దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్‌ | Bangladesh objects to CM Mamata's shelter for refugees comments | Sakshi
Sakshi News home page

దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్‌

Published Wed, Jul 24 2024 7:12 AM | Last Updated on Wed, Jul 24 2024 9:06 AM

Bangladesh objects to CM Mamata's shelter for refugees comments

ఢాకా: తమ దేశ ప్రజలకు  ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.

చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్‌ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’

‘‘పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్‌ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత  ప్రభుత్వానికి  ఒక అధికారిక నోట్‌ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.

నిస్సహాయులైన బంగ్లాదేశ్‌ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement