Dhaka
-
బంగ్లాదేశ్లో మళ్లీ హింస.. మంటల్లో షేక్ హసీనా తండ్రి ఇల్లు దగ్ధం
ఢాకా: బంగ్లాదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢాకాలో నిరసనకారులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో, హింస్మాతక పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) తండ్రి, బంగ్లా వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళన కారులు ముట్టడించి నిప్పటించారు. దీంతో, భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్లో నిరసనకారులు మరోసారి ఆందోళనలకు దిగారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. ఈ క్రమంలో ఢాకాలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ (Sheikh Mujibur Rahman) ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం, ఆయన ఇంటిలోకి బలవంతంగా చొచ్చుకెళ్లిన నిరసనకారులు ఇంటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇంటిని తగులబెట్టినట్టు కూడా స్థానికి మీడియాలో కథనాలు వెల్లడించింది.ఇదే సమయంలో మాజీ ప్రధాని హసీనాపై నమోదైన కేసులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ పార్టీ (Awami League) గురువారం నిరసనలు తెలపాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే హింస నెలకొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రెహమాన్కు చెందిన ధన్మొండి 32 నివాసంపై గతంలోనూ దాడి జరిగింది. గతేడాది ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వ పతనం తరువాత కూడా ఇంటిపై దాడి చేసి అందులోని కొంత సామగ్రిని ధ్వంసం చేశారు.అయితే, షేక్ హసీనా బంగ్లాదేశీయులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం చేస్తున్న సమయంలోనే నిరసనకారులు రెచ్చిపోయారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ.. ముహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనను నిర్వహించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బుల్డోజర్తో లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం సంపాదించిన జాతీయ జెండా, రాజ్యాంగం మరియు స్వాతంత్ర్యాన్ని నాశనం చేసే శక్తి వారికి ఇంకా లేదు. వారు ఒక భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదు. చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా వారు గుర్తుంచుకోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bangladesh | A mob vandalised and set on fire Sheikh Mujibur Rahman’s memorial and residence at Dhanmondi 32 in Dhaka, demanding a ban on the Awami League. pic.twitter.com/azMcQCqngM— ANI (@ANI) February 5, 2025ఇదిలా ఉండగా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని దేశ హోం శాఖ సలహాదారు, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడి.. గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్లో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) హసీనాతోపాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలటరీ, సివిల్ అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఆరోపణలపై ఐసీటీలో విచారణలో ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని చౌదరి తెలిపినట్లుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బీఎస్ఎస్ వార్తా సంస్థ ప్రకటించింది. ‘దేశంలో ఉంటున్న వారిని అరెస్టు చేస్తున్నాం. హసీనా దేశంలో లేరు.. విదేశాల్లో ఉన్న వారిని ఎలా అరెస్టు చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. Feb 5, 2025: Ousted #Bangladesh PM Sheikh Hasina today addressed her supporters via social media.But just before her speech, a mob attacked the historic #Dhamnondi residence of the country’s founding father Bangabandhu Sheikh Mujibur Rahman in #DhakaThis is the second time… https://t.co/f3rv7aimYj pic.twitter.com/GXxf5Mh6mx— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) February 5, 2025 -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
బంగ్లాదేశ్లో దారుణం.. భారత ఏజెంట్ అంటూ మహిళ జర్నలిస్ట్పై దాడి!
ఢాకా: బంగ్లాదేశ్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు, హిందువులు, మైనార్టీలే టార్గెట్గా కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టును మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఆమెను భారత ఏజెంట్ అంటూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ను భారత్లో భాగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారంటూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను కొందరు టార్గెట్ చేశారు. గుంపుగా వచ్చిన కొంతమంది.. ఢాకాలో ఆమెను చుట్టుముట్టారు. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని వారు ఆరోపించింది. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు.. ఆమెను రక్షించారు. అనంతరం, ఆమెను తేజ్ గావ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే, మున్నీ సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బంగ్లా ప్రభుత్వ వైఖరిని భారత్ ప్రభుత్వం సైతం తప్పుపడుతోంది. Bangladeshi TV journalist Munni Saha's car was intercepted by radical in Dhaka.The Radical mob accused her of being an Indian agent and a supporter of the former Hasina govt.Later on she was arrested by Dhaka police based on the allegations levelled by Radical .… pic.twitter.com/icHcUIuZZt— MÃHĘŠH ŸĐV (@MkYdv97) December 1, 2024 -
ఢాకాలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు
ఢాకా: బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత దేశానికి,హిందువులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే అక్కడ హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.తాజాగా బంగ్లాదేశ్లో మున్నీ షా అనే మహిళా జర్నలిస్టును రాజధాని ఢాకాలోని కార్వాన్బజార్లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి.చుట్టుముట్టడమే కాకుండా ఆమెను కొంత సేపు వేధించారు. అయితే పోలీసులు ఆ మహిళా జర్నలిస్టును అల్లరి మూక భారీ నుంచి కాపాడారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. ను అల్లరి మూక నుంచి కాపాడారు.భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్హసీనాను సమర్థించినందుకే షాను వేధించినట్లు తెలుస్తోంది. -
‘‘సెక్యులర్ను రాజ్యాంగం నుంచి తొలగించాల్సిందే’’
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
బంగ్లాలో నిరసనలు.. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు. షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ వద్ద ర్యాలీ నిర్వహించింది. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను ప్రకటించారు.🚨🇧🇩BANGLADESH: CALLS FOR PRESIDENT SHAHABUDDIN’S REMOVAL GROWProtests intensify against President Shahabuddin, accusing him of backing "fascism" and demanding his resignation.Source: Times of India pic.twitter.com/bzD4amPq7w— Info Room (@InfoR00M) October 22, 2024 ఇక.. ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్గా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఎదుర్కొవడానికి ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ బంగా భవన్ బయట ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు.అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి మిత్రుడు.ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడారు. 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ ‘బంగ్లాదేశ్ చత్రా లీగ్’ను నిషేధించాలి. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.Violence has erupted once again in Bangladesh, this time with students and protesters demanding the resignation of the President. #Bangladesh Violent protests continue at Bangabhaban in Dhaka. Scuffles between police and security personnel. Protesters blocked Gulistan Road… pic.twitter.com/QISEV9BNnN— Ashoke Raj (@Ashoke_Raj) October 22, 2024షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.చుప్పు అని కూడా పిలువబడే మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్కు 16వ అధ్యక్షుడు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
ఢాకా: బంగ్లాదేశ్లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.బంగ్లాదేశ్లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్లోని దుర్గా పూజ మండపంలోకి ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్లోని జేఎం సేన్ హాల్లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Bomb Blast in Tatibazara Puja Mandap, Dhaka.#DurgaPujaAttack2024 pic.twitter.com/BQqHj5SURo— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) October 11, 2024ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం -
బంగ్లాలో దాడులు మతపరమైనవి కావు: మహమ్మద్ యూనస్
ఢాకా: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. భారత్కు చేరుకున్న అనంతరం బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. అయితే బంగ్లాలో మైనర్టీలపై జరిగిన దాడులు భారత్తో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ దాడులకు సంబంధించి తాగాజా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్పందించారు. బంగ్లాదేశ్లో హిందులు, మైనార్టీలపై జరిగిన దాడులు మతపరమైనవి కావని తెలిపారు. ఆ దాడులు కేవలం రాజకీయ సంక్షోభంలో భాగంగానే జరిగినట్లు స్పష్టం చేశారు. రాజకీయ దాడులను భారత్ మతపరమైన దాడులుగా పేర్కొంటోందని.. అలా చెప్పటం సరికాదని అన్నారు. బంగ్లాలో ఉండే చాలామంది హిందువులు షేక్ హాసినాకు చెందిన అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులుగా ఉన్నట్లు భావించటంతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.‘ నేను దాడులు విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేశా. ఇక్కడ మైనార్టీలపై దాడులు జరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజకీయం సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు కూడా దాడులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు అంటే అవామీ లీగ్ మద్దతుదారులే అనే అభిప్రాయం ఉంది.అవామీ లీగ్ కార్యకర్తలపై దాడి చేసే క్రమంలో హిందువులపై దాడి జరిగినది. ఈ దాడలును నేను సమర్థించటం లేదు.కానీ, అవామీ లీగ్ మద్దతుదారులు, హిందువుల మధ్య స్పష్టమైన తేడా లేదు’ అని తెలిపారు. -
హసీనాను బంగ్లాకు అప్పగించండి.. భారత్కు విజ్ఞప్తి
ఢాకా: భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్ను కోరింది. ఆమెను బంగ్లాకు అప్పగించాలని బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మంగళవారం భారత్కు కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది. ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్పీ వ్యవస్థాపకుడు జియా-ఉర్ రెహమాన్ సమాధి వద్ద మీర్జా ఫఖ్రుల్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నాం. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవల్సిందే. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటం వల్ల భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను నిలుపుకోవడం లేదు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశం (భారత్) హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం’ అని అన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్తో ఆశ్రయం పొందుతున్నారు. -
Bangladesh: షేక్ హసీనాపై హత్య కేసు!
ఢాకా: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది. రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్ హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు. జూలై 19న మొహమ్మద్పూర్లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు. -
Bangladesh: రోడ్లపై నిరసనలకు దిగిన హిందువులు
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాజధాని ఢాకాలో హిందువులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. వీరికి విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తున్నది. మరోవైపు బంగ్లాదేశ్లోని పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై జరుగుతున్న మారణహోమానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఢాకాలో నిరసన తెలిపాయి. హిందూ దేవాలయాల ధ్వంసంపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ‘హిందువులకు జీవించే హక్కు ఉంది’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని పలువురు హిందువులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో హిందువులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ వారు చేశారు. ఇదేవిధంగా లండన్, ఫిన్లాండ్తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో నిరసనలు కొనసాగాయి. కాగా బంగ్లాదేశ్లోని హిందువులకు భద్రత కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్ను వదిలి బ్రిటన్కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
బంగ్లా సంక్షోభం: పార్లమెంట్ రద్దు
ఢాకా: బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది. -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
బంగ్లాదేశ్ ఉద్రిక్తతలతో అలర్ట్ అయిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్కు నడిపించే విమాన సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. “బంగ్లాదేశ్లో తాజా పరిస్థితుల దృష్ట్యా, ఢాకాకు నడిచే మా విమానాలను తక్షణమే రద్దు చేశాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కన్ఫర్మ్ బుకింగ్ ఉన్న ప్రయాణికులకు రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై వన్-టైమ్ మినహాయింపు ఇస్తున్నాం'' అని పేర్కొంది.IMPORTANT UPDATEIn view of the emerging situation in Bangladesh, we have cancelled the scheduled operation of our flights to and from Dhaka with immediate effect. We are continuously monitoring the situation and are extending support to our passengers with confirmed bookings…— Air India (@airindia) August 5, 2024 మరోవైపు.. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్.. తాజా పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలు ఉండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
భారత్లో షేక్ హసీనా.. అజిత్ దోవల్తో భేటీ!
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.భారత్లో షేక్ హసీనా..అయితే షేక్ హసీనా భారత్కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఇది యూపీలోని ఘజియాబాద్లో ఉంది. అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారు. అనంతరం ఆమె లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.బీఎస్ఎఫ్ అలెర్ట్..బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. -
బంగ్లాదేశ్: 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం ఆదివారం హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 100కు చేరింది. ఇందులో 14 మంది పోలీసులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఆందోళనల నేపథ్యం ప్రభుత్వం నేటి (సోమవారం) నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యు విధించి, ఇంటర్నెట్ సేవలను తెలిపివేశారు. బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్ల చెలరేగటంతో అక్కడ ఉండే భారతీయ విద్యార్థులు, పౌరులకు కేంద్ర ప్రభుత్వ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సాయం కోసం ఢాకాలోని భారత హైకమిషన్ సంప్రదించాని పేర్కొంది. .. ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
రిజర్వేషన్ కోటా నిరసన హింసాత్మకం.. ఆరుగురి మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మాకంగా మారాయి. ఈ నిరసనల్లో మంగళవారం ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఉన్న అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వేలాది మంది విద్యార్థుల మధ్య ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. దీంతో నిరసన మరింత పెరగకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం ముందస్తుగా.. బుధవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.Dozens injured in Bangladesh clashes as students protest against job quotas for government jobs and a pro-government student body — in pictures https://t.co/CXkzG9mx6b pic.twitter.com/G0ETouUPvs— Al Jazeera English (@AJEnglish) July 16, 2024 బంగ్లాదేశ్లో 56 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ కోటాల క్రింద రిజర్వ్ చేయబడ్డాయి. అయితే వాటిలో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వీరుల పిల్లలు, మనవళ్లకు 30 శాతం, 10 శాతం మహిళలకు, 10 శాతం అభివృద్ధి చెందని జిల్లాలకు చెందిన వారికి, 5 శాతం స్థానిక వర్గాలకు,1 శాతం వికలాంగులకు కేటాయించబడ్డాయి. ఈ రిజేర్వేషన్లను సంస్కరించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కోటా ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యార్థులు చేపట్టిన తీవ్రతరం కావటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.Dhaka University now at 12am..#Bangladesh#StepDownHasina pic.twitter.com/PQMX2e8nJQ— Sayed Rouf 🇵🇸 (@SayedRouf4) July 16, 2024 ఈ నిరసనల్లో సుమారు 400వందల మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే తాము హింసను రెచ్చగొట్టడానికి నిరసన చేయటం లేదని ఓ విద్యార్థి నిరసనకారుడు మీడియాకు తెలిపారు. ‘ మేకు కేవలం మా హక్కులుకోసం పోరాటం చేస్తున్నాం. కానీ అధికార పార్టీ గూండాలు శాంతంగా నిరసన తెలుపుతున్నవిద్యార్థులపై దాడులు చేస్తున్నారు’ అని తెలిపారు. ఇక.. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ హక్కుల కోసం శాంతియుతంగా నిసనలు హింసాత్మకంగా మారాటంపై అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులకు భద్రత కల్పించాలంది. యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఈ నిరసన హింసాత్మకంగా మారటాన్ని తీవ్రంగా ఖండించింది.দেশের বুকে আঠারো এসেছে নেমে।❤️#Bangladesh #কোটা_সংস্কার_চাই #কোটাবাতিলচাই #QuotaMovement #QuotaReform pic.twitter.com/Wkalog4iKi— toffee 🇵🇸 (@clowngrizzly) July 16, 2024 -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
Dhaka: ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఏడంతస్తుల భవనంలో గురువారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. శ్వాససంబంధ సమస్యల కారణంగా గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సమంతాలాల్ తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తొలుత భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో చెలరేగిన మంటలు తర్వాత పై అంతస్తులోని మరిన్ని రెస్టారెంట్లకు వ్యాపించాయి. పై అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు దుస్తుల దుకాణం కూడా మంటల్లో కాలిపోయింది. ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించి అక్కడి నుంచి తరలించారు. అయితే వీరిలో 42 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఘటనలో కొందరు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ప్రమాదం జరిగిన భవనంలో ప్రతి అంతస్తులో రెస్టారెంట్లుండటంతో గ్యాస్ సిలిండర్లు ఎక్కువయి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘనటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి.. గాజాలో ఘోరం ఇజ్రాయెల్ కీలక ప్రకటన -
అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్పోర్ట్ లేకుండానే ఢాకాకి
వాతావారణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇండిగో ఎయిల్లైన్స్కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి ఢాకాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది. STORY | Guwahati-bound IndiGo flight from Mumbai diverted to Dhaka due to bad weather READ: https://t.co/nQPVWCfi2s VIDEO: (Source: Third Party) pic.twitter.com/NFuVYIxKPb — Press Trust of India (@PTI_News) January 13, 2024 అయితే ఈవిషయంపై ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా పాస్పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఢాకాలో ల్యాండ్ అయ్యామని తెలిపారు. 178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం, దయచేసి వేగంగా స్పందించండి మరో ప్రయాణికుడు ట్విటర్ ద్వారా వేడుకున్నారు. I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn't land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️ — Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024 దీంతో దీనిపై అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది. -
Ban vs NZ: న్యూజిలాండ్కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్లో కివీస్కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాలు
-
5 వికెట్లతో చెలరేగిన తైజుల్.. ఐర్లాండ్ 214 ఆలౌట్
Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్: బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఐర్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ను బంగ్లాదేశ్ ఎడంచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (5/53), మీడియం పేసర్ ఇబాదత్ హుస్సేన్ (2/54), స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (2/43) దెబ్బ కొట్టారు. ఐర్లాండ్ జట్టులో హ్యారీ టెక్టర్ (50; 6 ఫోర్లు, 1 సిక్స్), లొర్కాన్ టకెర్ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అడేర్ ఒకటి, ఆండీ మెక్బ్రిన్ ఒక వికెట్ తీశారు. ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్ ఐర్లాండ్ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్, టీ20 సిరీస్లను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. చదవండి: గుజరాత్ టైటాన్స్కు గుడ్న్యూస్.. కేన్మామ స్థానంలో లంక ఆల్రౌండర్ ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరం! వన్డే వరల్డ్కప్ టోర్నీకి కూడా -
విషాదం: బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఢాకా: మన పక్కదేశమైన బంగ్లాదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఎమద్ పరిబహన్ సంస్థకు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా అదుపుతప్పి నీళ్లు లేని ఓ కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు మదారిపూర్లోని కుతుబ్పూర్ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతిచెందారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఘటనపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఏడంతస్తుల భవనంలో పేలుడు..14 మంది మృతి..100 మందికి గాయాలు
ఢాకా: బంగ్లాదేశ్ ఢాకాలోని బహుళ అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఢాకా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గలిస్తాన్ ప్రాంతంలో అత్యంత రద్దిగా ఉండే సిద్దిఖీ బజార్లో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఏడు అంతస్తులున్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో పలు ఆఫీస్లు, స్టోర్లు ఉన్నాయి. పేలుడు అనంతరం 11 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో శానిటైజేషన్ మెటీరియల్స్ విక్రయించే ఓ స్టోర్లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం -
Ind Vs Ban: ఏడేళ్ల క్రితం ధోని సేనకు భంగపాటు! రెండో వన్డేలో గెలిస్తేనే..
India tour of Bangladesh, 2022 - Bangladesh vs India, 2nd ODI- మిర్పూర్: ఏడేళ్ల క్రితం భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు 1–2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది. ధోని నాయకత్వంలో నాడు తొలి రెండు వన్డేల్లోనే ఓడిన తర్వాత చివరి మ్యాచ్లో నెగ్గి పరువు దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి మన జట్ట దాదాపు అలాంటి స్థితినే ఎదుర్కొంటోంది. ఆదివారం అనూహ్యంగా మొదటి మ్యాచ్లో ఓడిన రోహిత్ శర్మ బృందం సిరీస్ చేజారకుండా ఉండాలంటే తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో వన్డేలో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కూడా గత వన్డే జరిగిన వేదికపైనే జరగనుంది. పిచ్ అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు కూడా అనుకూలిస్తూ సమతూకంగా ఉంది. మ్యాచ్కు వర్ష సూచన లేదు. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే! ►ఉదయం గం.11.30 గంటలకు ఆరంభం ►సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం తుది జట్లు అంచనా భారత్ ఫిట్నెస్ సమస్యల కారణంగా అక్షర్ పటేల్ మొదటి మ్యాచ్కు అందుబాటులో లేడు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నట్లయితే.. బ్యాటింగ్ లైనప్ను పటిష్టం చేసే క్రమంలో అక్షర్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. యువ స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అతడు వచ్చే ఛాన్స్ ఉంది. జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్. బంగ్లాదేశ్: ఎటువంటి మార్పులు లేకుండా మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే బంగ్లా బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్టు: లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఇబాదత్ హుస్సేన్. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ -
బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు.. ఫోటోలు వైరల్
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్తో పోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టింది. బంగ్లాదేశ్కు చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇక న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా ఉన్న శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్ శుక్రవారం భారత జట్టులో చేరనున్నారు. కాగా శుక్రవారం ఢాకా వేదికగా భారత జట్టు తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు దూరమైన భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి బంగ్లాతో సిరీస్కు జట్టులో చేరారు. Little Kids welcoming Rohit Sharma and Virat Kohli in Bangladesh - Beautiful pictures. pic.twitter.com/yLMFCZ69id — CricketMAN2 (@ImTanujSingh) December 1, 2022 View this post on Instagram A post shared by Voompla (@voompla) బంగ్లాదేశ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్. బంగ్లాదేశ్ టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్. చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..! -
అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా
డిసెంబర్లో టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో పాటు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్లో భాగంగా షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్లు బంగ్లా రాజధాని ఢాకాలోనే జరగాల్సి ఉంది. అయితే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డే వేదికను మాత్రం ఢాకా నుంచి చిట్టగాంగ్కు మార్చినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) బుధవారం పేర్కొంది. బంగ్లాదేశ్లో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) డిసెంబర్ 10న వేలాది మందితో ఢాకా వీదుల్లో ర్యాలీతో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. అయితే అదే రోజు డాకాలో మూడో వన్డే జరగాల్సి ఉంది. దీంతో అల్లర్లకు ఆస్కారం ఉండడంతో వన్డే వేదికను మార్చాలని బీసీబీ నిర్ణయించుకుంది. అందుకే డిసెంబర్ 10న జరగనున్న మూడో వన్డేను డాకాలో కాకుండా చిట్టగాంగ్ వేదికగా జరుగుతుందని తెలిపింది. ఇక గత నెలలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎన్పీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అవినీతి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీఎన్పీ కోరుతుంది. ఇక మొదటగా అనుకున్న ప్రకారం రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు డాకా, చిట్టగాంగ్లు వేదికలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని బీసీబీ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యునస్ తెలిపారు. డిసెంబర్ 4,7, 10 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. డిసెంబర్ 14-18 వరకు చిట్టగాంగ్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 22-26 వరకు డాకా వేదికగా రెండో టెస్టు జరగనుంది. చదవండి: అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు? నేనింకా చిన్న పిల్లాడినే కదా! బంగ్లాతో టెస్టు సిరీస్.. జడేజా దూరమయ్యే అవకాశం! జట్టులోకి సూర్య? -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
Ban Vs SL: బంగ్లా టూర్కు శ్రీలంక.. 18 సభ్యులతో కూడిన జట్టు ఇదే!
Sri Lanka tour of Bangladesh- 2022: బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి 18 సభ్యుల పేర్లు వెల్లడించింది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా శ్రీలంక రెండు మ్యాచ్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో దిముత్ కరుణరత్నే సారథ్యంలోని లంక జట్టు మే 8న పర్యాటక దేశానికి చేరుకోనుంది. మే 11 ప్రాక్టీసు మ్యాచ్తో ఆటను ఆరంభించనుంది. కాగా ఈ సిరీస్తో ఒషాడా ఫెర్నాండో తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దేశవాళీ టోర్నీ నేషనల్ సూపర్ లీగ్లో ప్రతిభ నిరూపించుకోవడంతో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటన-2022: 18 సభ్యులతో కూడిన జట్టు ఇదే దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కమిల్ మిషారా, ఒషాడో ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్విల్లా, దినేశ్ చండిమాల్, సుమిందా లఖణ్, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డనియా, రమేశ్ మెండిస్, చమిక కరుణరత్న. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక షెడ్యూల్: మే 11, 12: ప్రాక్టీసు మ్యాచ్- ఛట్టోగ్రామ్లో మే 15- 19: మొదటి టెస్టు- ఛట్టోగ్రామ్లో మే 23- 27: రెండో టెస్టు- ఢాకాలో -
మెడికల్ టూరిజానికి హబ్గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్స్కిల్, రీ–స్కిల్ ) -
నేరుగా నగరానికే...
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాం డ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. వైద్యానికి తక్కువ ఖర్చు.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్లోని పలు కా ర్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బా గ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయి లో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బు లు, కాలేయ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రుల కు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది.. వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొ దలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరి యా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగు లు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. -
బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్పై 200 మంది మూకుమ్మడి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్పై దాడి చేసి కూల్చి వేశారు. వివరాల ప్రకారం.. ఢాకాలోని లాల్మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని సుమారు 200 మందితో కూడిన గుంపు గురువారం ధ్వంసం చేసి దోచుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనను ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఆయన ట్విటర్లో.. "డోల్ యాత్ర & హోలీ వేడుకల సందర్భంగా ఇది చాలా దురదృష్టకర సంఘటనని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో ఢాకాలోని టిప్పుసుల్తాన్ రోడ్లో, చిట్టగాంగ్లోని కొత్వాలీలో కూడా జరిగాయి. It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv — Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022 -
బంగ్లాలో భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం
ఢాకా: బంగ్లాదేశ్ స్వతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు బుధవారం ఘనస్వాగతం లభించింది. మూడురోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్తో చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో పాటు ఆయన సతీమణి, కూతురు, ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు. కోవింద్కు 21 తుపాకుల సెల్యూట్తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్కు ఆహా్వనం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. చదవండి: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం ఆయన ముజిబుర్ రహ్మన్ మ్యూజియంను దర్శించారు. కోవిడ్ కల్లోలం తర్వాత రాష్ట్రపతి జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. డిసెంబర్ 16న కోవింద్ గౌరవార్ధం నేషనల్ పెరేడ్ గ్రౌండ్లో గెస్ట్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని హసీనాతో రాష్ట్రపతి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. -
తాలిబన్ల పాలనలో అఫ్గన్ తొలి క్రికెట్ సిరీస్ ఇదే!
ఢాకా: అఫ్గనిస్తాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది. మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్ 19 టీమ్కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. చదవండి: South africa vs Sri lanka: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు -
న్యూజిలాండ్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో కివీస్ చెత్త రికార్డు..
ఢాకా: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు టి20 ఫార్మాట్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఢాకాలో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ (2/10), ముస్తఫిజుర్ (3/13), నాసుమ్ అహ్మద్ (2/5), సైఫుద్దీన్ (2/7) న్యూజిలాండ్ను దెబ్బ తీశారు. టి20ల్లో న్యూజిలాండ్కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. బంగ్లా టీంలో ముస్తిఫర్ రహీమ్ 16, మహ్మదుల్లా 14 పరుగులతో నాటౌట్గా నిలిచి మరో వికెట్ పడకుండా విజయం సాధించారు. కాగా ఈ సిరీస్ కోసం, న్యూజిలాండ్ జట్టు 10 మంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. చదవండి: Shaheen Afridi: కెరీర్లో చాలా ఎదగాలి.. పెళ్లికి తొందరేంలేదు What a start for Bangladesh! New Zealand are 18/4 after the Powerplay 👀 Who will help them rebuild?#BANvNZ | https://t.co/4Bvg9arZLr pic.twitter.com/tMPt3JnFY8 — ICC (@ICC) September 1, 2021 Bangladesh registered their first T20I victory over New Zealand after defeating the visitors by seven wickets in the opening match.#BANvNZ report 👇 — ICC (@ICC) September 1, 2021 -
వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్కు కరోనా పాజిటివ్
ఢాకా: న్యూజిలాండ్ బ్యాట్స్మన్ ఫిన్ అలెన్ కరోనా బారిన పడ్డాడు. ఇది సాధారణ విషయమే!.. విచిత్రమేమింటంటే ఫిన్ అలెన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఢాకా వచ్చిన అతనికి జ్వరం లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే కరోన పరీక్ష చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతన్ని బస చేసిన హోటల్లోనే క్వారంటైన్ చేసినట్లు కివీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిన్ అలెన్ న్యూజిలాండ్ తరపున 3 టీ20 మ్యాచ్లాడి 88 పరుగులు చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 1 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. చదవండి: WI Vs PAK: 10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్ ఆఫ్రిది; పాకిస్తాన్ ఘన విజయం -
చిత్తుగా ఓడిన ఆసీస్; రెండో టీ20లోనూ బంగ్లాదేశ్ గెలుపు
ఢాకా: ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ మరోసారి షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్ను వరుసగా రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లా ఐదు టీ20ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హెన్రిక్స్ 30 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(9), సౌమ్యా సర్కార్లు(0)లు తొందరగా ఔటైనా.. షకీబ్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్ను నిర్మించారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ 37 నాటౌట్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ 22 నాటౌట్గా నిలిచి మ్యాచ్ను గెలిపించారు. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్... మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. షకీబ్ (36; 3 ఫోర్లు), నయీమ్ (30; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. హాజల్వుడ్ 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఆసీస్ 20 ఓవర్లలో 108 పరుగుల వద్ద ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (45; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ రహ్మాన్, ఇస్లామ్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు ఇదే వేదికపై రెండో టి20 జరుగుతుంది. -
బంగ్లాదేశ్ పర్యటనకు ఆస్ట్రేలియా.. జట్టు ఇదే!
