస్ దళాలు దోచుకుని ఆ ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఇది కూడా చదవండి: ‘ఆ భారతీయుడే న్యూయార్క్లో హత్యకు కుట్రపన్నాడు’ थाईलैंड के 'अयुत्या' शहर का नाम प्राचीन भारतीय शहर अयोध्या के नाम पर रखा गया है। यहां एक ऐसा राजवंश है जिसके हर राजा को राम का अवतार माना जाता है।(29.11) (वीडियो 'अयुत्या' शहर से है।) pic.twitter.com/h8zY64JzJ7 — ANI_HindiNews (@AHindinews) November 29, 2023 -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్లో, థాయ్లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
‘వీలైతే నేను మలాల అవుతా’
72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్ రన్నరప్గా థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్ భామ ఆంటోనియా పోర్సిల్డ్ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే గాక సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్ తాను మలాలా యూసఫ్జాయ్ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్ చేసిందో మనకు తెలుసు. మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ పోర్సిల్డ్ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్ మోరయా విల్సన్ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది. ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్ భామ పోర్సిల్డ్ పాక్కి చెందిన ఐకానిక్ మహిళ, నోబెల్ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్ జాయ్ని చెప్పడం అందర్నీ షాక్కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహించింది. FINAL Q&A starting with Thailand! @porxild#72ndMISSUNIVERSE #MissUniverse2023 @TheRokuChannel pic.twitter.com/w71IH4kEvY — Miss Universe (@MissUniverse) November 19, 2023 (చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?) -
టూరిస్టులకు థాయ్లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్లాండ్లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్లాండ్కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్లాండ్కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
భారీ విజయంతో భారత్ శుభారంభం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 7–1తో నెగ్గింది. భారత్ తరఫున సంగీత కుమారి (29వ, 45వ, 45వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మోనిక (7వ ని.లో), లాల్రెమ్సియామి (52వ ని.లో), సలీమా టెటె (15వ ని.లో), దీపిక (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
నేటి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ
స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు రాంచీలో మొదలవుతుంది. తొలి రోజు థాయ్లాండ్ జట్టుతో సవితా పూనియా కెపె్టన్సీలోని భారత జట్టు ఆడనుంది. మ్యాచ్ రాత్రి గం. 8:30 నుంచి జరుగుతుంది. చైనా, జపాన్, కొరియా, మలేసియా జట్లు కూడా ఈ టోరీ్నలో పోటీపడుతున్నాయి. థాయ్లాండ్తో మ్యాచ్ తర్వాత భారత్ 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్తో, నవంబర్ 2న కొరియాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు నవంబర్ 4న సెమీఫైనల్లో తలపడతాయి. నవంబర్ 5న ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్–5 చానెల్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
థాయిలాండ్లో కూడా నవరాత్రులు..రెస్టారెంట్, హోటళ్లలో ఓన్లీ వెజ్!
మనకు దసరా నవరాత్రులు జరిగే సమయంలోనే థాయ్లాండ్లో ఏటా శాకాహార సంబరాలు జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 15న మొదలైన ఈ సంబరాలు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఈ సంబరాలను ‘జయ్’ ఉత్సవాలు అని పిలుస్తారు. ఒకానొకప్పుడు మలయ్ సమ్రాజ్యాన్ని పరిపాలించిన తొమ్మిదిమంది చక్రవర్తుల పేరిట ఈ ఉత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే ఆచారం మొదలైనట్లు చెబుతారు. థాయ్లాండ్లోని మిగిలిన ప్రాంతాల కంటే ఫుకేత్ నగరంలో ఈ సంబరాలు భారీ స్థాయిలో జరుగుతాయి. థాయ్లాండ్లోనే కాకుండా మలేసియా, ఇండోనేసియా, సింగపూర్లలో పెరనాకన్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ ఈ సంబరాలు జరుగుతాయి. తావో మత ఆచారాల ప్రకారం తొమ్మిదిరోజుల పాటు ఈ సంబరాలను ఘనంగా జరుపుకొంటారు. ఈ తొమ్మిదిరోజులూ మాంసాహారాన్ని ముట్టరు. పూర్తిగా శాకాహారమే భుజిస్తారు. ఈ సందర్భంగా దీక్షపూనే వారిలో కొందరు నాలుకకు, బుగ్గల్లోను పదునైన సూదులు, కత్తులు వంటి ఆయుధాలను గుచ్చుకుని ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఊరేగింపులు జరిగే వీథుల్లోను, ప్రార్థన మందిరాల వద్ద ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆహారశాలలను ఏర్పాటు చేస్తారు. ఈ ఆహారశాలల్లో చైనీస్ సంప్రదాయ శాకాహార వంటకాలను విక్రయిస్తారు. ఈ సంబరాలు జరిగే తొమ్మిదిరోజుల్లోనూ థాయ్లాండ్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు కూడా శాకాహార వంటకాలనే విక్రయిస్తాయి. పూర్తి శాకాహారమే విక్రయిస్తున్నట్లుగా హోటళ్లు, రెస్టారెంట్లపై పసుపు రంగు జెండాలను ఎగురవేస్తాయి. (చదవండి: తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..) -
ఏషియన్ గేమ్స్లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్లాండ్ను దెబ్బకొట్టారు. థాయ్లాండ్ ఇన్నింగ్స్లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్తో తలపడనుంది. -
థాయ్లాండ్తో భారత్ తొలి పోరు
రాంచీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్ 27న థాయ్లాండ్ జట్టుతో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్తో, నవంబర్ 2న కొరియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ నవంబర్ 4న, ఫైనల్స్ నవంబర్ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్ 2016లో టైటిల్ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్గా నిలిచింది. -
షినవత్రకు థాయ్లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
భారత మహిళల హాకీ జట్టుకు టైటిల్
సలాలా (ఒమన్): మహిళల హాకీ ఆసియా కప్ ఫైవ్స్ (ఐదుగురు ఆడే) టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. తద్వారా 2024 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 7–2 గోల్స్ తేడాతో థాయ్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున జ్యోతి, మరియానా కుజుర్ రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ నవ్జ్యోత్ కౌర్, మోనికా టొప్పో, మహిమా చౌదరీ ఒక్కో గోల్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన జట్లు తలపడే తొలి హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ వచ్చే జనవరి 24 నుంచి 27 వరకు మస్కట్లో జరుగనుంది. -
థాయిలాండ్లో.. ‘సహకారం’లోనే మార్కెటింగ్
హన్మకొండ : థాయిలాండ్ దేశంలో సహకార రంగంలోనే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ కొనసాగుతోందని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. సహకార రంగంలో స్థిరమైన ఫైనాన్సింగ్ వ్యూహాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అంశంపై థాయిలాండ్కు స్టడీ టూర్కు వెళ్లి వచ్చిన మార్నేని సోమవారం ‘సాక్షి’తో అక్కడి విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మన దేశంలో వ్యవసాయ మార్కెటింగ్ ప్రత్యేక వ్యవస్థగా కొనసాగుతుంటే థాయిలాండ్లో సహకార రంగంలోనే కొనసాగుతుంది. మన దేశంలో చిన్నచిన్న కమతాల్లో వ్యవసాయం చేస్తుంటే థాయిలాండ్లో కమతాలు చాలా విశాలంగా ఉంటాయి. ఒక్కో వ్యవసాయ క్షేత్రం 30 నుంచి 50 ఎకరాల వరకు ఉంటుంది. కుటుంబం మొత్తం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ దేశంలో పంట ఉత్పత్తులకు విలువ జోడింపు చేస్తారు. దీంతో రైతులకు అధిక ఆదాయం వస్తుంది. వరితోపాటు పండ్లు, కూరగాయలు వరితో పాటు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేస్తారు. పండ్లు, కూరగాయల సాగు పాలీ హౌజ్ల్లోనే చేస్తారు. పంట ఉత్పత్తులను రైతులే ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తారు. ప్రతి వ్యవసాయ క్షేత్రం కంపెనీని తలపిస్తుంది. భారత్లో 80 శాతం ఆధారపడితే థాయిలాండ్లో 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడుతారు. అక్కడ సాగునీటి వనరులు తక్కువ. మార్కెటింగ్ మన దగ్గర అంత సానుకూలంగా ఉండదు. అదే థాయిలాండ్లో సులువుగా ఉంటుంది. థాయిలాండ్ ప్రధానంగా పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచింది. మన దేశంలోనే కేంద్ర సహకారం పెరిగితే సహకార రంగం పురోభివృద్ధి సాధిస్తుంది. అధ్యయనానికి వస్తామన్నారు.. తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా గురించి చెప్పితే ఇలా కూడా ఉంటుందా అని థాయిలాండ్ దేశస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విష యం విన్న వారు తెలంగాణకు వచ్చి అధ్యయ నం చేస్తామని చెప్పారు. సహకార వ్యవస్థలో నూ తన విధానాలు తీసుకురావడానికి ఈ స్టడీ టూర్ కు వెళ్లాం. 22వ తేదీన బ్యాంకాక్లోని హోటల్ సెంట్రో వాటర్గేట్లో సమావేశమై వివిధ సహకార సంఘాల పనితీరు.. వ్యవస్థ విధి విధానాల పై చర్చించాం. రెండో రోజు బ్యాంకాక్లోని సహకార శాఖ కార్యాలయాలు, వాటి పనితీరును అఽ ద్యయనం చేశాం. మూడోరోజు బోతాంగ్ జిల్లా థాట్తంగ్లో గల పంటలను పరిశీలించాం. -
ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!. ఇంతకీ ఈ ప్యాలెస్ని పోలిన భవనం థాయ్లాండ్లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు. ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్రూమ్. బంగారు రంగు డిజైన్తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం. View this post on Instagram A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia) (చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..) -
పర్యాటకులతో సందడిగా ఉండే ఆ బీచ్..హఠాత్తుగా మూతపడింది!
పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ఆ బీచ్ సడెన్గా మూతపడింది. పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ఆ బీచ్ నిశబ్ధంలోకి వెళ్లిపోయింది. కారణం వింటే నిజంగా షాకవ్వుతారు. ఎప్పుడూ మళ్లీ ఇదివరుకటి రోజుల్లా ఆ బీచ్ ఉంటుందా అని చాలామంది పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. అసలు ఎందుకు ఆ బీచ్ క్లోజ్ అయ్యింది? మంచి ఆదాయాన్ని ఇచ్చేదే పర్యాటక రంగం. అందులోనూ పర్యాటకానికి పేరుగాంచిన బీచ్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అలాంటి బీచ్ ఎందుకు అలా మూగబోయింది. దాగున్న రహస్యం ఏంటంటే.. థాయ్లాండ్లోని కో ఫై ఫై లేహ్ ద్వీపంలో కొండల మధ్య ఉన్న "మాయా బే బీచ్" మంచి పర్యాటక స్పాట్గా పేరు. పగడపు దీవులకు ప్రసిద్ధిగాంచింది. ఈ మాయా బే పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తుందంటే చుట్టూ ఉన్న దట్టమైన మొక్కలు, నీలిరంగులో స్పష్టంగా కనిపించే నీళ్లు, బంగారు ఇసుక చూస్తే.. భూతల స్వర్గంలా ఉంటుంది. ఎప్పుడూ నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది. అయితే ధాయ్ అధికారులు ఒక రోజు సడెన్గా మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏదో కొన్ని రోజులు అన్నుకున్నారు అక్కడున్న నగరవాసులు కానీ నిరవధికంగా ఏళ్ల పాటు మూతపడిపోయింది. రూ. 100 కోట్లకు పైగా ఆదాయం నిజానికి ధాయ్ అధికారులు ఈ బీచ్ని మూసేయడానికి ఇష్టపడలేదు. కానీ పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లుసంబంధిత ఆధారాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అధికారులకి. థాయ్లాండ్కి పర్యాటకంగా ఈ బీచ్ నుంచే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడకు పర్యాటకులు కారణంగా వేలాది బోట్లు వచ్చేవి. దీంతో కాలుష్యం ఏర్పడిందని, బీచ్ అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి కారణంగా అక్కడ ఉండే పగడపు దిబ్బలకు నష్టం వాటిల్లింది. పెద్ద సంఖ్యలో పగడపు దిబ్బలు మాయం అయినట్లు నిపుణులు అంచనా వేశారు. దీంతో థాయిలాండ్ జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు,మొక్కల సంరక్షణ విభాగం అధికారులు బీచ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు మూత వేయబడుతుందని ప్రకటించారు. మొదట నాలుగు నెలలు అన్నారు అలా ఏకంగా నాలుగేళ్లు మూతపడిపోయింది. మళ్లీ ఇటీవలే గత మే నెల నుంచి రీ ఓపెన్ అయ్యింది. ఏదీ ఏమైనా..మంచి ఆదాయ మార్గమని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మంచిదే కానీ దాంతో పర్యావరణ స్ప్రుహ ఉండటం అత్యంత ముఖ్యం అని చాటి చెప్పారు ఈ థాయ్ అధికారులు. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్కి తిరిగి వచ్చి షూటింగ్ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్లాండ్లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
థాయ్లాండ్లో డబుల్
‘ఇస్మార్ట్ శంకర్’ (2019) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో రామ్ పొతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభించాం. ఈ షెడ్యూల్లో రామ్, నటుడు సంజయ్ దత్పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి. -
27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా?
బ్యాంకాక్: థాయ్ మహారాజు వజిరాలాంగ్కార్న్(71) రెండో కుమారుడు యువరాజు వచరేసార్న్ వైవాచారవాంగ్సే(42) సుమారు 27 ఏళ్ల తర్వాత రాజయానికి తిరిగొచ్చారు. ఆయనకు రాకను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn who has been living in New York, has reportedly returned to Thailand. This was a video posted and widely shared on social media. pic.twitter.com/vYPNOdUBjs — Thai Enquirer (@ThaiEnquirer) August 6, 2023 న్యూయార్క్ లో ఒక న్యాయ సంస్థలో పనిచేస్తున్న వచరేసార్న్ వైవాచారవాంగ్సే చాలా కాలం తర్వాత తిరిగి రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది డిసెంబరులో థాయ్ మహారాజు పెద్ద కుమార్తె యువరాణి బజ్రకితీయాబా మహిడాల్(44)మైకో ప్లాసం ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోమాలో ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి వచ్చారా లేక రాజా కుటుంబం వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn, expressed during his visit to the 2infamily Foundation, a foundation for child care in Khlong Toei, that returning to #Thailand after 27 years of living abroad was like a dream come true. He stated… pic.twitter.com/lZ4h4WLCIV — Thai Enquirer (@ThaiEnquirer) August 8, 2023 ఇదిలా ఉండగా యువరాజు థాయ్లాండ్ వస్తూనే ఓ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొని నిర్భాగ్యులైన పిల్లలను, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మరుసటి రోజున ఆయన దేశం(రాజ్యం)లోని ఎమరాల్డ్ బుద్ధుడి దేవాలయం తోపాటు అనేక దేవాలయాలను సందర్శించారు. రాత్రి ఒక ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఫోటో తీసుకున్న ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కింద 'బ్యాంకాక్ టుక్ టుక్' అని క్యాప్షన్ కూడా రాశారు. థాయ్లాండ్ మహారాజు వజిరాలాంగ్కార్న్ కు నలుగురు భార్యలు ఏడుగురు సంతానం. 2016లో పట్టాభిషక్తుడైన ఆయన రెండో భార్య సుజరిణీ వైవాచారవాంగ్సేకు కలిగిన కుమారుడే వచరేసార్న్ వైవాచారవాంగ్సే. యువరాణి చాలాకాలంగా కోమాలో ఉండటంతో దుఃఖసాగరంలో ఉన్న రాజకుటుంబంలో యువరాజు రాకతో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరిశాయి. ఇది కూడా చదవండి: భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్ -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి
World Richest Thailand King: ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న సంపన్నులను గురించి.. ప్రపంచంలోని కుబేరుల గురించి కూడా కొంత వరకు తెలుసుకున్నాం. అయితే ఈ రోజు అపారమైన సంపదను మాత్రమే కాకుండా వేల ఎకరాల భూమిని కలిగి, లెక్కకు మించిన వాహనాలను కలిగిన ఒక సంపన్న రాజును గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేల ఎకరాల భూమి.. నివేదికల ప్రకారం.. థాయ్లాండ్కు చెందిన మహారాజు 'మహా వజిరాలాంగ్కార్న్' (Maha Vajiralongkorn) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. ఈయన ఆస్తి సుమారు రూ. 3.2 లక్షల కోట్లు. అంతే కాకుండా వజ్రాలు, రత్నాలు వంటి వాటితో పాటు.. 16 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమి కూడా వజిరాలాంగ్కార్న్ అధీనంలో ఉండేదని సమాచారం. ఖరీదైన డైమండ్.. భూముల విషయం పక్కనపెడితే మహా వజిరాలాంగ్కార్న్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన 545.67 క్యారెట్ బ్రయోన్ గోల్డెన్ జూబ్లీ డైమండ్ ఉండేదని.. దీని విలువ 12 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ (రూ. 98 కోట్లు) ఉంటుందని అంచనా, ఇది రాజు కిరీటంలో పొందుపరిచారు. వీటితో పాటు అపురూపమైన రాజ వాయిద్యాలు కూడా ఆయన వద్ద ఉండేవని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! విమానాలు, హెలికాఫ్టర్లు & కార్లు.. బంగారం, వజ్రాలు మాత్రమే కాకుండా.. వజిరాలాంగ్కార్న్ దగ్గర ఏకంగా 38 విమానాలు, లెక్కకు మించిన హెలికాఫ్టర్లు ఉండేవి. ఇందులో నాలుగు బోయిన్, మూడు ఎయిర్బస్ విమానాలు. వీటితో పాటు 300 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు వీరి గ్యారేజిలో ఉండేవి. కేవలం వాహనాలకు వినియోగించే ఫ్యూయెల్ ఖర్చు మాత్రం సంవత్సరానికి రూ. 524 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ రాజు ఎంత సంపన్నుడో ఇట్టే తెలిసిపోతుంది. ఇదీ చదవండి: హీరోలా ఉన్న ఇతడిని గుర్తుపట్టారా? దేశం గర్వించదగ్గ సంపన్నుడు.. విశాలమైన ప్యాలెస్.. థాయ్లాండ్లోని గ్రాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఏకంగా 23,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని 1782లో నిర్మించినట్లు సమాచారం. ఇది వారి వారసత్వానికి చిహ్నంగా చారిత్రాత్మక కట్టడంగా నిలిచింది. వజిరాలాంగ్కార్న్ రాజుని 'కింగ్ రామ ఎక్స్' అని కూడా పిలుస్తారు. -
జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్ చేశారు. ఇక థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా గుర్తింపు పొందింది. My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi! pic.twitter.com/mMvq0afPjG — YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023 చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి -
ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..?
బ్యాంకాక్: నడిచే ఎస్కలేటర్ లో పొరపాటున కాలు పడి ఇరుక్కోవడంతో 57 ఏళ్ల మహిళ మోకాలి పైభాగం వరకు కాలును తొలగించిన సంఘటన థాయ్ లాండ్లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. దీంతో పర్యాటక కేంద్రమైన బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో సౌకర్యాలపై అనుమానాలు కమ్ముకుని, ఇకపై బ్యాంకాక్ పర్యటన అంటే పర్యాటకులు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డాన్ ముయాంగ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కారంత్ తనకుల్జీరపత్ తెలిపిన వివరాల ప్రకారం నఖోన్ సి తమ్మారత్ వెళ్తోన్న ఒక మహిళ నడిచే ఎస్కలేటర్ మీద వెళ్తుండగా ఉన్నట్టుండి ఆమె కాలు ఎస్కలేటర్ లోపల ఇరుక్కుపోయింది. చాలాసేపు నొప్పితో విలవిల్లాడిపోయిన ఆ మహిళకు విముక్తి కలిగించడానికి విశ్వప్రయత్నాలు చేశామని అన్నారు. ఇరుక్కున్న కాలిని విడిపించేందుకు చాలాసేపు శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంలో ఆమె కాలును మోకాలి పైభాగం వరకు తొలగించి అనంతరం దగ్గర్లోని బుమ్రుంగ్రాండ్ అంతర్జాతీయ హాస్పిటల్ కు తరలించామని తెలిపారు కారంత్. ప్రమాదానికి గల కారణం ఏమిటన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మా వలన ఆ మహిళకు జరిగిన నష్టానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని.. జరిగిన తప్పిదానికి మేము పూర్తి బాధ్యత వహిస్తామని, ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు తోపాటు ఆమెకు ఎలాంటి పరిహారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కారంత్. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. మా అమ్మ పైకి ధైర్యంగానే ఉన్నప్పటికీ కాలు తీసేయడంతో ఆమె గుండె బద్దలైందని ఒకే కాలితో జీవితాంతం ఎలాగన్న ఆలోచన తనను లోలోపలే తొలిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
వీడెవండి బాబు! యవ్వనం కోసం.. రక్తం తాగేస్తున్నాడు!
అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, వాటి కోసం పడే పాట్లు, ఎంచుకునే దారులే వేరు. కొంతమంది వ్యాయామం చేస్తే, మరికొంతమంది కాస్మోటిక్స్ ట్రై చేస్తుంటారు. అయితే, థాయ్లాండ్కు చెందిన రోజాకోర్న్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్ ఉంది. వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక అప్పటి నుంచి రోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే! ‘మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో ‘లావోఖానో’ అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను’ అని కోర్న్ చెప్పాడు. ఈ మధ్యనే ఈ కాక్టెయిల్ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్. చదవండి: బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్గా నిలిచింది! -
ప్రజాతీర్పుకు పట్టం కట్టాలి!
అణిచివేత ఎక్కువైనప్పుడు ఆగ్రహం వస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు మార్పును కోరుతూ ప్రజా సందేశాన్ని మోసుకొస్తుంది. ఆదివారం థాయిలాండ్లో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళి అందుకు తాజా ఉదాహరణ. సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న, మరోమాటలో సైన్యమే తొమ్మిదేళ్ళుగా నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. మార్పు కోరుతూ థాయిలాండ్ ఓటర్లు తీర్పునిచ్చారు. అలా 2020లో విద్యార్థుల నేతృత్వంలో సాగిన ప్రజాస్వామ్య అను కూల భారీ నిరసన ఉద్యమాల తర్వాత జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ ఫలితం అపూర్వం. దేశ రాజకీయాల్లో మిలటరీ, రాయల్టీ ప్రాబల్యాన్ని సామాన్యులు నిరసించడం అక్కడి ప్రజాస్వామ్యవాద శక్తులకు సంతోషకరమే. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులందరికీ గుణపాఠమే. 6.5 కోట్ల జనాభా గల థాయిలాండ్లో 5.2 కోట్ల మందికి ఓటు హక్కుంది. రానున్న నాలుగేళ్ళ కాలానికి 500 స్థానాల ప్రజా ప్రతినిధుల సభకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సుమారు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఛాయిస్ ఏమిటో చెప్పేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలైన ఫ్యూథాయ్, మూవ్ ఫార్వర్డ్ పార్టీలు రెండూ అధికార పార్టీని మట్టి కరిపించాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల శిబిరాలు విజయం సాధిస్తాయని ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణల నుంచి ఊహిస్తున్నదే. కానీ, ఈ స్థాయి విజయం అనూహ్యం, అద్భుతమే. పట్టణప్రాంతాల్లో పట్టున్న, ప్రగతిశీల ‘మూవ్ ఫార్వర్డ్’ 151 స్థానాలతో అగ్రపీఠిన నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పదవీచ్యుత ప్రధానమంత్రి తక్షిణ్ శినవాత్ర తరఫున జనాకర్షక రాజకీయ పక్షమైన ‘ఫ్యూథాయ్’కి 141 స్థానాలు రావచ్చని లెక్క. అయితే, అధికార శక్తులు ఈ ఫలితాలను అంగీకరించి, ఈ సంస్కరణవాద పార్టీలు ప్రభుత్వం ఏర్పరిచేలా గద్దెను అప్పగిస్తాయా అన్నదే ప్రశ్న. గత∙రెండు దశాబ్దాల్లో స్వేచ్ఛగా ఎన్నికలైన ప్రతిసారీ తక్షిణ్ నేతృత్వంలోని పార్టీలు గెలుస్తూ వచ్చాయి. సైన్యం మాత్రం కోర్టు జోక్యంతోనో, తిరుగుబాట్లతోనో వారిని పదే పదే అధికారానికి దూరం పెడుతూ వచ్చింది. నిండా 36 ఏళ్ళ తక్షిణ్ కుమార్తె ఇంగ్లక్ ఇప్పుడు ‘ఫ్యూథాయ్’ పార్టీని నడుపుతున్నారు. అయితే, వారసత్వ రాజకీయాలతో విసిగిన లక్షలాది తొలి యువ ఓటర్లు ‘మూవ్ ఫార్వర్డ్’ వైపు మొగ్గడంతో, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి. విదేశాల్లో చదివి, వ్యాపార నిమిత్తం తిరిగొచ్చి, సైనికపాలన, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న 42 ఏళ్ళ పిటా లిమ్జాయోన్రత్కు ఎన్నికల్లో జనం జై కొట్టారు. ఈ నేతలిద్దరూ సైన్యానికి ఎదురొడ్డిన ధనిక వ్యాపార కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇక, చిన్నాచితకా ప్రతిపక్షాలు సైతం ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషమే. ఈ ప్రజాస్వామ్య అనుకూల పార్టీలన్నీ కలసి సంకీర్ణ సర్కార్గా పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయట. అలా అన్నీ ఒక తాటిపైకొస్తే సైనిక పాలన, రాచరికపు అపరిమిత అధికారాలకు చరమగీతం పాడాలన్న జనం కోరిక నెరవేరుతుంది. కానీ, పార్టీలు అనుకున్నంత మాత్రాన జరగాలని లేదు. 2019 ఎన్నికల్లో నేటి ‘మూవ్ ఫార్వర్డ్’ పార్టీ ముందస్తు రూపం ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ మూడోస్థానంలో నిలిచింది. తీరా పార్టీ సారథిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. పార్టీ రద్దయింది. ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తున్న ‘మూవ్ ఫార్వర్డ్’ నేత పిటాకు సైతం ఎన్నికైన ఎంపీల మద్దతుతో పాటు సైన్యం నియమించిన సెనేటర్ల మద్దతు అవసరం. ఎన్నికల్లో గెలిచినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరం కావడమే థాయ్ లోని విచిత్రం. ఇదంతా ఎన్నికల్లో గెలిచిన పార్టీల అధికారాన్ని సైతం తటస్థీకరించేలా, సెనేట్ను నియమిస్తూ 2017లో రాజ్యాంగాన్ని సైన్యం తిరగరాసిన ఫలితం. 2014లో జనరల్ ప్రయూత్ చాన్ – ఓచా అప్పటి పౌరప్రభుత్వాన్ని పడదోసి, సైన్యం, రాయలిస్ట్ పార్టీలు, రాచరికపు అండతో తనను తాను ప్రధానిగా నియమించుకున్నారు. న్యాయవ్యవస్థ సహా అన్నిటినీ విధేయులతో నింపేశారు. ఇటు నిరుపేద థాయ్లను ఆకర్షించే ఫ్యూథాయ్ పార్టీ అన్నా... అటు నిర్బంధ సైనిక శిక్షణ, రాజు – రాణులను పల్లెత్తు మాటన్నా 15 ఏళ్ళ దాకా జైల్లోకి నెట్టే కఠినమైన ‘లెస్–మాజెస్టీ’ చట్టాలకు చరమగీతం పాడతానంటున్న మూవ్ ఫార్వడ్ పార్టీ అన్నా... సహజంగానే సైన్యానికి గిట్టదు. కానీ, రాచరిక అనుకూల చట్టాలను మారుస్తానంటున్న పార్టీకి నవతరం థాయ్ ప్రజలు జేజేలు పలకడం ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రజాస్వామ్య మార్పు పవనాలకు సూచన. ఇది గ్రహించి సంప్రదాయ శక్తులు పట్టు సడలిస్తాయా? జనం ఎన్నుకున్న 500 సభ్యుల ప్రతినిధుల సభతో పాటు పాలక సైనిక వర్గమే నియమించిన 250 మంది సభ్యుల సెనేట్కూ ప్రధాని ఎంపికలో ఓటు ఉండడమే విషాదం. అంటే ఎన్నికల్లో పెల్లుబికిన ప్రజాస్వామ్య వెల్లువను సైతం సైన్యం పరోక్షంగా తొక్కేసే ముప్పుంది. ఇన్నేళ్ళుగా దేశాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్న సైనిక జనరల్స్ తాజా ప్రజా తీర్పును గౌరవించాలి. అధికారాన్ని గెలిచిన పార్టీలకు అప్పగించి, సైనిక విధులకు పరిమితం కావాలి. ఆ పని చేయక, ప్రజాకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది థాయిలాండ్కే మంచిది కాదు. పొరుగునే మయన్మార్లో 2020 నవంబర్ ఎన్నికల్లో ఆంగ్సాన్ సూక్యీ అఖండ విజయం సాధించినా, మూడునెలల్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకొని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశంలా థాయ్లాండ్ తయారు కాకుండా ప్రపంచ దేశాలూ జాగరూకత వహించాలి. అప్పుడే థాయ్ ప్రజలు గెలిచినట్టు, అక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు! -
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్లాండ్లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి
సాక్షి, హైదరాబాద్, కొండపాక(గజ్వేల్): మొన్నటికి మొన్న ఈడీ మనీలాండరింగ్ కేసు... నిన్నటికి నిన్న థాయ్లాండ్లో గుట్టురట్టయిన అక్రమ కెసినో వ్యవహారం... ఈ రెండింటిలోనూ ప్రధానంగా వినిపించిన పేరు చీకోటి ప్రవీణ్ కుమార్. నగరానికి చేరుకున్న ప్రవీణ్ పటాయా కెసినో వ్యవహారంపై స్పందిస్తూ మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. ఆ వీడియోలో ప్రవీణ్ మాట్లాడుతూ... ‘థాయ్లాండ్లో నేను ఎలాంటి ఈవెంట్ నిర్వహించలేదు. ఆ ఈవెంట్ దేవ్, సీత అనే వాళ్లు నిర్వహించారు. పోకర్ టోర్నమెంట్ 4 రోజులు పాటు జరుగుతోందని నాకు ఆహ్వానం పంపారు. నేను అక్కడకు వెళ్లిన నాలుగో రోజు సదరు హోటల్లోని కాన్ఫరెన్స్ రూమ్ను సందర్శించా. అందులో అడుగుపెట్టిన 15 నుంచి 20 నిమిషాల్లోనే పోలీసులు దాడి చేశారు. అప్పుడే నాకు వాళ్లు పంపింది నకిలీ ఆహ్వానపత్రిక అని తెలిసింది. ఆ అక్రమ కెసినో నిర్వహించింది నేనే అయితే ఇంత తేలిగ్గా తిరిగి రాలేను. అలాంటి వాటికి అక్కడ కఠినమైన శిక్షలు ఉన్నాయి. థాయ్లాండ్లో అక్రమంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తే ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్షపడుతుంది. నా పాస్పోర్టు కూడా బ్లాక్లిస్ట్ చేసే వాళ్లు. పోలీసులు దాడి చేసిన రోజు అక్కడి న్యాయస్థానానికి సెలవు. మరుసటి రోజు కోర్టులో స్వల్ప జరిమానాతో విడిచిపెట్టారు’ అని వివరించారు. నామీద చాలా కుట్రలు ‘నా చుట్టూ చాలా కుట్రలు జరుగుతున్నాయి. నేను రాజకీయ పార్టీలోకి వస్తున్నానని కొందరు అనుకుంటున్నారేమో..! ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పటాయాలో అక్రమ కెసినోతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిర్వాహకులు దేవ్, సీత కూడా అక్కడి పోలీసుల వద్ద అంగీకరించారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నేను అక్కడ రూ.50 లక్షలు లంచం ఇచ్చానని జరుగుతున్న ప్రచారం సత్యదూరం. ఆ ఈవెంట్కు నాకు ఎలాంటి సంబంధం లేదు’అని ప్రవీణ్ అన్నారు. నాకేం సంబంధం లేదు: దేవేందర్రెడ్డి థాయ్లాండ్లోని పటాయాలో జరిగిన గ్యాంబ్లింగ్ డెన్కు తనకు ఎలాంటి సంబంధం లేదని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విహార యాత్రకు వెళ్లగా.. అక్కడి హోటల్లో ఇండియన్ ఫుడ్ తయారు చేయించామంటూ స్నేహితులు చెప్పడంతో ఆ హోటల్కు వెళ్లామన్నారు. 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్పారు. అక్కడ ఫోకర్ గేమ్ మాత్రమే పెట్టారని తెలిపారు. తమపై పెట్టిన కేసు నిరాధారమంటూ కోర్టు కొట్టివేసిందన్నారు. కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ -
నేను నిర్దోషిని: చికోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ సహా 84 మంది భారతీయుల అరెస్టుకు కారణమైన థాయ్లాండ్లోని అక్రమ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అక్కడి పోలీసులు స్పష్టత ఇచ్చారు. గత నెల 27 నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రూ.50 కోట్ల టర్నోవర్ జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు చోన్బూరీ ప్రావిన్స్ పోలీసు చీఫ్ కంపోన్ లీలప్రపపోన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడు అంతస్తుల్లో విస్తరించిన ఆసియా హోటల్లో మొత్తం 300 గదులు ఉన్నాయి. గత నెల 27న కొన్ని రూముల్లోకి దిగిన 84 మంది ఆ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వెలసిన అక్రమ జూదగృహంలో పేకాట, స్నూకర్ ఆడుతున్నారు. గేమింగ్ చిప్స్తో లావాదేవీలు జరుగుతుండగా ఆ వివరాలను 40 గేమింగ్ క్రెడిట్ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు వాటిలో నమోదైనట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. చికోటి స్పందన.. థాయిలాండ్ వ్యవహారంపై చికోటి ప్రవీణ్ మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు దేవ్, సీత అనే వ్యక్తుల నుంచి ఫోకర్ టోర్నమెంట్ ఉందని ఆహ్వానం అందితేనే థాయ్లాండ్ వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్ నిషేధం అనే విషయం తనకు తెలియదని, ఆ అక్రమ క్యాసినో నిర్వాహకుడిని తాను కాదన్నారు. తన నిర్దోషిత్వాన్ని థాయ్ పోలీసుల ఎదుట నిరూపించుకున్నట్లు చెప్పారు. సదరు హాల్లోకి తాను అడుగు పెట్టిన పది నిమిషాలకే పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్లో స్ట్రీమ్ అయ్యేలా: అక్రమంగా నడుస్తున్న ఈ పేకాట శిబిరంపై అక్కడి పోలీసులకు అదే హోటల్లో బస చేసిన ఓ గోవా వాసి ద్వారా సమాచారం అందింది. హోటల్పై దాడి చేసిన పోలీసులు అందులో నాలుగు పేకాట టేబుళ్లు, మూడు పోకర్ టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 16 మంది మహిళల సహా 84 మంది భారతీయులు, థాయ్లాండ్కు చెందిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వీరందరికీ థాయ్లాండ్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పూచీకత్తుగా 4,500 బాట్స్ (దాదాపు రూ.11వేలు) చెల్లించాలని ఆదేశించింది. ఈ తతంగమంతా పూర్తి చేసుకుని, పాస్పోర్టులు పొందిన తర్వాత భారతీయులంతా తిరిగి రానున్నారు. అయితే... ఆ పేకాట శిబిరంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాటిని ఇంటర్నెట్తో అనుసంధానించారు. ఆ లైవ్ ఫీడ్ హైదరాబాద్లో స్ట్రీమ్ అయ్యేలా ఏర్పాటుచేసినట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి అక్రమ ఈవెంట్లు భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు నగదు కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఫైనాన్షియర్ కోసమే ఈ క్యాసినో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ హామీ మాకెందుకు ఇవ్వరు?: కేటీఆర్ -
థాయ్లాండ్లో చికోటి ప్రవీణ్కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్యాంబ్లింగ్పై నిషేధం ఉన్న థాయ్లాండ్లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడిన చికోటి ప్రవీణ్కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్తో పాటు 83 మందికి బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాను కోర్టు విధించింది. ఫైన్ కట్టించుకుని పాస్పోర్టులను పోలీసులు తిరిగిచ్చేశారు. కాగా, థాయ్లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు అందించిన సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్గా తేలిన విషయం తెలిసిందే. చదవండి: థాయ్లాండ్లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు -
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సంచలన విషయాలు
-
చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్పై నిషేధం ఉన్న థాయ్లాండ్లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్ పోలీసులు వేగవంతం చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. థాయ్లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్గా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్లాండ్కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు. చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్ను చేధించారు థాయ్ పోలీసులు. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో హైదరాబాద్కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ డీసీసీబీ చైర్మన్.. బీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్రెడ్డితో పాటు ఇసుక వ్యాపారి సాగర్, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం వీఆర్ఏ వాసు సైతం అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్లాండ్ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు. అయితే.. అనుమతి లేకుండా థాయ్లాండ్ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్సాగర్ అనే ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. క్యాసినోకు ఫైనాన్స్ చేసిన వినోద్రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్ మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్ ఓనర్ను కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. ఆమె సహకారం.. భారీగా వసూళ్లు అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్ పట్టాయా హోటల్ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్ కెల్వెల్కర్ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్ అనే థాయ్ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఇల్లీగల్ మైగ్రేంట్ వర్కర్స్ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. పట్టాయాలో గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్ పోలీసులు.. అక్కడి సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు హోటల్లో కన్వెన్షన్ హాల్ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్జాక్ టేబుల్స్ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్కు లైవ్ రికార్డింగ్ కనెక్ట్ చేశాడని థాయ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్తోపాటు నేపాల్లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్రావు ఆసక్తికర వ్యాఖ్యలు -
థాయ్ లాండ్ పోలీసుల అదుపులో చికోటి, మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డి
-
థాయ్ లాండ్ లో చికోటి ప్రవీణ్ అరెస్ట్
-
థాయ్లాండ్లో చికోటి ప్రవీణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: థాయ్లాండ్లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. పటాయలో 90 మంది భారతీయులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నటు తెలుస్తోంది. పటాయలో ఓ హోటల్లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న థాయ్ పోలీసులు.. దాడులు నిర్వహించారు. థాయ్లాండ్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ అయిన వాళ్లలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్, భారతీయ నగదును థాయ్లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్తో పాటు అరెస్ట్ అయిన వాళ్లలో మాధవరెడ్డి, దేవేందర్రెడ్డి కూడా ఉన్నారు. గేమ్స్ ఆడేందుకు పెద్ద ఎత్తున్న భారతీయులను చికోటి థాయ్లాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్లో థాయ్లాండ్ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇదీ చదవండి: ఆఫ్టర్ 55 ఇయర్స్ వాళ్లంతా.. -
రూ. 3 కోట్ల లాటరీ.. భర్త ఇంటికి రావడంతో ఊహించని షాకిచ్చిన భార్య!
సుమారు రూ.3 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్న ఓ భార్య ఈ విషయాన్ని భర్త దగ్గర దాచిపెట్టి సర్ప్రైజ్ కాదు పెద్ద షాక్ ఇచ్చింది. అసలు విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యపై దావా వేశాడు. ఈ ఘటన థాయ్లాండ్లో చోటు చేసుకుంది. అసలు వీళ్ల కథేంటంటే.. వివరాల్లోకి వెళితే.. థాయ్ల్యాండ్లో నివసిస్తున్న నారిన్కి 20 ఏళ్ల క్రితం చవీనాన్ అనే మహిళతో వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వారికి పెద్ద మొత్తంలో అప్పులు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లు. కుటుంబ పోషణతో పాటు అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకుని.. ఈ క్రమంలో సంపాదన కోసం భార్యాభర్తలు 2014లో దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే కొన్ని రోజులు తర్వాత నరిన్ దక్షిణ కొరియాలో పని చేస్తూనే ఉండగా, అతని భార్య మాత్రం కుమార్తెలను చూసుసుకునేందుకు తిరిగి థాయ్లాండ్కు వచ్చేసింది. కుటుంబం కోసం ప్రతి నెల నరిన్ ప్రతి నెలా దాదాపు డబ్బులు పంపేవాడు. చవీవాన్ లక్కీగా లాటరీలో రూ.2.9 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ గుడ్న్యూస్ తన భర్తకి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత లాటరీని విషయాన్ని చవీనాన్ దాచిందని తన కుమార్తెల ద్వారా నరిన్ తెలుసుకున్నాడు. ఇది తెలుసుకునేందుకు ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి మార్చి 3న అతను థాయ్లాండ్కు వెళ్లాడు. అయితే తన భార్య ఫిబ్రవరి 25న తన ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు తెలిసి షాకయ్యాడు. దీనిపై నరీన్ స్పందిస్తూ.. ‘నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యా. ఏం చేయాలో తెలియడం లేదు. మా 20 ఏళ్ల వైవాహిక జీవితంలో తన భార్య ఇలా చేస్తుందని ఏరోజూ ఊహించలేదు. నా బ్యాంకు ఖాతాలో కూడా ప్రస్తుతం పెద్దగా నగదు లేదు. తను మోసం చేసింది. అందుకే న్యాయం కోసం ఆమెపై కోర్టులో దావా వేశా’ అని అతడు వాపోయాడు. పోలీసులు, ఇతర సంబంధిత శాఖలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్లాండ్ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్లాండ్లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్లాండ్లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్పీస్ థాయ్లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మితిమీరిన వాయు కాలుష్యం.. 2 లక్షల మంది ఆస్పత్రి పాలు!
బ్యాంకాక్: థాయ్లాండ్లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. బ్యాంకాక్లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి. -
యంగ్ టాలెంట్
థాయ్లాండ్లో పుట్టిన వర్షిత పదమూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో ఇండియాకు వచ్చింది. సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చెన్నైలోని ‘కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ’లో మ్యూజిక్ కోర్సు చేసింది. ‘స్వర్ణభూమి అకాడమీ ఆఫ్ మ్యూజిక్’ నిర్వహించిన వర్క్షాప్కు హాజరైన తరువాత జాజ్ మ్యూజిక్పై ఆసక్తి మొదలైంది. వర్షిత ఫస్ట్ సింగిల్ ‘స్టే’కు మంచి స్పందన వచ్చింది. స్పాటిఫై, యూట్యూబ్, సౌండ్క్లౌడ్లో ఆమె పాటలు ఎంతో ఆదరణ పొందాయి. ఇరవై సంవత్సరాల వయసులో సెవెన్ ఐలాండ్ ఫిల్మ్ఫెస్టివల్, కోవ్లాంగ్ పా యింట్ సర్ఫ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లాంటి ఎన్నో ఫెస్టివల్స్లో తన గాత్రాన్ని వినిపించింది వర్షిత. ఏఆర్రెహమాన్ మ్యూజిక్ ట్రూప్లో భాగంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. 22 సంవత్సరాల వర్షిత పాటలు పడడంలోనే కాదు రాయడంలో కూడా ప్రతిభ చూపుతుంది.వర్షిత ΄పాటల్లో ఎంత మాధుర్యం ఉంటుందో, మాటల్లో అంత ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస కోణంలో ఎన్నో కళాశాలల్లో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చింది. -
నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్లా సర్జరీ! కానీ..
ఇటీవలకాలంలో పలు నేరస్తులు పోలీసులకు పట్టబడకుండా ఉండేందుకు చేసే పనులు విస్మయానికి గురి చేస్తున్నాయి. అతి తెలివితో పేరు, వేషంతో సహా కొందరూ సర్జరీలతో ముఖ మార్పిడికి సిద్ధపడిపోతున్నారు. అయినప్పటికీ వారు చేసిన నేరాలే వారిని చివరికి పట్టించేస్తున్నాయి. ఎన్ని వేషాలు వేసినా.. చివరికీ కటకటాలపాలు కాక తప్పట్లేదు. వివరాల్లోకెళ్తే..థాయ్ డ్రగ్ డీలర్ పోలీసులకు చిక్కకూడదని పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. ఐతే అతను చేసిన ఆ ప్రయత్నాలేమి ఫలించకపోగా..అతడు పోలీసులకు పట్టుబడక తప్పలేదు. సహరత్ సవాంగ్జాంగ్ అనే వ్యక్తి కొరియన్లా సర్జరీ చేయించుకుని సియోంగ జిమిన్గా పేరు మార్చుకుని అసలు గుర్తింపు దాచే యత్నం చేశాడు. ఐతే అతను డ్రగ్స్ను ఇతరలకు కొనుగోలు చేయడం కారణంగా అతన్ని సులభంగా ట్రాక్ చేశారు పోలీసులు. దీంతో బ్యాంకాక్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న సవాంగ్జాంగ్ని పోలీసులు అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు దర్యాప్తులో సాక్ష్యులు అతన్ని అందమైన కొరియన్గా అభివర్ణించారు. ఐతే అతను క్లాస్ వన్ డ్రగ్ అయిన ఎక్స్టసీ(ఎండీఎంఏ)ని దిగుమతి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతను పట్టబడటానికి ముందు గతంలో మూడుసార్లు అరెస్టు అయ్యాడు కూడా. గానీ ఏదోరకంగా నిర్బంధం నుంచి తప్పించుకునే వాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసు మేజర్-జనరల్ థీరదేజ్ తమ్మసూటీ మాట్లాడుతూ.. సవాంగ్జాంగ్ కేవలం 25 ఏళ్ల వయసులో పేరుమోసిన డ్రగ్ డీలర్గా మారాడని, ఇలాంటి వాళ్లు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, ఇటీవల థాయ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణ తదితరాలపై కొరడా ఝళిపిస్తోంది. (చదవండి: అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదు! మరోసారి పాక్పై విరుచుకపడ్డ నిక్కీ) -
అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. 14 రోజుల్లోనే వీసా..!
న్యూఢిల్లీ: అమెరికా వీసా ఆశావహులు ప్రస్తుతం భారత్లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. బీ1, బీ2 వీసాల కోసం వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. మొదటిసారి దరాఖాస్తుదారుల్లా అందరికీ ఇంటర్వ్యూ మినహాయింపు లేకపోవడంతో వీసా అపాయింట్మెంట్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే భారతీయుల కోసం ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బ్యాంకాక్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం దేశాల్లోని అమెరికా ఎంబసీలు భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే అమెరికా వీసా గడువు ముగిసిన భారతీయులు ఈ దేశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా లభిస్తుంది. ప్రస్తుతం కోల్కతా నుంచి అమెరికా బీ1, బీ2 వీసాల కోసం ధరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కోసం 589 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ముంబై నుంచి అయితే ఏకంగా 638 రోజులు వేచి చూడాలి. చెన్నైలో అయితే 609 రోజులు, హైదరాబాద్లో అయితే 596 రోజులు, ఢిల్లీలో అయితే 589 రోజులు వెయిట్ చేయాలి. కానీ భారతీయులు బ్యాంకాక్ వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేస్తే 14 రోజుల్లోనే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తవుతుంది. వీసా త్వరగా రావాలనుకునే వారు ఈ దేశాలకు వెళ్తే సరిపోతుంది. జనవరిలో తాము లక్ష వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ శనివారం వెల్లడించింది. 2019 జులై తర్వాత ఒక్క నెలలో ఇన్ని దరఖాస్తులు పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రానున్న రోజుల్లో సిబ్బంది పెరుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేస్తామని పేర్కొంది. కరోనా సమయంలో అమెరికా ఎంబసీలు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో కొంతమందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. ఈ కారణంగానే వీసాల జారీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. అయితే భారతీయుల కోసం అమెరికా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. బీ1, బీ2 వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి: డబ్బు ఉందా?.. దుబాయ్లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా -
Golf League: అదరగొట్టిన ఈగల్ హంటర్స్, సామా ఏంజెల్స్
Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మరింత రసవత్తరంగా మారింది. గ్రూప్ స్టేజ్లో ఆధిక్యం కోసం జట్లన్నీ పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా మూడో సీజన్ సెకండ్ లెగ్ పోటీల్లో అండర్ డాగ్స్ సెంట్రో ఈగల్ హంటర్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 113 పాయింట్లతో అత్యుత్తమంగా రాణించింది. ఈగల్ హంటర్స్ తరపున కేవీఎస్ ఎన్ రెడ్డి, సురేష్ రాణించారు. అదే విధంగా.. తొలిసారి మహిళలు ఓనర్లుగా ఉన్న ఏకైక గోల్ఫ్ టీమ్ ‘సమా ఏంజెల్స్’ టీమ్.. మూడో సీజన్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సరోజా వివేక్, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా వ్యవహరిస్తున్న సమా టీమ్ వికారాబాద్లోని వూటీ గోల్ఫ్ కోర్స్లో జరిగిన మూడో రౌండ్లో సత్తా చాటింది. సరోజా వివేక్, మాధవి సహా టీమ్ గోల్ఫర్లు ఆకట్టుకున్నారు. ఈ రౌండ్లో సామా ఏంజెల్స్ 109 పాయింట్లు సాధించింది. సిటీలో జరుగుతున్న అది పెద్ద లీగ్ అయిన హెచ్పీజీఎల్లో నాలుగు గ్రూప్స్లో 16 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్లో 10 మంది గోల్ఫర్లు ఉన్నారు. ఇక గ్రూప్ దశలో తొలి రెండు రౌండ్లు హెచ్సీఏ, బౌల్డర్ హిల్స్లో నిర్వహించారు. వచ్చే బుధ, శనివారాల్లో గ్రూప్ దశలో చివరి రౌండ్లు జరుగనున్నాయి. అనంతరం నాకౌట్ రౌండ్ ఆరంభమవుతుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు టీమ్స్ క్వార్టర్స్కు అర్హత సాధిస్తాయి. వచ్చే నెల 24న థాయ్లాండ్లో ఫైనల్స్ను జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్.. షాక్కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా.. Gongadi Trisha: శెభాష్ బిడ్డా! మ్యాచ్ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు -
విదేశాలకు గుంటూరు ఘాటు.. మలేషియా, థాయ్లాండ్పై స్పెషల్ ఫోకస్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సన్న రకం మిర్చి ఘాటును మరిన్ని దేశాలకు రుచి చూపేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఏటా రూ.3,502 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరుగుతుండగా 2024–25 నాటికి రూ.4,661 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాల వారీగా ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన వెల్లడించారు. ప్రస్తుతం గుంటూరు నుంచి సుమారు 16 దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుండగా అత్యధికంగా చైనా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియాకు అత్యధికంగా జరుగుతున్నాయి. మిగిలిన దేశాలకు ఎగుమతులు నామమాత్రంగా ఉన్నాయి. థాయ్లాండ్ ఏటా దిగుమతి చేసుకుంటున్న మిర్చిలో గుంటూరు నుంచి 56.7 శాతం, మలేషియా 45.6 శాతం మాత్రమే ఉండటంతో ఎగుమతులు మరింత పెంచేలా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా ప్యాకింగ్ లేకపోవడం, ఎండబెట్టడం లాంటి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు సరిపడా లేకపోవటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు 121.6 ఎకర్లాల్లో స్పైసెస్ పార్క్తో పాటు క్లస్టర్ వ్యవస్థ అభివృద్ధి, ఎగుమతుల అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేయనున్నారు. మిర్చి ఉప ఉత్పత్తులను ప్రోత్సహించేలా చిల్లీసాస్, చిల్లీ పికిల్, చిల్లీ పేస్ట్, చిల్లీ ఆయిల్ లాంటి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత అందించనున్నారు. గుంటూరు మిర్చి ప్రత్యేకతలివే.. మూడు నుంచి 5 సెంటీమీటర్ల పొడవైన గుంటూరు సన్న రకం మిరప ఎర్రటి ఎరుపుతో ఘాటు అధికంగా ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్లు అధికంగా ఉండటం దీని ప్రత్యేకత. గుంటూరు మిర్చికి 2009లో భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. సన్న రకం మిర్చి సాగుకు గుంటూరు జిల్లా వాతావరణం అనుకూలం కావడంతో 77,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ మిర్చిని వంటల్లోనే కాకుండా సహజ సిద్ధమైన రంగుల తయారీలో వినియోగిస్తారు. కాస్మొటిక్స్, పానియాలు, ఫార్మా స్యూటికల్స్, వైన్ తయారీతో పాటు పలు రంగాల్లో ఈ మిర్చి ఉత్పత్తులను వినియోగిస్తారు. ఇన్ని విశిష్టతలున్న గుంటూరు మిర్చిపై చైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చైనా ఏటా దిగుమతి చేసుకునే మిర్చిలో 86.7 శాతం భారత్ నుంచే కావడం గమనార్హం. గుంటూరు జిల్లా నుంచి 2021–22లో చైనాకు రూ.1,296 కోట్ల విలువైన మిర్చి ఎగుమతులు జరిగాయి. చదవండి: ఓర్చుకోలేక.. ‘ఈనాడు’ విషపు రాతలు.. సీమను సుభిక్షం చేస్తున్నదెవ్వరు? -
15 లక్షల ఖాళీ బీరు సీసాలతో ఆలయం
ప్లాస్టిక్తోనే కాదు, గాజుతోనూ పర్యావరణానికి ముప్పే! ప్లాస్టిక్ ఎంతకాలమైనా మట్టిలో కలవదు. గాజు కొంతకాలానికి మట్టిలో కలిసిపోతుంది. ఆ లెక్కన ప్లాస్టిక్ కంటే గాజు మెరుగైనదే అయినా, గాజు తయారీ ప్రక్రియలో గాజును కరిగించడానికి అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. ఫలితంగా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదలై, పరిసరాల్లోని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్లాండ్ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సీసాల ఆలయం. థాయ్లాండ్లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్హాన్ ప్రాంతంలో ఉంది ఈ సీసాల ఆలయం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి అంచనా వేసిన మేరకు 15 లక్షల ఖాళీసీసాలను సేకరించి, రెండేళ్లలో దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాంగణంలో ఇదేరీతిలో 2009 నాటికి ఇరవై కట్టడాలను నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించినవే! ‘మిలియన్ బాటిల్ టెంపుల్’గా వార్తలకెక్కిన ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేది. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్లాండ్లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్లాండ్కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు. ఎందుకు నిర్మించారంటే..? పనిగట్టుకుని మరీ ఖాళీసీసాలతో ఆలయ జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనుకుంటున్నారా? నిజానికి పర్యావరణాన్ని రక్షించుకోవలసిన అవసరం తీవ్రంగానే ఏర్పడింది. చుట్టూ సముద్రతీరం ఉండే థాయ్లాండ్ బీచ్లలో పర్యాటకుల కోలాహలం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ముందు– అంటే, 1984 నాటికి ముందు థాయ్ బీచ్లలో ఎక్కడ చూసినా వాడి పారేసిన ఖాళీ బీరుసీసాలు గుట్టలు గుట్టలుగా కనిపించేవి. సముద్రాన్నే మింగేసేంతగా ఖాళీ సీసాల గుట్టలు ఏర్పడటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. థాయ్ ప్రభుత్వానికి కూడా ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది. సముద్రం కలుషితం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం ఉందని గుర్తించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీరంలో గుట్టలుగా పేరుకుపోతున్న ఖాళీసీసాలను ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఈ సమస్య పరిష్కారానికి మీ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోండి’ అని ప్రజలను కోరింది. బౌద్ధభిక్షువులను కూడా ఇదే కోరిక కోరింది. ప్రభుత్వం పిలుపుతో బౌద్ధభిక్షువులు ముందుకొచ్చారు. ‘ఖాళీసీసాలను మాకిచ్చేయండి. మేము ఇక్కడ ఆలయం నిర్మించుకుంటాం’ అని అడిగారు. ‘ఇవ్వడమేంటి? తీరానికి వెళ్లి మీరే కావలసినన్ని సీసాలను తీసుకెళ్లండి’ అని బదులిచ్చింది ప్రభుత్వం. లక్షలాది సీసాలను తెచ్చుకోవడం కొద్దిమంది బౌద్ధభిక్షువుల వల్ల సాధ్యమయ్యే పనికాదు. దీంతో ఆలయ ధర్మకర్తలు బాగా ఆలోచించి, సీసాల సేకరణ కోసం ప్రజల సహాయాన్ని కోరారు. ఒక్కరూ స్పందించలేదు. కొన్నాళ్లు ఓపికగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో మరో ప్రకటన చేశారు. ‘పరిశుభ్రతే పరమాత్మ. అందువల్ల అందరూ తలా ఓ చెయ్యి వేసి, దైవకార్యానికి మీ వంతు సహాయం చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కలసిరండి. పర్యావరణ పరిరక్షణకు సహాయపడండి’ అని ప్రకటించడంతో ప్రజల్లో నెమ్మదిగా స్పందన మొదలయ్యింది. ఒక్కొక్కరే సీసాలు సేకరించి, ఆలయానికి ఇవ్వసాగారు. థాయ్ తీరంలో నెమ్మదిగా సీసాల గుట్టలు తరిగిపోసాగాయి. అలాగే ఆలయ నిర్మాణం వేగం పుంజుకుంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలా చక్కని సీసాల ఆలయం తయారైంది. వనరుల పునర్వినియోగానికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఉదాహరణ. - దినేష్ రెడ్డి -
Anchor Vishnupriya: థాయ్లాండ్ వ్యాకేషన్లో విష్ణు ప్రియ (ఫొటోలు)
-
మిస్ థాయ్లాండ్ ధరించిన ఈ డ్రెస్ వేటితో తయారు చేశారో తెలుసా..?
అందాల పోటీ అంటేనే గుర్తొచ్చేది వారు ధరించే దుస్తులు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ బ్యూటీ కాంటెస్ట్లో మోడల్స్ రకరకాల దుస్తులు ధరిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే యువతులు అందం, ప్రతిభ ఎంత ముఖ్యమో వస్త్రధారణ కూడా అంతే ముఖ్యం. జడ్జిలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా వీరి వస్త్రధారణ ఉంటుంది. కళ్లు చెదిరే డ్రెస్లతో సాక్షాత్తు దేవకన్యే దిగివచ్చిందా? అనేలా క్యాట్ చేస్తూ మైమరిపిస్తుంటారు. మిస్ యూనివర్స్ 2022 పోటీలు తాజాగా న్యూజెర్సీలో జరిగాయి. ఈ పోటీల్లో థాయ్లాండ్ తరపున పోటీలో నిలిచిన అన్నాసుయాంగమ్-ఐయామ్ (Anna Sueangam-Iam) పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఇటీవల జరిగిన ప్రాథమిక పోటీలో ఆమె ధరించిన వెరైటీ గౌను అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె కాస్టూమ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. టైటిల్ గెలవకుండానే అందరి దృష్టిని ఆకర్షించిన అన్నా గౌను అంత పాపులర్ కావడం వెనక ఓ బాధాకరమైన గతం ఉంది. వాడిపడేసిన కోక్ డబ్బా మూతలతో.. చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపించిన ఈ గౌను వాస్తవానికి వాడిపడేసిన డ్రింక్ డబ్బాల మూతలతో తయారు చేశారు. మిస్ యూనివర్స్ థాయ్లాండ్ ఇన్స్ట్రాగ్రామ్ పేజ్లో అన్నా గౌనుకి సంబంధించిన వివరాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రఖ్యాత థాయ్ డిజైనర్ అరిఫ్ జహవాంగ్ ఈ డ్రెస్సును రూపొందించాడు. అన్నా తన బాల్యం, గత జీవితాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఈ డ్రెస్సును తయారు చేయించింది ఈ క్రమంలో ఉపయోగించిన డ్రింక్ క్యాన్స్ మూతలతో (రిసైకిల్ వ్యర్థాలతో) దీనిని తీర్చిదిద్దేలా జాగ్రత్త పడింది. లుక్ కోసం ఆ మూతల మధ్యలో స్వరోవ్స్కీ డైమండ్స్ వచ్చేలా రెడీ చేసుకుంది. ఈ గౌనుతోనే అన్నా ప్రాథమిక పోటీల్లో పాల్గొంది. బాల్యమంతా చెత్తలోనే కాగా థాయ్లాండ్కు చెందిన అన్నా తండ్రి చెత్త సేకరిస్తూ, తల్లి వీదుల్లో చెత్త ఊడుస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో ఆమె బాల్యమంతా చెత్తకుప్పలు, వాడి పడేసిన వస్తువుల మధ్యే సాగింది. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటే ఎక్కువ గడపడంతో అన్నా తన నానన్మ దగ్గరే పెరిగింది. తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి కూతుర్ని చదివించారు. అందుకు తగ్గట్టే అన్నా కష్టపడి చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. చదువుకునే రోజుల్లో కొందరు ఆమెను గార్బెజ్ బ్యూటీ క్వీన్గా ఎగతాళి చేసేవారు. అయినా అన్నా అవన్నీ పట్టించుకునేది కాదు. ఓవైపు చదువులో రాణిస్తూ మరోవైపు అందాల పోటీల్లో పాల్గొనేది. అలా మిస్ థాయ్లాండ్ 2020’ పోటీల్లో పాల్గొని ‘టాప్ 16’లో చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత జరిగిన ‘మిస్ యూనివర్స్ థాయ్లాండ్ 2022’ పోటీల్లో టైటిల్ సంపాదించి తన కలను సాకారం చేసుకుంది. తనను విమర్శించిన నోళ్లను మూయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. గతం ఎలా ఉన్నా కృషి పట్టుదల, నమ్మకంతో గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించింది. View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) View this post on Instagram A post shared by Miss Universe Thailand (@missuniverse.in.th) తన డ్రెస్కు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ గౌనులో నా బాల్యం దాగుంది. నా తల్లిదండ్రులు చెత్తను సేకరించేవారు. నా బాల్యమంతా చెత్తకుప్పల మధ్యే సాగింది. అందుకే అందరూ వాడి పడేసిన కూల్డ్రింగ్ మూతలతో ఈ గౌన్ను డిజైన్ చేయించాను. పనికిరాని వస్తువులకు కూడా అందం, విలువ ఉంటాయని దీని ద్వారా ప్రపంచానికి చూపించాలనుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ చెప్పుకొచ్చింది. మిస్ యూనివర్స్ 2022 టైటిల్ గెలుచుకున్న అమెరికా భామ మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా 2022గానూ పోటీలు న్యూజెర్సీలో (జనవరి 14న) జరిగాయి. ఈ ఏడాది భారత్ తరపున కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల దివితా రాయ్ ప్రాతినిథ్యం వహించారు. గతేడాది మిస్ దివా యునివర్స్ టైటిల్ను ఈమె సొంతం చేసుకొని మిస్ యూనివర్స్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. అయితే అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని దక్కించుకుంది. The new Miss Universe is USA!!! #MISSUNIVERSE pic.twitter.com/7vryvLV92Y — Miss Universe (@MissUniverse) January 15, 2023 -
కీర్తిసురేష్.. నీకు ఇలాంటివి అవసరమా? అస్సలు సూట్ కాదు
తమిళసినిమా: నటి కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలో సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. తర్వాత తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో లైంగికదాడికి గురై ప్రతీకారేచ్ఛతో రగిలే యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా కొన్ని హీరోయిన్ సెంట్రింగ్ కథా పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో కీర్తిసురేష్ ఇప్పుడు పూర్తిగా గ్లామర్పై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కారణం అవకాశాలు తగ్గడమే అని ప్రచారం జరుగుతోంది. తెలుగులో చిరంజీవికి చెల్లెలుగా బోలాశంకర్ చిత్రంలో, నానికి జంటగా దసరా చిత్రంలో నటిస్తోంది. వీటిలో దసరా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇకపోతే తమిళ్లోను శివకార్తికేయన్కు జంటగా నటించిన మావీరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో కీర్తిసురేష్ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈమె తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు థాయిలాండ్లో విహారయాత్ర చేస్తోంది. అక్కడ బికినీ దుస్తుల్లో దిగిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేష్ హాట్నెస్ ఓవర్ లోడ్ కీర్తి వేరే లెవెల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే కీర్తి ఇలాంటివి నీకు సరిపడవు. పాత కీర్తిలా ఉంటేనే బాగుంటావు అంటూ సూచనలు ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
పాన్ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్ డాలర్లు, కంగుతిన్న అధికారులు
ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్లో వందలకొద్ది పాన్మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్కత్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్పోర్ట్ ఇంటిలిజెన్స్ అధికారులు కోల్కతా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్ అధికారులు నిందితుడు పాన్మసాలా ప్యాకెట్లలో యూఎస్ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు. సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్లో ఒక జతన యూఎస్ కరెన్సీ దానితో పాటు పాన్ పౌడర్ పెట్టి ప్యాక్ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్లోని బ్యాంకాక్కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది) #WATCH | AIU officials of Kolkata Customs intercepted a passenger scheduled to depart to Bangkok yesterday. A search of his checked-in baggage resulted in the recovery of US $40O00 (worth over Rs 32 lakh) concealed inside Gutkha pouches: Customs pic.twitter.com/unxgdR7jSu — ANI (@ANI) January 9, 2023 -
విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
-
Video: విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. చేయి దించి మాట్లాడంటూ..
కారణం ఏంటో తెలియదు కానీ విమానంలో కొంతమంది యువకులు తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్లాండ్కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్ నుంచి కోల్కతా వస్తున్న థాయ్ స్మైల్ ఎయిర్వేస్ టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు. విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది. దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కావడంతో తనను తాను రక్షించుకుంటూ వారి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు రికార్డ్ చేయగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 ఇందులో.. ఇద్దరిలో ఒకరు.. కూర్చోని నెమ్మదిగా మాట్లాడండి అని చెబుతుండగా.. ఎదుటి వ్యక్తి ముందు చేయి కిందకు దించు అని అరవడం వినిపిస్తోంది. సెకన్ల వ్యవధిలోనే వీరి మధ్య గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రైలు, బస్సులో సీటు కోసం గొడవ పడటం చూశాం. కానీ విమానంలో ఒకరినొకరు తన్నుకోవడం ఏంట్రా బాబూ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అంతేగాక ఇప్పటివరకు, థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఈ ఘటనపై స్పందించలేదు. చదవండి: Bomb Cyclone: జారిపోతున్న కార్లు.. మంచులా మారుతున్న వేడి నీళ్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
షాకింగ్.. మనిషి మెదడును తినేసే వ్యాధి.. ఆ దేశంలో తొలి మరణం..
సియోల్: దక్షిణ కొరియాలో 'నాయ్గ్లేరియా ఫాలెరీ' తొలి మరణం నమోదైంది. ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీన్నే 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. డిసెంబర్ 10న థాయ్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి(50) ఆ మరునాడే ఆస్పత్రిలో చేరాడని, గత మంగళవారం చనిపోయాడని అధికారులు వివరించారు. దేశంలో ఇదే తొలి కేసు అని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారి వెలుగుచూసింది. ఈ అమీబా కొలనులు, నదులు, కాలువలు, చెరువల్లో ఉంటుంది. మనిషి ముక్కు, నోరు లేదు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఫలితంగా మరణానికి కారణం అవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణుల చెప్పారు. అయినా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. కొలనులు, కాలువల్లోకి దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు అత్యంత అరుదుగా నమోదవుతాయి. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొరియాలోనూ వెలుగుచూసింది. చదవండి: కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్.. -
మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..
బ్యాంకాక్: థాయ్లాండ్ సముద్రజలాల్లో ఆ దేశ యుద్ధనౌక ఒకటి మునిగిపోయింది. ఆ ఘటనలో 75 మందిని కాపాడారు. అయితే 31 మంది నావికుల జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం థాయ్లాండ్ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నమైంది. ప్రచుయాప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్లోని బాంగ్సఫాన్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. ఆదివారం రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. 75 మందిని కాపాడగా మిగతా వారి గాలిస్తున్నారు. చదవండి: పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్ను సీజ్ చేసి.. -
థాయ్ ప్రిన్స్కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్లాండ్లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి..
గచ్చిబౌలి (హైదరాబాద్): హిందీ భాష నేర్చుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి వచ్చిన థాయ్లాండ్ విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. హిందీపాఠాలు నేర్పి స్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్డ్రింక్లో మద్యం కలిపి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించాడు. వర్సిటీలో బాధితురాలితోపాటు చదివే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్లు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ధర్నా విరమించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు వెల్లడించారు. హిందీ నేర్పిస్తానంటూ.. థాయ్లాండ్కు చెందిన విద్యార్థిని (24) హెచ్సీయూలో ఎంఏ హిందీ చదువుతోంది. 25రోజులుగా హెచ్సీయూలోని ఇంటర్నేషనల్ స్టడీస్ హస్టల్లో ఉంటోంది. వర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ రవి రంజన్ ఆమెపై కన్నువేశాడు. హిందీ నేర్పిస్తానని, తన నివాసానికి రావాలని కోరాడు. శుక్రవారం క్లాసులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకుని మసీదుబండ ప్రాంతంలోని తన ఫ్లాట్కు తీసుకువెళ్లాడు. పాఠాలు చెప్తూ కూల్డ్రింక్లో మద్యం కలిపి థాయ్లాండ్ విద్యార్థినికి ఇచ్చాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. వెంటనే థాయ్లాండ్లోని ప్రొఫెసర్కు ఫోన్ చేసి రవి రంజన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం చెప్పింది. థాయ్లాండ్ ప్రొఫెసర్ వెంటనే రవి రంజన్కు ఫోన్ చేసి విద్యార్థినిని వదిలేయాలని తీవ్రంగా మందలించాడు. దీనితో భయపడిన రవి రంజన్.. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినిని వర్సిటీ హస్టల్ సమీపంలో వదిలివెళ్లిపోయాడు. బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెంటనే వర్సిటీ క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అసొసియేట్ ప్రొఫెసర్ అలోక్ మరో ఇద్దరు హెల్త్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే థాయ్ విద్యార్థినికి హిందీ, ఇంగ్లిష్ రాకపోవడంతో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయింది. దీనితో వారు థాయ్ ప్రొఫెసర్ సాయంతో ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్టు తెలుసుకున్నారు. దీనిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద ప్రొఫెసర్ రవి రంజన్పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. థాయ్ విద్యార్థిని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, షాక్లో ఉన్న ఆమె తేరుకున్నాక మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని.. అవసరమైతే సెక్షన్లు మార్చుతామని మాదాపూర్ ఏసీపీ రఘునందన్రావు తెలిపారు. అట్టుడికిన క్యాంపస్ ప్రొఫెసర్ రవిరంజన్ ఘాతుకం తెలిసిన హెచ్సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ ప్రధాన ద్వారం లోపల స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ధర్నాకు దిగాయి. ప్రొఫెసర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆందోళన చేశాయి. హెచ్సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్, వీసీ సర్రాజు, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్ రవి రంజన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై వర్సిటీ స్వయంగా ఫిర్యాదు చేస్తుందని హమీ ఇచ్చారు. దీనితో విద్యార్థి సంఘాలు ధర్నా విరమించాయి. మహిళా సాధికారత ఉపన్యాసంతో! థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రొఫెసర్ రవి రంజన్ ఇటీవల మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదంటూ మండిపడ్డారు. పోలాండ్లో ప్రొఫెసర్గా పనిచేసిన రవి రంజన్.. 2018లో హెచ్సీయూలో చేరినట్టు చెప్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం హెచ్సీయూకు ఇప్పటివరకు మంచిపేరు ఉంది. కానీ ప్రొఫెసర్ రవి రంజన్ చర్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. థాయ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. అప్పటిదాకా పోరాడుతాం. – అభిషేక్ నందన్, హెచ్సీయూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రవి రంజన్పై కఠిన చర్యలు చేపట్టాలి ప్రొఫెసర్లను తండ్రులుగా, అన్నలుగా భావిస్తారు. అలాంటి వారు కంచే చేను మేసినట్టుగా అత్యాచార యత్నం చేయడం సిగ్గుచేటు. ప్రొఫెసర్ రవి రంజన్పై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్సిటీలోని వేధింపుల సెల్లో మూడు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇలాంటి వేధింపుల కేసులెన్నో పెండింగ్లో ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలి. – మహేశ్ నమాని, ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ -
ప్రియుడిపై అనుమానం.. ఫుల్గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్లాండ్లో వెలుగుచూసింది. పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు. ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..! -
లాటరీ తగలడమే శాపమైంది...లవర్తో భార్య జంప్
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...థాయ్లాండ్కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్కన్రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది. ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే మణిత్, అంగన్రాత్లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు. (చదవండి: బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....) -
పాపం.. 32 ఏళ్లుగా బోనులోనే!
డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ. ఏడాది వయసులో బాగా నమ్మిన వ్యక్తి చెయ్యి పట్టి గెంతులేసుకుంటూ దేశాలు దాటింది ఆ చిట్టి గొరిల్లా. పాపం.. తన జీవితం మూడు దశాబ్దాలపైగా నరకం లాంటి చోట చిక్కుకుపోతుందని ఊహించి ఉంటే అమ్మ ఒడిని అప్పుడు అది వీడి ఉండేది కాదేమో!. బువా నోయి.. దీనికి అర్థం చిట్టి తామర అని. అయితే పేరులో ఉన్న ఆహ్లాదం.. ఆ గొరిల్లా ముఖంలో ఏమాత్రం కనిపించదు. దాని వయసు 33 ఏళ్లు. కానీ, 32 ఏళ్లుగా కంపు కొట్టే తుప్పు పట్టిన బొనులో బంధీగా ఉండిపోయింది. అందుకేనేమో ప్రపంచంలోనే అత్యంత బాధను అనుభవిస్తున్న గొరిల్లాకు దీనికంటూ ఒక ముద్ర పడిపోయింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాంగ్ బంగ్ ఫ్లాత్లో బాంగ్ కీ ఖాన్ వద్ద ఓ ప్రైవేట్ మర్షియల్ బిల్డింగ్ పైన ‘పటా’ అనే జూ ఉంది. ఈ జూకి ప్రధాన ఆకర్షణ మాత్రమే కాదు.. అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది బువా నోయి. బువా Bua Noi పుట్టింది జర్మనీలో. ఏడాది వయసున్న బువాను దాని సంరక్షకుడు 7 లక్షల పౌండ్లకు థాయ్లాండ్ పటా జూ నిర్వాహకులకు అమ్మేశాడు. 1990లో అది అమ్మకి దూరమై.. ఈ జూలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అది బయటకు వచ్చింది లేదు. అక్కడే తిండి.. అక్కడే నిద్ర. అదే బోనులో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ జూకి ప్రధాన ఆకర్షణగా మారిపోయింది. అయితే ఒంటరిగా అది పడుతున్న అవస్థను చూడలేక.. 2015 నుంచి కొందరు ఉద్యమకారులు దానిని బయటకు రప్పించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. కొన్నదానికంటే కాస్త ఎక్కువ డబ్బు చెల్లిస్తేనే.. దానిని వదులుతానంటూ భీష్మించుకు కూర్చున్నాడు పటా జూ ఓనర్. దీంతో దీని విడుదలకు పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. Triste ao conhecer a história de outro animal escravizado por toda a vida. Bua Noi vive presa há mais de 30 anos num espaço dentro de uma loja de departamentos num shopping da Tailândia. Ela é conhecida como a gorila mais triste do mundo. Como as pessoas são capazes?? #FreeBuaNoi pic.twitter.com/yDZaNV7xkd — PREFIRO LULA 🚩🦑 (@carolando_44) October 26, 2022 థాయ్ పాప్ సింగర్ చెర్ సైతం దీనికి బయటకు రప్పించేందుకు చాలా యత్నించాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అగ్రిమెంట్ బలంగా ఉండడంతో.. అక్కడి ప్రభుత్వం సైతం ఎలాంటి బలవంతపు చర్యలకు దిగలేకపోయింది. చివరకు ఫండ్ రైజింగ్ ద్వారా అనుకున్న సొమ్ము సేకరణకు దిగినా.. ఫలితం దక్కలేదు. అగ్రిమెంట్లో ఉన్న లొసుగులతో ఎప్పటికప్పుడు దానిని అమ్మే ధర పెంచుకుంటూ పోతున్నాడు ఆ ఓనర్. ఇది దాని స్వేచ్ఛకు అడ్డుతగులుతోంది. దీంతో దానికి మరణం ద్వారా అయినా విముక్తి అందించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడి కోర్టులో కొందరు అందుకు సంబంధించి పిటిషన్లు సైతం దాఖలు చేస్తున్నారు. బంధీగా అలా అది చావడం కంటే.. దానిని అక్కడే చంపేసేందుకు ప్రభుత్వం చర్యలు పూనుకోవాలని, అందుకు ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. మరోవైపు ఈ విషయం తమదాకా రావడంతో పెటా ఏషియా స్పందించింది. దాని బతుకు మరీ ఘోరంగా ఉందని.. పటా జూను మొత్తానికే సీల్ చేసి అక్కడి జంతువులకు విముక్తి కల్పించేందుకు పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. -
మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే సంస్థను కొనుగోలు చేసిన తొలిమహిళ
బ్యాంకాక్: మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలను నిర్వహించే సంస్థను తొలిసారిగా ఒక థాయి మహిళ సుమారు రూ. 164 కోట్లతో కొనుగోలు చేసింది. థాయి స్థానిక మీడియా ప్రాజెక్టు రన్వే ఎడిషన్ను నిర్వహిస్తున్న ట్రాన్స్ జెండర్ హక్కుల ప్రచారకర్త అయినా జకపాంగ్ జక్రాజుతాటిప్ ఈ సంస్థను కొనుగోలు చేసినట్లు జేకేఎన్ గ్లోబల్ గ్రూప్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారని గ్లోబల్ గ్రూప్ పేర్కొంది. అంతేగాదు 70 ఏళ్ల చరిత్రలో ఈ అందాల పోటీ సంస్థను సొంతం చేసుకున్న తొలిమహిళ జకపాంగేనని వెల్లడించింది. గతంలో ఈ సంస్థ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యజమాన్యంలో ఉన్నట్లు తెలిపింది. ఈమేరకు జకపాంగ్ మాట్లాడుతూ...తాను కొనుగోలు చేసిన బ్రాండ్ని అభివృద్ధి చేయడానికి దొరికిన అరుదైన అవకాశంగా పేర్కొంది. ఇది థాయ్లాండ్ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నానని చెప్పింది. ఈ సంస్థ థాయ్లాండ్కు ఒక మంచి శక్తిగా ఉపయోగపడుతుందని, పైగా ఎక్కువ మంది పర్యాటకులను తీసుకువస్తుందని విశ్వసిస్తున్నాని అని అన్నారు. ఈ సంస్థ తాను రన్ చేస్తున్న కంపెనీ ఫోర్ట్ఫోలియోకు బలమైన వ్యూహాత్మక శక్తిగా ఉంటుందని పేర్కొంది. అలాగే విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, సంప్రదాయాలు నుంచి వచ్చే ఉద్వేగభరితమైన వ్యక్తులకు వేదికను అందించే వారసత్వాన్ని కొనసాగిస్తూ..ఒక గొప్ప బ్రాండ్గా అభివృద్ధి చేసేందుకు యత్నిస్తానని జకపాంగ్ చెప్పారు. తదుపరి మిస్ యూనివర్స్ పోటీ యూఎస్లో న్యూ ఓర్లిన్స్లో జరగనుంది. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్లాండ్కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్లాండ్లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్గా ఉందే! -
దురదృష్టం అంటే వీళ్లదే! థాయ్లాండ్కు మేలు చేసిన ‘వర్షం’! సెమీస్లో
Womens Asia Cup T20 2022 : మహిళల ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో బంగ్లాదేశ్కు చేదు అనుభవం ఎదురైంది. వరణుడు ఆటంకం కలిగించిన కారణంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు! ఇక బంగ్లా నిష్క్రమణతో థాయ్లాండ్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెల్హెట్ వేదికగా మంగళవారం(అక్టోబరు 11) బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉండటంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెమీస్లో థాయ్లాండ్ దీంతో బంగ్లా, యూఏఈ జట్లకు భంగపాటు ఎదురైంది. చెరో పాయింట్ లభించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 5 పాయింట్లు మాత్రమే సాధించిన బంగ్లా గ్రూప్ దశలో ఐదో స్థానంలో నిలిచిపోయింది. మరోవైపు.. పాకిస్తాన్పై సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన థాయ్లాండ్ ఆరు పాయింట్లతో సెమీస్కు అర్హత సాధించింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో పాటు టాప్-4లో స్థానం దక్కించుకుంది. కాగా అక్టోబరు 13న సెమీ ఫైనల్స్ జరుగనుండగా.. 15న మహిళల ఆసియా కప్-2022 ఫైనల్ జరుగనుంది. ఇక ఈసారి మ్యాచ్లన్నీ సెల్హెట్లోని సెల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగడం గమనార్హం. చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్ Sreehari Nataraj: 'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్కు అవమానం After a hard fought battle, India 🇮🇳, Pakistan 🇵🇰, Sri Lanka 🇱🇰 and Thailand 🇹🇭 qualify for the semi-finals of the #WomensAsiaCup2022 🏆! We have some exciting games lined up ahead! Who are you rooting for? 👇#AsianCricketCouncil #ACC pic.twitter.com/QWUUd4z8l9 — AsianCricketCouncil (@ACCMedia1) October 11, 2022 -
థాయిలాండ్ లో మారణహోమం
-
రక్తమోడిన శిశు సంరక్షణాలయం
బ్యాంకాక్: థాయ్లాండ్లో మాజీ పోలీసు జరిపిన కాల్పులతో శిశు సంరక్షణాలయం రక్తసిక్తమైంది. ఈశాన్య థాయ్లాండ్లోని నోంగ్బూ లాంఫూ నగరంలోని డే కేర్ సెంటర్పై పన్యా కామ్రాప్(34) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అభంశుభం తెలియని 24 మంది చిన్నారులు సహా మొత్తంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో అతను డే కేర్ సెంటర్కి వచ్చి మొదట ఐదుగురు సిబ్బందిని హతమార్చాడు. తర్వాత ఒక గదిలో నిద్రిస్తున్న చిన్నారులపైకి బుల్లెట్ల వర్షం కురిపించాడు. దాంతో పరుపులన్నీ రక్తంతో నిండి ఘటనాస్థలి భీతావహంగా మారింది. డే కేర్ సెంటర్లో ఎనిమిది నెలల గర్భిణిని సైతం అతడు చంపేశాడు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ రహదారి వెంట ఉన్న వారిపైనా తూటాల వర్షం కురిపించాడు. దీంతో ఒక చిన్నారిసహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న అతను తన కొడుకును, భార్యను సైతం చంపేసి చివరకు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. శిశు సంరక్షణాలయంలో చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది. దాడికి అతను పిస్టల్, షాట్గన్తోపాటు పదునైన కత్తిని వాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఒక మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అతడిని పోలీసు విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. థాయ్లాండ్ చరిత్రలో పాఠశాలలో కాల్పుల ఘటనలో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. వాస్తవానికి థాయ్లాండ్లో ఆయుధాలతో దాడి ఘటనలు అరుదు. ఆయుధాలతో దాడి ఘటనల్లో బ్రెజిల్లో ప్రతి లక్షలమందికి 23 మంది చనిపోతే థాయ్లాండ్లో నలుగురే మరణించారు. ఇదీ చదవండి: 650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు -
ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్, 50లక్షల టికెట్లు ఉచితంగా
సాక్షి,ముంబై: ప్రముఖ ఎయిర్లైన్ ఎయిర్ ఏసియా విమాన ప్రయాణీకులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఏకం50 లక్షల ఉచిత విమాన టికెట్లను అందిస్తోంది. ఈమేరకు కంపెనీ ట్విటర్లో వివరాలను అందించింది కస్టమర్లు సెప్టెంబర్ 25 వరకు ఈ ఆఫర్లతో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్ని టికెట్ల ద్వారా జనవరి 1 అక్టోబర్ 28, 2023 మధ్య ప్రయాణించవచ్చని ఎయిర్ ఏసియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరెన్ చాన్. తమ వెబ్సైట్, మొబైల్ఆప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యాప్ లేదా వెబ్సైట్లో, ఈ ఆఫర్ను యాక్సెస్ కోసం "Flights" చిహ్నాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అంతర్జాతీయంగా విమాన సేవలు క్రమంగా పునఃప్రారంభించడంతో పాటు, సంస్థ 21వ పుట్టినరోజు సందర్భంగా అందిస్తున్నఈ బిగ్ సేల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చాన్ కోరారు. థాయ్లాండ్, కంబోడియా, వియత్నాంతో సహా అనేక ASEAN దేశాల ప్రయాణికులు ఆఫర్కు అర్హులు. రెండు నెలల క్రితం ఎయిర్ఏషియా కస్టమర్లకు ఉచిత టికెట్లను అందించిన సంగతి తెలిసిందే. AirAsia's BIG Sale is back! Enjoy 5 Million FREE Seats* starting today until 25 September 🥳 **Domestic: All-in from RM23, Asean: All-in from RM54. *Includes airport taxes, MAVCOM fee, fuel surcharges and other applicable fees. T&C apply. Read more: https://t.co/Pe2kRcZC7L — airasia Super App (@airasia) September 19, 2022 -
మహిళ బాత్రూమ్లో భారీ పైథాన్.. ఆ తర్వాత ఏమైందంటే?
అనుకోకుండా ఓ పామును చూస్తేనే మనం భయంతో వణికిపోతాము. అలాంటిది ఇంట్లో ఉండే బాత్రూమ్లోకి ఏకంగా భారీ కొండ చిలువ ప్రవేశిస్తే.. ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి షాకింగ్ ఘటనే థాయ్లాండ్కు ఓ మహిళకు ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. బ్యాంకాక్కు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉన్న బాత్రూమ్లోకి ఓ 12 అడుగుల కొండ చిలువ వెళ్లింది. ఈ క్రమంలో బాత్రూమ్లో నుంచి బయటకు వచ్చేందుకు కొండ చిలువ ప్రయత్నించింది. అయితే బాత్రూమ్ మొత్తం గ్లాస్తో కవర్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న రెండు పిల్లలు గమినిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు. కాగా, ఇంటి సభ్యుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ టాయిలెట్ టబ్ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ద్వారా కొండచిలువ బాత్రూమ్లోని వచ్చినట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) -
అభిమానులకు యూట్యూబ్ స్టార్ కుచ్చుటోపీ.. రూ. 437 కోట్లు ముంచేసి
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే.. (Photo Credits: Nutty Instagram) థాయ్లాండ్కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్గా ఎదిగింది. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది. చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్ (Photo Credits: Nutty Instagram) అంతేగాక బ్రోకర్గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...
థాయిలాండ్లో ఒక అపరిచిత వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి జూలో హల్చల్ చేశాడు. చివరికి ఒక పెద్ద ఫిషింగ్ నెట్ వలకి చిక్కుతాడు. అసలు ఇదంతా ఏంటి? ఎందుకిలా సంచరించాడనే కదా! వివరాల్లోకెళ్తే...ఆ వ్యక్తి యానిమల్ ఎస్కేప్ డ్రిల్లో భాగంగా ఇలా చేశాడు. ఆస్ట్రిచ్ పక్షులు చాలా వైల్డ్గా ఉంటుంది. పైగా అది ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో జూ నుంచి తప్పించుకుంటే జూ సిబ్బంది అప్రమత్తమై పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించి దాన్ని పట్టుకోవాలి లేదంటే అది ఎవరిపైన ఐనా దాడి చేస్తే ఇక అంతే సంగతులు. ఈ నేపథ్యంలోనే జూ అధికారులు వైల్డ్ యానిమల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే డ్రిల్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆ వ్యక్తి ఆస్ట్రిచ్ పక్షిమాదిరిగా దుస్తులు ధరించి జూలో అటు నుంచి ఇటూ పరిగెడుతుంటాడు. మిగతా ముగ్గురు జూ సిబ్బంది అప్రమత్తమై ఒక పెద్ద వలతో సదరు ఆస్ట్రిచ్ వేషధారణలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. పక్షులలో అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ని పట్టుకోవాలంటే జూ పరిసరాలను సిబ్బంది తమ నియంత్రణలోనికి తెచ్చుకుని మరీ పట్టుకునేందుకు యత్నించాలి. పైగా ఆ పక్షి గంటకు 70 కి.మీ వేగంతో పరిగెత్తుతుంది. ఆ విపత్కర సమయంలో ఏ మాత్రం భయపడినా చాలు మన పని అయ్యిపోతుంది. అది సింహం వంటి పెద్ద పెద్ద జంతువులనే దాడి చేసి హతమార్చగలదు. (చదవండి: ఆ జర్నలిస్ట్ వర్క్ డెడికేషన్ని చూసి... ఫిదా అవుతున్న నెటిజన్లు) -
నా పేరు జోన్ జండాయ్; అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..
నేను నా జీవితంలో పొందే అతి కొన్ని చిరాకులతో పాటు అత్యంత ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడూ పొందుతూనే ఉన్నాను. నిన్నటి నా జీవితం నాకు జోన్ జండాయ్ ని బహుమతిని చేసింది. తెలుసుకున్న కొద్ది జీవితాన్నిమరింత సంతోషంలో ముంచెత్తే సాధారణ జీవన దూత ఈయన. జోన్ జండాయ్ ఒక రైతు, థాయ్లాండ్లో కెల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి గా ప్రపంచం ఈయనను తెలుసుకుంది. జోన్ జండాయ్ థాయ్లాండ్లోని యాసోథార్న్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన వ్యవసాయం చేస్తారు. ఇంకా మట్టి గృహాలను నిర్మిస్తారు. 2003 లో పన్ పన్ అనే విత్తన సంరక్షణ సంస్థను స్థాపించారు. జోన్ జోండాయ్ చేసిన ఒక ప్రసంగ పాఠాన్ని విని ఎంత సంతోష పడ్డానో మాటల్లో చెప్పలేక ఈ ఆనందాన్ని నలుగురితో పంచుకోడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ వ్యాస రూపం. - అన్వర్ జీవితంలో నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది, ఎప్పటికి చెప్పగలిగేది ఒకే ఒక మాట ఉంది. అది ఏమిటంటే " Life Is Simple". అవును జీవితం అత్యంత సులభమైనది, సరదా అయినది. "జీవితం సులభం" అనే సులభతరమైన విషయం తెలుసుకోవడం మాత్రం నాకు అంత సులభంగా జరగలేదు. నేను ఇంతకు మునుపు బ్యాంకాక్లో ఉండేవాడిని. అక్కడ ఉన్నప్పుడు నా జీవితం చాలా కష్టంగా, చాలా చాలా సంక్లిష్టంగా ఉండేది. "జీవితం సులభం" అనే విషయం గురించి నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించడానికి సమయం కూడా నాకు అప్పుడు లేదు. నా పేరు జోన్ జండాయ్. నేను ఈశాన్య థాయ్లాండ్ ప్రాంతంలోని ఒక చిన్నగ్రామంలో జన్మించాను. నా చిన్నప్పుడు మా ఊరు, ఆ వాతావరణం, గాలి, మాట, వెలుతురు, పలకరింపు.. ప్రతీది సరదాగా, సులభంగా ఉండేది. అప్పుడు జీవితం సహజంగా ఉండేది కాబట్టి జీవితం అనేది సులభం అనే ఎరుక నాకు అప్పుడు లేదు. అత్యంత సహజమైన మానవ జీవితపు లక్షణాలు ఎప్పుడు ప్రత్యేక ఎరుక అయి ఉండవు కదా. ఒక రోజు మా ఊరికి టెలివిజన్ వచ్చింది. ఆ టీవి తో పాటు దానికి తీసుకు వచ్చిన పట్నవాసపు మనుషులూ వచ్చారు. ఆ యంత్రం, దానిని నడిపేవారు ఇద్దరూ కలిసి మాకు మునుపు తెలియని, ఆలోచించని, అసలు ఆ జ్ఞానమే లేని ఒక కొత్త మాట మాకు నేర్పారు "ఒరే! నాయనా మీరు మీరు కడు పేదవారు, కటిక దరిద్రులు. మీ జీవితాంతం వరకు మీరు ఇలా దరిద్రపు గొట్టుగా ఉండనక్కర లేదు. మీరు మేల్కోవాలి. మీ జీవితంలో విజయాన్ని వెంబడించాలి, విజయం యొక్క అయిదు మెట్లు ఎక్కాలి. ఆ అయిదు మెట్లు ఎక్కడానికి మీరు బ్యాంకాక్ వెళ్లాలి" అని చెప్పారు. (నేను మా నూనెపల్లె నుండి హైద్రాబాద్ వరకు దేకినట్లు అన్నమాట) కాబట్టి నేను బ్యాంకాగ్ వచ్చాను, నేను కడు దరిద్రుడిని అని తెలుసుకోడం నాకు ఎంతో చెడుగా అనిపించింది. నేను కటిక పేదరికం వాడిని అని తెలుసుకోడం నా మనసుకు భరించరాని కష్టం వేసింది. కాబట్టి ఎట్టి పరిస్తితుల్లో నేను బ్యాంకాక్కు వెళ్లాలి విజయం సాధించాలి. నేను బ్యాంకాక్కి వెళ్ళాలని నిర్ణయించుకోవడం.. అక్కడికి చేరుకోవడం అప్పుడు నాకు చాలా గొప్పగా, గర్వంగా ఉండిది. మనం చాలా నేర్చుకోవాలి, గొప్ప చదువు చదువుకోవాలి మరియు చాలా కష్టపడాలి. అలా చేస్తూ ఉంటే ఆ పై మీరు విజయం సాధించవచ్చు అనే మాటలు పదే పదే నా చెవుల్లో ధరించిన నిత్య మంత్రాలు అయ్యాయి. అందుకని నేను చాలా కష్టపడటం ప్రారంభించాను. రోజుకు ఎనిమిది గంటలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేవాన్ని. అంత కష్టపడి పని చేసి చివరికి నేను భోజనానికి సంపాదించుకున్నది కేవలం ఒక కప్పు నూడుల్స్ మాత్రమే. లేదా గిన్నెడు ఫ్రైడ్ రైస్. ఇంకా బ్యాంకాగ్ లో నేను నివసించిన గది ఎలా ఉండేది అనుకున్నారు! అది చాల చెడ్డగా ఉండేది. మహా మురిగ్గా ఉండేది. భరించలేనంత వేడిగా ఉండేది . ఆ వేడితో పాటు నాతో పాటు ఆ గది పంచుకుని ఉన్న చాలా మంది ఊపిరి వేడి . ఇటువంటి పరిస్తితుల మధ్య నేను ఇంకా చాలా తీవ్రంగా కష్టపడటం మొదలుపెట్టాను. నాకు అప్పుడు ఓ అనుమానం కలిగింది. కష్టపడి పని చేయడం అనే సూత్రం వెనుక ఏదో తేడా ఉందని నాకు అనిపిచింది. నేను ఇంత కష్టపడి పనిచేస్తూ పోతున్న కొద్దీ నా జీవితం సులువు కావాలి కదా! కానీ ఇంకా ఎందుకు కష్టతరమవుతుంది? గిన్నెడు అన్నం, కాళ్ళు చాపుకోడానికి తగినంత స్థలం లేని గది ప్రాప్తం అవుతుంది ఎందుకని? కాబట్టి ఎక్కడో ఏదో తప్పుగా ఉండాలి. ఎందుకంటే నేను కష్టపడి పని చేసి చాలా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాను కానీ నేను వాటిని నా వినియోగం కోసం పొందలేను. నేను సంపాదించే డబ్బుతో అవేమి కొనగలిగే శక్తి నాకు సమకూరడం లేదు. ఒక్క వళ్ళు వంచి పని చెయ్యడమే కాదు, నేను బుర్రా ఉపయోగించి చదువు, జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. విద్యని అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. నేను యూనివర్సిటీలో చదువుకోవడానికి బయలుదేరాను. కానీ యూనివర్సిటీలో నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే చదువుకోవడం అనే పనిని విద్యాలయాలు చాలా బోరింగ్ చేసి పెట్టాయి. నేను ఇక్కడ ఈ చదువుల భవనాల్లోని ప్రతి అధ్యాపకుడిలోను, వారు విశ్వవిద్యాలయంలో బోధించే విషయాలను చూసినప్పుడు, వారిలో చాలామందికి ఉన్నదంతా విధ్వంసక జ్ఞానం. నాకు యూనివర్సిటీలో ఉత్పాదక జ్ఞానం అసలు దొరకలేదు. ఒక ఆర్కిటెక్చర్ లేదా ఇంజినీర్ కావడం అంటే అర్థం ఏమిటంటే.. మీరు ఈ భూమిని, ఈ సహజ సంపదని మరింత, వీలయినంత మరింత ఎక్కువ నాశనం చేసేవారిగా తయారు కావడం. ఈ విధ్వంసక వాస్తువేత్త వ్యక్తులు ఎంత ఎక్కువ తయారు అయితే వారు అంత ఎక్కువ పనిచేసి ఈ భూమి మీది, పర్వతాలు, నదులు, అడవులు మరింత నాశనం చేయడమే అన్నమాటే. ఈ పచ్చదనాన్ని, ఈ సహజ వర్ణాలని తమ బూడిదరంగు మెదడుల న్నుండి బయటికి తీసిన జ్ఞానంతో కొలతలు వేసి ఈ ప్రపంచమంతా కాంక్రీట్ నింపడం. కనుచూపు మేర అంతా బూడిద రంగు, బూడిద రంగు బిల్డింగులు, బూడిద రంగు రోడ్లు, బూడిదరంగు ఆకాశం, బూడిద రంగు జ్ఞానం.. భూమికి బూడిద రంగు కట్టడపు పన్ను, చెరువులోని నీటికి ఇంటి ట్యాంకర్ లలో బంధించిన పన్ను. వ్యవసాయానికి పురుగు మందుల విషపు పన్ను. జీవితం చాలా కష్టంగా ఉంది నేను నిరాశకు గురయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను, నేను అసలు బ్యాంకాక్లో ఎందుకు ఉండాలి? నా చిన్నప్పుడు మా పల్లెలో ఎవరూ రోజుకి ఎనిమిది గంటలు పని చేయడం నేను ఎప్పుడు చూడలేదు అక్కడ ప్రతి ఒక్కరూ రోజుకు రెండు గంటలు, సంవత్సరానికి కేవలం రెండు నెలలు పనిచేశారు, ఒక నెలలో వరినాట్లు నాటడం, మరో నెలలో వరి కోయడం అనేదే పని. మిగిలినది అంతా ఖాళీ సమయం, పది నెలల ఖాళీ సమయం. అందుకే మా థాయ్లాండ్లో ప్రజలు చాలా పండుగలను కలిగి ఉన్నారు. ప్రతి నెలా మాకు ఒక పండుగ ఉంటుంది. ఎందుకంటే జీవితం గడపడానికి, జీవితాన్ని పండగ చేసుకొడానికి అక్కడ చాలా ఖాళీ సమయం ఉంది. జీవితం పండగ కావడం కన్నా జీవితం మరింకేం కోరుకుంటుంది? అక్కడ రాత్రి పూటే కాదు మధ్యాహ్నపు భోజనం ముగించి ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోతారు. (మా నూనెపల్లెలో వర్షాలు పడే రాత్రిళ్ళు తప్పనిస్తే, మేము ఎప్పుడూ ఇంటి గోడల మధ్యనో, తడికల మధ్యనో నిద్ర పోయిందే లేదు. నిద్ర అంటే అంతా మా ఊరి రోడ్ల మీదే, రాత్రుల్లు మా ఊరి దారులన్ని మంచాలు మొలిచిన పొలాల్లా ఉండేవి. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అయితే అర్ధరాత్రి ఊరి సెంటర్ లో టీ తాగడానికి అని పోతూ పోతూ తన ఇంటి రోడ్డు ముందు నిద్రపోతున్న మనిషిని మంచంతో సహా లేపుకు వెళ్ళి మరో ఇంటిముందు దింపేవాళ్ళం, కొంటెగా. ఆ ఇంటి ముసలమ్మ మా ఇంటి ముసలమ్మతో రాత్రంతా కబుర్లు చెప్పుకోడానికి మనవడితో మంచం మోపించుకు వచ్చి ఈ మంచం పక్కన ఆ మంచం కుదిర్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర పోయేవారు. పిల్లలూ అంతే చంకలో దుప్పటి దిండు పెట్టుకుని పక్కింటి నేస్తుడితో మహా మహా ముచ్చట్లు ఆడటం లేదా రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం వింటూ అక్కడే బజ్జోడం. అర్థరాత్రి దాటాకా మనుషులు, మంచాలే కాదు మా ఊరి రహదారులూ, జట్కా బళ్ళు, సైకిల్ రిక్షాలు అన్నీ నిద్ర పోయేవి. కేవలం కీచు రాళ్ళ చప్పుడు, లేదా అప్పుడప్పుడు కప్పల బెకబెకలు. ఇప్పుడు రోడ్డులకు అసలు నిద్ర లేదు. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక బండి గాన్లు దాన్లను తొక్కుతూనే పోతుంటాయి. హారన్లు రోడ్డులను దోమల్లా కుడుతూనే ఉంటాయి) మధ్యాహ్న భోజనానంతర నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా మేం వీధి అరుగులపై కూచుని కేవలం కబుర్లు చెప్పుకుంటాం. ముచ్చట్లు ఆడుకుంటాం. దారిన పోయే అందరి యోగక్షేమాలు విచారిస్తాం "ఏం బ్బా! మీ అల్లుడు ఎలా ఉన్నాడు, మీ భార్య, కోడలు ఎలా ఉన్నారు, మీ కోడి, మేకా ఎలా ఉన్నాయి" ఊళ్ళో జనాలకు ఏం ఉన్నా లేకపోయినా చాలా సమయం ఉండేది. వారికి తమతో తాము ఉండటానికి సమయం ఉంది. తమతో తాము ఉండటానికి సమయం ఉన్నప్పుడు మనిషికి తనను తాను అర్థం చేసుకోడానికి సమయం ఉంటుంది. ప్రజలు తమను తాము అర్థం చేసుకున్నప్పుడు వారు తమ జీవితంలో ఏమి కోరుకుంటున్నారో సులభంగా, స్పష్టంగా గ్రహించగలరు. చాలా మంది ప్రజలు తమకు ఆనందం కావాలి, ప్రేమ కావాలి.. తమ జీవితాలను హాయిగా సంపూర్ణంగా ఆస్వాదించాలని కోరుకుంటారు, తీరిక, తీరుబడి ఉన్న ప్రజలు తమ జీవితంలో చాలా అందాలను చూస్తారు కాబట్టి వారు ఆ అందాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేసేవారు. కొంతమంది హాయిగా ఇంటి బయట కూచుని తమ కత్తి పిడిని నునుపు చేసుకునే వారు, వాటిపై బొమ్మలు చెక్కేవారు, బుట్టా, గంప చక్కగా అల్లుకునేవారు, తడికలకు, చాటలకు కాగితపు గుజ్జు పసుపు అలికేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలా చేయడం లేదు. ప్రజలు ప్రతి చోటా ప్లాస్టిక్ని ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ పీలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ జీవితంలో ఏదో తప్పు ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. నేను ఈ విధంగా జీవించలేను కాబట్టి నేను యూనివర్సిటీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకని తిరిగి నా చిన్న ఊరికి తిరిగి వెళ్ళాను. నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చిన్నతనంలో ఉన్నట్లుగా, నాకు గుర్తుండేలా జీవించడం మొదలుపెట్టాను. నేను ఇక్కడ సంవత్సరానికి రెండు నెలలు పని చేయడం ప్రారంభించాను. వ్యవసాయంలో నాకు నాలుగు టన్నుల బియ్యం వచ్చింది. మేము మొత్తం మా కుటుంబంలో ఉన్నది ఆరుమందిమి. మేమంతా కలిపి సంవత్సరానికి అర టన్ను కంటే తక్కువ తింటాము. కాబట్టి మిగిలిన బియ్యాన్ని అమ్మవచ్చు. ఇంకా నేను రెండు చిన్న చేపల చెరువులు తీసుకున్నాను. మాకు ఏడాది పొడవునా తినడానికి హాయిగా చేపలు ఇక్కడ దొరుకుతాయి. అంతే కాక నేను నాకున్న అర ఎకరం కంటే తక్కువ చిన్న స్థలంలో ఒక చిన్న తోటను కూడా వేసాను. తోట పని కోసం రోజుకు 15 నిమిషాలు గడుపవలసి వస్తుంది. నేను ఈ తోటలో 30 కంటే ఎక్కువ రకాల కూరగాయలను పండిస్తున్నాను. అన్ని కూరగాయలను మేం ఆరుగురం ఎట్లాగో తినలేం కాబట్టి మాకు కావలసినవి కొన్ని ఉంచుకుని మిగతా వాటిని మార్కెట్లో అమ్మడం వల్ల కొంత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జీవితం ఇక్కడ చాలా సులభం. నేను ఏడేళ్లపాటు బ్యాంకాక్లో ఉండాల్సి వచ్చింది. గంటల తరబడి కష్టపడి పని చేశాను, అంత కష్టపడి పని చేసినా సంపాదించుకున్నది తినడానికి సరిపోలేదు.. కానీ ఇక్కడ, సంవత్సరానికి రెండు నెలలు మరియు రోజుకు 15 నిమిషాలు మాత్రమే పనిచేసి నేను ఇంట్లో ఆరుగురికి ఆహారం ఇవ్వగలను. జీవితం అంటే సులువుగా ఉండటం. ఇంకో ముఖ్యమైన విషయం. చిన్నతనంలో స్కూల్లో ఎప్పుడూ మంచి గ్రేడ్ సాధించని నాలాంటి తెలివితక్కువవారికి జీవితంలో ఇల్లు అనేది రాసిపెట్టి ఉండదని నేను అనుకున్నాను. నేనే కాదు ఇది చాలామంది అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకంటే తెలివైనవారు, ప్రతి సంవత్సరం క్లాసులో నంబర్ వన్ అయిన వారు మంచి ఉద్యోగం పొందుతారు. మంచి ఉద్యోగం వల్ల మంచి వేతనం లభిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఒక స్వంత ఇల్లు పొందడానికి అత్యంత అర్హులు. కానీ నాకు, నావంటి యూనివర్సిటి చదువు పూర్తి చేయలేని వారు కూడా ఒక ఇంటిని కలిగి ఉంటారా? నాలాంటి, తక్కువ విద్య ఉన్న వ్యక్తులకు ఇల్లు అనేది ఒక ఆశాజనకపు ఎప్పటికీ పూర్తి కాని కల. కానీ, ఇక్కడ నా పేద గ్రామంలో నాకడుపుకు, కుటుంబ అవసరాలకు ఆహార ఉత్పత్తి సాధించిన నేను ఇప్పుడు భూసంబంధమైన భవనాలు చేయడం ప్రారంభించాను, ఇళ్ళు కట్టడం అంటారా అది చాలా సులభం అయింది నాకు ఇక్కడ. నేను రోజూ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, రెండు గంటల సమయం ఇల్లు కట్టడానికి వెచ్చించాను. మూడు నెలల సమయంలో నాకు స్వంత ఇల్లు వచ్చింది. మట్టి, రాయి, గడ్డి, వెదురు కలిస్తే ఇల్లు. నేను చదువుకునేప్పుడు నా క్లాస్లో అత్యంత తెలివైన స్నేహితుడు ఒకరు, అతను తన ఇంటిని నిర్మించడానికి నాకు లాగానే మూడు నెలల సమయం తీసుకున్నాడు. ఆ ఇంటికి గృహ సంబంధమైన వస్తు సంచయంతో పాటు అప్పులూ చేయాల్సి వచ్చింది. అతను 30 సంవత్సరాల పాటు తన అప్పు చెల్లించాలి. కాబట్టి, అతనితో పోలిస్తే, నాకు 29 సంవత్సరాల 10 నెలల ఖాళీ సమయం అనేది మిగిలింది. జీవితం అనేది సులభమైనది. ఈ సులభమైన జీవితాన్ని దానిపై అప్పులు, వడ్డీల ఋణం వేసి బరువుగా ఎందుకు బ్రతుకుతున్నాము మనం. నా మొదటి ఇల్లు కట్టేంత ముందు వరకు కూడా అంత తేలికగా, సులువుగా ఒక ఇల్లు నిర్మించవచ్చని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం నేను ఒక ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ ఇల్లు మాత్రం నాకు చాలా ఉన్నాయి. సమస్య అల్లా ఈ రాత్రి నేను ఏ ఇంట్లో నిద్ర పోవాలి అనేదే. కాబట్టి, ఇల్లు అనేది ఒక సమస్య కాదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లలు, 13 సంవత్సరాల వయస్సు వాళ్ళు ఒక పాఠశాల కట్టుకున్నారు. అదీను వారు స్వంతంగా చేసుకున్న ఇటుకలను ఉపయోగించి తరువాత నెలలో ఆ పాఠశాలకు ఒక లైబ్రరీ కూడా. కాబట్టి ఇల్లు కట్టుకోడం పెద్ద విషయం కాదు మమ్మల్ని చూసి ఒక ముసలి సన్యాసిని కూడా ఆమె కోసం ఒక గుడిసెను నిర్మించుకున్నది కాబట్టి జీవితం లాగే, ఇల్లూ కూడా సులభం, మీరు నన్ను నమ్మకపోతే పోనీ, మీరూ ఒకమారు ప్రయత్నించండి. జీవితం అంటే, నివాసం అంటే, హాయిగా బ్రతకడం చాలా సులువు. ఇంటి తరువాత తదుపరి విషయం దుస్తులు. నేను అందగాడిని కాదు కాబట్టి అందంగా కనిపించడానికి ఖరీదయిన దుస్తులు ధరించడం ఒక మార్గం అనిపించింది. బాగా కనిపించడం కోసం. నేను నాకు నచ్చిన ఒక సినీ నటుడిలా దుస్తులు ధరించడానికి ప్రయత్నించాను. అందుకని ఒక జత జీన్స్ కొనడానికికని డబ్బు ఆదా చేయడానికి ఒక నెల బాగా కష్టపడ్డాను. చివరికి ఆ దుస్తులు కొని వాటిని ధరించి అద్దంలో చూసుకుంటూ నేను ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగాను. కుడి నుండి ఎడమవైపుకు మళ్ళాను. అద్దంలో నా చుట్టూ నేను తిరిగాను. నేను చూసిన ప్రతిసారీ నేను ఒకే వ్యక్తిని, ఆ పాత నేనుని మాత్రమే చూసాను. ఒక నెలపాటు చెమట రక్తం ధారవోసి కొన్న అత్యంత ఖరీదైన ప్యాంటు, చొక్కా కూడా నా మొహాన్ని, జీవితాన్ని మార్చలేదు. అద్దంలో కనబడిన నాకు నేను చాలా వెర్రివాడిని అనిపించింది. ఖరీదయిన దుస్తుల కొసం, అత్యంత ఆధునిక పొకడల వస్త్రాల వెంట పరిగెట్టి డబ్బు ఎంతగానయినా కూడపెట్టండి. అది మనల్ని ఏమాత్రం మార్చలేదు. నేను దాని గురించి మరింత తెలుసుకోవడం, ఆలోచించడం మొదలుపెట్టాను. మనం ఎందుకని ఫ్యాషన్ని అనుసరించాలి? ఆలోచించిన కొద్ది నాకు జవాబు దొరకలేదు. వంటిని కాపాడటమే దుస్తుల కేవల ఉద్దేశం. ఆ తర్వాత, 20 సంవత్సరాల వరకు, నేను ఏ బట్టలు కొనలేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బట్టలన్నీ ప్రజల నుండి వచ్చినవే ప్రజలు నన్ను సందర్శించడానికి వచ్చినప్పుడు, మరియు వారు ఇక్కడి నుండి వెళ్ళేప్పుడు వారు ఇక్కడ చాలా దుస్తులను వదిలివేస్తారు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు టన్నుల కొద్దీ బట్టలు ఉన్నాయి. ఏం చేస్తాం? వద్దనుకున్నవి ఎంత ఉండినా ఏం ప్రయోజనం. ఇలా ఆలోచించినప్పుడు నాకు మరింత స్వేచ్ఛగా అనిపిస్తుంది. అవసరానికి మించి ఏదీ వద్దు అనుకోవడంలో ఉన్నస్వేచ్చ మరి ఎందులో లేదు. ఇక చివరి విషయం ఏమిటంటే, అనారోగ్యం. నేను జబ్బుపడినప్పుడు సంగతి. అప్పుడు ఏమి చేయాలి? నేను నా పాత జీవితాన్ని కొత్త గా మొదలు పెట్టేముందు అంత సులువుగా మొదలు కాలేదు, దాని గురించి చాలా ఆందోళన చెందాను, ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, మందు మాకులు, వైద్యం, ఆస్పత్రి.. వీటి ఖర్చులు! నేను దీని గురించీ ఆలోచించడం మొదలుపెట్టాను, మానవుడికి అనారోగ్యం సాధారణమైనది, అనారోగ్యం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. అనారోగ్యం అయింది అంటే దాని అర్థం- మన జీవితాల్లో, మనం గడుపుతున్న జీవిత విధానంలో మనం ఏదో తప్పు చేశామని మన శరీరం మనకు గుర్తుచేసే విషయం. అందుకే మనం అనారోగ్యానికి గురవుతాము. కాబట్టి, నాకు జబ్బు వచ్చినప్పుడు, నేను కాస్త ఆగిపోయి నా దగ్గరకు నేను రావాలి. దాని గురించి కాస్త ఆలోచించాలి. ఇదిగో ఇది నేను చేసిన తప్పు. కాబట్టి ఈ తరహా పని మరలీ చేయరాదు. డబ్బు లేకపోతే ఏవుంది, నన్ను నేను నయం చేసుకోవడానికి నీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. భూమి, దాని మన్ను నన్ను స్వస్థపరచడానికి ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నాకు ఇది ఆరోగ్య స్వేచ్ఛ లాంటిది అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఉన్న జీవిత విధానంలో స్వేచ్ఛగా ఉన్నాను. నేను దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందను. నాకు భయం తక్కువ, నా జీవితంలో నేను కోరుకున్నది నేను చేయగలను. మునుపు గడిపిన బ్యాంకాగ్ జీవితం నాకు చాలా భయం కల్పించింది, దాని నీడన నేను ఏమీ చేయలేకపోయాను. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛగా భావిస్తున్నాను, నన్ను నేను ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా అనుకుంటున్నా, నాలాగా ఎవరూ లేరు, నన్ను నేను ఎవరిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. విజయానికి అడుగెట్టాల్సిన ఏ మెట్టు వెదకవలసిన అవసరం లేదు. నన్ను పోగొట్టుకుని ఎవరినో ధరించడానికని పూనుకుని అన్వేషణకు బయలుదేరాల్సిన అవసరమూ లేదు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం ఆ తర్వాత ఇక ఏం చేయాలి? నేను బ్యాంకాక్లో ఉన్నప్పటి జీవితపు మనస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, నా జీవితంలో అప్పుడు చాలా చీకటిగా అనిపించింది. ఆ సమయంలో చాలా మంది నాలాగే ఆలోచిస్తారని, అలోచిసూ ఉంటారని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కాబట్టి, నావంటి భావసారూప్యత కల వారిమి కలిసి చింగ్ మాయిలో "పన్ పన్ 'అనే కార్యశాలని ప్రారంభించాము (చియాంగ్ మాయి పర్వత ఉత్తర థాయ్లాండ్లోని ఒక నగరం.) మా ఆలోచనల ప్రధాన లక్ష్యం కేవలం విత్తనాన్ని సేకరించడమే! విత్తనాన్ని కాపాడటమే.! విత్తనం అంటే ఆహారం, ఆహారం అంటే జీవితం. విత్తనం లేకపోతే, జీవితం లేదు. విత్తనం లేదంటే స్వేచ్ఛ లేదు. విత్తనం లేకపోతే ఆనందం లేదు. ఎందుకంటే మన జీవితం ఆహారం పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని కాపాడటం చాలా ముఖ్యం. అందుకే విత్తనాల పొదుపుపై దృష్టి పెట్టాం. ఇది "పన్ పన్లో "ప్రధానమైనది. విత్తనం తరువాత రెండవ విషయం ఏమిటంటే ఒక కూడిక కేంద్రాన్ని నెలకోల్పడడం. ఇది ఒక అభ్యాస కేంద్రం. ఇదెందుకు అంటే, మనం జీవితాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి, జీవితాన్ని సులభతరం చేసుకోడం తెలుసుకోవడానికి అన్నమాట. ఎందుకంటే మనం ఈ జీవితాన్ని వీలయినంత సంక్లిష్టంగా మరియు గొప్ప కంగాళిగా ఎలా గడపాలో నేర్పించాము. దానిని ఇప్పుడు ఆ సంక్లిష్టత బారినుండి విముక్తం చేయాలి. జీవితాన్ని ఎలా సులభతరం చేయవచ్చు? చేయడం సులభం, కానీ ఎలా సులభతరం చేయాలో చెప్పడం మాకు తెలియదు. ఎందుకంటే మనం దానిని విముక్తం చేయడానికి సూత్రాలు సులువుగా దొరకనంత చిక్కుగా చేసాము. గొలుసుల మీద గొలుసులు, ముడుల మీద ముడులు, వస్తువుల మీద వుస్తువులు... చెత్త చేసాము మనం జీవితాన్ని. అందుకని ఇప్పుడు ముడులు విప్పడం నేర్చుకోవడం మొదలుపెడదాము. అందరం కలిసి ఉండడం నేర్చుకుందాము. అన్నిటి నుండి డిస్కనెక్ట్ కావడం నేర్చుకుందాము. మనం సంతోషంగా ఉండాలంటే, మన ఆలోచనా స్వేచ్చ మనకు తిరిగి రావాలి అందుకని మళ్లీ మనతో మనం కనెక్ట్ అవ్వాలి, ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి, మన మనస్సు మరియు శరీరాన్ని మళ్ళీ కలపాలి. జీవితం అనేది సులభం. దానిని చూసి భయపడకండి. వెనక్కి రండి. మొదలు నుండి ఇప్పటి వరకు, నేను నేర్చుకున్నది నాలుగు ప్రాథమిక అవసరాలు: ఆహారం, ఇల్లు, బట్టలు మరియు వైద్యం. ఈ నాలుగు- ప్రపంచంలో అందరికి చౌకగా మరియు అందుబాటులోకి సులభంగా ఉండాలి. నాకరికత అంటే అర్థం అదే. కానీ మనం వందలూ, వేలు కాదు ఈ కేవల నాలుగు సంఖ్హ్యల విషయాలను పొందడానికి ఈ భూమి మీద నివసించే అనేక మందికి కష్టతరం చేసి పెట్టాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ విధంగా నాగరికమైనదో దానిని చూసి మనం ఎలా గర్వంగా పడగలమో నాకు తెలియడం లేదు. ఈ భూమిపై ఇప్పుడు ఉన్నది అత్యంత నాగరికమైన యుగం అని భావించేవారు ఉన్నారు. భూమిపై చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మన దగ్గర మహా మహా విశ్వవిద్యాలయాల చదువు పూర్తి చేసిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ భూమిలో అసాధారణమైన అత్యంత తెలివైన వ్యక్తులు ఉన్నారు. మేధావులు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు.. ఒక్కరని కాదు, రకరకాలు. కానీ, జీవితం ఎలా ఉంది అంటారు? కష్టంగా ఉంది కష్టాతి కష్టంగా ఉంది. ఇంత కష్టం మనం ఎవరి కోసం పడుతున్నట్టు? దేనికోసం పరిగెడుతున్నట్లు? ఈ నడుస్తున్న జీవన వ్యాకరణం తప్పు అని నాకు అనిపిస్తోంది, ఈ తరహా జీవన విధానం సాధారణమైనది కాదు, ప్రాకృతమైనది కాదు. కాబట్టి, నేను దానినుండి సాధారణ మానవ స్థితికి రావాలనుకుంటున్నాను. మనిషి ఒక సాధారణత్వానికి మరలిపోవాలి. అతను జంతువులతో సమానంగా ఉండాలి. అవును మీరు సరిగా చదివారు. జంతువులతో సమానంగా పక్షులు ఒకటి లేదా రెండు రోజుల్లో గూడు కట్టుకుంటాయి. ఎలుక ఒక్క రాత్రిలో తన నివాస రంధ్రం చేస్తుంది. కానీ సృష్టిలో మనలాంటి తెలివైన మనుషులు ఒక ఇంటి కోసం 30 సంవత్సరాలు గడుపుతారు. అప్పులు చేసి మరీ జీవితాన్ని క్లిష్టతరం చేసుకుంటారు. ఇంత కష్టమైన జీవితంలో కూడా ఈ భూమి మీద వసించే చాలామంది వ్యక్తులకు తమ జీవితంలో ఒక ఇంటిని కలిగి ఉంటారని నమ్మలేము. కాబట్టి ఇదంతా తప్పు జరుగుతుంది. మనం మన ఆత్మను ఎందుకు నాశనం చేసుకుంటున్నాము? మనం మన సామర్థ్యాన్ని ఎందుకు అంతగా నాశనం చేసుకుంటున్నాము? ఈ ఆలోచనలో నన్ను నేను వెదుక్కుంటూ వెనక్కి వచ్చాను. నేను ఒక సాధారణుడ్ని అయ్యాను అనుకుంటున్నాను. మీరంతా సాధారణ మార్గంలో అనుకునే ఒక అసాధారణమైన రీతిలో జీవిస్తున్నారు. మీకు తెలియదు, మీకు మీ గురించి ఆలోచించే సమయం, స్వేచ్చ లేదు. నిజానికి ఇప్పుడు ఈ రోజు నేను సాధారణంగా ఉండటానికి, మామూలుగా బ్రతకడానికి, సహజంగా ఉండేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రజలు నన్ను ఒక అసాధారణ వ్యక్తి అనుకుంటున్నారు లేదా పిచ్చివాడు, కానీ అదేమీ నేను పట్టించుకోను. ఎందుకంటే అది నా సమస్య కాదు వారి సమస్య. జీవితం నాకు ఇప్పుడు సులభంగా, తేలికగా ఉంది. అది నాకు చాలు. అది నాకు చాలా ఎక్కువ. ప్రజలు ఏమైనా అనుకోవచ్చు. వారు అనుకోడాన్ని, వారి అభిప్రాయాలను మార్చడానికి, నచ్చచెప్పడానికి నేను ఏమీ చేయలేను. నేను చేయగలిగేది ఒక్కటే, నన్ను, నా మనసును మార్చుకోవడం. నా మనస్సును నేనే నిర్వహించుకోవడం. ఎంపిక అనేది ఎవరికి వారి వ్యక్తిగత ఎన్నిక. మీకు ఏం కావాలో మీరు మీరు ఎంపిక చేసుకోవచ్చు. సులభంగా నుండి కష్టంగా ఉండటానికి ఎంపిక. కష్టంగా నుండి సులభంగాఉండటానికి ఎంపిక, అది మీ పై ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) -
భారీగా పెరిగిన ఇన్స్టంట్ నూడిల్స్ ధరలు, 14 ఏళ్ల తర్వాత..తొలిసారి!
థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 14ఏళ్ల తర్వాత ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను పెంచే ప్రతిపాదనకు థాయ్లాండ్ ఆమోదం తెలిపిందని ఆ దేశ వాణిజ్య విభాగం వెల్లడించింది. పెరిగిన ధరలు ఆగస్ట్ 25 (నిన్న)నుంచి అమల్లోకి వచ్చాయి. 2008లో చివరి సారిగా థాయిల్ లాండ్ ప్రభుత్వం ఇన్స్టంట్ నూడిల్స్ ధరల్ని పెంచింది. అయితే కొద్ది రోజుల క్రితం.. ఉక్రెయిన్పై రష్యా వార్, గత సంవత్సరాల్లో సంభవించిన కరువు, వరదలతో పాటు గోధుమలు, ఇంధనం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఇన్ స్టంట్ నూడుల్స్ ఐదు ప్రధాన ఉత్పత్తిదారులు తమ ధరలను పెంచడానికి అనుమతించాలని థాయ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో తాజాగా ఉత్పత్తి దారులు విజ్ఞప్తితో థాయ్ ప్రభుత్వం ధరల పెంపుపై మద్దతు పలికింది. దీంతో ప్రతి సాధారణ పరిమాణ ప్యాకెట్పై ఏడు భాట్ల (అంటే భారత్ కరెన్సీలో రూ.15.48) పెంచుతూ వాణిజ్య విభాగం ఆమోదం తెలిపింది. ఇన్స్టంట్ నూడుల్స్ ధరలను బ్యాంకాక్ ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్కి ఆరు భాట్ (రూ.13.27కి) పరిమితం చేసింది. ►ఇటీవలి వారాల్లో, గోధుమ పిండి ధర దాదాపు 20-30 శాతం పెరిగింది. పామాయిల్ ధర రెండింతలు పెరిగిందని థాయ్ ప్రభుత్వ ప్రిజర్వ్డ్ ఫుడ్ విభాగానికి చెందిన వీర నాఫప్రుక్చార్ట్ చెప్పారు. ►జూన్లో థాయ్లాండ్లో ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందని, వినియోగదారులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రించాలంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ►జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలలో నూడిల్స్ ధరలు ఇప్పటికే పెరిగాయి. చైనాలో ఈ సంవత్సరం గోధుమ ధర 30 శాతం పెరగవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. -
థాయ్లాండ్ చెక్కేసిన గొటబయ
కొలంబో: శ్రీలంక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కారణమంటూ నిరసనకారలు ఆందోళనలు చేపట్టడంతో గోటబయ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మాల్దీవుల నుంచి సింగపూర్కి పయనమయ్యారు. అక్కడే 14 రోజుల పర్యాటక వీసాపై తాత్కాలికంగా ఆశ్రయం పొందారు కూడా. అంతేగాక ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియునున్న తరుణంలో శ్రీలంక ప్రభుత్వం మరికొన్ని రోజులు గోటబయకి అక్కడే ఆశ్రయం ఇవ్వాల్సిందిగా సింగపూర్ అధికారులను కోరింది. మరీ ఏమైందో తెలియదు గానీ ఆయన హఠాత్తుగా థాయలాండ్ చెక్కేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు గోటబయ రాజపక్స గురువారానికి థాయ్లాండ్ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది కూడా. దీంతో గోటబయ థాయలాండ్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైన తీవ్ర నిరసనలు నడుమ అధ్యక్ష పదవికి రాజీనామ చేసి దేశం వదిలి పారిపోయిన తొలి అధ్యక్షుడగా గోటబయ నిలిచిపోయాడు. (చదవండి: Gotabaya Rajapaksa: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక) -
Thailand: నైట్క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం
బ్యాంకాక్: థాయ్ల్యాండ్ చోన్బురి ప్రావిన్స్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్క్లబ్లో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో పలువురు దుర్మరణం పాలయ్యారు. అర్ధరాత్రి దాటాక సట్టాహిప్ జిల్లాలోని మౌంటెన్ బీ నైట్క్లబ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటిదాకా 13 మంది దుర్మరణం పాలైనట్లు అధికారులు ధృవీకరించారు. మరో 35 మంది తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బాధితులంతా థాయ్ పౌరులేనని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. -
రెండు తలలతో జన్మించిన పిల్లి.. మురిసిపోతున్న యజమాని!
