థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌.. ముగిసిన భారత్‌ పోరు | Kidambi Srikanth bows out of Thailand Masters 2025 | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌.. ముగిసిన భారత్‌ పోరు

Published Sat, Feb 1 2025 1:17 PM | Last Updated on Sat, Feb 1 2025 1:17 PM

Kidambi Srikanth bows out of Thailand Masters 2025

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌... మహిళల సింగిల్స్‌ లో రక్షిత శ్రీ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయారు.

 శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లలో శ్రీకాంత్‌ 17–21, 16–21తో వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ (చైనా) చేతిలో; శంకర్‌ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్‌ చెన్‌ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్‌ వన్‌ నితిత్‌ క్రాయ్‌ (థాయ్‌ లాండ్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. 

పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయి ప్రతీక్‌–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌ జోడీ (భారత్‌) 19–21, 18–21తో డేనియల్‌ మార్టిన్‌–షోహిబుల్‌ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement