kidambi srikanth
-
థాయ్లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
శ్రీకాంత్ శుభారంభం
బ్యాంకాక్: కొత్త ఏడాదిలో భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి విజయం అందుకున్నాడు. థాయ్లాండ్ మాస్టర్స్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రపంచ 47వ ర్యాంకర్ శ్రీకాంత్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–18తో డానిల్ దుబోవెంకో (ఇజ్రాయెల్)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్ ఆరంభంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 6–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో శ్రీకాంత్కు కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 15–15తో సమమైన దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19–15తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మూడు పాయింట్లు కోల్పోయిన శ్రీకాంత్ రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను హస్తగతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో తెలంగాణ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి 11–21, 15–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 15–21, 17–21తో జింగ్ హాంగ్ కోక్ (మలేసియా) చేతిలో, మిథున్ మంజునాథ్ 14–21, 13–21తో షోలే ఐదిల్ (మలేసియా) చేతిలో, సతీశ్ కుమార్ 15–21, 18–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ (భారత్) 15–21, 21–15, 21–19తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్లో రక్షిత శ్రీ ముందంజ వేయగా... తాన్యా హేమంత్, తారా షా, శ్రియాన్షి వలిశెట్టి తొలి రౌండ్లో ఓడిపోయారు. రక్షిత శ్రీ 21–19, 21–16తో లుయో యు వు (చైనా)పై గెలుపొందగా... తాన్యా 21–15, 11–21, 13–21తో కిసోనా సెల్వదురయ్ (మలేసియా) చేతిలో, తారా షా 15–21, 16–21తో థమనోవన్ నితిత్క్రాయ్ (థాయ్లాండ్) చేతిలో, శ్రియాన్షి 17–21, 13–21తో పిచమోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారుమిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–8, 21–16తో వీరాఫట్–సరారట్ (థాయ్లాండ్) జోడీపై విజయం సాధించింది. -
పెళ్లి తర్వాత తొలిసారి..
ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు. భారత్కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జి క్వాలిఫయర్తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు నిర్వహిస్తారు. బరిలో పీవీ సింధుమరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరిన్ని క్రీడా వార్తలుహరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్లో జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది. -
భార్య అంటే శ్రీకాంత్కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్ను శ్రీకాంత్ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్గా ఎదిగిన శ్రీకాంత్ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో ఇది జరగ్గా.. హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్గా టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేశ్తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు.రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు తమ ఇన్ స్టా స్టోరీల్లో శ్రావ్యవర్మ, కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!) -
పెళ్లి కొడుకైన కిదాంబి శ్రీకాంత్.. సంగీత్లో స్పెషల్ అట్రాక్షన్గా రష్మిక మందన్న (ఫొటోలు)
-
ఆర్జీవీ మేనకోడలితో కిదాంబి శ్రీకాంత్ పెళ్లి.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్న (ఫొటోలు)
-
మేడమ్ని జాగ్రత్తగా చూసుకో !
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ సెలబ్రిటీ స్టైలిస్ట్గా తనకంటూ గుర్తింపు పొందారు. అలాగే కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ‘గుడ్ లఖ్ సఖి’ సినిమాకి సహ నిర్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం రష్మికా మందన్న లీడ్ రోల్ చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్లు రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ, శ్రావ్య వర్మల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కాగా బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్తో శ్రావ్య త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.ఆగస్టు 10న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల శ్రావ్య వర్మ ఇచ్చిన బ్యాచిలరేట్ పార్టీకి రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోని శ్రావ్య తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి,‘నా గర్ల్ గ్యాంగ్తో సింగిల్గా ఇదే నా లాస్ట్ వీకెండ్’ అని పోస్ట్ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..‘శ్రావ్య వర్మ మేడమ్ పెళ్లి చేసుకోనున్నారు. శ్రీకాంత్ కిదాంబి.. ఇకపై తను నీది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే’ అంటూ రిప్లై ఇస్తూ శ్రీకాంత్ని ట్యాగ్ చేశారు. ఇందుకు శ్రీకాంత్ స్పందిస్తూ ‘మహారాణిలా చూసుకుంటా’ అంటూ బదులిచ్చారు. -
క్వార్టర్స్లో శ్రీకాంత్
మకావ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–18తో భారత్కే చెందిన ప్రపంచ 57వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు కొంత ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పాయింట్లు సాధించి వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్లో స్కోరు 12–10 వద్ద శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో తేరుకున్న ఆయుశ్ ఒకదశలో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి అంతరాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఆయుశ్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే శ్రీకాంత్ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఆయుశ్ రెండు పాయింట్లు సాధించినా, మరోవైపు శ్రీకాంత్ మూడు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ తస్నిమ్ మీర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ తొమోకా మియజాకి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 67వ ర్యాంకర్ తస్నిమ్ 17–21, 21–13, 10–21తో పరాజయం పాలైంది. గాయత్రి–ట్రెసా జోడీ విజయం మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 21–11తో లిన్ చి చున్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 17–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్ శుభారంభం
మకావ్: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ దు»ొవెంకో (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో ఆయుశ్ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 14–21, 21–10, 12–21తో పనిట్చాపోన్ (థాయ్లాండ్) చేతిలో, చిరాగ్ సేన్ (భారత్) 12–21, 17–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, మిథున్ (భారత్) 12–21, 15–21తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ) చేతిలో, సమీర్ వర్మ (భారత్) 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్ కున్–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్–జిహెనిచా (థాయ్లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్ చాన్–యాంగ్ చు యున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
పెళ్లి షాపింగ్ చేసిన భారత ప్రముఖ షట్లర్
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు. నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్కు సంబంధించిన చిత్రాలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉన్నాడు. -
సెమీస్లో శ్రీకాంత్ పరాజయం
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. బాసెల్లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్లో కిడాంబి శ్రీకాంత్.. పీవీ సింధుకు చుక్కెదురు
Swiss Open Super 300 badminton tournament- బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అతను 21–10, 21–14తో చియా హా లీ (చైనీస్ తైపీ)ని వరుస గేముల్లో కంగుతినిపించాడు. తద్వారా పదహారు నెలల కాలం తర్వాత తొలిసారి ఓ టోర్నీ సెమీస్లో అడుగుపెట్టాడు. ఇక శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో చైనీస్ తైపీ, వరల్డ్ నంబర్ 22 లిన్ చున్ యీని కిడాంబి శ్రీకాంత్ ఎదుర్కోనున్నాడు. అంతకు ముందు పురుషుల ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్సీడెడ్ శ్రీకాంత్ 21–16, 21–15తో మలేసియన్ టాప్ సీడ్ ప్లేయర్ లీ జీ జియాను వరుస గేముల్లో కంగు తినిపించిన విషయం తెలిసిందే. పీవీ సింధుకు చుక్కెదురు మరోవైపు.. రెండు ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు, లక్ష్యసేన్లకు ప్రి క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఏడో సీడ్ లక్ష్యసేన్ 17–21, 15–21తో చియా హా లీ (చైనీస్ తైపీ) జోరుకు నిలువలేకపోయాడు. మహిళల ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ సింధు 21–16, 19–21, 16–21తో జూనియర్ ప్రపంచ చాంపియన్, 17 ఏళ్ల టొమొకా మియజకి (జపాన్) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల డబుల్స్లో 8వ సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట 14–21, 15–21తో సెటియాన–ఎంజెలా యూ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో కంగుతింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి–సుమిత్ రెడ్డి జంట 11–21, 14–21తో రాబిన్ టాబెలింగ్–సెలెనా పేక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ ముందంజ
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి, మిథున్ మంజునాథ్ శుభారంభం చేశారు. సమీర్ వర్మ, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 45 నిమిషాల్లో 22–20, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలుపొందగా... శంకర్ 21–14, 21–17తో లియోంగ్ జున్ హావో (మలేసియా)ను, మిథున్ 21–17, 21–8తో జేసన్ (హాంకాంగ్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ 14–21, 18–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... లె లాన్ జి (చైనా)తో జరిగిన మ్యాచ్లో కిరణ్ జార్జి తొలి గేమ్ను 17–21తో కోల్పోయాక గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్లో అషి్మత, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... హైదరాబాద్ అమ్మాయి సామియా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అష్మిత 21–10, 21–16తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా)పై, మాళవిక 22–20, 21–8తో ఇనెస్ (పెరూ)పై నెగ్గగా... సామియా 14–21, 18–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జోడీ.. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్ లీ చెయుక్ యి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్లో ఆడిన శ్రీకాంత్ రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్ చి లీ–ఫాంగ్ జెన్ లీ (చైనీస్ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్కోల్ఫన్–ప్రజోంగ్జాయ్ (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Malaysia Open 2024: కిడాంబి శ్రీకాంత్ సంచలనం
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 12–21, 21–18, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తదుపరి రౌండ్లో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప–తనీషా (భారత్) జోడీ 21–13, 21–16తో ఫ్రాన్సెస్కా కోర్బి–అలీసన్ లీ (అమెరికా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
శ్రీకాంత్కు సవాల్.. నేటి నుంచి మలేసియా ఓపెన్
కౌలాలంపూర్: గత సీజన్ భారత స్టార్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలిచి్చంది. కానీ ఇప్పుడు ఒలింపిక్ నామ సంవత్సరం కావడంతో మన బ్యాడ్మింటన్ ఆటగాళ్లంతా నూతనోత్సాహంతో కొత్త సీజన్కు శ్రీకారం చుట్టేపనిలో ఉన్నారు. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో శుభారంభమే లక్ష్యంగా మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, ప్రపంచ 8వ ర్యాంకర్ ప్రణయ్, డబుల్స్లో అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి కోటి ఆశలతో కొత్త ఏడాదిని విజయవంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. నేడు జరిగే తొలిరౌండ్ మ్యాచ్ల్లో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శ్రీకాంత్, వెంగ్ హాంగ్ యంగ్ (చైనా)తో లక్ష్య సేన్ తలపడతారు. -
శ్రీకాంత్ మరో పరాజయం
లక్నో: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మాజీ ప్రపంచ నంబర్వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఈ ఏడాది తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోతున్నాడు. సొంతగడ్డపై జరుగుతోన్న సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ టోర్నీలోనూ శ్రీకాంత్ ఆటకు మొదటి రౌండ్లోనే తెరపడింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21–23, 8–21తో చైనీస్ తైపీకి చెందిన చియా హవొ లీ చేతిలో వరుస గేముల్లో పరాజయం చవి చూశాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ జార్జ్ 21–16, 14–21, 21–13తో భారత్కే చెందిన క్వాలిఫయర్ చిరాగ్ సేన్పై గెలుపొందగా, సమీర్ వర్మ 9–21, 21–7, 17–21తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ప్రియాన్షు రజావత్ 21–17, 21–19తో డిమిట్రి పనరిన్ (కజకిస్తాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్లో క్లిష్టమైన డ్రా ఎదురవడంతో మాల్విక బన్సోద్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 21–18, 17–21, 10–21తో జపాన్ స్టార్ నజొమి ఒకుహర చేతిలో ఓడిపోయింది. భారత సహచరుల మధ్య జరిగిన పోరులో ఉన్నతి హుడా 15–21, 21–19, 21–18తో ఆకర్షి కశ్యప్పై గెలుపొందగా, క్వాలిఫయర్ కేయూర 8–21, 16–21తో ఎనిమిదో సీడ్ సంగ్ షు యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో గాయత్రీ–ట్రెసా జాలీ జోడీ 21–9, 21–16తో భారత్కే చెందిన అపూర్వ –సాక్షి గెహ్లావత్ జంటపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో కోన తరుణ్–శ్రీకృష్ణప్రియ జంటకు 14–21, 15–21తో నితిన్ కుమార్–నవధ మంగళం జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
BWF Championships: సింధుకు క్లిష్టమైన డ్రా.. ఆ రెండు అడ్డంకులు దాటితేనే
కౌలాలంపూర్: ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ పీవీ సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. ఈనెల 21 నుంచి 27 వరకు డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ కార్యక్రమం గురువారం జరిగింది. మహిళల సింగిల్స్లో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో ఉంది. 16వ సీడ్గా బరిలోకి దిగనున్న సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆ తర్వాత సింధుకు ప్రతి రౌండ్లో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడే చాన్స్ ఉంది. మూడో రౌండ్లో మరో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్లాండ్) సిద్ధంగా ఉండవచ్చు. ఈ రెండు అడ్డంకులు దాటితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సెయంగ్ (దక్షిణ కొరియా)తో సింధు ఆడే అవకాశముంది. ఆన్ సెయంగ్తో ఇప్పటి వరకు సింధు ఆరుసార్లు ఆడగా ఆరుసార్లూ ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో రెండో సీడ్ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
ప్రణయ్ అద్భుత పోరాటం.. టాప్ సీడ్ షట్లర్కు షాక్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ సెమీస్కు దూసుకెళ్లారు. ఇవాళ (ఆగస్ట్ 4) జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ప్రణయ్.. టాప్ సీడ్ ఆంథోని సినిసుకను, యువ షట్లర్ ప్రియాన్షు.. మాజీ వరల్డ్ నంబర్ 1, భారత్కే చెందిన కిదాంబి శ్రీకాంత్ను మట్టికరిపించారు. ఇటీవలి కాలంలో సూపర్ టచ్లో ఉన్న వరల్డ్ నంబర్ 9 ప్లేయర్ ప్రణయ్.. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 16-21, 21-17, 21-14తో ప్రత్యర్ధి ఆట కట్టించాడు. మరో క్వార్టర్స్లో ఓర్లీయాన్స్ మాస్టర్స్ విజేత ప్రియాన్షు.. కిదాంబి శ్రీకాంత్ను వరుస సెట్లలో (21-13, 21-8) ఓడించాడు.క్వార్టర్స్లో తమ కంటే మెరుగైన ప్రత్యర్ధులపై విజయాలు సాధించిన ప్రణయ్, ప్రియాన్షులు సెమీస్లో ఎదురెదురుపడనున్నారు. ఇదే టోర్నీలో మహిళల విభాగానికి వస్తే.. భారత ఏస్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టింది. అమెరికన్ షట్లర్ బెయివెన్ జాంగ్తో జరిగిన మ్యాచ్లో సింధు వరుస సెట్లలో (21-12, 21-17) ఓటమిపాలైంది. కేవలం 39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. జాంగ్ చేతితో సింధుకు ఇది ఐదో ఓటమి. -
క్వార్టర్స్లో పీవీ సింధు.. ఫామ్లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు క్వార్టర్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించిన సింధు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్కు చేరుకోవడంతో ఫామ్లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్స్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక భారత్కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్లో కిడాంబి శ్రీకాంత్తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేసిన భారత షట్లర్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు మొదటి రౌండ్లో విజయం సాధించారు. జపాన్ ఓపెన్లో విఫలమైన ప్రణయ్ హాంకాంగ్కు చెందిన చెక్ యూను చిత్తు చేశాడు. మూడు సెట్లలో జోరుగా ఆడిన భారత షట్లర్ 21-18, 16-21, 21-15తో గెలిచి రెండో రౌండ్కు దూసుకెళ్లాడు. మరో మ్యాచ్లో 19వ ర్యాంకర్ శ్రీకాంత్ జపాన్ ఆటగాడైన కెంటా నిషిమొటోపై 21-18, 21-7తో అవలీలగా గెలుపొందాడు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్లో బోణీ కొట్టింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయిన ఆమె మహిళల సింగిల్స్ రెండో రౌండ్కు చేరింది. 47వ ర్యాంకర్ అష్మితా చాలిహపై 21-18, 21-13తో సింధు విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో ఆమె భారత్కే చెందిన ఆకర్షి కష్యప్ను ఢీ కొట్టనుంది. -
తొమ్మిదో ర్యాంక్కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం..
BWF world rankings: గతవారం జపాన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ప్రణయ్, సెమీఫైనల్లో ఓడిన లక్ష్య సేన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్లో పురోగతి సాధించారు. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో ర్యాంక్కు... లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 19వ ర్యాంక్లో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు 17వ ర్యాంక్లో, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండో ర్యాంక్లో కొనసాగుతున్నారు. సాకేత్–మార్టినెజ్ జోడీ శుభారంభం మిఫెల్ టెన్నిస్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తన భాగస్వామి మార్టినెజ్ (వెనిజులా)తో కలిసి సాకేత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మెక్సికోలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–మారి్టనెజ్ ద్వయం 6–3, 2–6, 10–5తో ఎర్నెస్టో ఎస్కోబెడో–రోడ్రిగో మెండెజ్ (మెక్సికో) జోడీపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్ జంట మూడు ఏస్లు సంధించింది. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్పై ప్రణయ్కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్లోనే ఓడిన సింధు, కిడాంబి శ్రీకాంత్
యోసు (కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్, ప్రపంచ 17వ ర్యాంకర్ పీవీ సింధు 18–21, 21–10, 13–21తో 22వ ర్యాంకర్ పాయ్ యుపో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తస్నీమ్, మాళవిక, ఆకర్షి, తాన్యా, అష్మిత కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–12, 22–24, 17–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్కిది వరుసగా 12వ ఓటమి. భారత నంబర్వన్ ప్రణయ్ 21–13, 21–17తో జూలియన్ (బెల్జియం)పై, ప్రియాన్షు 21–15, 21–19తో చోయ్ జి హున్ (కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సిక్కి రెడ్డి జోడీ గెలుపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ 21–17, 21–17తో అలి్వన్ మోరాదా–అలీసా లియోన్ (ఫిలిప్పీన్స్)లపై గెలి చారు. సుమీత్ రెడ్డి–అశి్వని పొన్నప్ప 21–23, 21–13, 12–21తో సాంగ్ హున్ చో–లీ జంగ్ హున్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
శ్రీకాంత్, ప్రణయ్ జోరు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–17, 22–20తో ప్రపంచ 20వ ర్యాంకర్, భారత్కే చెందిన లక్ష్య సేన్ను ఓడించగా... ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–18, 21–16తో ప్రపంచ 16వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. గతంలో లక్ష్య సేన్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన శ్రీకాంత్కు ఈసారి గట్టిపోటీనే లభించింది. ప్రతి పాయింట్కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. అయితే కీలకదశలో శ్రీకాంత్ సంయమనంతో ఆడి పైచేయి సాధించాడు. తొలి గేమ్లో స్కోరు 17–17తో సమంగా ఉన్నదశలో శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో శ్రీకాంత్ 20–14తో విజయానికి పాయింట్ దూరంగా నిలిచాడు. అయితే లక్ష్య సేన్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 20–20తో సమం చేశాడు. వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయినా శ్రీకాంత్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత యువతార ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరి గిన మ్యాచ్లో 14వ ర్యాంకర్ సింధు 18–21, 16–21తో ఓడిపోయింది. ఓవరాల్గా తై జు యింగ్ చేతిలో సింధుకిది 19వ ఓటమికాగా వరుసగా తొమ్మిదో పరాజయం. 2019 ప్రపంచ చాంపియన్షిప్లో చివరిసారి తై జు యింగ్ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో ఈ చైనీస్ తైపీ ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో సాత్విక్ జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో హి జి టింగ్–జౌ హావో డాంగ్ (చైనా) జంటపై గెలిచింది. -
శ్రీకాంత్ ముందుకు...
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో శ్రీకాంత్కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
Malaysia Masters: సెమీస్లో సింధు, ప్రణయ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
కౌలాలంపూర్: తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సింధు 74 నిమిషాల్లో 21–16, 13–21, 22–20తో యి మన్ జాంగ్ (చైనా)పై గెలుపొందగా... ప్రణయ్ 91 నిమిషాల్లో 25–23, 18–21, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించాడు. అయితే భారత మరో స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. 57 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–16, 16–21, 11–21తో ప్రపంచ 57వ ర్యాంకర్ క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే సెమీఫైనల్స్లో గ్రెగోరియా టున్జంగ్ (ఇండోనేసియా)తో సింధు; అడినాటాతో ప్రణయ్ తలపడతారు. -
Malaysia Masters: ప్రపంచ ఐదో ర్యాంకర్కు షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్
కౌలాలంపూర్: వ్యక్తిగత విదేశీ కోచ్ను నియమించుకున్న తర్వాత భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆటతీరులో మార్పు కనిపిస్తోంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ 23వ ర్యాంకర్ శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–19, 21–19తో అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో వెనుకబడి పుంజుకున్నాడు. కున్లావుత్పై శ్రీకాంత్కిదే తొలి గెలుపు కావడం విశేషం. గతంలో కున్లావుత్తో ఆడిన మూడుసార్లూ శ్రీకాంత్ వరుస గేముల్లో ఓడిపోవడం గమనార్హం. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్పై నెగ్గిన ప్రణయ్ భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్ మరో గొప్ప విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ను ఓడించిన ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 11వ ర్యాంకర్ షి ఫెంగ్ లీని బోల్తా కొట్టించాడు. 70 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–16, 21–11తో షి ఫెంగ్ లీపై గెలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో స్కోరు 7–5తో వద్ద ప్రణయ్ వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 16–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్కే చెందిన లక్ష్య సేన్ 14–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు వరుసగా 13వసారి... మహిళల సింగిల్స్లో భారత స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ సింధు 21–16, 21–11తో ప్రపంచ 28వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. తొలి గేమ్లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. రెండో గేమ్లోనూ ఆమెదే పైచేయిగా నిలిచింది. ఒహోరిపై సింధుకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో జాంగ్ యి మాన్ (చైనా)తో సింధు; నిషిమోటో (జపాన్)తో ప్రణయ్; క్రిస్టియన్ అడినాటా (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతారు. -
Badminton Asia Championships 2023: అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత షట్లర్లు
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. దుబాయ్లో నేడు మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 61 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మహిళల సింగిల్స్లో భారత స్టార్స్ సైనా నెహ్వాల్ మూడు కాంస్య పతకాలు (2010, 2016, 2018), పీవీ సింధు (2014, 2022) రెండు కాంస్య పతకాలు సాధించారు. అయితే ఈ ఏడాది సైనా నెహ్వాల్ బరిలోకి దిగడంలేదు. -
Madrid Spain Masters: క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో భారత్కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్కే చెందిన సాయిప్రణీత్పై గెలుపొందాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
అతికష్టం మీద గట్టెక్కిన శ్రీకాంత్.. సింధు శుభారంభం
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–11, 25–27, 23–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ సితికోమ్ థమాసిన్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక మూడో గేమ్లో శ్రీకాంత్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. 19–15తో ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్ ఒక్కసారిగా వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకోవడంతో థమాసిన్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే శ్రీకాంత్ స్కోరును 20–20తో స్కోరును సమం చేశాడు. ఆ వెంటనే థమాసిన్ మరో పాయింట్ సాధించి 21–20తో ఆధిక్యంలోకి వచ్చాడు. కానీ శ్రీకాంత్ పట్టుదలతో ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 23–21తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సాయిప్రణీత్ (భారత్) 21–16, 18–21, 21–12తో జాన్ లూడా (చెక్ రిపబ్లిక్)పై, ప్రియాన్షు రజావత్ (భారత్) 18–21, 21–16, 21–11తో విక్టర్ స్వెండ్స్న్ (డెన్మార్క్)పై, కిరణ్ జార్జి (భారత్) 21–16, 21–14తో మిథున్ మంజునాథ్ (భారత్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. అయాటో ఎండో–యుటా టకె (జపాన్)లతో జరిగిన తొలి రౌండ్లో సాతి్వక్–చిరాగ్ తొలి గేమ్లో 9–11తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధుతోపాటు వర్ధమాన క్రీడాకారిణిలు ఆకర్షి కశ్యప్, మాళవిక, అషి్మత ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో సింధు 21–10, 21–14తో జెన్జిరా స్టాడెల్మన్ (స్విట్జర్లాండ్)పై, ఆకర్షి 12–21, 21–15, 21–18తో ఆరో సీడ్ మిచెల్లి లీ (కెనడా)పై, మాళవిక 21–19, 16–21, 21–9తో కిసోనా సెల్వదురై (మలేసియా)పై, అష్మిత 21–12, 22–20తో లియోనైస్ హ్యుట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం 18–21, 16–21తో రెనా మియారా–అయాకో సకురమాటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
All England Badminton Tourney: సీడింగ్ లేకుండానే బరిలోకి భారత ఆటగాళ్లు
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నేడు (మార్చి 14) బర్మింగ్హామ్లో మొదలుకానుంది. 2001లో పుల్లెల గోపీచంద్ తర్వాత మరో భారత ప్లేయర్ ఈ టోర్నీ టైటిల్ను సాధించలేకపోయాడు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2009 తర్వాత తొలిసారి భారత క్రీడాకారులెవరికీ సీడింగ్ లభించలేదు. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
పుణే: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ సెమీస్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–10, 18–21, 21–16 స్కోరుతో కార్తికేయ కుమార్పై విజయం సాధించాడు. ఇతర పురుషుల సింగిల్స్లో ప్రియాన్షు రజావత్, హర్షీల్ దాని, మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్లో టాప్ సీడ్ గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జంట సెమీస్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్లో గాయత్రి–ట్రెసా 21–16, 21–12 తేడాతో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, అస్మిత చలీహ సెమీస్ చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో హేమనాగేంద్ర–కనికా కన్వాల్ జోడి సెమీస్ చేరుకుంది. ఇషాన్ భట్నాగర్ –తనీషా క్రాస్టో జంట వీరికి వాకోవర్ ఇచ్చింది. -
India Open 2023: శ్రీకాంత్కు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం భారత క్రీడాకారులకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో ప్రపంచ 14వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ని్రష్కమించాడు. ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 14–21, 19–21తో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది పదో పరాజయం కావడం గమనార్హం. 2017లో డెన్మార్క్ ఓపెన్లో చివరిసారి అక్సెల్సన్ను ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ డెన్మార్క్ ప్లేయర్ చేతిలో వరుసగా ఏడోసారి ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక (భారత్) 17–21, 12–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 12– 21తో బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని –శిఖా (భారత్) 8–21, 11–21తో పియర్లీ తాన్–థినా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
French Open Badminton: శ్రీకాంత్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–18, 21–18తో భారత్కే చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లక్ష్య సేన్ను ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–16, 16–21, 21–16తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... ప్రపంచ 31వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 21–23, 22–20తో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జోడీ 15–21, 16–21తో ఫజర్–మొహమ్మద్ రియాన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్కు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సింగపూర్కు చెందిన ఏడో సీడ్ లో కీన్ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్ను ఓడించాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్ శ్రీకాంత్ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్లలో ప్రణయ్ చేతిలో ఓడిన సేన్ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ – బగాస్ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది. థాయిలాండ్కు చెందిన జొంగొల్ఫాన్ కిటిథారకుల్ – రవీంద ప్రజొంగ్జాయ్ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ఇషాన్ భట్నాగర్ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు -
ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు
జపాన్ ఓపెన్-2022 సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం దాదాపుగా ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే స్టార్ షట్లర్లంతా ఇంటిముఖం పట్టగా.. గురువారం కిదాంబి శ్రీకాంత్ పోరాటం సైతం ముగిసింది. భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్ మాత్రమే ఈ టోర్నీ బరిలో మిగిలాడు. పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్లో శ్రీకాంత్.. జపాన్కు చెందిన కంటే సునేయమ చేతిలో 10-21, 16-21 తేడాతో పోరాడి ఓడాడు. అంతకుముందు శ్రీకాంత్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్ 4 ఆటగాడు లీ జీ జియాకు షాకిచ్చి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించాడు. ఇక టోర్నీ బరిలో నిలిచిన ఏకైక భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విషయానికొస్తే.. ఈ మాజీ వరల్డ్ నంబర్ 8 షట్లర్ ప్రీక్వార్టర్స్లో సింగపూర్ ఆటగాడు, మాజీ వరల్డ్ ఛాంపియన్ లో కియాన్ యును వరుస సెట్లలో (22-20 21-19) ఖంగుతినిపించి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. ప్రణయ్ తదుపరి రౌండ్లో తైపీ షట్లర్ చౌ టెన్ చెన్ను ఢీకొట్టాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీ బరిలో భారత తురుపు ముక్క పీవీ సింధు బరిలో దిగని విషయం తెలిసిందే. చదవండి: వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్ -
వరల్డ్ నంబర్ 4కు షాకిచ్చిన శ్రీకాంత్.. సైనా, లక్ష్యసేన్ ఔట్
జపాన్ ఓపెన్ 2022లో బుధవారం భారత షట్లర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, సైనా నెహ్వాల్ ఇంటిబాట పట్టగా, కిదాంబి శ్రీకాంత్.. వరల్డ్ నంబర్ 4 ఆటగాడికి షాకిచ్చి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు చుక్కెదురైంది. బుధవారం శ్రీకాంత్ ఒక్కడే తొలి రౌండ్ గండాన్ని అధిగమించాడు. శ్రీకాంత్.. మలేషియాకు చెందిన లి జి జియా ను 22-20, 23-21 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీకాంత్.. ఈ గేమ్లో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. మిగతా గేమ్ల్లో లక్ష్యసేన్.. జపాన్కు చెందిన కెంట నిషిమొటొ చేతిలో 21-18, 14-21, 13-21 తేడాతో, సైనా నెహ్వాల్.. జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి చేతిలో 21-9, 21-17 తేడాతో ఓడారు. పురుషుల డబుల్స్లో అర్జున్-కపిల ద్వయం.. చోయ్-కిమ్ చేతిలో, మహిళల డబుల్స్లో జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ.. కిటితరకుల్-ప్రజోంగజ్ చేతిలో, మిక్స్డ్ డబుల్స్లో ప్రసాద్-దేవాంగన్ జంట.. జెంగ్-హుయాంగ్ చేతిలో ఓటమి చవిచూశాయి. కాగా, ఈ టోర్నీలో మంగళవారం హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: యూఎస్ ఓపెన్లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్కు బిగ్షాక్ -
ఒకే పార్శ్వంలో శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్
టోక్యో: గత ఏడాది జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత్కు కిడాంబి శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకం అందించారు. అయితే ఈసారి మాత్రం భారత్కు మళ్లీ రెండు పతకాలు వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈనెల 22 నుంచి టోక్యోలో జరిగే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రణయ్ ఒకే పార్శ్వంలో ఉండటమే దీనికి కారణం. ఈ ముగ్గురికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. మరో పార్శ్వంలో 2019 ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ ఉన్నాడు. సాయిప్రణీత్కూ కఠినమైన ‘డ్రా’నే పడింది. తొలి రౌండ్లో ఎన్హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; విటింగస్ (డెన్మార్క్)తో లక్ష్య సేన్; లూకా వ్రాబర్ (ఆస్ట్రియా)తో ప్రణయ్; నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్ తలపడతారు. చౌ తియెన్ చెన్తో ఇప్పటివరకు ఆడిన నాలుగుసార్లూ సాయిప్రణీత్ ఓడిపోయాడు. తొలి రౌండ్ అడ్డంకి దాటితే రెండో రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్)తో ప్రణయ్ ఆడతాడు. మూడో రౌండ్లో మొమోటా లేదా ప్రణయ్లతో లక్ష్య సేన్ ఆడే అవకాశముంది. మరోవైపు శ్రీకాంత్ రెండో రౌండ్లో చైనా ప్లేయర్ జావో జున్ పెంగ్.తో ఆడతాడు... ఈ మ్యాచ్లో గెలిస్తే మూడో రౌండ్లో ఐదో సీడ్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్కు లక్ష్య సేన్ లేదా ప్రణయ్ లేదా మొమోటాలలో ఒకరు ఎదురుపడతారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధుకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో హాన్ యు (చైనా) లేదా కి జుయ్ఫె (నెదర్లాండ్స్)లలో ఒకరితో సింధు ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో సింధుకు కొరియా స్టార్ ఆన్ సె యంగ్ ఎదురుకానుంది. భారత్కే చెందిన సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో... లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)తో మాళవిక తలపడతారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంటకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
కాంస్యంతో సరిపెట్టుకున్న శ్రీకాంత్.. సింధుకు ‘స్వర్ణా’వకాశం
కామన్వెల్త్ గేమ్స్లో తెలుగు తేజం సింధు ఖాతాలో సింగిల్స్ విభాగం పసిడి పతకమే బాకీ ఉంది. గత ఈవెంట్లో స్వర్ణం గెలిచినప్పటికీ అది మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వచ్చింది. సింగిల్స్లో గ్లాస్గో (2014) లో కాంస్యం, గోల్డ్కోస్ట్ (2018)లో రజతం నెగ్గిన ఆమెకు ఇప్పుడు స్వర్ణావకాశం మళ్లీ వచ్చింది. బర్మింగ్హామ్ ఈవెంట్లో సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్లో ఆమె 21–19, 21–17తో యో జియా మిన్ (సింగపూర్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సంపాదించింది. పురుషుల సింగిల్స్లో స్టార్ లక్ష్య సేన్ కూడా పసిడి వేటకు సిద్ధమవగా... కిడాంబి శ్రీకాంత్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 21–18తో జియా హెంగ్ తె (సింగపూర్)పై గెలుపొందాడు. శ్రీకాంత్ కాంస్యంతో భారత పతకాల సంఖ్య 51కి చేరింది. సెమీఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 18–21, 21–16తో జియా హెంగ్ టె (సింగపూర్)పై గెలుపొందగా, శ్రీకాంత్ 21–13, 19–21, 10–21తో తే యంగ్ ఎంజ్ (మలేసియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–6, 21–15తో చెంగ్ పెంగ్ సున్–టియాన్ కియన్ మెన్ (మలేసియా) జంటపై గెలిచి పసిడి పోరుకు సిద్ధమైంది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 18–21తో తాన్ కూంగ్ పియర్లీ–థినా మురళీధరన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచింది. -
Commonwealth Games 2022: సెమీస్లో సింధు, శ్రీకాంత్
బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్లో సింధు... పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి చేరారు. క్వార్టర్ ఫైనల్స్లో సింధు 19–21, 21–14, 21–18తో గో వె జిన్ (మలేసియా)పై, శ్రీకాంత్ 21–19, 21–17తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై, లక్ష్య సేన్ 21–12, 21–11తో జూలియన్ (మారిషస్)పై గెలిచారు. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 21–8, 21–6తో తాలియా–కేథరిన్ (జమైకా) జంటపై గెలిచింది. -
స్వర్ణం లక్ష్యంగా దూసుకుపోతున్న సింధు, శ్రీకాంత్
కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్లు స్వర్ణ పతకం లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మహిళల సింగల్స్లో సింధు, పురుషుల సింగల్స్లో శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. వీరిద్దరు తమ తొలి రౌండ్లలో ప్రత్యర్ధులపై సునాయస విజయాలు సాధించి ముందడుగు వేశారు. సింధు.. ఒలింపిక్ పతక విజేత, మాల్దీవులకు చెందిన ఫాతిమా నబా అబ్దుల్ రజాక్పై 21-4, 21-11 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించగా, శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానగాలియాపై 21-9, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని సాధించాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. చదవండి: భారత రిలే జట్టుకు రజతం -
కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ వెయిట్ లిఫ్టింగ్లో కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్ లిఫ్టింగ్లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్.. జూడో (2), లాన్స్ బౌల్స్ (1), టేబుల్ టెన్నిస్ (1), బ్యాడ్మింటన్ (1) క్రీడల్లో గెలిచినవి. ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో భారత్ సాధించిన సిల్వర్ మెడల్పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుంది. భారత్ ఆడిన నాలుగు గేమ్ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్ బంగారు ఆశలను నీరుగార్చారు. అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్.. తన వల్లే భారత్ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్ అన్నాడు. చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం -
కిదాంబి శ్రీకాంత్కు షాక్.. క్వార్టర్స్కు సింధు, ప్రణయ్
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్కు భారత్కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్కే చెందిన మాళవిక బాన్సోద్పై విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో మాళవిక బాన్సోద్పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది. చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్లలో చేతులెత్తేశారు! జపాన్తో పోరులో.. -
తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్, లక్ష్య సేన్
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్స్, ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–23, 10–21తో ప్రపంచ 41వ ర్యాంకర్బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోగా... భారత్కే చెందిన ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 21–10, 21–9తో లక్ష్య సేన్ను బోల్తా కొట్టించాడు. గతంలో లెవెర్డెజ్తో ఆడిన ఐదుసార్లూ గెలిచిన శ్రీకాంత్ ఆరోసారి మాత్రం ఓటమి చవిచూశాడు. లక్ష్య సేన్పై ప్రణయ్కిదే తొలి విజయం కావడం విశేషం. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అర్జున్–ధ్రువ్ జోడీ 27–25, 18–21, 21–19తో మత్సుయ్–టెకుచి (జపాన్) జంటపై గెలిచింది. చదవండి: Asia Cup Qualifiers: సునీల్ ఛెత్రీ అరుదైన రికార్డు.. మెస్సీకి రెండు అడుగుల దూరంలో -
క్వార్టర్ ఫైనల్లో సింధు .. శ్రీకాంత్ వాకోవర్
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్లో భారత టాప్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ మ్యాచ్ ఆడకుండానే ‘వాకోవర్’ ఇవ్వడంతో అతని ప్రత్యర్థి ఎన్హట్ గుహెన్ (ఐర్లాండ్) ముందంజ వేశాడు. శ్రీకాంత్ పొత్తి కండరాలు పట్టేయడంతో కోర్టులోకి దిగక ముందే తప్పుకున్నాడు. లెవెర్డెజ్తో జరిగిన తొలి రౌండ్లోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నా...ఎలాగోలా మ్యాచ్ను ముగించగలిగాడు. ఇతర మ్యాచ్లలో భారత షట్లర్ల ఆట ముగిసింది. మహిళల సింగిల్స్లో మాల్విక బన్సోద్, మహిళల డబుల్స్లో అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడి, మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రస్టో జంట ఓడారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ప్రణయ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, మాళవిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సైనా నెహ్వాల్, అష్మిత, ఆకర్షి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకాంత్ 18–21, 21–10, 21–16తో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. సౌరభ్ వర్మ 20–22, 12–21తో తోమా పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సాయిప్రణీత్ 12–21, 13–21తో వాంగ్చరోయిన్ (థాయ్లాండ్) చేతిలో, ప్రణయ్ 17–21, 21–15, 15–21తో డారెన్ లూ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–19, 18– 21, 21–18తో లారెన్ లామ్ (అమెరికా)పై... మాళవిక 17–21, 21–15, 21–11తో ఉలితినా (ఉక్రెయిన్) పై నెగ్గగా.. సైనా 21–11, 15–21, 17–21తో కిమ్ గా ఉన్ (కొరియా) చేతిలో, ఆకర్షి 13–21, 18–21 తో మిచెల్లి (కెనడా) చేతిలో, అష్మిత 10–21, 15– 21తో రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడారు. -
చరిత్రాత్మక విజయం
చరిత్రాత్మక ఘట్టం. చిరస్మరణీయ సందర్భం. భారత బ్యాడ్మింటన్లో సువర్ణాక్షర లిఖిత విజయం. ఇలాంటి విశేషణాలు ఎన్ని వాడినా తక్కువే. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్గా పేరున్న ప్రతిష్ఠాత్మక థామస్ కప్లో ఆదివారం భారత పురుషుల జట్టు సాధించిన గెలుపు అలాంటిది మరి. 73 ఏళ్ళ థామస్ కప్, ఉబర్ కప్ల చరిత్రలో భారత్కు తొలిసారి దక్కిన విజయం ఇది. అందులోనూ 14 పర్యాయాలు విజేతగా నిలిచిన ఇండొనేషియా జట్టును 3–0 తేడాతో ఓడించడం అనూహ్యం. ఈ విజయానికి దేశమంతటా అపూర్వ స్పందన లభిస్తున్నదంటే కారణం అదే. ఈ విజయం సాధించిపెట్టినవారిలో షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ పుల్లెల గోపీచంద్ వంటి తెలుగు తేజాలు ఉండడం మరింత గర్వకారణం. ఇప్పటి దాకా కేవలం ప్రాతినిధ్యానికే తప్ప పతకానికి నోచుకోని పురుషుల టీమ్ టోర్నమెంట్ థామస్ కప్లో భారత విజయం ఇప్పుడిక కొన్ని తరాల పాటు చెప్పుకొనే కథ. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్లలో మన విజయాలు గాలివాటువేమో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, ఫైనల్లో మన ఆటగాళ్ళు 3 వరుస విజయాలతో మునుపటి ఛాంపియన్ ఇండొనేషియాను ఓడించి, దేశానికి బంగారు పతకం తెచ్చారు. 43 ఏళ్ళ క్రితం ప్రకాశ్ పదుకోనే, సయ్యద్ మోదీ లాంటి దిగ్గజాలతో కూడిన భారత షట్లర్ల జట్టు సెమీస్ దాకా వెళ్ళి, డెన్మార్క్ చేతిలో ఓడింది. ఈసారి సెమీఫైనల్లో అదే డెన్మార్క్పై గెలిచి ఫైనల్కు చేరడం గమ్మల్తైన కాకతాళీయం. యువ షట్లర్ లక్ష్యసేన్ మొదటి సింగిల్స్లో తొలి గేమ్ ఓడినా, పుంజుకొని వరల్డ్ నంబర్ 5 ఆటగాణ్ణి మట్టికరిపించారు. డబుల్స్లో సాయిరాజ్, చిరాక్ షెట్టి సైతం మొదటి గేమ్ ఓడినా, తరువాత రెండు గేమ్లలో సత్తా చాటి, గెలుపు అందించారు. కీలకమైన రెండో సింగిల్స్లో మన తెలుగు బిడ్డ శ్రీకాంత్ ఆచితూచి ఆడారు. ఆసియా క్రీడోత్సవాల విజేత జొనాథన్ క్రిస్టీని ఓడించి, సువర్ణాధ్యాయం లిఖించారు. 1975లో హాకీ వరల్డ్ కప్... 1983లో క్రికెట్ వరల్డ్ కప్... ఈ 2022లో ప్రపంచ బ్యాడ్మింటన్ కప్ లాంటి థామస్ కప్... మూడు వేర్వేరు ఆటలు... మూడు వేర్వేరు సందర్భాలు... మూడింటా సమష్టి కృషితో భారత జట్లే విజేతలు. బ్యాంకాక్లోని ఇంప్యాక్ ఎరీనాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడిన ఈ ఘట్టాన్ని – 39 ఏళ్ళ క్రితం 1983 క్రికెట్ వరల్డ్ కప్లో కపిల్ సేన సాధించిన విజయంతో ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 73 ఏళ్ళ చరిత్రను తిరగరాసిన తాజా గెలుపు, 1983 నాటి విజయం కన్నా మించినదని గోపీచంద్ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. ఆ వరల్డ్ కప్ క్రికెట్లోనూ, ఇప్పుడీ థామస్ కప్ బ్యాడ్మింటన్లోనూ భారత జట్టుపై ఎవరికీ ఎలాంటి అంచనాలూ లేవు. రెండు సందర్భాల్లోనూ భారత జట్టు విజేతగా నిలుస్తుందన్న ఊహా లేదు. కానీ, ఇంగ్లండ్లో ఆనాటి భారత క్రికెటర్లు, ఇప్పుడు బ్యాంకాక్లో మన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కలసికట్టుగా ఆడితే, అసాధ్యం కూడా సుసాధ్యమేనని నిరూపించారు. బ్యాడ్మింటన్ ప్రధానంగా వ్యక్తిగత ప్రతిభాపాటవాలకు గీటురాయిగా నిలిచే క్రీడ. వ్యక్తిగత ప్రతిభతో ఆ రంగంలో పతకాలు సాధించడం గొప్పే. కానీ, సమష్టి కృషితో ఒక టీమ్ ఈవెంట్లో విజయం సాధించడం మరీ గొప్ప. థామస్ కప్ ప్రాథమికంగా టీమ్ ఈవెంట్ గనక జట్టులోని ప్రతి సభ్యుడూ టోర్నమెంట్ పొడుగూతా విజయ ప్రదర్శనలే ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, టీమ్ ఈవెంట్లలో మన డబుల్స్ జోడీలు ఆట్టే రాణించకపోవడం భారత షటిల్ బ్యాడ్మింటన్ను చిరకాలంగా వేధిస్తున్న సమస్య. దాన్ని అధిగమించి, అపూర్వమైన ఆట తీరుతో దక్కిన ఈ థామస్ కప్ ప్రత్యేకమైనదని కోచ్ గోపీచంద్ భావిస్తున్నది అందుకే! ఈ అపూర్వ విజయాన్ని ఏ ఒక్కరి ఖాతాలోనో పూర్తిగా వేసెయ్యలేం. భారత బ్యాడ్మింటన్లో వ్యక్తిగత ప్రతిభతో పాటు కలసికట్టుగా ఆడే ఓ బృంద స్ఫూర్తి వికసిస్తోందనడానికి ఈ విజయం ఓ తార్కాణం. బంగారు భవితకు బలమైన పునాది. గతంలో వరల్డ్ ఛాంపియన్ షిప్, ఒలింపిక్ పతకాలు, ఇప్పుడు థామస్ కప్ – ఇవన్నీ బ్యాడ్మింటన్లో భారత్ అంచెలంచెల శిఖరారోహణకు సాక్ష్యాలు. ఇండొనేషియా, మలేసియా లాంటి బలమైన జట్లను థామస్ కప్లో ఓడించి, స్వర్ణాన్ని సాధించడం రాకెట్ వేగంతో మారుతున్న మన షటిల్ క్రీడా ముఖచిత్రానికి ప్రతీక. ‘కుbŒ∙భీ హో... జీత్నా హై’ అనే లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో సాగితే ఏదీ అసాధ్యం కాదని షట్లర్లు నిరూపించారు. పదిమంది జట్టూ ప్రత్యేక వాట్సప్ గ్రూప్లో నిర్మొహమాటంగా భావావేశాలు పంచుకుంటూ సాగిన వైనం మరో విజయసూత్రం. 1980లో ప్రకాశ్ పదుకోనే, 2001లో పుల్లెల గోపీచంద్, 2010లో సైనా నెహ్వాల్, ఆ పైన పీవీ సింధు... ఇలా ఎప్పటికప్పుడు బ్యాడ్మింటన్ తారలు ఉద్భవిస్తూనే ఉన్నారు. అయితే, గ్రామాల నుంచి ఆకలితో వచ్చిన ఆటగాళ్ళతో ప్రస్తుత భారత బ్యాడ్మింటన్ జట్టు మునుపెన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇది ఒక శుభపరిణామం. పారుపల్లి కాశ్యప్, సాయి ప్రణీత్ లాంటి ఆటగాళ్ళ తర్వాత కిడాంబి శ్రీకాంత్ లాంటి వాళ్ళ అడుగుజాడల్లో లక్ష్యసేన్ లాంటి యువ షట్లర్లు తయారవుతుండడం భవితపై మరిన్ని ఆశలు రేపుతోంది. ఈ కొత్త తరాన్ని తయారు చేయడంలో గోపీచంద్, ఆయన అకాడెమీ లాంటివి నిరంతరం చేస్తున్న కృషి గణనీయం. జూలైలో కామన్వెల్త్, ఆగస్టులో వరల్డ్ ఛాంపియన్షిప్ – ఇలా మరెన్నో ప్రపంచ శ్రేణి పోటీలు రానున్న వేళ తాజా విజయం మన షట్లర్లకు పెద్ద ఉత్ప్రేరకం. ఆటకూ, ఆశకూ ఇప్పుడిక ఆకాశమే హద్దు. -
Thomas Cup 2022: షటిల్ కింగ్స్
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్గా పేరున్న థామస్ కప్లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్లో ఫలితం తేలగా... టైటిల్ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ సింగిల్స్లో, డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్... తెలంగాణ ప్లేయర్ పంజాల విష్ణువర్ధన్ గౌడ్, కోచ్ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు. బ్యాంకాక్: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్ ఇప్పుడు టీమ్ ఈవెంట్లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్లో తొలిసారి భారత్ చాంపియన్గా అవతరించింది. ప్రకాశ్ పడుకోన్, సయ్యద్ మోడీ, విమల్ కుమార్, పుల్లెల గోపీచంద్లాంటి స్టార్స్ గతంలో థామస్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే. కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్ కప్ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్ కప్ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి ఇండోనేసియాకు షాక్ ఇచ్చింది. శుభారంభం... తొలిసారి థామస్ కప్ ఫైనల్ ఆడిన భారత్కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్లో తడబడిన లక్ష్య సేన్ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్లో ఇండోనేసియా ప్రపంచ నంబర్వన్ కెవిన్ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్ మొహమ్మద్ అహసాన్లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్ జంటను బోల్తా కొట్టించి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్గా జరిగిన రెండో సింగిల్స్లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్ జొనాథాన్ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 23–21తో గెలుపొంది భారత్ను చాంపియన్గా నిలిపాడు. ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ ఈ మ్యాచ్లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్ రెండో గేమ్లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్లను నిర్వహించలేదు. మనం గెలిచాం ఇలా... లీగ్ దశ: గ్రూప్ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్ మ్యాచ్ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడి గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్: ఐదుసార్లు చాంపియన్ మలేసియాపై భారత్ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్: 2016 విజేత డెన్మార్క్పై భారత్ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్కు అర్హత సాధించింది. గెలుపు వీరుల బృందం... థామస్ కప్లో భారత్ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్), లక్ష్య సేన్ (ఉత్తరాఖండ్), హెచ్ఎస్ ప్రణయ్ (కేరళ), ప్రియాన్షు రజావత్ (మధ్యప్రదేశ్) పోటీపడ్డారు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)... ఎం.ఆర్.అర్జున్ (కేరళ)–ధ్రువ్ కపిల (పంజాబ్) జోడీలు బరిలోకి దిగాయి. నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్ విజయాల్లో ఉండే సంతృప్తే అది. –కిడాంబి శ్రీకాంత్ ‘అభినందనల జల్లు’ థామస్ కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్ కప్ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తొలిసారి థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. తొలిసారి థామస్ కప్ గెలవడం భారత బ్యాడ్మింటన్కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్, ప్రణయ్లకు కూడా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్కు 1983 ప్రపంచకప్ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్కు ఈ టోర్నీ విజయం అలాంటిది. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ థామస్ కప్ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ రూ. 2 కోట్ల నజరానా థామస్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు. -
భళా.. కిడాంబి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయాన్ని భారత జట్టు గెలుపొందడం, అందులో గుంటూరుకు చెందిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించడంతో ఆదివారం క్రీడాభిమానులు, సహచరులు, కోచ్లు ఉద్వేగానికి లోనయ్యారు. శభాష్ శ్రీకాంత్.. అంటూ ప్రశంసలు కురిపించారు. 2018లో ప్రపంచ నంబర్ వన్ స్థానం పొందిన తర్వాత అనేక విజయాలు నమోదు చేసినా, భారత చిరకాల వాంఛ అయిన థామస్ కప్ గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. థామస్ కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీకాంత్ తనదైన శైలిలో ప్రత్యర్థి ఇండోనేషియా ఆటగాడు, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21–15, 23–21 స్ట్రెయిట్ సెట్స్లో మట్టికరిపించి తెలుగోడి సత్తా చాటాడు. గుంటూరులో ఉన్న శ్రీకాంత్ తండ్రి కృష్ణను షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంపత్ కుమార్, డి.శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంటూరులోనే ఓనమాలు ఏడేళ్ల వయసులో శ్రీకాంత్ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వేసవి శిక్షణకు సరదాగా వచ్చాడు. అప్పుడే అతనిలోని వేగాన్ని గుర్తించిన శిక్షకులు, సీనియర్ ఆటగాళ్లు తల్లిదండ్రులు కృష్ణ, రాధలకు మరింత ఉత్తమ శిక్షణ ఇప్పించాలని సలహా ఇవ్వడంతో హైదరాబాద్కు మకాం మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్ తల్లిదండ్రులు గుంటూరుతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అడపాదడపా శ్రీకాంత్ గుంటూరుకు రావడం, పాత మిత్రులను కలవడం జరుగుతోంది. ఈ దేశం గర్విస్తోంది.. థామస్ కప్లో నా కుమారుడు శ్రీకాంత్ విజయాన్ని దేశం సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతో సాధన చేశాడు. దీని కోసం ఎన్నో సరదాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ విశ్రమించకుండా సాధన చేస్తునే ఉంటాడు. శ్రీకాంత్ను చూసి మరింత మంది ఔత్సాహిక క్రీడాకారులు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను. – కిడాంబి కృష్ణ, శ్రీకాంత్ తండ్రి అద్భుత వేగం అతని సొంతం ఎన్టీఆర్ స్టేడియంలో తొలి నాళ్లలో శ్రీకాంత్ సాధన చేయడం చూశాను. అద్భుత వేగం అతని సొంతం. తోటి పిల్లలతో సరదాగా ఉండడంతో పాటు, ఆట సమయంలో వేరే ధ్యాస లేకుండా దృష్టి సారించే వాడు. విజయం సాధించాలంటే ఏమి చేయాలో అతనికి బాగా తెలుసు. అందుకోసం చేసేదంతా క్రమశిక్షణతో చేసేవాడు. ఈ రోజు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్లు గమనిస్తే భారత బృందం కొత్త దూకుడు విధానాన్ని అనుసరించింది. ప్రత్యర్థులు ఇది తెలుసుకునే లోపే విజయం భారత్ సొంతమయ్యింది. – షేక్ అన్వర్ బాషా, షటిల్ కోచ్ ఇదొక చరిత్రే భారత జట్టులోని ఐదుగురిలో నలుగురు తెలుగువారు. అందులో మన గుంటూరు షట్లర్ శ్రీకాంత్ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అటువంటి క్రీడాకారుడ్ని పొందిన రాష్ట్రం, దేశం గర్వపడుతోంది. మా ముందు ఓనమాలు నేర్చుకున్న పిల్లాడు ఈ రోజు ప్రపంచం మెచ్చే ప్లేయర్గా గుర్తింపు పొందడం పట్ల అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులం గర్వంగా ఫీల్ అవుతున్నాం. – సంపత్ కుమార్, షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి -
థామస్ ఉబర్ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్
-
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
నాకౌట్ దశకు భారత్ అర్హత
బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్ క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు అర్హత పొందింది. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్లో చైనీస్ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్తోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్గా నిలుస్తుంది. కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ను 52 నిమిషాల్లో ఓడించి భారత్కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్ ఆంథోనీ–కెవిన్ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ 21–15, 21–12తో సంకీర్త్ను ఓడించి భారత్కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్లో గారగ కృష్ణప్రసాద్–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–15, 21–11తో డాంగ్ ఆడమ్–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్లో ప్రియాన్షు రజావత్ 21–13, 20–22, 21–14తో విక్టర్ లాయ్పై గెలవడంతో భారత్ 5–0తో కెనడాను క్లీన్స్వీప్ చేసింది. ఉబెర్ కప్లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్ మ్యాచ్లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. -
థామస్ కప్–ఉబెర్ కప్లో భారత జట్లు శుభారంభం
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్–ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్లో భారత పురుషుల జట్టు గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్లో 5–0తో జర్మనీపై నెగ్గగా... ఉబెర్ కప్లో భారత మహిళల జట్టు గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో 4–1తో కెనడా జట్టును ఓడించింది. జర్మనీతో పోటీలో తొలి మ్యాచ్లో లక్ష్య సేన్ 21–16, 21–13తో మాక్స్ వీస్కిర్చెన్ను ఓడించగా... రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 10–21, 21–13తో జోన్స్ రాల్ఫీ–మార్విన్ సీడెల్ జోడీపై నెగ్గింది. మూడో మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–9, 21–11తో కాయ్ ష్కాఫెర్పై గెలిచి భారత్కు 3–0తో ఆధిక్యాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్లో అర్జున్ –ధ్రువ్ జోడీ... ఐదో మ్యాచ్లో ప్రణయ్ కూడా నెగ్గ డంతో భారత్ 5–0తో జర్మనీని క్లీన్స్వీప్ చేసింది. సింధు అలవోకగా... కెనడాతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–17, 21–10తో 11వ ర్యాంకర్ మిచెల్లి లీపై 33 నిమిషాల్లో గెలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో శ్రుతి మిశ్రా–సిమ్రన్ సింగ్ జంట ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. అయితే ఆ తర్వాతి మూడు మ్యాచ్ల్లో ఆకర్షి కశ్యప్ ... తనీషా–ట్రెసా జాలీ జంట... అష్మిత నెగ్గడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. -
ప్రిక్వార్టర్స్లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
సింధు, శ్రీకాంత్లకు కాంస్యం.. వ్రిత్తికి రజతం.. ఇంకా...
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 14–21, 17–21తో ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 19–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్లో ఓడిన సింధు, శ్రీకాంత్లకు 5,220 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. ఇతర క్రీడా వార్తలు.. వ్రిత్తి అగర్వాల్కు రజతం సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజతం పతకం సాధించింది. అండర్–16 బాలికల ఫ్రీస్టయిల్ 1500 మీటర్ల విభాగం ఫైనల్ రేసును వ్రిత్తి 18 నిమిషాల 06.40 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ‘షూటౌట్’లో భారత్ ఓటమి భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్లో భాగంగా నెదర్లాండ్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సవిత కెప్టెన్సీలోని భారత జట్టు ‘షూటౌట్’లో 1–3తో ఓడిపోయింది. ఆట తొలి నిమిషంలో రజ్విందర్ కౌర్ గోల్తో భారత్ ఖాతా తెరువగా... 53వ నిమిషంలో కెప్టెన్ జాన్సెన్ యిబ్బి గోల్తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున నవనీత్ కౌర్ మాత్రమే సఫలంకాగా రజ్విందర్, నేహా, జ్యోతి విఫలమయ్యారు. నెదర్లాండ్స్ జట్టు తరఫున మరాంటె, ఫోర్టిన్ కిరా, జాన్సెన్ సఫలంకాగా... ఫియోనా విఫలమైంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! -
Korea Open: సింధు, శ్రీకాంత్ జోరు
సన్చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్లాండ్)ను ఓడించింది. బుసానన్పై సింధుకిది 17వ విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–12, 18–21, 21–12తో సన్ వాన్ హో (కొరియా) పై గెలిచాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–18, 20–22తో కాంగ్ మిన్హుక్–సియో సెయుంగ్జె (కొరియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 17–21తో ఎమ్ హై వన్–బో రియోంగ్ కిమ్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
Korea Open: అదరగొట్టిన సింధు, శ్రీకాంత్
సన్చెయోన్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరు అలవోక విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే రైజింగ్ స్టార్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ రన్నరప్ లక్ష్యసేన్కు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. డబుల్స్లో ఒక్క సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ తప్ప అంతా ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో మూడో సీడ్గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–15, 21–10తో అయ ఒహొరి (జపాన్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్లో మాల్విక బన్సోద్ 8–21, 14–21తో ఆరోసీడ్ పొర్న్పవీ చొచువాంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21–18, 21–6తో మిశా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)పై గెలిచాడు. ఆరో సీడ్ లక్ష్యసేన్ 20–22, 9–21తో షెసర్ హిరెన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్ రెడ్డి–అశ్విన్ పొన్నప్ప జంట 20–22, 21–18, 14–21తో ఐదో సీడ్ ఒయు జువాన్ యి–హువాంగ్ య కియంగ్ (చైనా) ద్వయంతో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 21–15, 21–19తో హి యాంగ్–లో కియాన్ హీన్ (సింగపూర్) జంటపై గెలుపొందగా, రెండో సీడ్ మొహమ్మద్ అసాన్–హెండ్రా సెతియాన్ (ఇండోనేసియా)తో జరిగిన పోరులో అర్జున్–ధ్రువ్ కపిల 8–5 స్కోరు వద్ద రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగారు. చదవండి: IPL 2022: 150 కిమీ వేగంతో బంతి.. కళ్లు చెదిరే సిక్స్; డికాక్ ఊహించి ఉండడు -
సింధు, శ్రీకాంత్ సులువుగా...