ఢాకా: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్తో ఆసీస్ 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. ఇక 2017 తర్వాత మెదటిసారిగా ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ప్రస్తుతం వెస్ట్ఇండీస్ పర్యటనలో ఉన్న ఆసీస్ నేరుగా బంగ్లాదేశ్ చేరుకోనుంది. ఢాకాలో కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునుంది. మరోవైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న స్వదేశానికి చేరుకోనుంది. ఈ సీరిస్ లో భాగంగా మొత్తం 5 టీ20 మ్యాచ్లు ఢాకా వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్తో ఆడుతున్న జట్టును కొనసాగించనుంది. ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా. -
డ్రీమర్లకు యూఎస్ కోర్టు షాక్!
హూస్టన్: దాదాపు 6 లక్షల మంది వలసదారులను స్వదేశాలకు తరలించకుండా రక్షణ కల్పిస్తున్న డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్) చట్టం చెల్లదని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బరాక్ ఒబామా హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పటివరకు పలువురు భారతీయ యువతకు రక్షణ లభిస్తూ వచ్చింది. డ్రీమర్స్గా పిలిచే ఈ యువతకు శరాఘాతం కలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో డ్రీమర్స్ను రక్షించాలన్న బైడెన్ ప్రభుత్వ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్లయింది. ఈ చట్టం రూపొందించడంలో ఒబామా ప్రభుత్వం పరిధి దాటిందని న్యాయమూర్తి ఆండ్రూ హనెన్ అభిప్రాయపడ్డారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ఈ చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ఈ చట్టం అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అనైతికమని, అందువల్ల ఇకపై డాకా అప్లికేషన్ల ఆమోదాన్ని నిలిపివేయాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటికే స్వీకరించిన అప్లికేషన్లపై తీర్పు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ సహా పలు రిపబ్లికన్ రాష్ట్రాలు డాకాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. ఈ చట్టం కారణంగా తాము అదనపు వ్యయాలు భరించాల్సివస్తోందని ఈ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా డాకాపై తీర్పునిచ్చిన న్యాయమూర్తిని గతంలో బుష్ ప్రభుత్వం నియమించింది. -
విషాదం: భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లోని ఓ కారాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఢాకా శివారులోని రూప్ గంజ్లోని కర్మాగారంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక అధికారులు వివరాల ప్రకారం.. రుప్గంజ్లోని షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. కర్మాగారంలో రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఎక్కువగా ఉండడంతో భవనం మొత్తం మంటలు త్వరగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతి చెందారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 18 అగ్నిమాపక విభాగాలు కష్టపడుతున్నాయని, సహాయక చర్యులను ముమ్మరం చేశామని అన్నారు. తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాడానికి జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. -
బంగ్లాదేశ్లో నిర్భయ తరహా ఘటన
ఢాకా: బంగ్లాదేశ్లోని ఓ 22 ఏళ్ల మహిళపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సావర్ ప్రాంతంలో అశులియా పశువుల మార్కెట్ దగ్గరలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అశులియా పోలీస్ ఇన్స్పెక్టర్ జియాల్ ఇస్లాం వివరాల ప్రకారం..బాధితురాలు మణిక్గంజ్లోని తన సోదరి ఇంటి నుంచి నారాయణగంజ్లో ఉన్న ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి 8 గంటలకు మరో బస్సు కోసం నబినగర్ బస్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ ఆ మహిళకు ఇంతకుముందు పరిచయం ఉన్న నజ్ముల్ అనే వ్యక్తి కలిసాడు. ఇద్దరు కలిసి బస్సు కోసం ఎదురు చూస్తుండగా..అక్కడకి వచ్చిన బస్సులో ఎక్కారు. అయితే నిందితులు బస్సులో ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలు రాకముందే దించేశారు. అదే సమయంలో నజ్ముల్, బాధితురాలని అడ్డుకుని తిరిగి నబినగర్ తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు దుండగులు బస్సులో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో నజ్ముల్ అరుపులు విని పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి వాహనాన్ని ఆపి వారిని రక్షించారు. బస్సును అదుపులోకి తీసుకుని నిందుతులను అరెస్ట్ చేశారు. కోర్టు వారిని ప్రశ్నించడానికి నాలుగు రోజుల రిమాండ్ విధించింది. కాగా ఆరుగురు నిందితులను ఆర్యన్(18), షాజు(20), సుమోన్ మియా(24), మోనోవర్(24), షోహాగ్(25), సైఫుల్ ఇస్లాం(40) గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. వీరంతా తురాగ్ ప్రాంతంలోని కమర్పారా నివాసితులుగా పేర్కొన్నారు. (చదవండి: పార్టీ పేరుతో రచ్చ..150 మంది అరెస్ట్) -
బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల
ఢాకా: దాదాపు వారం క్రితం అరెస్టయిన బంగ్లాదేశ్ సీనియర్ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లామ్ ఆదివారం విడుదలయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అనుమతి లేకుండా ఫోటోలు తీశారన్న ఆరోపణలపై వలసవాద కాలానికి చెందిన ఓ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుపై బంగ్లాదేశ్లోని మీడియా సహా ఐక్యరాజ్యసమితి వరకూ పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని ఓ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 5వేల టాకాలను పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్పోర్టును సమర్పించాలని కోర్టు ఆమెను కోరింది. అనంతరం కాశీంపుర్ మహిళా సెంట్రల్ జైలు నుంచి ఆదివారం రోజినా విడుదలయ్యారు. జూలై 15వరకూ బెయిల్ కొనసాగనుంది. వ్యాక్సిన్లను కొనే వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆమె ఫొటోలు తీశారంటూ ఆరోగ్య శాఖ ఆమెపై కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇకపై కూడా జర్నలిస్టుగా మరింత బాధ్యతతో పని చేస్తానని చెప్పారు. (చదవండి: UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది) -
బంగ్లాదేశ్లో పడవ ప్రమాదం, 26 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. బుధవారం వరకూ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి: భారత్కు ఈయూ చేయూత -
మోదీ బంగ్లా పర్యటన: శశి థరూర్ క్షమాపణలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నందుకు కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ క్షమాపణలు చెప్పారు. శశి థరూర్ తన తప్పును తెలుసుకున్నానని, ఇది కేవలం ప్రముఖ న్యూస్ఛానల్లో వచ్చిన హెడ్లైన్స్ను సరిగ్గా చదవక పోవడంతో తప్పు దొర్లిందని, క్షమించండి అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేయడంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను ప్రధాని మోదీ అంగీకరింలేదంటూ శశి థరూర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్కు కూడా ప్రధాని మోదీ భారతీయుల ఫేక్ న్యూస్ రుచి చూపిస్తూన్నారని థరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్కు స్వేచ్ఛను ఎవరు ప్రసాదించారో అందరికీ తెలుసు అంటూ ఆయన ట్విటర్లో చెప్పుకొచ్చారు. ఇక థరూర్ ట్వీట్ నేపథ్యంలో ప్రధాని మోదీపై కొందరు కాంగ్రెస్ నాయకులు విమర్శనాస్త్రాలు కూడా ఎక్కుపెట్టారు. అయితే, బంగ్లాకు స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఇందిరా కృషిని ప్రధాని మోదీ గుర్తు చేయగా.. థరూర్ దానిని తప్పుగా అర్థం చేసుకుని ట్వీట్ చేసినట్టు వెల్లడైంది. తర్వాత పొరపాటు గ్రహించిన థరూర్ తాజాగా తను చేసిన ట్వీట్ను తొలగించారు. దాంతో పాటు క్షమాణలు కూడా చెప్పారు. ‘పొరపాటు చేసినప్పుడు అంగీకరించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’అని ఆయన ట్విటర్లో చెప్పుకొచ్చారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసినాతో పలు ద్వైపాక్షిక అంశాలపై ఆయన నేడు చర్చించనున్నారు. I don't mind admitting when I'm wrong. Yesterday, on the basis of a quick reading of headlines &tweets, I tweeted "everyone knows who liberated Bangladesh," implying that @narendramodi had omitted to acknowledge IndiraGandhi. It turns out he did: https://t.co/YE5DMRzSB0 Sorry! — Shashi Tharoor (@ShashiTharoor) March 27, 2021 చదవండి: ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి -
నా టీనేజ్లో బంగ్లాదేశ్ కోసం కొట్లాడాను
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటున్నారు. ఈక్రమంలో తాను మొట్టమొదటిసారి పోరాటం చేసింది బంగ్లాదేశం కోసమేనని.. అది కూడా టీనేజ్లో ఉన్నప్పుడు అని మోదీ గుర్తు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలిన అనంతరం తొలిసారి మోదీ విదేశీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్తో తనకు ఉన్న అనుబంధాన్ని మోదీ నెమరువేసుకున్నారు. బంగ్లా పర్యటనలో శుక్రవారం ప్రధాని బిజీబిజీగా గడిపారు. బంగ్లాదేశ్ 50 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢాకాలోని జాతీయ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా ప్రయాణం ప్రారంభమయ్యిందే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం. నా మిత్రులతో కలిసి నేను 20 ఏళ్ల వయసులో భారత్లో సత్యాగ్రహ దీక్ష చేశా. ఆ పోరాటం సందర్భంగా నేను జైలుకు కూడా వెళ్లా’ అని మోదీ తన రాజకీయ జీవిత అరంగేట్రాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప దేశం ఆవిర్భవించడానికి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేనివని మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల గొప్పదనం.. మమకారం సరిహద్దులో ఉండే భారతీయులు ఎప్పుడు మరువలేరని తెలిపారు. ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని రోజులని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని నరేంద్ర మోదీ చెప్పారు. అంతకుముందు బంగ్లాదేశ్లోని భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. రేపు కూడా బంగ్లా పర్యటనలో మోదీ బిజీబిజీగా ఉండనున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. -
బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
-
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్గ్రౌండ్ గ్యాస్పైప్లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్గంజ్ పోర్టుటవున్లోని బైతుల్సలాత్ మసీద్లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్లైన్ లీకేజ్లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
ముష్ఫికర్కు ‘నో’ చెప్పిన బీసీబీ
ఢాకా: కరోనాతో విరామం తర్వాత తిరిగి ప్రాక్టీస్ను ప్రారంభించాలనుకున్న బంగ్లాదేశ్ అగ్రశ్రేణి క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్కు మొండి చేయి ఎదురైంది. అతనితో పాటు మరికొంత మంది క్రికెటర్లు మిర్పూర్లోని షేర్–ఎ–బంగ్లా స్టేడియంలో ప్రాక్టీస్లో పాల్గొంటామని విజ్ఞప్తి చేయగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో ఈ సమయంలో బహిరంగ శిక్షణ మంచిది కాదంటూ వారి ప్రతిపాదనను తిరస్కరించింది. ‘ప్రాక్టీస్ చేసేందుకు ఇది తగిన సమయం కాదని మేం ముష్ఫికర్ను వారించాం. ట్రెయినింగ్ ముఖ్యమే కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత అన్నింటికన్నా ప్రధానం. మిర్పూర్లో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాం. పూర్తి స్థాయిలో మైదాన పరిసరాలు సురక్షితం కాలేదు’ అని బీసీబీ స్పష్టం చేసింది. -
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ బౌలింగా?
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) బుధవారం ఆరంభం కాగా ఓ బౌలింగ్ వేసిన తీరు నవ్వులు తెప్పించడమే కాదు.. అనేక అనుమానాలకు తావిచ్చింది. వెస్టిండీస్కు చెందిన 34 ఏళ్ల ఎడమ చేతి మీడియం పేసర్ క్రిష్మర్ సంతోకి బీపీఎల్లో సిలెట్ థండర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టాగ్రామ్ చాలెంజర్స్తో జరిగిన ప్రారంభపు మ్యాచ్లో సంతోకి వేసిన బంతులు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. కుడిచేతి వాటం బ్యాట్స్మన్కు అతడు ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ.. లెగ్సైడ్కు అత్యంత దూరంగా ఫుల్టాస్ వేయడం గమనార్హం. ఆ బంతి వికెట్కు ఎంత దూరంగా వెళ్లిదంటే టెస్ట్ల్లోనూ ఆ బంతిని నిస్సందేహంగా వైడ్గా ప్రకటించేంతగా. ఆ బంతిని అందుకొనేందుకు కీపర్ ఎడమవైపుకు బాగా డైవ్ కొట్టి మరీ ఆపాడు. ఇక.. క్రిష్మర్ వేసిన నోబ్ను చూసి‘ ‘క్రికెట్లో ఇలాంటి నోబాల్ కూడా వేస్తారా?’ అనిపించింది. అతడి కుడికాలు క్రీజ్కు చాలా దూరంగా పడింది. దాంతో సంతోకి బౌలింగ్పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తంజేశారు. సంతోకి అనుమానాస్పద బౌలింగ్పై విచారణ చేయాలని బంగ్లా క్రికెట్ బోర్డును కోరామని సిలెట్ థండర్ డైరెక్టర్ తంజిల్ చౌధురి పేర్కొన్నారు. ‘ నో బాల్-వైడ్పై విచారణకు ఆదేశించాం. ఓవరాల్గా మాకు బరిలోకి దిగే ఎలెవన్ జట్టుపై మా జోక్యం ఉండదు. అది మేనేజ్మెంట్, కోచ్ పని. దీనిపై స్పాన్సర్ల ప్రమేయం ఏమైనా ఉందని అడిగా. కానీ వారు చెప్పలేదు. ఇక ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. సంతోకి ఇలా బౌలింగ్ చేసి స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డడా అనే అనుమానం కూడా ఉంది. సంతోకి ఇలా చేయడానికి ఎవరి ప్రమేయం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తాం’ అని తంజిల్ తెలిపారు. ఈ మ్యాచ్లో సంతోకి 4 ఓవర్లు బౌలింగ్ వేసి 34 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్లో సిలెట్ థండర్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిలెట్ థండర్ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ను చట్టాగ్రామ్ చాలెంజర్స్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టీ20 మ్యాచ్లో సంతోకి ఒక నోబాల్తో పాటు 4 వైడ్లు వేశాడు. దాంతోనే అతని బౌలింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. A no-ball bowled by Krishmar Santokie in the opening match of the Bangladesh Premier league #BPL2019 today. pic.twitter.com/Lvzut5d0Gz — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 And this a wide, bowled just a couple of balls before that. pic.twitter.com/SItM4IG30x — Nikhil Naz (@NikhilNaz) December 11, 2019 -
నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా..
ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ షకిబుల్ హసన్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండేళ్లు నిషేధం విధించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ జట్టును ఇప్పటివరకూ షకిబుల్ సమర్ధవంతంగా నడిపించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ప్రయోగాలు చేస్తోంది. టీ20 ఫార్మాట్కు మహ్మదుల్లాను కెప్టెన్గా నియమించిన బీసీబీ.. టెస్టులకు మాత్రం మోమినల్ హక్ను సారథిగా నియమించింది. దీనిపై మోమినల్ హక్ మాట్లాడుతూ.. ఇదొక ఊహించని పరిణామంగా పేర్కొన్నాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ‘నేను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆలోచించలేదు. కెప్టెన్సీ చేయాలనే ఆలోచన కూడా లేదు. అసలు బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్గా చేస్తారని ఏ రోజూ ఊహించలేదు. నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. కాస్త బలవంతంగానే ఆ పాత్రను నాకు కట్టబెట్టారు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం జట్టును సమర్ధవంతంగా నడిపించడమే. అల్లా దయవల్ల నేను కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. కెప్టెన్సీ కారణంగా అదనపు ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. నేను గతంలో ఏ రకంగా స్వేచ్ఛగా ఆడానో, అదే తరహా ప్రదర్శనను ఇవ్వడానికి యత్నిస్తా’ అని మోమినల్ హక్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్కు కెప్టెన్గా చేయడం ఒక గొప్ప అవకాశం అయితే, భారత్తో డే అండ్ నైట్ టెస్టులో ఆడటం ఇంకా గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
‘ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం చేశారు’
ఢాకా: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాలు కొన్ని వికృత కార్యాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ అరాచాకాల గురించి నోరు విప్పితే.. ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. గతకొద్దికాలంగా బంగ్లాదేశ్లో ఈ అరాచాకాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో ఓ చిన్నారి మదర్సాలోని ఓ ఉపాధ్యాయుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ చిట్లితల్లిని అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాక మదర్సాలో పిల్లలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితుల గురించి ప్రపంచానికి వెల్లడించింది. బాలిక మృతితో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మదర్సా సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢాకా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న హోజైఫా అల్ మమ్దుహ్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. ఆ వివరాలు.. ‘విద్యాభ్యాసం నిమిత్తం నేను ఢాకాలోని మూడు మదర్సాల్లో ఉన్నాను. ప్రతి చోట ఇలాంటి అకృత్యాలు చాలా సహజం. మదర్సాలో పని చేసే సిబ్బంది మాతో పాటు హస్టల్లోనే ఉండేవారు. సిబ్బందే కాక సీనియర్ విద్యార్థులు కూడా దారుణాలకు పాల్పడేవారు. పగలంతా ఏదో విధంగా గడిపిన విద్యార్థులు రాత్రి అవుతుందంటేనే భయంతో బిగుసుకుపోయేవారు. ఆ రాత్రి ఎవరికి కాళరాత్రిగా మారనుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. దాదాపు మదర్సాలో ఉన్న ప్రతి విద్యార్థిపై ఈ అకృత్యాలు జరిగేవి. మేమంతా స్వయంగా బాధితులమే కాక ప్రత్యక్షంగా సాక్షులం కూడా. నేను కూడా ఈ నరకాన్ని అనుభవించాను. అది కూడా చాలా చిన్న వయసులో. ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది. నా సీనియర్లే నాతో ఇలా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని దారుణాల మధ్యే నా విద్యాభ్యాసం ముగిసింది. నాకు తెలిసిన చాలా మంది మదర్సా టీచర్లు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని పాపంగా భావిస్తారు. కానీ పిల్లలతో లైంగిక సంబంధం కొనసాగించడం వారి దృష్టిలో పెద్ద నేరం కాదు. బాధితులు, నేరస్తులు ఒకే చోట ఉండటం మూలానా ఇలాంటి దారుణాలు బయటకు రావు. పైగా విద్యార్థులంతా పేదవారు కావడంతో మౌనంగా ఈ నరకాన్ని భరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. హోజైఫా పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ జర్నలిస్టు స్ఫూర్తితో మరి కొంత మంది ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు మదర్సా నిర్వహకులు హోజైఫా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అతడు యూదు మతానికి లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వాడని.. అందుకనే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మదర్సాలో చదవడం ఇష్టం లేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తారని మండి పడుతున్నారు. మదర్సాల ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
51 ఏళ్ల తర్వాత బయటపడింది