బ్యాంకాక్: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్లాండ్లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు. ఫ్రాంక్ అండ్ లూయీదే గిన్నిస్ రికార్డు ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్ అండ్ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్ క్యాట్గా 2012లోనే ఇది గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం. ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది! -
కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం..ఏ దేశాల్లో అమల్లో ఉందంటే..!
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భారత్లో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులపై కొరడా ఝులిపించింది థాయ్లాండ్. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు, చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది. 'హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను న్యాయశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతే ఏకగ్రీవంగా ఆమోదం లభించటం గమనార్హం. స్వచ్ఛంద కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో.. చేపట్టాల్సిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ బిల్లు రాయల్ గెజిట్లో పబ్లీష్ అయ్యాక చట్టంగా మారనుంది. ఏ దేశాలు ఈ శిక్షను అమలు చేస్తున్నాయి? కెమికల్ కాస్ట్రేషన్ అనేది శిక్షల్లో కొత్తదేమి కాదు. ఇది దక్షిణ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్ కాస్ట్రేషన్ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాస్ట్రేషన్ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీనికి గురైన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. సెక్స్ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని బావిస్తున్నారు. ఇదీ చూడండి: యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా? -
విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్లో అధికారులు
Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా. -
‘మెట్రో ఇండియా’ రేసులో రిలయన్స్, ప్రేమ్జీ
న్యూఢిల్లీ: మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు రేసు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. థాయిలాండ్కు చెందిన చరోన్ పోక్పాండ్ (సీపీ) గ్రూపు సైతం రంగంలోకి వచ్చింది. అలాగే, ప్రేమ్జీ ఇన్వెస్ట్ (విప్రో ప్రేమ్జీ సొంత పెట్టుబడుల సంస్థ), ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ కూడా రేసులో ఉన్నాయి. ప్రముఖ రిటైల్ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ రిటైల్ కూడా పోటీ పడుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. జర్మనీకి చెందిన రిటైలర్ మెట్రో ఏజీ.. భారత్లోని తన ఆస్తులను విక్రయానికి పెట్టడం తెలిసిందే. ఇక 1–1.5 బిలియన్ డాలర్లతో మెట్రో ఇండియా ఆస్తుల కొనుగోలు అవకాశాలను టాటా గ్రూపు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్ బెయిన్ క్యాపిటల్ మదింపు వేస్తున్నట్టు సమాచారం. ఫ్లిప్కార్ట్–వాల్మార్ట్, డీమార్ట్, అమెజాన్ ఈ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టేనని తాజా సమాచారం. ఈ వారంలోనే నాన్బైండింగ్ ఆఫర్లను సమర్పించాల్సి ఉంటుంది. నాన్ బైండింగ్ ఆఫర్లు వచ్చిన తర్వాత ఆయా సంస్థలతో మెట్రో ఏజీ చర్చలు నిర్వహించనుంది. ఇందుకు రెండు నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. భారత్లో కార్యకలాపాలు అనుకున్నంత ఆశావహంగా లేకపోవడంతో మెట్రో ఏజీ తన ఆస్తులను విక్రయించి వెళ్లిపోవాలని అనుకుంటుండడం తెలిసిందే. పదికి పైగా సంస్థలు తొలుత ఆసక్తి చూపించగా.. అధిక పోటీ కారణంగా కొన్ని సంస్థలు ముందే తప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సహా సుమారు పది సంస్థలు పోటీ పడుతున్నట్టు తొలుత పేర్లు వినిపించడం గమనార్హం. ‘‘మా విధానం ప్రకారం మీడియాలో వచ్చే ఊహాజనిత వార్తలపై స్పందించం. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను మదింపు వేస్తూనే ఉంటుంది’’అని రిలయన్స్ రిటైల్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
వరల్డ్ ఫుడ్ థాయ్ సొమ్తమ్ తయారీ ఇలా!
కావలసినవి: పచ్చిబొప్పాయి చిన్నది – ఒకటి, బీన్స్ – నాలుగు(సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – ఆరు, చెర్రీ టొమాటోలు – ఎనిమిది(ముక్కలు తరగాలి), పచ్చిమిర్చి (ఎర్ర లేదా పచ్చనివి) – ఆరు, పంచదార – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు, సోయాసాస్ – రెండు టేబుల్ స్పూన్లు, వేయించిన వేరు శనగ గింజలు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ.. ∙ బొప్పాయి తొక్క, గింజలు తీసి సన్నగా తురుమి ఒక గిన్నెలో వేయాలి ∙ వెల్లుల్లి రెబ్బలు, బీన్స్, టొమాటోలు, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి పక్కనపెట్టుకోవాలి ∙ ఒక కప్పులో పంచదార, నిమ్మరసం, సోయా సాస్వేసి కలిపి పెట్టుకోవాలి ∙ ఇప్పుడు బొప్పాయి తరుగులో దంచిన ముక్కలు, పంచదార, సోయాసాస్ల మిశ్రమం వేసి చక్కగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. గమనిక: దంచాల్సిన వాటిని బ్లెండర్లో అస్సలు వేయకూడదు. సోయాసాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయనవసరం లేదు. -
ధీరజ్ జట్టు పసిడి గురి
ఫుకెట్ (థాయ్లాండ్): ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్ రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ధీరజ్, సుశాంత్ పార్థ్ సాలుంకె, రాహుల్ కుమార్ నగర్వాల్లతో కూడిన భారత జట్టు 6–2తో కజకిస్తాన్ జట్టును ఓడించింది. -
Hanami In Japan: లీ హోలీ.. జపాన్లో హనామి, థాయ్లాండ్లో సోంక్రాన్, ఇంకా...
మనదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్లలోను, భారతీయ సంతతివారు ఎక్కువగా నివసించే ఆఫ్రికా, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ మాదిరిగానే వసంతానికి స్వాగతం పలుకుతూ వివిధ దేశాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. హనామి జపాన్ జపాన్లో జరుపుకొనే వసంతోత్సవాన్ని ‘హనామి’ అంటారు. ‘హనామి’ అంటే పుష్పసందర్శనం. ఈ కాలంలోనే జపాన్లో చెర్రీ చెట్లు నిండా పూలతో విరగబూసి కనువిందు చేస్తాయి. ప్లమ్ వృక్షాలు కూడా ఇలాగే విరగబూస్తాయి గాని, జపాన్లో చెర్రీ వృక్షాలే విరివిగా కనిపిస్తాయి. చెర్రీ పూలను జపానీస్ భాషలో ‘సకురా’ అంటారు. హనామి వేడుకలు ఏటా మార్చి నెలలో ఆఖరి వారం నుంచి మే తొలివారం వరకు జరుగుతాయి. ఏటా ఫిబ్రవరిలో జపాన్ వాతావరణ శాఖ ఆ ఏడాది చెర్రీవృక్షాలు ఏ సమయంలో పుష్పించడం ప్రారంభిస్తాయో అంచనా వేసి, తేదీని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వేడుకలు మొదలవుతాయి. తొలుతగా ఒకినావా దీవి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. మన కార్తీక వనభోజనాలను ఉసిరిచెట్ల కింద చేసుకునే పద్ధతిలోనే జపాన్ ప్రజలు వసంతకాలంలో ఆరుబయట విరగబూసిన చెర్రీచెట్ల కింద, ప్లమ్ చెట్ల కింద ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదాలు చేసుకుంటారు. చాలాచోట్ల రాత్రివేళ కూడా చెట్లకు పేపర్లాంతర్లు వేలాడదీసి, ఆరుబయటే ఆటపాటలతో విందు వినోదాలతో గడుపుతారు. టోక్యోలోని ఉయెనో పార్కులో ‘హనామి’ వేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. ‘హనామి’ వేడుకల సంప్రదాయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో గెన్మెయి మహారాణి కాలం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. జపాన్లో మృతుల కళేబరాలను చెర్రీ చెట్ల కింద సమాధి చేసే ఆచారం కూడా ఉంది. ‘హనామి’ వేడుకల్లో పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుతారు. వసంతానికి స్వాగతం పలుకుతూ ఆరుబయట ప్రకృతి ఒడిలో గడుపుతారు. హనామి తరహా వేడుకలు తైవాన్, కొరియా, ఫిలిప్పీన్స్, చైనాలలోనూ జరుగుతాయి. జపాన్ 1912లో అమెరికాకు మైత్రీచిహ్నంగా మూడువేల చెర్రీ మొక్కలను కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికాలోనూ పలుచోట్ల ఈ వేడుకను ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోంక్రాన్– థాయ్లాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడంతోనే థాయ్లాండ్లో వసంతోత్సవాలు మొదలవుతాయి. థాయ్లాండ్ వాసులు ఏటా ఏప్రిల్ 13న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ రోజు నుంచి మొదలయ్యే వసంత స్వాగతోత్సవాలు మాత్రం మూడు రోజుల పాటు– ఏప్రిల్ 15 వరకు చాలా సందడిగా కొనసాగుతాయి. ఈ వేడుకల కోసం అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 12 నుంచి 16 వరకు సెలవు దినాలను ప్రకటిస్తుంది. బంధుమిత్రులతో ఈ వేడుకలు జరుపుకోవడానికి ఉపాధి కోసం నగరాల్లో పనిచేసుకునే వారంతా స్వస్థలాలకు పయనమవుతారు. థాయ్లాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ‘సోంక్రాన్’ అంటారు. ‘సోంక్రాన్’కు మూలం సంస్కృతంలోని ‘సంక్రాంతి’ పదమే. సౌరమానం ప్రకారం తొలి సంక్రాంతి అయిన మేష సంక్రాంతినే థాయ్లాండ్ వాసులు నూతన సంవత్సరంగా పాటిస్తారు. భారత్లో కూడా సౌరమానం పాటించేవారు మేష సంక్రాంతినే నూతన సంవత్సరంగా పాటిస్తారు. థాయ్లాండ్ వాసులు మిగిలిన వారికి భిన్నంగా వరుసగా మూడురోజుల పాటు వసంతోత్సవాలను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా థాయ్ ప్రజలు బౌద్ధారామాలను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేసి, జనాలంతా కూడళ్లలోకి చేరుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. నీళ్లు చిమ్ముకునే ఆచారం వల్ల ఈ వేడుకలను ‘వాటర్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, చక్కగా అలంకరించుకున్న మహిళలు, యువతులు సంగీతవాద్యాలతో పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళతారు. కొన్నిచోట్ల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఊరేగింపులో పాల్గొన్న అందమైన మహిళలను, యువతులను ‘లేడీ సోంక్రాన్’, ‘మిస్ సోంక్రాన్’ బిరుదులిచ్చి, కిరీటాలతో వారిని ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఆలయాల పునరుద్ధరణ కోసం ఇసుకను దానం చేస్తారు. పెద్దలను స్మరించుకుంటూ, బౌద్ధ భిక్షువులకు అన్నసంతర్పణలు చేస్తారు. మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ వసంతకాలం అడుగుపెట్టే తొలిరోజు మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తారు. మెక్సికోలోని తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఏటా మార్చి నెలలో వసంతారంభంగా వాతావరణ నిపుణులు ప్రకటించిన రోజున ఈ సంబరాలను జరుపుకొంటారు. సాధారణంగా మార్చి 19–22 తేదీల మధ్య వసంత రుతువు మొదలవుతుంది. సంగీత వాద్యాలతో దారిపొడవునా పాటలు పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ విచిత్ర వేషధారణలతో ఉత్సాహంగా ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపులో తినుబండారాలు, పానీయాలు విరివిగా దొరుకుతాయి. ఈ వేడుకలు కొన్నిచోట్ల వారంరోజుల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు రెండు వారాల వరకు కూడా కొనసాగుతాయి. కార్నివాల్ వేడుకలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో మెక్సికోకు వస్తుంటారు. శాషిల్యూటెన్– స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో వసంతోత్సవాన్ని ఏప్రిల్లో జరుపుకుంటారు. చలిదేశం కావడం వల్ల అక్కడ వసంతకాలం కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మధ్యయుగాల నుంచే స్విట్జర్లాండ్లో ఈ వేడుకలు జరుపుకొనే ఆచారం ఉంది. అప్పట్లో వేసవిలోని మొదటి పనిదినాన ఈ వేడుకలను జరుపుకొనేవారు. గత శతాబ్దం నుంచి ఈ వేడుకలను ఏప్రిల్ మూడో సోమవారం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. విద్యుత్తు లేని మధ్యయుగాల కాలంలో శీతాకాలంలో పగటి వెలుతురు ఉన్నంత సేపే పనిగంటలు నడిచేవి. వేసవిలోని తొలి పనిదినాన కాలానికి తగినట్లు పనివేళలను నిర్ణయించుకునే వారు. సాయంత్రం ఆరుగంటలకు చర్చిగంటలు మోగగానే పనివేళలను ముగించుకోవాలని అప్పట్లో శాసనం కూడా తెచ్చారు. శీతాకాలం వెళ్లిపోతూ వసంతం ప్రారంభమైదనడానికి సూచనగా స్విస్ ప్రజలు నగరాలు, పట్టణాల కూడళ్లలో పెద్దసంఖ్యలో గుమిగూడి, గోనెపట్టాలు, ఇతర వ్యర్థాలతో తయారుచేసే శీతాకాలం దిష్టిబొమ్మను తగులబెడతారు. దీని తలభాగంలో మందుగుండు కూడా దట్టిస్తారు. బొమ్మ కొంత కాలిన తర్వాత మంటలు తలవరకు వ్యాపించి, మందుగుండుకు నిప్పు తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఈ ఆచారం మనదేశంలో జరిగే హోలికాదహనం, కామదహనం మాదిరిగానే కనిపిస్తుంది. శీతాకాలం దిష్టిబొమ్మను ‘బోగీ’ అంటారు. మనం భోగిమంటలు వేసుకుంటాం, వాళ్లు ‘బోగీ’కి మంట పెడతారు. గమ్మత్తుగా లేదూ! సెమానా శాంటా– గ్వాటెమాలా గ్వాటెమాలాలో ‘సెమానా శాంటా’ పేరిట వసంతోత్సవాలను జరుపుకొంటారు. ‘సెమానా శాంటా’ అంటే పవిత్ర వారం అని అర్థం. ఈ వారాన్ని ‘సెమానా మేయర్’ (ప్రధానవారం) అని కూడా అంటారు. ఈ వారం రోజులూ గ్వాటెమాలా నలుమూలలా చర్చ్లలో ప్రార్థనలు, వీథివీథినా ఊరేగింపులు జరుగుతాయి. ‘శాంటా హెర్మన్డాడ్’ అనే శాంతిపరిరక్షక దళాల నాయకత్వంలో పిల్లా పెద్దా అందరూ క్రీస్తు, మేరీమాతల చిత్రపటాలు ధరించి, పాటలు పాడుతూ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈస్టర్ ఆదివారంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ పవిత్రవారానికి సన్నాహాలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే లా క్యుయారెస్మా (లెంట్)తో ప్రారంభమవుతాయి. ‘లెంట్’ రోజుల్లో క్యాథలిక్లు ఉపవాసాలు, ప్రార్థనలతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్లు ఈ ఆచారాలను పాటించినా, గ్వాటెమాలాలో మాత్రం మరింత విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రవారంలో ఊరేగింపు జరిపే దారుల్లో ‘లాస్ ఆంఫ్రోబాస్’ అనే రంగురంగుల తివాచీలను పరుస్తారు. ఈ తివాచీల హస్తకళా నైపుణ్యం చూసి తీరాల్సిందే! గ్వాటెమాలా ప్రజలు ఈ వేడుకల కోసం స్వయంగా ఈ తివాచీలను తయారు చేస్తారు. వీటి తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. రంపపుపొట్టు, ఎండిపోయిన పూలు, ఆకులు, పండ్లు, చెట్ల బెరళ్ల నుంచి అత్యంత ఆకర్షణీయమైన రంగులను తయారు చేయడం ఇక్కడి విశేషం. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్: హాలండ్, మిషిగాన్ అమెరికాలో మిషిగాన్ రాష్ట్రంలోని హాలండ్ నగరంలో ఏటా ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ పేరిట వసంతోత్సవ సంబరాలు జరుగుతాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే డచ్ ప్రజలు ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ ఏటా మే నెల రెండోవారంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ రుతువులో ట్యూలిప్ మొక్కలు విరగబూస్తాయి. గత శతాబ్దకాలంగా మిషిగాన్లోని హాలండ్ నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థిరపడ్డ డచ్ ప్రజల కోరిక మేరకు 1928లో హాలండ్ నగరపాలక సంస్థ నెదర్లాండ్స్ నుంచి లక్ష ట్యూలిప్ మొక్కల దిగుమతికి అనుమతించింది. వాటిని స్థానిక పార్కులకు పంపిణీ చేసింది. మరుసటి సంవత్సరం ఆ మొక్కలు విరగబూయడంతో చిన్నస్థాయిలో వేడుక జరుపుకొన్నారు. హాలండ్ నగర శతవార్షిక సంవత్సరమైన 1947 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల సందర్భంగా ట్యూలిప్ పూలను ప్రదర్శిస్తూ ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మార్జానా– పోలండ్ పోలండ్లో వసంతోత్సవాలను ‘మార్జానా’ పేరిట జరుపుకొంటారు. ‘మార్జానా’ అనేది పురాతన స్లావిక్ మతానికి చెందిన శీతాకాల మృత్యుదేవత. చెక్, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలలో ఈ దేవతను ‘మోరానా’ అని, రష్యాలో ‘మారెనా’ అని, ఉక్రేనియాలో ‘మారా’ అని, బల్గేరియాలో ‘మొరా’ అని పిలుస్తారు. పునర్జన్మల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక ఇది. శీతకాలం ముగిసే సమయంలో జనాలు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలను మోగిస్తూ భారీ ఊరేగింపు జరిపి, ‘మార్జానా’ దేవత దిష్టిబొమ్మను దగ్గర్లోని నదుల్లోను, జలాశయాల్లోను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంతో మరణించిన ‘మార్జానా’ తిరిగి ‘కోస్త్రోమా’– అంటే వసంత దేవతగా జన్మిస్తుందని విశ్వసిస్తారు. నిమజ్జనానికి ముందు కొన్నిచోట్ల మార్జానా దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టడం లేదా, దిష్టిబొమ్మకు చుట్టిన దుస్తులను చించేయడం వంటి పనులు చేస్తారు. ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకల్లో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు పాల్గొంటారు. ‘మార్జానా’ను నిమజ్జనం చేసి, విందు వినోదాలతో వేడుకలు జరుపుకొంటే పంటలు బాగా పండుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. సింబురిజాదా – బోస్నియా బోస్నియాలో వసంతోత్సవమంటే ఆహారోత్సవమే! ‘సింబురిజాదా’ పేరిట ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఈ వేడుకలను జనాలు ఆరుబయట జరుపుకొంటారు. నదులు, తటాకాల ఒడ్డున, ఉద్యానవనాల్లోను గుంపులు గుంపులుగా చేరి, ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆరుబయట పొయ్యిలు ఏర్పాటు చేసుకుని, భారీస్థాయిలో గుడ్లను గిలకొట్టి వాటితో సామూహికంగా తయారుచేసే వంటకాలను అందరూ ఆరగిస్తారు. వేడుకలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా ఈ గుడ్ల వంటకాలను వడ్డిస్తారు. వసంత స్వాగతోత్సవ వేడుకల్లో గుడ్లు మాత్రమే ఎందుకు? వేరేవి ఏవైనా వండుకుంటే కుదరదా? అంటే, కుదరనే కుదరంటారు బోస్నియా వాసులు. జీవావిర్భవానికి మూలం గుడ్డు. ఎక్కడైనా గుడ్డు నుంచే పిల్ల పుడుతుంది. వసంతంతోనే కొత్త రుతువు మొదలవుతుంది. అందువల్ల కొత్త జీవానికి సంకేతంగా గుడ్లతోనే సంప్రదాయ వంటకాలు చేసుకుంటామని చెబుతారు. ఫాలెస్– స్పెయిన్ స్పెయిన్లో ‘ఫాలెస్’ పేరిట వసంతారంభంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలను సెయింట్ జోసెఫ్ సంస్మరణార్థం ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు భారీ ఎత్తున జరుపుకొనే సంబరాల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ‘ఫాలెస్’ అంటే కాగడా అని, నిప్పుపెట్టడం అని అర్థాలు ఉన్నాయి. ‘ఫాలెస్’ వేడుకల్లో ఊరేగింపులు, విందు వినోదాలు, గానాభజానాలు అట్టహాసంగా జరుగుతాయి. విందుల్లో గుమ్మడికాయ, చాక్లెట్తో తయారుచేసే ప్రత్యేక సాంప్రదాయక వంటకాలను వడ్డిస్తారు. ఈ వేడుకల్లో ప్రజలు కొత్తదనానికి స్వాగతం పలికే క్రమంలో పాతవాటన్నింటినీ వదులుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే పాత వస్తువులన్నిటినీ కూడళ్లలో గుట్టలుగా పోసి, వాటికి నిప్పంటిస్తారు. ఈ తతంగం మన భోగిమంటల మాదిరిగా ఉంటుంది. పెద్దసైజులో తయారు చేసే దిష్టిబొమ్మలను కూడా ఈ మంటల్లో వేసి తగులబెడతారు. స్పెయిన్లోని వాలెన్షియా నగరంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి. చదవండి: Cricketers Holy Celebrations: రోహిత్ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో -
వారం తర్వాత మెల్బోర్న్ చేరిన వార్న్ భౌతిక కాయం..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్వార్న్ పార్థివ దేహం మెల్బోర్న్కు చేరుకుంది. బ్యాంకాక్లో గత శుక్రవారం గుండెపోటుతో 52 ఏళ్ల వార్న్ హఠాన్మరణం చెందాడు. అతని భౌతిక కాయంపై ఆస్ట్రేలియా జాతీయ పతాకాన్ని ఉంచారు. థాయ్లాండ్ నుంచి ప్రైవేటు జెట్ విమానంలో అతని పార్థివ దేహాన్ని సన్నిహితులు, వ్యక్తిగత సహాయకుడు స్వదేశానికి తీసుకొచ్చారు. తన కెరీర్కే వన్నె తెచ్చిన ఎంసీజీలో ఈ నెల 30న ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేసేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించింది. సుమారు లక్ష మంది ఇందులో పాల్గొనే అవకాశముంది. చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..! వీడియో: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
వార్న్ చనిపోవడానికి నాలుగు గంటల ముందు రూంలో ఏం జరిగింది.. ఆ నలుగురు ఎవరు..?