సన్చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 40 నిమిషాల్లో 21–15, 21–14తో లౌరెన్ లామ్ (అమెరికా)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 40 నిమిషాల్లో 22–20, 21–11తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. గతంలో డారెన్తో ఆడిన మూడుసార్లూ ఓడిన శ్రీకాంత్ నాలుగో ప్రయత్నంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకృష్ణప్రియ 5–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–15తో తె యాంగ్ షిన్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21–19, 21–18తో జున్ లియాంగ్ ఆండీ క్వెక్–యుజియా జిన్ (సింగపూర్) జంటపై నెగ్గింది. -
క్వార్టర్స్లో సింధు, శ్రీకాంత్
బాసెల్: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్లు కూడా క్వార్టర్స్ చేరగా... వెటరన్ స్టార్ సైన నెహ్వాల్కు ప్రిక్వార్టర్స్లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–19, 21–14తో నెస్లిహన్ యిగిట్ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో పొపొవ్పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్లో సీనియర్ షట్లర్ కశ్యప్కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్వన్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్ ఒక టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్పై నెగ్గాడు. పురుషుల డబుల్స్లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. -
శ్రీకాంత్ శుభారంభం
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై, ప్రణయ్ 25–23, 21–16తో సాయిప్రణీత్ (భారత్)పై, కశ్యప్ 21–17, 21–9తో ఎనోగట్ రాయ్ (ఫ్రాన్స్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ (భారత్) 21–8, 21–13తో యెలీ హోయాక్స్ (ఫ్రాన్స్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
PV Sindhu: ఏడో ర్యాంకులోనే సింధు.. ఇక సైనా మాత్రం
PV Sindhu- Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సింధు ర్యాంక్లో ఎలాంటి మార్పూ లేదు. ఆమె నిలకడగా ఏడో ర్యాంకులోనే కొనసాగుతోంది. గాయాలతో సుదీర్ఘ కాలంగా సతమతమవుతున్న సైనా ఇటీవల బరిలోకి దిగుతోంది. ఈ సీనియర్ షట్లర్ 28వ ర్యాంకులో కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరాడు. అందువల్లే ర్యాంకు మెరుగువుతోంది. కాగా... కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు. సాయిప్రణీత్ 19వ ర్యాంకుకు దిగజారాడు. హెచ్.ఎస్. ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 24, 26వ ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19వ ర్యాంకులో, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాయి. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
జర్మన్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ల దూకుడు
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఆగ్బమ్రుగ్ఫన్ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది. 𝐀𝐚𝐫𝐚𝐦𝐛𝐡 🔥🏸⏰ 2:30 pm IST onwards (Tentative)#GermanOpen2022#Badminton pic.twitter.com/X1K1kP9owX— BAI Media (@BAI_Media) March 8, 2022 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. స్పెయిన్ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా.. హాంగ్కాంగ్ షట్లర్ ఆంగుస్ కా లాంగ్తో ప్రణయ్ పోటీపడాల్సి ఉంది. చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్తో..! -
పుడమితో చెలిమి.. సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా
సమస్త జీవులకు ఆధారమైన పుడమి, సంక్షోభంలోకి జారుతోంది. పర్యావరణ సమస్యలతో ప్రకృతి తల్లడిల్లిపోతోంది. దీనంతటికీ కారణమైన మనిషి, మేల్కొని ఈ దురవస్థను చక్కదిద్దుకోవాల్సిన అత్యయిక పరిస్థితి ముంచుకొచ్చింది. అందుకే, బాధ్యత కలిగిన సాక్షి మీడియా గ్రూప్ ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పుడమి సాక్షిగా! ‘వాతావరణ మార్పు’ ప్రమాద పరిస్థితులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకత, పర్యావరణ సమతుల్యత సాధనలో ప్రభుత్వాల, కార్పోరేట్ల, పౌర సమాజాల, గ్రామాల, కుటుంబాల, వ్యక్తుల బాధ్యతలేమిటో అవగాహన కల్పించేలా‘పుడమి సాక్షిగా’ రెండో ఎడిషన్ (2022) నిర్వహించాం. ఈ కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు, సినీ నటులు, కవి–గాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ, పత్రిక, వెబ్సైట్ వేదికలుగా... గత కొద్ది రోజులుగా మెగా క్యాంపెయిన్ రూపంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 8 గంటల ‘మెగా టాకాథన్’ జరిగింది. నాలుగు ప్రధాన అంశాలు గాలి, నీరు, నేల, శక్తిపై లోతైన చర్చలు ప్రత్యేక ఆకర్షణ! పుడమి సమస్యలు, తీవ్రత, ప్రతికూల ప్రభావాలు, పరిష్కారాలు... ఈ కృషిలో ఆదర్శంగా నిలుస్తోన్న వ్యక్తులు, వ్యవస్థలను ఇందులో ప్రస్తావించారు. అంతులేని కాలుష్యాలు, పాలనా వైఫల్యాలు, పౌర సమాజ నిర్లక్ష్యం వంటి లోపాలను ఎత్తి చూపారు, ప్రకృతిని కాపాడే ఆదర్శ విధానాలు, పద్ధతులను ఎలుగెత్తి చాటారు. అన్ని స్థాయుల్లో ఎవరు... ఏం చేస్తే... పుడమిని కాపాడుకోవచ్చో... విలువైన సమాచారం, ప్రేరణ, స్ఫూర్తి...‘పుడమి సాక్షిగా’ మీ కోసం. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి.. పుడమి సాక్షిగా పేరుతో సాక్షి మీడియా గ్రూప్ చేపడుతున్న పర్యావరణ కార్యక్రమం హర్షించదగింది. సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రకృతిని మనం ఇప్పుడు కాపాడకపోతే.. భవిష్యత్తు తరాలకు దాన్ని స్వచ్ఛంగా అందించలేం. బాధ్యతాయుతమైన పౌరులుగా భూమాతను కాపాడుకునే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మనందరం ప్రతి సందర్భంలో మొక్కలు నాటితే.. అవి మనకు స్వచ్ఛమైన గాలిని, ఆహారాన్ని ఇస్తాయి. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి. – బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్, ఏపీ. పుడమిని కాపాడేందుకు సాక్షి మీడియా గ్రూప్ చక్కటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మన వంతుగా పాల్గొందాం. మూడు సులభమైన మార్గాలను ఎంచుకుందాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ప్రకృతి వనరులను ఇబ్బంది పెట్టకుండా జీవించడం నేర్చుకోవాలి. నీటి వృథాను నివారించడంతోపాటు వర్షపు నీటిని కాపాడుకోవాలి. అలాగే విద్యుత్తును కూడా. చెట్లు మనకెంతో మేలు చేస్తాయి. వాటిని కాపాడుకోవాలి. మరిన్ని చెట్లను పెంచాలి. – పద్మభూషణ్ పి.వి.సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ పరిరక్షణ. దీన్ని గ్లోబల్ అల్టిమేటంగా చూడాల్సిందే. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే కానీ దానికోసం భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టొద్దని మా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మా రాష్ట్రంలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. అది ప్రకృతికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడతామని తెలియజేస్తున్నాను. పెరిగిపోతున్న జనాభా, తరిగి పోతున్న వనరులు, మనిషిలో నిర్లక్ష్యం.. ఇవన్నీ పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్లే. అందుకే పర్యావరణాన్ని పాఠశాల విద్యలో భాగం చేస్తున్నాం. – మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి , ఏపీ అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను వద్దని చెబితే.. ఎంతో మేలు జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు పర్యావరణ కాలుష్యం పై ప్రజలకు అవగాహన పెంచడానికి ‘పుడమి సాక్షిగా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి అభినందనలు. ప్రకృతిలో జీవిద్దాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఏసీ వినియోగాన్ని తగ్గిద్దాం. చెట్లు నాటితే అవి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. ఫలాలను ఇవ్వడంతోపాటు ఆక్సిజన్నూ అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పుడమి సాక్షిగా ముందుకు కదులుదాం. – శ్రీకాంత్ కిడాంబి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఒకవైపు అభివృద్ధి, మరో వైపు పర్యావరణం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకు రావాలన్న సీఎం ఆశయంలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రీస్కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. సామాజిక స్పృహకలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దని చెబుతున్నాం. ప్రజలలో అవగాహన కల్పించేందుకు సాక్షి మీడియా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. -విజయ్కుమార్, మెంబర్ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ -
India Open: ఏడుగురు ప్లేయర్లకు కరోనా.. టోర్నీ నుంచి అవుట్
India Open Badminton 7 Players Test Covid Positive: భారత బ్యాడ్మింటన్ శిబిరంలో కరోనా కలకలం రేగింది. ఇండియా ఓపెన్- 2022 పోటీల్లో పాల్గొనే ఏడుగురు షట్లర్లకు కోవిడ్ సోకింది. వరల్డ్ చాంపియన్షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ సహా పలువురికి నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్గా తేలినట్లు సమాచారం. అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా.. ‘‘నిబంధనల్లో భాగంగా నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ టెస్టులో ఏడుగురికి పాజిటివ్గా నిర్దారణ అయింది’’ అని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కారణంగా వీళ్లంతా టోర్నీ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లను పక్కకుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియా కథనం ప్రచురించింది. కాగా బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం క్రీడల పోటీల్లో పాల్గొనే వారందరికీ ఆరోగ్య భద్రతను నిర్ధారించడానికి టెస్టింగ్ ప్రోటోకాల్లు అమలు చేశారు. ఇక ఇండియా ఓపెన్ రెండో రౌండ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో వీరిద్దరూ తొలి రౌండ్లో అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్ శ్రీకాంత్ 21–17, 21–10తో సిరిల్ వర్మ (భారత్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సింధు 21–5, 21–16తో కుదరవల్లి శ్రీకృష్ణప్రియ (భారత్)పై గెలిచింది. భారత్కే చెందిన అష్మిత చాలియా 24–22, 21–16తో ఐదో సీడ్ ఎవగెనియా కొసెత్స్కాయా (రష్యా)పై సంచలన విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ (భారత్) జంట 21–12, 21–10తో ప్రొజొరోవా–రుదకోవా (ఉక్రెయిన్) జోడీపై నెగ్గి ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–సాయిప్రతీక్ (భారత్) ద్వయం 21–16, 16–21, 21–17తో ఇషాన్ భట్నాగర్–తనీషా క్రాస్టో (భారత్) జోడీపై... సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) జంట 21–11, 21–11తో చిరాగ్ అరోరా–నిషు రాప్రియా (భారత్) ద్వయంపై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. -
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ షురూ.. బరిలో సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా కోవిడ్ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్–500’ టోర్నమెంట్ ఈ ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మేటి ఈవెంట్లో సత్తా చాటేందుకు మాజీ చాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్లు సై అంటున్నారు. అయితే భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ క్రియాశీలం కావడంతో థర్ట్ వేవ్ (కోవిడ్ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కఠిన ప్రొటోకాల్ ప్రకారం పకడ్బందీగా ఈవెంట్ను నిర్వహించేందుకు ఆర్గనైజర్లు గట్టి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో ఆటగాళ్లు, కోర్టు వెలుపల సిబ్బంది తప్ప ప్రేక్షకుల స్టాండ్లలో ఎవరూ కనిపించరు. టీవీల్లో తప్ప వేదిక వద్ద చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత స్టార్లు సహా విదేశీ టాప్ స్టార్లు, ప్రపంచ చాంపియన్ షట్లర్లు ఇండియా ఓపెన్ ఆడేందుకు ఇది వరకే భారత్ చేరుకున్నారు. ప్రపంచ పురుషుల చాంపియన్ లో కియన్ వీ (సింగపూర్), మలేసియా టాప్స్టార్స్ ఒంగ్ వి సిన్, టియో యియి, ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్ అసాన్, హెండ్రా సెతివాన్ తదితరుల ఆటతో ఇందిరా గాంధీ స్టేడియం కళకళలాడనుంది. 2017 ఇండియా ఓపెన్ విజేత అయిన సింధు టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన ఉత్సాహంతో ఉండగా, 2015 చాంపియన్ శ్రీకాంత్ ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు. ఇద్దరు మరోసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టు దలతో ఉన్నారు. సింధు తొలి రౌండ్లో సహచర క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియతో, పురుషుల టాప్ సీడ్ శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లో భారత సహచరుడు సిరిల్ వర్మతో తలపడనున్నాడు. -
సీఎం జగన్ సహకారం మరువలేనిది..