న్యూఢిల్లీ: దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను తాజాగా గుర్తించారు. ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. ఐఏఎఫ్కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న గల్లంతైంది. అప్పటి నుంచి దీని ఆచూకీ లభ్యం కాలేదు. ఐఏఎఫ్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీనిలో ఉన్న సిబ్బంది గురించి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ క్రమంలో 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు విమానంలో ప్రయాణించిన సిపాయ్ బేలీరామ్ మృతదేహాన్ని గుర్తించారు. దాంతో వాయుసేన మరోసారి గాలింపు చర్యలను ఉధృతం చేయగా 2007లో మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్లో పడినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, ఎయిర్బ్రేక్ అసెంబ్లీ, కాక్పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ఫోర్స్ చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది పైలట్కు సమాచారమిచ్చారు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి చండీగఢ్కు మళ్లించారు. అయితే మార్గమధ్యంలో రోహ్తంగ్ పాస్ మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్ఫోర్స్ సిబ్బంది దీని కోసం తీవ్రంగా గాలించినప్పటికి ఫలితం దక్కలేదు. -
భారీ అగ్నిప్రమాదం; 19 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ శ్రీలంక జాతీయుడు సహా 19 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవంతిలో వస్త్ర దుకాణాలు, ఇంటర్నెట్ సేవలందించే ఆఫీస్లు ఉన్నాయి. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. శ్రీలంకకు చెందిన నిరాస్ చంద్ర అనే వ్యక్తి సహా మొత్తం ఆరుగురు మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి కిందకు దూకడంతో చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. 21 మంది అగ్నిమాపకదళ సిబ్బందితోపాటు, వైమానిక, నౌకా దళాలు కూడా ఐదు హెలికాప్టర్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశాయి. కాగా, బంగ్లాదేశ్లో 10 ఏళ్ల కాలంలో 16 వేల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయని 1590 మంది మృతి చెందారని సుప్రీంకోర్టు న్యాయవాది సయిద్ రిజ్వానా హుస్సేన్ వెల్లడించారు. -
ఢాకాలో అగ్నిప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఓ శ్రీలంక జాతీయుడు సహా 19 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. బనానీ ప్రాంతంలో ఉన్న 22 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవంతిలో వస్త్ర దుకాణాలు, ఇంటర్నెట్ సేవలందించే ఆఫీస్లు ఉన్నాయి. 8వ అంతస్తులో మొదలైన మంటలు పైకి ఎగబాకి 11వ అంతస్తు వరకు చేరి, పక్కనున్న మరో రెండు భవనాలకూ వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి కారణాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. శ్రీలంకకు చెందిన నిరాస్ చంద్ర అనే వ్యక్తి సహా మొత్తం ఆరుగురు మంటల నుంచి తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి కిందకు దూకడంతో చనిపోయారని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. 21 మంది అగ్నిమాపకదళ సిబ్బందితోపాటు, వైమానిక, నౌకా దళాలు కూడా ఐదు హెలికాప్టర్లతో నీటిని చల్లి మంటలను ఆర్పివేశాయి. -
70 ప్రాణాలు బుగ్గిపాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవంతి కింది అంతస్తులో నిల్వ ఉంచిన రసాయనాలకు మంటలు అంటుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు భవనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 70 మంది సజీవదహనం కాగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓల్డ్ ఢాకాలోని చాక్బజార్లో ఉన్న నాలుగంతస్తుల ‘హాజీ వహెద్ భవంతి’లో బుధవారం రాత్రి 10.40 గంటలకు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ సందర్భంగా భవంతిలో నిల్వ ఉంచిన రసాయనాలు, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్కూ ఈ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. పక్కనే ఉన్న మిగతా భవంతులకు అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. 200 మంది అగ్నిమాపక సిబ్బంది దాదాపు 14 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందనీ, మరో 25 మంది స్థానికుల జాడ తెలియరావడం లేదని అధికారులు అన్నారు. నివాసాల్లోనే రసాయనాల నిల్వ ఈ విషయమై దక్షిణ ఢాకా మేయర్ సయీద్ ఖొకోన్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం ప్రారంభమైన భవంతి కింది అంతస్తును రసాయనాలు నిల్వచేసే గోదాముగా మార్చారని తెలిపారు. ఇదే భవనంలోని పైఅంతస్తుల్లో ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. ప్రమాదస్థలికి సమీపంలో ఓ వివాహ వేడుక జరగడం, రెస్టారెంట్లలో జనసందోహం ఉండటంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయనీ, వీటికి డీఎన్ఏ పరీక్షలు అవసరమవుతాయని వెల్లడించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారన్నారు. రాత్రి కావడంతో ఓ భవంతి ప్రధాన ద్వారానికి తాళం వేశారనీ, దీంతో మంటల నుంచి తప్పించుకోలేక పలువురు స్థానికులు చనిపోయారని పేర్కొన్నారు. లక్ష టాకాల పరిహారం ఈ ప్రమాదంపై బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు లక్ష టాకాలు(రూ.84,576), తీవ్రంగా గాయపడ్డవారికి 50,000 టాకాలు (రూ.42,288) పరిహారంగా అందిస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఢాకా అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు బంగ్లాదేశ్ హోం, పరిశ్రమల శాఖలు వేర్వేరుగా విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి. -
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..
-
ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి
ఢాకా : బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 70 మంది సజీవ దహనం కాగా... మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు... ఢాకాలోని చాక్బజార్లోని ఓ అపార్టుమెంటులో గురువారం గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే అదే అపార్టుమెంటులో ఓ కెమికల్ వేర్హౌజ్ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. కాగా ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించారని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఢాకాలో ఇలాంటి ఘెర అగ్ని ప్రమాదం సంభవించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సుమారు 120 మంది మృతి చెందారు. -
భర్త ప్రవర్తనతో విసిగిపోయి..
ఢాకా : పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నానే ఆవేదన ఓ వైపు.. ఎంత ప్రయత్నించినా భర్త ప్రవర్తనలో మార్పు రావడంలేదనే ఆవేశం మరోవైపు.. ఈ రెండు భావనల మధ్య నలిగిపోయిన ఓ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడుస్తున్న రెండు నెలల పసికందు నోట్లో ఉప్పు పోసి బిడ్డ చావుకు కారణమైంది. ఈ విషాదకర ఘటన బంగ్లాదేశ్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మహ్మద్ బచ్చు, సాతీలు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మహ్మద్ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల పాప, రెండు నెలల బాబు సంతానం. కాగా గత కొన్ని రోజులుగా మహ్మద్ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించడంతో ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం.... తాను దాచుకున్న డబ్బులతో కొడుకు కోసం పాల ప్యాకెట్ తీసుకురమ్మని సాతీ భర్తతో చెప్పింది. కానీ మహ్మద్ ఆ డబ్బును తన సొంత ఖర్చులకు వాడుకుని వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చర్యతో విసిగెత్తి పోయిన సాతీ.. కొడుకు గుక్క పట్టి ఏడుస్తుండటంతో సహించలేకపోయింది. పేదరికంలో బతికే కంటే చావడమే నయమంటూ ఆవేశంలో చిన్నారి నోట్లో ఉప్పు పోసింది. ‘ఇదే నీకు ఆహారం’ అంటూ పిచ్చిదానిలా ప్రవర్తించింది. కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన సాతీ.. కొడుకును తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తన భార్య కావాలనే కొడుకును పొట్టనబెట్టుందని మహ్మద్ ఫిర్యాదు చేయడంతో సాతీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆ విద్యార్థుల ఉద్యమం ‘ఫేస్బుక్’ పుణ్యమా!