స్పిన్ మాంత్రికుడు, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ ఈనెల (మార్చి) 4న థాయ్లాండ్లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్ది సహజ మరణమేనని (గుండెపోటు) అటాప్సి రిపోర్టు సైతం దృవీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఫుటేజ్ రకరకాల అనుమానాలకు తావిస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వార్న్ మృతి చెందడానికి నాలుగు గంటల ముందు నలుగురు యువతులు అతని రూమ్లో వెళ్లిన దృశ్యాలు విల్లాలోని సీసీ కెమరాల్లో రికార్డై ఉన్నాయి. వార్న్ బ్రతికుండగా చివరిసారిగా చూసింది ఈ నలుగురేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు.. వార్న్ రూమ్లో వారు ఏం చేస్తున్నారని పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. చనిపోయిన రోజు మధ్యాహ్నం (1: 53 గంటల సమయం) వార్న్.. నలుగురు మసాజ్ చేసే అమ్మాయిలను రూంకు పిలిపించుకున్నాడని, వారిలో ఇద్దరు వార్న్ స్నేహితుల రూంలోకి వెళ్లగా మరో ఇద్దరు వార్న్తో గంటకు పైగా గడిపారని, అనంతరం వారంతా తిరిగి 2: 58 గంటల సమయంలో రూం నుంచి వెళ్లిపోయారని సీసీ కెమరాల్లో రికార్డైన టైమ్ ఆధారంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనానికి వస్తానన్న వార్న్ ఎంతకీ రాకపోవడంతో అతని స్నేహితులు సాయంత్రం 5: 15 గంటలకు వార్న్ రూంకు వెళ్లారు. అయితే అప్పటికే వార్న్ ప్రాణాలు కోల్పోయి బెడ్పై నిర్జీవంగా పడి ఉన్నాడు. ఈ క్రమంలో స్నేహితులు వార్న్కు సీపీఆర్ చేస్తుండగా రక్తం కక్కుకున్నట్లు, అవే మరకలు టవల్పై, ఫ్లోర్పై పడ్డాయని పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వార్న్ స్నేహితులు కూడా అంగీకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు.. వార్న్ అతని స్నేహితులు మసాజ్ కోసం అమ్మాయిలను పిలిపించుకున్న మాట వాస్తవమేనని, అయితే అప్పటికే వార్న్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, ఈ కేసులో వార్న్ స్నేహితులకు కాని, మసాజ్ చేసిన అమ్మాయిలకు కాని ఎటువంటి సంబంధం లేదని, వార్న్ అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే మరణించాడని నిర్ధారించారు. వార్న్ను చివరిసారిగా చూసిన అమ్మాయిలను గుర్తించాల్సి ఉందని థాయ్ పోలీసులు పేర్కొన్నారు. చదవండి: షేన్ వార్న్ అంత్యక్రియలకు తేదీ ఖరారు -
వార్న్ లెజెండ్, గొప్ప వ్యక్తి అని విని షాకయ్యా: పాక్ క్రికెటర్
తొందరపాటు చర్యల వల్ల ఒక్కోసారి విమర్శలపాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో చిన్న తప్పు దొర్లితే చాలు ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. మార్చి 4న థాయ్లాండ్లోని విల్లాలో తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలో లెజెండ్ మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన సహచర ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆమిర్ సైతం వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించాడు. అయితే, ఇందుకు సంబంధించి అతడు చేసిన ట్వీట్లో అన్వయ దోషం వల్ల పూర్తిగా అర్థమే మారిపోయింది. ‘‘అతడు క్రికెట్ లెజెండ్, గొప్ప వ్యక్తి అనడం విని షాకయ్యాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్’’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు. ఒక్క ఫుల్స్టాప్ పెట్టి ఉంటే... ‘‘ఈ విషయం విని షాకయ్యాను. ఆయన లెజెండ్. మంచి మనసున్న వ్యక్తి’’ అనే అర్థం వచ్చేది. కానీ ఆమిర్ ఇది మిస్ కావడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘నీ ఇంగ్లిష్ వింటే వార్న్ ఏడ్చేసేవాడు. చచ్చిపోయి బతికిపోయాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్లో భాగమయ్యాడన్న కారణంగా ఆమిర్ కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్పై విమర్శలు! Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! shocked to hear that he was legend of the game and equally a good person . RIP LEGEND 🙏 😔 pic.twitter.com/bv9z0RojyT — Mohammad Amir (@iamamirofficial) March 4, 2022 -
Shane Warne: వార్న్ను తలచుకుని ఒక్కసారిగా ఏడ్చేసిన రికీ పాంటింగ్
‘‘మిగతా వాళ్లలాగే నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. పొద్దున నిద్ర లేవగానే మెసేజ్లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను పొద్దున్నే నెట్బాల్ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్తో గత రాత్రి నిద్రపోయాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. తనతో మడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాడు షేన్ వార్న్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. థాయ్లాండ్లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో వార్న్ సహచర ఆటగాళ్లు, అభిమానులు అతడిని తలచుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. మణికట్టుతో మాయ చేసే కింగ్ ఆఫ్ స్పిన్ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు. ఇక 15 ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీలో వార్న్ను కలిశానన్న 47 ఏళ్ల పాంటింగ్... వార్న్ తనకు ఓ నిక్నేమ్ పెట్టాడంటూ గుర్తు చేసుకున్నాడు. దశాబ్దకాలం పాటు కలిసి క్రికెట్ ఆడామని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామంటూ అతడితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించాడు. కాగా రికీ పాంటింగ్ సారథ్యంలో వార్న్ అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. చదవండి: Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! -
శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ లోకాన్ని విడిచి రెండోరోజులు కావొస్తోంది. వార్న్ అకాల మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల సంతాపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాగా థాయ్ అధికారులు ఆదివారం షేన్వార్న్ భౌతికకాయానికి అటాప్సీ (శవ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం కొరకు భౌతికకాయాన్ని ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వార్న్ చనిపోయే ముందు ఎలాంటి ఆల్కాహాల్.. మత్తు పదార్థాలు తీసుకోలేదని వార్న్ మేనేజర్ చెప్పినట్లు థాయ్ పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అటాప్సీ రిపోర్టు ద్వారా బయటపడే అవకాశాలున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టుమార్టం అనంతరం వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపింది. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కుమారుడు జాక్సన్తో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కాగా థాయ్లాండ్లోని కోయ్ సమూయ్ ప్రాంతంలోని తన విల్లాలో 52 ఏళ్ల వార్న్ అచేతనంగా పడి ఉండడం.. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసినట్లు తెలిసింది. వార్న్ స్నేహితులు కూడా దాదాపు 20 నిమిషాల పాటు అతన్ని బతికించే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకుండా పోయింది. వార్న్ మృతిపై అతని కుటుంబసభ్యులు ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. తండ్రి మృతిపై అతని పెద్ద కుమారుడు బోరున విలపించాడు. జాక్సన్ మాట్లాడుతూ..'' నాన్న ఇంకా మా కళ్ల ముందు తిరుగుతున్నట్లే ఉంది.. మా ఇంటి డోర్ నుంచి లోపలికి వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజంగా ఇది చెడ్డ కల అయితే బాగుండు'' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక వార్న్ 1992-2007 మధ్య 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా క్రికెట్కు తన సేవలందించాడు. మొత్తంగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. చదవండి: Shane Warne: వార్న్ మృతిపై థాయ్ పోలీసులు ఏమన్నారంటే.. Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి -
వార్న్ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ!
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ఆకాల మరణంతో క్రీడా లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. థాయిలాండ్లోని కోహ్ సమీయులో తన విల్లాలో గుండెపోటుతో వార్న్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వార్న్ మృతికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. షేన్ వార్న్ను బతికించడానికి తన ముగ్గురు స్నేహితులు విశ్వప్రయత్నాలు చేశారని థాయ్లాండ్ పోలీసులు తెలిపారు. వార్న్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయిలాండ్లోని కోహ్ సమీయులోని విల్లాలో ఉంటున్నారని, వార్న్ డిన్నర్కు రాకపోవడంతో స్నేహితుడు వెళ్లి చూసే సరికి వార్న్ విగిత జీవిగా పడి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. "వార్న్కు తన స్నేహితుడు సీపీఆర్ చేశాడు. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ వచ్చి 10-20 నిమిషాల పాటు మరో సీపీఆర్ చేసింది. తరువాత థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకువెళ్లింది. హాస్పిటల్ వెళ్లాక ఐదు నిమిషాలు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేదని, అతడు మరణించాడు" అని థాయ్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Shane Warne: మా గుండె పగిలింది.. మాటలు రావడం లేదు: రాజస్తాన్ రాయల్స్ భావోద్వేగం -
ఈ తాత మామూలోడు కాదండోయ్
తాత అనేగానే.. ఒళ్లు కుంగిపోయి, చర్మం ముడతలు పడి, సరిగ్గా కదల్లేక ఓ మూలన కూర్చుంటాడు అనుకుంటారేమో. ‘కబాలీ.. రా’ రేంజ్లో హుషారు చూపిస్తుంటాడీ తాత. ఈ తాత మామూలోడు కాదు. పేరు.. సావాంగ్ జన్ప్రామ్. వయసు 102 ఏళ్లు. ఉండేది థాయ్లాండ్ సాముత్ సాంగ్ఖ్రమ్ ప్రావిన్స్లో. పోయినవారం అక్కడ 26వ ఇటెరేషన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అందులో 100-105 ఏళ్ల కేటగిరీకి జరిగిన పోటీల్లో ఈ తాతే మొత్తం మెడల్స్ మెడలో వేసేసుకున్నాడు. స్వతహాగానే ఈ పెద్దాయన ఒక అథ్లెట్. అందుకే ఈ ఏజ్లోనూ హుషారుగా పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. ఈసారి పోటీల్లో ఈయనగారు ఏకంగా ఓ రికార్డ్ కూడా నెలకొల్పాడు. తన ఈడు వాళ్లతో పోటీపడి వంద మీటర్ల పరుగు పందెంను 27.08 సెకన్లలో పూర్తి చేశాడు. 100 మీటర్ల పరుగు పందెంలో జమైకా పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ పేరిట ఉంది(2009లో 9.58 సెకండ్లు). అలాంటిది ఈ ఏజ్లో ఈ తాత ఈ రికార్డును నెలకొల్పడం గొప్పే కదా! Sawang Janpram, 102, broke the Thai 100m record – for centenarians – at the annual Thailand Master Athletes Championships https://t.co/GZcaQGrAoR pic.twitter.com/OxqGLiXySI — Reuters (@Reuters) March 3, 2022 ఈ గొప్పతనం వల్లే ఈ తాతకి.. లేడీస్లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. యూత్ ఫిజికల్ టిప్స్ కోసం ఈ తాతను కలుస్తుంటారు.. ఇక డెభ్భై ఏళ్ల ఆయన కూతురే సిరిపాన్.. ప్రస్తుతం సావాంగ్కు ట్రయినర్గా ఉంది. ఆటలే నన్ను ధృడంగా ఉంచుతున్నాయి. టైంకి మంచిగా తిని.. ఎక్సర్సైజులు గట్రా చేస్తే నాలాగే మీరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అంటున్నాడు ఈ తాత. వీటితో పాటు పాజిటివ్ మైండ్ తన తండ్రి ఆరోగ్య రహస్యం అంటోంది సిరిపాన్. థాయ్లాండ్ మాస్టర్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ పోటీలు 1996 నుంచి నడుస్తున్నాయి. అప్పుడు కేవలం 300 మంది మాత్రమే పాల్గొన్నారు. మరి ఇప్పుడో.. 2 వేల మంది.. అదీ 35 నుంచి 102 ఏళ్ల మధ్యవయస్కులు పాల్గొంటున్నారు. అంటే.. ఫిట్నెస్ మీద థాయ్లాండ్ ప్రజలకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి!
బ్యాంకాక్: మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు.కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ఉడుమును (మానిటర్ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన థాయిలాండ్లోని ఓ రెస్టారెంట్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నారాతివాత్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది. చదవండి: Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది.. మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివి గలఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్..
Man With 8 Wives In Thailand: సాధారణంగా ఒక వ్యక్తి ఒక మహిళనే పెళ్లాడటాన్ని సమాజం, చట్టం అంగీకరిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో భర్త లేదా భార్యకు తెలీయకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటివి జరుతున్నాయి. అయితే ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక వీరందరిని ప్రేమించి మనువాడటం విశేషం. అంతేనా.. ఎనిమిదిమంది భార్యలతో ఎలాంటి గొడవలు లేకుండా ఒకే ఇంటిలో ఎంచక్కా కాపురం కూడా చేస్తుండటం మరో విశేషం. థాయ్లాండ్కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే టాటూ ఆర్టిస్ట్ తన ఎనిమిది మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంటిలో నాలుగు బెడ్ రూములు ఉండగా.. ఒక్కో గదిలో ఇద్దరు భార్యల చొప్పున ఎనిమిది మందితో కాపురం చేస్తున్నాడు. ఇటీవల తన వైవాహిక జీవితం గురించి ఓ టీవీ షోలో మాట్లాడాడు. ఈ షోలో సోరోట్ తన భార్యలను పరిచయం చేస్తూ, వారిని ఎలా కలిశారో వివరించాడు. చదవండి: Winter Olympic: గాల్వాన్లో మారణహోమానికి పాల్పడిన వ్యక్తి టార్బ్ బేరరా..? తన మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమించానని తరువాత ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పిన ఓంగ్..తన రెండో భార్యను మార్కెట్లోను, మూడో భార్యను హాస్పిటల్లో.. నాలుగు, అయిదు, ఆరో భార్యలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్లలో చూసి ప్రేమించినట్లు తెలిపాడు. ఇక తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్లినప్పుడు ఏడో భార్యను చూసి ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. ఇక నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి ఇష్టపడి అక్కడే పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చానని చెప్పాడు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో! అంతేగాక తమది ఎంతో అన్యోన్య దాంపత్యమని, తన భార్యలు అందరు తనకు సమానమేనని..తన ప్రేమను అందరికి ఒకేలా పంచుతానని చెబుతున్నాడు.అంతేకాదు నా భార్యలు చాలా అందమైనవారని, ఎంతో మంచివారని తెలిపాడు. తనను ఎంతో అపురూపంగా..ప్రేమగా చూసుకుంటారని చెబుతూ తెగ మురిసిపోయాడు. ఓంగ్ తన భార్యలు, ప్రేమ గురించి ఎంతో సంతోషంగా చెబుతుంటే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఈ రోజుల్లో ఒక భార్యతోనే వేగడం కష్టమనుకుంటే ఎనిమిది మందిని పెళ్ళి చేసుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు -
బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
బ్యాంకాక్: సాధారణంగా చాలా మంది పాముని చూడగానే భయంతో వెన్నులో వణుకుపుడుతుంది. మరికొందరైతే పాము ఫలాన చోట కనిపించిందంటే.. ఆ దారిదాపుల్లోకి వెళ్లటానికి సాహసించరు. అయితే, ఒక్కొసారి పాములు తమ దారి తప్పి ఆవాసం కోసం, ఆహర అన్వేషణలో జనవాసాల మధ్యన చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లో ఆత్మరక్షణకు ఒక్కొసారి అవి కాటు వేస్తాయి. మరికొన్నిసార్లు అవి కూడా ప్రమాదాల బారిన పడతాయి. కొందరు పాములు కనిపిస్తే.. స్నేక్ సోసైటి వారికి సమాచారం అందించి వాటిని ఏ ఆపద తలపెట్టరు. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి థాయిలాండ్లో జరిగింది. దక్షిణ థాయి ప్రావిన్స్లో క్రాబీలోని ఒక తోటలో గిరినాగు ( కోబ్రా) ప్రత్యక్షమయ్యింది. దీంతో అక్కడి వారంతా భయంతో వణికిపోయారు. అది దాదాపు 14 అంగుళాల వరకు పోడవుంది. స్థానికులు వెంటనే పాములను పట్టే వారికి సమాచారం అందించారు. అయితే, నైవాధ్ అనే వ్యక్తి ఆ ప్రదేశంలో పాములను పడుతుంటాడు. అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గిరినాగు మాత్రం బుసలు కొడుతూ.. ఎంత సేపటికి అతనికి లొంగలేదు. అతను పట్టుకుందామనుకోనేసరికి బుసలు కొడుతూ.. కాటు వేయడానికి రాసాగింది. దాదాపు 20 నిముషాలు కష్టపడి చాకచక్యంగా కోబ్రాను లొంగతీసుకున్నాడు. ఆ తర్వాత నైవాధ్.. కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరిత సర్పమని తెలిపాడు. ఇది పెద్ద పాములను సైతం తింటుందని తెలిపాడు. అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుందని, కాటు వేస్తే తక్కువ సమయంలోనే మనిషి ప్రాణాలు గాల్లో కలుస్తాయని వివరించాడు. ఆ తర్వాత కోబ్రాను సమీపంలోని అడవిలో వదిలేశాడు. ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. కాగా, అతను కోబ్రాను పట్టేటప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉంది..’, ‘కాటు వేస్తే.. అంతే సంగతులు..’, ‘మీ ధైర్యానికి జోహర్లు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా -
బ్యాంకాక్ టూర్ వెళ్తున్నారా? మీకో ముఖ్యగమనిక
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. థాయ్లాండ్కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్లాండ్ ప్రభుత్వం. ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం -
మూడో కంటికి తెలియకుండా థాయిలాండ్ లో బాబు పర్యటన
-
భలే ఉన్నాయ్.. తాబేళ్లు కావు, హోటల్ భవనాలు
ఏరియల్ వ్యూలో తీసిన ఫొటో ఇది. ఇందులో తాబేళ్లు వరుసగా కొలువుదీరినట్లు కనిపిస్తోంది కదూ! ఇవి తాబేళ్లు కావు, హోటల్ భవనాలు. థాయ్లాండ్లోని హువాహిన్ ప్రాంతంలో ఉన్న ఖావో తావో రిజర్వాయర్లో ఇలా తాబేలు ఆకారంలో నీటిలో తేలియాడే హోటల్ భవంతులను నిర్మించారు. (క్లిక్: సగం కొట్టేసిన బిల్డింగ్లా కనిపిస్తోందా.. అలా అనుకుంటే పొరపాటే!) పూర్తిగా వెదురుతోను, స్థానికంగా దొరికే ప్రకృతిసిద్ధమైన నిర్మాణ పదార్థాలతో వీటిని నిర్మించారు. ఈ హోటల్ భవంతుల్లో బస చేయడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. డెర్సిన్ స్టూడియో కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్ సారావుత్ జాన్సెంగ్ ఆరామ్ ఎంతో శ్రమించి, ఈ కూర్మహర్మ్యాలకు రూపకల్పన చేశారు. (చదవండి: ప్రపంచంలోనే పొడవైన మెట్రో లైన్.. ప్రత్యేకతలు ఇవే!) -
థాయ్లాండ్కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో?
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు థాయ్లాండ్ విహార యాత్రకు వెళ్లారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ నెల 24న ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. జనవరి 2 వరకు అక్కడే కుటుంబంతో గడిపి తిరిగి వస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. వెళ్లిన తర్వాత కూడా 2 రోజుల వరకు ఆయన కోటరీకి తప్ప ఎవరికీ తెలియనీయలేదు. వరుసగా 10 రోజులపాటు చంద్రబాబు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం సమాచారమివ్వడంతో ఆయన విహారయాత్ర గురించి బయటకు పొక్కింది. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చదవండి: (నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న)