తిరుపతి మంగళం: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ చెప్పారు. శుక్రవారం తిరుపతికి వచ్చిన ఆయన ఎంపీ గురుమూర్తిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు ఎంపీ గురుమూర్తి సహకారంతో తిరుపతిలో ఐదెకరాల స్థలాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించడం అభినందనీయమన్నారు. తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా యువతను చాంపియన్స్గా తీర్చిదిద్దుతానన్నారు. వచ్చే ఒలింపిక్స్లో గోల్డ్మెడల్ సాధించేందుకు పట్టుదలతో కృషి చేస్తానని శ్రీకాంత్ చెప్పారు. -
స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు సీఎం జగన్ సత్కారం
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్గా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. కిడాంబి శ్రీకాంత్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్లో.. 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి, శాప్ ఎండీ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, శాప్ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అమూల్లో పాలు పోసే రైతులే యజమానులు -
షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు సీఎం జగన్ సత్కారం
-
సిరిల్ వర్మతో శ్రీకాంత్ తొలి పోరు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్ను హైదరాబాద్కు చెందిన సిరిల్ వర్మ (భారత్)తో ఆడతాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం శ్రీకాంత్కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో శ్రీకాంత్కు ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్) ఎదురవుతాడు. స్పెయిన్లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఫైనల్లో లో కీన్ యు చేతిలోనే శ్రీకాంత్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. మరో భారత షట్లర్ సాయిప్రణీత్ తన తొలి మ్యాచ్లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో ఆడనున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్గా బరిలోకి దిగనున్న తెలుగు తేజం పీవీ సింధుకు సులువైన ‘డ్రా’ లభించింది. భారత్కే చెందిన శ్రీ కృష్ణప్రియతో సింధు తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ సైనా నెహ్వాల్... ఆరంభ మ్యాచ్లో ఐరిస్ వాంగ్ (అమెరికా)తో ఆడుతుంది. చదవండి: ప్రొ కబడ్డీ లీగ్లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్ -
అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..!
Kidambi Srikanth Returns To Top 10 World Rankings: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో తెలుగు తేజం, మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొట్టాడు. రెండేళ్ల తర్వాత తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని పదో ర్యాంక్లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్లో మరో భారత షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంక్(17)ను అందుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్కు చేరుకున్నాడు. 𝗥𝗔𝗡𝗞𝗜𝗡𝗚 𝗨𝗣𝗗𝗔𝗧𝗘𝗦 😍🔥@srikidambi entered 🔝 10 after 2 years@lakshya_sen achieved career high ranking@P9Ashwini & @sikkireddy entered top 20@PRANNOYHSPRI moved 6 ranks 🆙 Keep up the good work guys! 👊#IndiaontheRise#Badminton 📸 Badminton Photo pic.twitter.com/UOHHIRi96W — BAI Media (@BAI_Media) December 21, 2021 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు ఏడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. మహిళల డబుల్స్లో అశ్విని, సిక్కి జోడీ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 20వ స్థానంలో నిలిచింది. కాగా, తాజాగా జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్స్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్కు చేరుకొని రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు మరో భారత షట్లర్ లక్ష్యసేన్ సైతం సెమీస్కు చేరుకుని కాంస్య పతకం గెలిచాడు. చదవండి: హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు కాంస్యం -
తప్పులు సరిదిద్దుకోవాలి: గోపీచంద్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్పై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకుని వరుస మ్యాచ్లలో విజయం సాధించడం శుభపరిణామం అన్నాడు. అయితే, ఈ ఏడాది ఆరంభంలో శ్రీకాంత్లో ఆత్మవిశ్వాసం తక్కువగా కనిపించిందన్న గోపీచంద్.. టోర్నీలు ఆడుతున్నకొద్దీ ఆట మెరుగు కావడంతో తనపై తనకు నమ్మకం పెరిగిందని తెలిపాడు. సరైన సమయంలో చెలరేగి విజయం సాధించాడని... అయితే వచ్చే ఏడాది మరిన్ని టోర్నీలు గెలవాలంటే శ్రీకాంత్ తాను చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని గోపీచంద్ సూచించాడు. ఏదేమైనా ఈ టోర్నీలో శ్రీకాంత్తో పాటు లక్ష్య సేన్, ప్రణయ్ల ప్రదర్శన పట్ల కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్ చాంపియన్షిప్లో శ్రీకాంత్ రజత పతకం సాధించగా.. లక్ష్యసేన్ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! Kidambi Srikanth 🇮🇳 and Loh Kean Yew 🇸🇬 are as cool as cucumbers in this spectacular rally.#TotalEnergiesBadminton #BWFWorldChampionships #Huelva2021 pic.twitter.com/0FS7OzBCb1 — BWF (@bwfmedia) December 20, 2021 -
"వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధిస్తా"
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు. వరల్డ్ చాంపియన్షిప్ రజత పతకంపై... ఎవరికైనా ప్రపంచ చాంపియన్షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోర్నీలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది. వచ్చే ఏడాది ప్రణాళికలపై... విజయాల జోరు కొనసాగించడంతో పాటు అవసరమైన చోట లోపాలు సరిదిద్దుకొని ఆటను మరింత మెరుగుపర్చుకోవడం ముఖ్యం. రాబోయే 8–10 నెలలు నా కెరీర్లో ఎంతో కీలకం. జనవరి 10 నుంచి జరిగే ఇండియా ఓపెన్తో 2022లో మళ్లీ టైటిల్స్ వేటలో పడతా. అనంతరం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో రాణించడం ముఖ్యం. ఆపై కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్ ఈవెంట్లు ఉన్నాయి. నా గాయాల బాధ పూర్తిగా తప్పినట్లే. నేనిప్పుడు పూర్తి ఫిట్గా ఉన్నాను. ఒలింపిక్స్ ఆడలేకపోవడంపై... టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా కారణంగా కనీసం తొమ్మిది క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు రద్దు కావడం దెబ్బ తీసింది. ఆరంభ టోర్నీల్లో గాయం కారణంగా ఆడలేకపోగా, కోలుకొని కోర్టులో దిగే సరికి కోవిడ్ వచ్చేసింది. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ఒలింపిక్స్కు అర్హత సాధించకపోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోలేదని భావించా. ఇకపై ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టి మంచి ఫలితం సాధించా -
కిడాంబి శ్రీకాంత్కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
World Badminton Championship: భారత్కు రజత, కాంస్యాలు.. ప్రైజ్మనీ మాత్రం ఉండదు!
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు లక్ష్య సేన్. అయితే, తన ప్రదర్శన పట్ల మాత్రం సంతృప్తిగా లేనని, వచ్చే ఏడాది స్వర్ణ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. కాగా ఈ మెగా ఈవెంట్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ పసిడి గెలిచే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకోగా... సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్ (భారత్) కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లోభారత్ ఖాతాలో ఒకేసారి రజత, కాంస్య పతకాలు చేరాయి. ఇలా జరగడం ఇది రెండోసారి. అంతకుముందు... 2017లో మహిళల సింగిల్స్లో పీవీ సింధు రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం సాధించారు. ఈసారి పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పతకాలు సాధించారు. కాగా ఈ మెగా టోర్నీలో విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ప్రైజ్మనీ ఉండదు. సంతోషమే.. కానీ.. పతకం గెలిచిన లక్ష్య సేన్ మాట్లాడుతూ... ‘చరిత్ర సృష్టించడానికి చేరువగా వచ్చి సెమీఫైనల్లో ఓడటం బాధగా ఉంది. ఏదైతేనేం... నాకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకం దక్కింది. అయితే నేను ఈ పతకంతో సంతృప్తి చెందడంలేదు. ఓవరాల్గా టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ... కాంస్యం సాధించి నా గురువు ప్రకాశ్ పదుకొనే సరసన నిలవడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని పేర్కొన్నాడు.