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్లో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా ప్రజ్వరిల్లిన విద్యార్థి ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంగా మారి దేశంలోని ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తుండడంతో బెంబేలెత్తిన ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అన్యాయంగా అణచివేత చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీలతో విన్యాసం చేస్తూ భాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగిస్తూ, రబ్బర్ బుల్లెట్లను పేలుస్తూ వీర విహారం చేయడం మొదలు పెట్టారు. మరోపక్క మొబైల్ నెట్ సర్వీసులను స్తంభింప చేసిన అధికార యంత్రాంగం ‘ఫేస్బుక్’ను ఆడిపోసుకుంటోంది. విద్యార్థులను ఫేస్బుక్ చెడకొడుతుందని ప్రధాని స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పాలకపక్షానికి చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగి విద్యార్థులపై దాడులు చేస్తూ ఉడతా భక్తిగా ప్రభుత్వానికి తాము ఉన్నామని చాటుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చేతగాని దద్దమ్మల్లా తాము ఎలా కూర్చుంటామంటూ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ సంకీర్ణ కూటమి కార్యకర్తలు కూడా విద్యార్థుల గెటప్లో రంగంలోకి దిగి ప్రతిదాడులకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలోని పలు నగరాలు, ముఖ్యంగా ఢాకా నగరం రాజకీయ రణ రంగంగా మారిపోయింది. ఫేస్బుక్ కారణంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చిందన్న అసహనంతోనో, మరే కారణమోగానీ ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాక్ట్’లోని అత్యంత కఠినమైన 57వ సెక్షన్ కింద ఆందోళనాకారులపై బంగ్లా పోలీసులు దేశ ద్రోహం కేసులను బనాయిస్తున్నారు. ఈ సెక్షన్ కింద విద్యార్థుల ఉద్యమానికి ప్రాచుర్యం కల్పించిన జర్నలిస్టులను, మద్దతిచ్చిన సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో హైలెట్ చేసిన సామాజిక ఔత్సాహిక జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ సెక్షన్ కింద విద్యార్థులు కూడా అరెస్ట్ అయితే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గ్రహించిన సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పిలుపు మేరకు విద్యార్థులు తమ ఉద్యమాన్ని విరమించి ఆగస్టు తొమ్మిదవ తేదీ నుంచి పాఠశాలలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వారి పేరుతో రోడ్డెక్కిన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య రణరంగం కొనసాగుతోంది. అరెస్టయిన వారిలో అంతర్జాతీయంగా పలు పురస్కారాలు అందుకున్న ప్రముఖ బంగ్లాదేశ్ ఫొటోగ్రాఫర్, సామాజిక కార్యకర్త షాహిదుల్ ఆలమ్ కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆయన్ని నిర్బంధించి తీసుకెళ్లడం గమనార్హం. ఈ చట్టం ఎంత భయంకరమైనదంటే భారత సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 66 ఏ సెక్షన్ అంత. ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, అస్పష్టంగా ఉండడంతో అమాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్న కారణంగా 2015లో భారత సుప్రీం కోర్టు ఈ సెక్షన్ను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. బంగ్లాలో మాత్రం 2006లో అప్పటి నేషనలిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టం ప్రజల అణచివేతకు బాగా ఉపయోగపడుతోంది. జూలై 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో రోడ్డు భద్రతా సూత్రాలను పాటించాలని ఇటు ప్రజలకు, మరింత పటిష్టం చేయాలని అటు అధికారులకు పిలుపునిస్తూ విద్యార్థుల నుంచి వినూత్న ఉద్యమం పుట్టించుకొచ్చిన విషయం తెల్సిందే. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా విద్యార్థులు ఎంతో సహనంతో ప్రశాంతంగా ఉద్యమం నిర్వహించడం ప్రభుత్వం గుండెల్లో దడ పుట్టించింది. ఉద్యమం కాస్త పౌర సహాయ నిరాకరణ ఉద్యమంగా మారుతుండడంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాలకపక్ష అణచివేతకు దిగింది. అదే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమి కూడా రంగంలోకి దిగింది. దీంతో పౌర ఆందోళన కాస్త రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. 2019, జనవరిలోగా బంగ్లా పార్లమెంట్కు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2001 సంవత్సరం నుంచి వివిధ పౌర అంశాలపై బంగ్లాలో యువకులు, విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, వాటిని అణచివేయడం బంగ్లా ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అణచివేత ధోరణినే అనుసరించింది. ప్రజాస్వామ్యం పేరిట నిరంకుశంగానే వ్యవహరించింది. గత అయిదేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్న భారత ప్రభుత్వం ప్రస్తుత అణచివేత పర్వంపై మౌనమే పాటిస్తోంది. ‘నాయకులనే వారు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ప్రజలెవరికీ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉండకూడదనే. కిరాయి గూండాలతో ప్రజల డిమాండ్లను అణచివేయవచ్చని అనుకుంటారు. అలాంటి చర్యలు ఎప్పటికీ విజయవంతం కావు’ అని బంగ్లాదేశ్ జాతిపిత, అవామీ లీగ్ మూలపురుషుడు షేక్ ముజిబూర్ రహమాన్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆయన వ్యాఖ్యల పట్ల విశ్వాసం ఉంటే ఆయన కూతురైన షేక్ హసీనా ఈ అణచివేత చర్యలకు దిగేవారు కాదమో! చదవండి: విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’ -
విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’
సాక్షి, న్యూఢిల్లీ : ‘చట్టం అందరికి ఒక్కటే’ పేరిట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విద్యార్థులు చిత్రమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఆదివారం నాడు జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించడంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు దీనికి శ్రీకారం చుట్టారు. పోలీసులు సవ్యంగా విధులు నిర్వహించక పోవడం వల్ల, అనుభవం లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు బస్సులు నడుపుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి వారు రోడ్డెక్కారు. వ్యవస్థను తామే మార్చాలని నిర్ణయించుకున్నారు. పోలీసుల విధులను వేరే చేపట్టారు. ఎదురుపడిన ప్రతి వాహనాన్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్లు తనిఖీ చేస్తున్నారు. టూ వీలర్లపై, కార్లలో వచ్చిన పోలీసులను కూడా ఆపుతున్నారు. వారిలో చాలా మంది వద్ద డ్రైవింగ్ లైసెన్స్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ‘మీరే చట్టాన్ని పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు?’ అంటూ వారిని విద్యార్థులు నిలదీస్తున్నారు. వారు క్షమాపణలు చెప్పినప్పటికీ ససేమిరా అంటూ వెనక్కి పంపిస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన ఓ మంత్రి కారునే ఆపి చాలా మర్యాదగా మాట్లాడుతూ వెనక్కి పంపించారు. బాలలు, బాలికలు తేడా లేకుండా స్కూల్ విద్యార్థులంతా యూనిఫారమ్లు ధరించి ఉద్యమంలో పాల్గొనడం ఓ విశేషమయితే. ఎక్కడా దౌర్జన్యానికి పాల్పడకుండా వీలైనంత వరకు మర్యాదగా వారు ఉద్యమాన్ని నడిపించడం విశేషం. షాజహాన్ ఖాన్ అనే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల ఉద్యమానికి ఆజ్యం పోశాయి. గత ఆదివారం నాడే భారత్లోని మహారాష్ట్రలో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారని, అక్కడ ఎలాంటి ఉద్యమం లేదు, ఇక్కడ ఎందుకు ఉద్యమం నడిపిస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో సదరు మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించడం విద్యార్థులకు కోపం తెప్పించింది. విద్యార్థుల ఉద్యమానికి ‘ఫేస్బుక్’ ఎంతో తోడ్పడుతోంది. విద్యార్థులు తాము చేస్తున్న ఉద్యమాన్ని ఎక్కడిక్కడ వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎక్కడికక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి వచ్చారు. పోలీసులు ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎప్పటివో పాత ఫొటోలను కూడా షేర్ చేయడం కాస్త విచారకరం.ఢాకాలో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలోని పలు నగరాలకు విస్తరించింది. విద్యార్థులకు భయపడి పోలీసులు, అధికారులు, ఉద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా బండ్లు తీయడం లేదు. సిగ్నల్ వ్యవస్థను కూడా బుద్ధిగా పాటిస్తున్నారు. తాము కూడా ఉద్యమాన్ని ఇంతకు మించి ముందుకు తీసుకపోలేమని, విద్యార్థులుగా చదువుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందన్నారు. విద్యార్థుల్లో ఉద్యమం పట్ల ఇంత స్ఫూర్తి రావడానికి మరో కారణం ఉంది. గత ఏప్రిల్ నెలల్లోనే కోటా అంటే రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి విజయం సాధించారు. భారత్లో లాగా అక్కడ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఉద్యమానికి దిగొచ్చిన బంగ్లా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులే కాకుండా బంగ్లాదేశ్ యువత కూడా ఉద్యమాల్లో ముందే ఉంటుంది. 1971 విముక్తి యుద్ధానికి ద్రోహం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలని, దేశంలోనే అతిపెద్ద మత పార్టీ అయిన ‘జమాత్–ఏ–ఇస్లామ్’ పార్టీని నిషేధించాలంటూ ఉద్యమాలు నడిపి యువత విజయం సాధించింది. -
విద్యార్థుల ఉద్యమానికి వణికిన ‘ఢాకా’
-
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
-
విద్యార్థుల ఆగ్రహ జ్వాల.. పోలీసులు షాక్..
ఢాకా, బంగ్లాదేశ్ : ఒక్క ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కుదిపేసింది. ఒక్కచోట ఏకమైన వేలాది మంది విద్యార్థులు శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు నేర్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత నెల 30న ఢాకా నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనతో ఢాకాలోని విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నెల 2వ తేదీన(గురువారం) వేలాదిగా ఏకమై శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఉంచి, వాహనాల పేపర్లను తనిఖీ చేస్తూ, ప్రభుత్వ అధికారులు విధుల నిర్వహణ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. చట్టం అందరికీ వర్తిస్తుంది.. ఢాకాలోని ఓ వీధిలో బైక్పై వస్తున్న ట్రాఫిక్ పోలీసు బైక్ను పలువురు విద్యార్థులు అడ్డగించారు. అనంతరం అతన్ని బైక్ పేపర్స్, లైసెన్స్ చూపించాలని కోరారు. సదరు పోలీసు నీళ్లునమలడంతో చట్టం అందరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తాను పేపర్లు తీసుకురాలేదని, దయచేసి క్షమించాలని ఆయన విద్యార్థులను కోరారు. మరో సంఘటనలో పోలీసు వ్యాన్ను అడ్డగించిన ఓ విద్యార్థి బృందం వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేసింది. రాంగ్ రూట్లో వస్తున్న ఓ మంత్రిని సైతం విద్యార్థులు అడ్డగించారు. పోలీసులకు లంచాలు ఇచ్చి, నాయకులు ఎలా పబ్బం గడుపుకుంటున్నారన్న విషయంపై విద్యార్థులు మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. చట్టం అందరికీ సమానమే అన్న సంగతి గుర్తుంచుకోండంటూ మంత్రికి విద్యార్థులు హితవుపలికారు. ఫేస్బుక్లో వైరల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్బుక్లో వైరల్గా మారాయి. అయితే, దురదృష్టవశాత్తు ఈ ఘటనతో సంబంధం లేని ఫొటోలు(నకిలీవి) కూడా ఎక్కువ షేర్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్లో ‘కోటా సంస్కరణలు’కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 1971లో స్వతంత్రం అనంతరం దేశం కోసం నిలబడిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటాను ప్రకటించింది. 47 ఏళ్లుగా కోటా వ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు రోడ్లెక్కారు. దీంతో దిగొచ్చిన హసీనా సర్కారు కోటాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!
సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్ఫోన్లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్ అహ్మద్ తీశారు. ‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్ అహ్మద్ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్ అహ్మద్ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్సైట్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్ అహ్మద్కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్–అమెరికన్ హేతువాద బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్ అహ్మద్ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు. -
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్..
ఢాకా : ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ వీసా సెంటర్ను బంగ్లాదేశ్ ఢాకాలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన రాజ్నాథ్ సింగ్ ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్లో దాదాపు 18, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్తో పాటు బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసదుజామాన్ ఖాన్ కమల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ‘అన్ని ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ వల్ల, వీసా కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గునుంద’ని తెలిపారు. ఈ విషయం గురించి ఇండియన్ హై కమిషనర్ హర్ష వర్ధన్ శ్రింగ్లా ‘జమునా పార్క్లో ఏర్పాటు చేసిన ఈ వీసా సెంటర్ ప్రంపంచలోకెల్లా అతిపెద్ద భారతీయ వీసా సెంటర్. ఇప్పటికే బంగ్లాదేశ్లో 12 భారతీయ వీసా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో మోతీఝీల్, ఉత్తర, ఢాకా, గుల్షన్లో ఉన్ననాలుగు వీసా సెంటర్లను ఆగస్టు 31 నాటికి ఇక్కడికే మారుస్తాం అని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు భారత్కు వస్తూంటారు. గతేడాది భారత ప్రభుత్వం 14 లక్షల మంది బంగ్లాదేశీయులకు వీసాలు జారీ చేసింది. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
బైక్పై వస్తున్న ఉగ్రవాది కాల్చివేత
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ అనుమానిత ఉగ్రవాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. నగరంలోని కిల్గావ్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్(ఆర్ఏబీ) యూనిట్ వద్దకు శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై దూసుకొచ్చాడు. చెక్పోస్ట్ వద్ద సిబ్బంది ఆదేశాలను లెక్కచేయకుండా దూసుకొచ్చిన అతడిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఉన్నటువంటి బ్యాగులో పేలుడు పదార్ధాలు గుర్తించామని ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్(డీఎమ్పీ) అధికారులు వెల్లడించారు. బాంబు డిస్పోజల్ యూనిట్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఢాకాలోని ఓ ఆర్ఏబీ స్థావరం వద్ద ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో భద్రతను కట్టదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
ల్యాండింగ్లో రన్వేను ఢీకొన్న విమానం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా విమానాశ్రయంలో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తోకభాగం రన్వేను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఉన్న 8 సిబ్బందితో సహా మొత్తం 168 మంది క్షేమంగా బయటపడ్డారు. కాగా విమానం దెబ్బతింది. ఈ నెల 22న ఈ ఘటన జరిగింది. జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు ఈ విమాన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అలాగే బోయింగ్ కంపెనీకి చెందిన ఓ బృందం కూడా ఢాకాకు వెళ్తుందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ పౌరవిమాయన సంస్థ అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తారని భావిస్తున్నట్టు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయరాదని వారు నిర్ణయిస్తే ఏఏఐబీ విచారణ చేపట్టవచ్చని తెలిపారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. విమాన ప్రమాదానికి బాధ్యులుగా ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది. -
'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'
ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకా కేఫ్ మారణ హోమానికి కారణమైన కీలక సూత్రదారి లొంగిపోయేందుకు నిరాకరించడమే కాకుండా దాడులకు దిగడం వల్లే ప్రతిదాడులు చేసి హతమార్చామని ఢాకా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్పై గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి ఒక భారతీయురాలు, 16మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. దీని సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)గా బంగ్లా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇతడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పటి నుంచి బలగాలు అతడికోసం గాలిస్తున్నాయి. ఢాకా శివార్లలోని నారాయణ్గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను కార్నర్ చేసినప్పటికీ వారు లొగిపోకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు గంటపాటు జరిగిన కాల్పుల్లో ఎట్టకేలకు తమీమ్ చనిపోయాడు. -
ఢాకా దాడి సూత్రధారి హతం
మరో ఇద్దరు ఉగ్రవాదులనుమట్టుబెట్టిన బంగ్లా పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్పై గత నెలలో జరిగిన ఉగ్ర దాడి సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)ని బంగ్లా భద్రతా బలగాలు శనివారం హతమార్చాయి. అతడితో పాటు ఇద్దరు అనుచరులు చనిపోయారు. జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తమీమ్. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. భద్రతా బలగాల అదుపులో ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన ఓ ఉగ్రవాది ఢాకా శివార్లలోని నారాయణ్గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం ఇవ్వడంతో ఆపరేషన్ చేపట్టినట్టు కౌంటర్ టైజమ్ యూనిట్ చీఫ్ మోనీరుల్ ఇస్లాం చెప్పారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో లోపలి నుంచి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురూ చనిపోయారు. ఈ ఆపరేషన్ సుమారు గంట పాటు సాగిందని వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి కొన్ని గ్రెనేడ్లు, ఓ పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, తమీమ్కు సంబంధించిన సమాచారం అందించిన వారికి బంగ్లా పోలీసులు 20లక్షల బంగ్లా టాకాల రివార్డును ప్రకటించారు. -
రంజాన్ మాసం.. రక్తసిక్తం
ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం. ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో! -
'ప్రాణాలతో రానేమో.. అందరినీ చంపేస్తున్నారు'
ఆగ్రా/ఫిరోజాబాద్: ఢాకాలోని రెస్టారెంటుపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలుకోల్పోయిన భారతీయ యువతి తరుషి జైన్(19) ఎంతటి భయానక పరిస్థితిని ఎదుర్కుందో ఆఖరి ఘడియల్లో తన తండ్రికి వివరించింది. తన ఇద్దరు స్నేహితులతోపాటు రెస్టారెంటులోని వాష్ రూమ్ లో దాక్కున్న ఆమె తండ్రికి ఫోన్ చేసి ఉగ్రవాదులు ఇక్కడ రెస్టారెంటులోకి చొరబడ్డారు. నాకు చాలా భయంగా ఉంది. నేను ప్రాణాలతో భయటకు వస్తానో లేదో కచ్చితంగా మాత్రం చెప్పలేను. ఇక్కడ అందరినీ వాళ్లు చంపేస్తున్నారు. నేను నా స్నేహితులతో కలిసి టాయిలెట్ లో దాచుకున్నాను. మేము కూడా ఒకరి తర్వాత ఒకరం హత్యకు గురవుతామనిపిస్తుంది' అని ఆమె తండ్రి సంజీవ్ జైన్ మీడియాతో చెప్పారు. అదే ఆమె నుంచి చివరి మాటలని వివరించాడు. తన కూతురు నుంచి ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి తెల్లవార్లు గుర్షాన్ కేఫ్ వద్ద ఎంతో కంగారుగా ఎదురుచూశాడు. తెల్లవారు జామున ఆమె ఫోన్ డెడ్ అయినా బలగాలు సైనిక చర్యలు జరుపుతున్నారని, బంధీలకు విముక్తి లభిస్తుందని చెప్తుండగా ఆశగా ఎదురుచూశాడు. 13మంది బందీలకు విముక్తి అని చెప్పాక అందులో తమ కూతురు ఉండకపోతుందా అని భావించాడు. కానీ ఉగ్రవాదులు కర్కశంగా గొంతు కోసిన 20మందిలో తమ కూతురు కూడా ఉందని తెలిసి నిశ్ఛేష్టుడయ్యాడు. కాగా, తమ సోదరిని ఒక హిందువుగా భావించి దారుణంగా చేసిన ఆ ప్రాంతంలో మేం అంత్యక్రియలు నిర్వహించబోమని, ఇండియాకు తీసుకొచ్చుకుంటామని ఆమె సోదరుడు చెప్పాడు. -
ఇది భారత్కు హెచ్చరిక
* భారత్-బంగ్లా సరిహద్దులో భద్రత అంతంతే! * అక్రమ చొరబాటుదారులకు రాజకీయ అండ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం నాటి ఉగ్రవాద ఘటన.. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత్కు ఘాటైన హెచ్చరిక లాంటిదే. బంగ్లా సరిహద్దు ద్వారా భారత్లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల కట్టడిపై భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో సరైన భద్రతలేని సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇటీవల ఇక్కడ భారత్ కాస్త నిఘా పెంచినా బంగ్లా నుంచి చొరబాట్లు సాగుతూనే ఉన్నాయి. భారత-బంగ్లా సరిహద్దు వెంబడే ఎక్కువగా ఉగ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదరికంతోపాటు వివిధ కారణాలతో భారత్లోకి వస్తున్న ప్రజలతో ఉగ్రవాదులూ కలిసిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 1971 నుంచి 10 లక్షలకు పైగా బంగ్లాదేశీయులు భారత్లోకి ప్రవేశించారు. దీని ప్రభావం ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఆయా రాష్ట్రాల్లో స్థానికుల ఆందోళనకు ఇదే ప్రధాన కారణం. రాజధాని ఢిల్లీతోసహా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులతో వెలసిన కాలనీలున్నాయి. ఇలా వలస వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్లోని బుర్ద్వాన్లో పేలుళ్లకు పాల్పడటం తెలిసిందే. బంగ్లాలో శిక్షణ పొంది భారత్లో ప్రవేశించి భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారు. అక్రమ వలసలకు, వాటికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలకు అడ్డుకట్ట వేయకపోతే భారత్లో భారీ విధ్వంసం తప్పద’ని అంతర్జాతీయ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు కూడా బంగ్లాలో పేదరికాన్ని ఆసరా చేసుకుని వారిలో విషబీజాలు నాటి భారత్పైకి ఉసిగొల్పుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఆగ్నేయాషియా దేశాల్లో నిఘా పెరగటంతో అక్కడి ఉగ్రవాద సంస్థలూ బంగ్లాను స్థావరంగా చేసుకుంటున్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. -
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది.