ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు.
నగరంలోని కిల్గావ్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్ఏబీ) యూనిట్ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై దూసుకొచ్చాడు. చెక్పోస్ట్ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్(డీఎమ్పీ) అధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్ యూనిట్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఢాకాలోని ఓ ఆర్ఏబీ స్థావరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో భద్రతను కట్టదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
బైక్పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత
Published Sat, Mar 18 2017 12:14 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
- ‘విశాఖ ఉక్కు’ ఆస్తుల విక్రయంపై అభ్యంతరం ఉందా?
- కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష
- తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
- తిరువూరు ఎమ్మెల్యే అరాచకం.. ఎ.కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసం
- అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..
- కొత్త కొలువు రద్దయిపాయె!
- రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
- రాజ్యసభలోనూ నీట్ రగడ
- సోలోగా.. జాలీగా
Advertisement