Foreign Affairs
-
11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
భారదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశంగా ఎంతో కృషి చేస్తున్నారు. గడచిన దశాబ్ధ కాలంలో ప్రధాని మోదీ పలు దేశాలతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. ఈ నేపద్యంలో భారత్ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 10, 2025) ఫ్రాన్స్లో మూడు రోజుల పర్యటనకు బయల్దేరివెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు మోదీ. #WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves for France to co-chair the AI Action Summit. From France, PM Modi will proceed on a two-day visit to the United States at the invitation of President Donald Trump. pic.twitter.com/oxElBtrIDY— ANI (@ANI) February 10, 2025 అయితే గడచిన 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 86 విదేశీ పర్యటనలు జరపడం విశేషం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల జాబితాభూటాన్ (జూన్ 15, 2014 నుండి జూన్ 16, 2014 వరకు)బ్రెజిల్( జూలై 13, 2014 - జూలై 17, 2014)నేపాల్ (ఆగస్టు 03, 2014 - ఆగస్టు 04, 2014)జపాన్ (ఆగస్టు 30, 2014 - సెప్టెంబర్ 03, 2014)అమెరికా(26, 2014 - సెప్టెంబర్ 30, 2014)మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ (నవంబర్ 11, 2014 - నవంబర్ 19, 2014)నేపాల్ (నవంబర్ 25, 2014 - నవంబర్ 27, 2014)సీషెల్స్, మారిషస్, శ్రీలంక (మార్చి 10, 2015 - మార్చి 14, 2015)సింగపూర్ (మార్చి 29, 2015 - మార్చి 29, 2015)ఫ్రాన్స్, జర్మనీ, కెనడా (ఏప్రిల్ 10, 2015 - ఏప్రిల్ 18, 2015)చైనా, మంగోలియా, దక్షిణ కొరియా (మే 14, 2015 - మే 19, 2015)బంగ్లాదేశ్ (జూన్ 06, 2015 - జూన్ 07, 2015)రష్యా(జూలై 06, 2015 - జూలై 13, 2015)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ఆగస్టు 16, 2015 - ఆగస్టు 17, 2015)ఐర్లాండ్ , అమెరికా ( సెప్టెంబర్ 23, 2015 - సెప్టెంబర్ 29, 2015)యునైటెడ్ కింగ్డమ్, టర్కీ(నవంబర్ 12, 2015 - నవంబర్ 16, 2015)మలేషియా, సింగపూర్(నవంబర్ 21, 2015 - నవంబర్ 24, 2015)ఫ్రాన్స్(నవంబర్ 29, 2015 - నవంబర్ 30, 2015)రష్యా(డిసెంబర్ 23, 2015 - డిసెంబర్ 24, 2015)బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా(మార్చి 30, 2016 - ఏప్రిల్ 03, 2016)ఇరాన్ (మే 22, 2016 - మే 23, 2016)ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో (జూన్ 04, 2016 - జూన్ 08, 2016)ఉజ్బెకిస్తాన్ (జూన్ 23, 2016 - జూన్ 24, 2016)మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా(జూలై 07, 2016 - జూలై 11, 2016)వియత్నాం, చైనా(సెప్టెంబర్ 02, 2016 - సెప్టెంబర్ 05, 2016)లావోస్(సెప్టెంబర్ 07, 2016 - సెప్టెంబర్ 08, 2016)జపాన్(నవంబర్ 11, 2016 - నవంబర్ 12, 2016)శ్రీలంక (మే 11, 2017 - మే 12, 2017)జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్(మే 29, 2017 - జూన్ 03, 2017)కజకిస్తాన్(జూన్ 08, 2017 - జూన్ 09, 2017)పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్(జూన్ 24, 2017 - జూన్ 27, 2017)ఇజ్రాయెల్, జర్మనీ(జూలై 04, 2017 - జూలై 08, 2017)చైనా, మయన్మార్(సెప్టెంబర్ 03, 2017 - సెప్టెంబర్ 07, 2017)ఫిలిప్పీన్స్(నవంబర్ 12, 2017 - నవంబర్ 14, 2017)దావోస్ (స్విట్జర్లాండ్)(జనవరి 22, 2018 - జనవరి 23, 2018)జోర్డాన్, పాలస్తీనా, యుఎఈ, ఒమన్(ఫిబ్రవరి 09, 2018 - ఫిబ్రవరి 12, 2018)స్వీడన్, యూకె, జర్మనీ(ఏప్రిల్ 16, 2018 - ఏప్రిల్ 20, 2018)చైనా (ఏప్రిల్ 26, 2018 - ఏప్రిల్ 28, 2018)నేపాల్(మే 11, 2018 - మే 12, 2018)రష్యా (మే 21, 2018 - మే 22, 2018)ఇండోనేషియా, మలేషియా, సింగపూర్(మే 29, 2018 - జూన్ 02, 2018)చైనా(జూన్ 09, 2018 - జూన్ 10, 2018)రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా(జూలై 23, 2018 - జూలై 28, 2018)నేపాల్(ఆగస్టు 30, 2018 - ఆగస్టు 31, 2018)జపాన్(అక్టోబర్ 27, 2018 - అక్టోబర్ 30, 2018)సింగపూర్(నవంబర్ 13, 2018 - నవంబర్ 15, 2018)మాల్దీవులు(నవంబర్ 17, 2018 - నవంబర్ 17, 2018)అర్జెంటీనా(నవంబర్ 28, 2018 - డిసెంబర్ 03, 2018)దక్షిణ కొరియా(ఫిబ్రవరి 21, 2019 - ఫిబ్రవరి 22, 2019)మాల్దీవులు, శ్రీలంక (జూన్ 08, 2019 - జూన్ 09, 2019)కిర్గిజ్స్తాన్(జూన్ 13, 2019 - జూన్ 14, 2019)జపాన్ పర్యటన (జూన్ 27, 2019 - జూన్ 29, 2019)భూటాన్(ఆగస్టు 17, 2019 - ఆగస్టు 18, 2019)ఫ్రాన్స్, యూఎఈ, బహ్రెయిన్(ఆగస్టు 22, 2019 - ఆగస్టు 27, 2019)రష్యా (సెప్టెంబర్ 04, 2019 - సెప్టెంబర్ 05, 2019)అమెరికా(సెప్టెంబర్ 21, 2019 - సెప్టెంబర్ 28, 2019)సౌదీ అరేబియా(అక్టోబర్ 28, 2019 - అక్టోబర్ 29, 2019)థాయిలాండ్(నవంబర్ 02, 2019 - నవంబర్ 04, 2019)బ్రెజిల్(నవంబర్ 13, 2019 - నవంబర్ 15, 2019)బంగ్లాదేశ్(మార్చి 26, 2021 - మార్చి 27, 2021)అమెరికా(సెప్టెంబర్ 22, 2021 - సెప్టెంబర్ 25, 2021)ఇటలీ, స్కాట్లాండ్(అక్టోబర్ 29, 2021 - నవంబర్ 02, 2021)జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ (మే 02, 2022 - మే 05, 2022)నేపాల్ (మే 16, 2022 - మే 16, 2022)జపాన్ (మే 23, 2022 - మే 24, 2022)జర్మనీ, యూఏఈ(జూన్ 26, 2022 - జూన్ 28, 2022)ఉజ్బెకిస్తాన్( సెప్టెంబర్ 15, 2022 - సెప్టెంబర్ 16, 2022)జపాన్(సెప్టెంబర్ 27, 2022 - సెప్టెంబర్ 27, 2022)ఇండోనేషియా(నవంబర్ 14, 2022 - నవంబర్ 16, 2022)జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా(మే 19, 2023 - మే 25, 2023)అమెరికా, ఈజిప్టు(జూన్ 20, 2023 - జూన్ 25, 2023)ఫ్రాన్స్, యూఏఈ(జూలై 13, 2023 - జూలై 15, 2023)దక్షిణాఫ్రికా, గ్రీస్(ఆగస్టు 22, 2023 - ఆగస్టు 26, 2023)ఇండోనేషియా (సెప్టెంబర్ 06, 2023 - సెప్టెంబర్ 07, 2023)దుబాయ్ పర్యటన (నవంబర్ 30, 2023 - డిసెంబర్ 01, 2023)యూఏఈ, ఖతార్(ఫిబ్రవరి 13, 2024 - ఫిబ్రవరి 15, 2024)భూటాన్(మార్చి 22, 2024 - మార్చి 23, 2024)ఇటలీ(జూన్ 13, 2024 - జూన్ 14, 2024)రష్యా, ఆస్ట్రియా(జూలై 08, 2024 - జూలై 10, 2024)పోలాండ్, ఉక్రెయిన్(ఆగస్టు 21, 2024 - ఆగస్టు 23, 2024)బ్రూనై,సింగపూర్(సెప్టెంబర్ 03, 2024 - సెప్టెంబర్ 05, 2024)అమెరికా(సెప్టెంబర్ 21, 2024 - సెప్టెంబర్ 24, 2024)లావోస్(అక్టోబర్ 10, 2024 - అక్టోబర్ 11, 2024)రష్యా(అక్టోబర్ 22, 2024 - అక్టోబర్ 23, 2024)నైజీరియా, బ్రెజిల్, గయానా(నవంబర్ 16, 2024 - నవంబర్ 22, 2024)ప్రధాని మోదీ కువైట్ పర్యటన (డిసెంబర్ 21, 2024 - డిసెంబర్ 22, 2024)ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం -
సరిహద్దుల్లో ఫెన్సింగ్ నిర్మాణం.. భారత హై కమిషనర్కు బంగ్లా సమన్లు
ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్ఎస్ తెలిపింది. ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్ ఫెన్సింగ్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని చెప్పారు. -
స్వదేశానికి గుడ్ బై
సాక్షి, అమరావతి: గడచిన రెండు దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కరోనా అనంతరం భారత పౌరసత్వం వదులుకుని స్వదేశానికి గుడ్బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2011–2023 మధ్య పదమూడేళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్నారైలు భారత పౌరసత్వాన్ని వదులుకుని.. విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్నారైలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు పేర్కొంది.అమెరికాలో రెండో స్థానం వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలు ఉండగా.. 65,960 మందితో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు, కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడటానికి ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గుచూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. -
ఫోన్ట్యాపింగ్ కేసులో అనూహ్య మలుపు.. ప్రభాకర్రావు మరో పిటిషన్
సాక్షి,హైదరాబాద్:ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పాస్పోర్టు రద్దు చేయడాన్ని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు విదేశాంగ శాఖ వద్ద సవాల్ చేశారు. విదేశాంగశాఖ ద్వారానే ప్రభాకర్ రావును రప్పించే పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్టును పోలీసులు రద్దు చేయించారు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్రావుకు రెడ్కార్నర్ నోటీసు ఇప్పించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్రావు పిటిషన్ పెట్టుకున్నారు. కాగా,ఇదే కేసులోమరో నిందితుడు శ్రవణ్రావు చికాగోలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ర్ను కెనడా అనుమానితునిగా పేర్కొటంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణులను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు. చదవండి: కెనడాలో భారతీయుల హవా.. విద్యా, ఉద్యోగాల్లో ముందంజ‘‘మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ , బ్రిటన్లో రష్యా విదేవీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? మీడియా అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘ మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్లో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం’’ అని అన్నారు.నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.చదవండి: దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
దీదీ వ్యాఖ్యల్ని ఖండించిన బంగ్లాదేశ్
ఢాకా: తమ దేశ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ స్పందించింది. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారా శాఖ మంగళవారం భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపించింది.చదవండి: సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’’ అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.చదవండి: బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత -
భారత్కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?
ఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో మూసా జమీర్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది. -
విదేశీ వ్యవహారాల్లో భారత్ విశ్వబంధు
సాక్షి, హైదరాబాద్: విదేశీ వ్యవహారాల్లో భారత్ను విశ్వబంధుగా తీర్చిదిద్దామని.. ప్రపంచమంతా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. మనతో కలసి పనిచేసేందుకు ఎన్నో దేశాలు ఎదురుచూస్తున్నాయని చెప్పారు. మంగళవారమిక్కడ ఓ హోటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో విదేశాంగ విధానంపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జైశంకర్ ‘భారత విదేశాంగ విధానం– సందేహం నుంచి విశ్వాసం వైపు పయనం‘అనే అంశంపై మాట్లాడారు. ‘ఒకప్పుడు సరిహద్దు సమస్యలు అంటే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేవి. వాటికి పరిష్కారం చూపి రక్షణ పరంగా బలమైన దేశంగా నిలిచాం. మోదీ పదేళ్ల పాలనలో భారతే అత్యంత సురక్షిత దేశంగా అంతా భావిస్తున్నారు. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్దార్ వల్లబాయ్ పటేల్ చెప్పినా.. అది మిత్రదేశమేనంటూ నెహ్రూ వినలేదు. నాటి నెహ్రూ తప్పిదంతో కశ్మీర్ సమస్య తలెత్తింది. కొంత భూ భాగం పాక్ అ«దీనంలోకి వెళ్లింది. కశ్మీర్ విషయంలో నాటి నెహ్రూ తప్పిదాలను పదేళ్లలో ప్రధాని మోదీ సరిచేశారు’అని వెల్లడించారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ‘ఈ పదేళ్లలో ప్రపంచంలోనే మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మోదీ గ్యారంటీ దేశంలోనే కాదు.. విదేశీ పాలసీతో ప్రపంచ వ్యాప్తంగా మోదీ గ్యారంటీగా మారింది. మన విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాలతో అత్యంత సఖ్యత ఏర్పడింది. 125 దేశాల్లో ఎంబసీలు నెలకొల్పాం’అని జైశంకర్ వివరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. మే 12న ఆదివారం సెలవు తీసుకుని, 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, భవిష్యత్, అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. 500 ఏళ్ల తర్వాత రాముని జన్మభూమిలో సీతారామ కల్యాణం జరిగిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనా, భారత్ను జైశంకర్ కాపాడారని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కితాబిచ్చారు. -
ప్రధాని మోదీపై వ్యాఖ్యలు సిగ్గుచేటు.. కానీ..
మాలే: ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరుదేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలు సిగ్గుచేటు.. జాత్యాహంకారం అని ఆ దేశ మాజీ డిప్యూటీ స్పీకర్ ఇవా అబ్దుల్లా అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె భారతదేశానికి క్షమాపణలు చెప్పారు. బైకాట్ మాల్దీవులు నిర్ణయాన్ని వదిలివేయాలని భారతీయులను అభ్యర్థించారు. "మా దేశ మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. భారతీయులు న్యాయబద్ధంగా కోపంగా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు దారుణమైనవి. కానీ ఇవి మాల్దీవుల ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించవు. ఈ వ్యాఖ్యలకు భారతదేశ ప్రజలకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా" అని ఆమె అన్నారు. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా స్పందించారు. విదేశీ నాయకులపై ఈ వ్యాఖ్యలు ఆమోదించలేనివని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అధికారిక అభిప్రాయాన్ని ప్రతిబింబించవని చెప్పారు. భారత్తో మాల్దీవులు నిర్మాణాత్మక, సానుకూల సంభాషణను పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి
లండన్: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్ కింగ్డమ్(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ సభ్యుల ఆగడాలు, భారత్కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్ క్లెవర్లీ, టిమ్ బారో దృష్టికి తీసుకెళ్లారు. జైశంకర్ బుధవారం లండన్లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్మ్యాప్–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. -
ఢిల్లీలో భూటాన్ రాజుకు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్లో రాజు వాంగ్చుక్ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
భారత్ వ్యవహారాల్లో కెనడా జోక్యం
న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి. ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే. -
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
యుద్ధం తర్వాత ఇదే తొలిసారి.. భారత్లో పర్యటించనున్న ఉక్రెయిన్ మంత్రి!
ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఆమెకిదే మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం. సోమవారం( ఏప్రిల్ 10) భారత్లో అడుగుపెట్టనున్న జపరోవా... నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఝపరోవా ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం వాణిజ్యం, విద్య, సంస్కృతి, రక్షణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని‘ తెలిపింది. ఈ పర్యటనలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కైవ్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్ల ఓ వార్తాపత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అనేక సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. -
ఉగ్రవాదంపై ‘క్వాడ్’ కార్యాచరణ బృందం
న్యూఢిల్లీ: ఆధునిక యుగంలో కొత్త రూపు సంతరించుకుంటున్న ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని కఠినంగా అణచివేయడానికి చేపట్టాల్సిన చర్యల కోసం ‘వర్కింగ్ గ్రూప్ ఆఫ్ కౌంటర్–టెర్రరిజం’ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ‘క్వాడ్’ దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ‘క్వాడ్’ కూటమిలో భాగమైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఎస్.జైశంకర్, ఆంటోనీ బ్లింకెన్, యోషిమస హయషీ, పెన్నీ వాంగ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రపంచమంతటా ఉగ్రవాద భూతం విస్తరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర మూకల ఆటకట్టించడానికి నాలుగు దేశాల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. చట్టబద్ధ పాలన, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి మద్దతు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. జీ7 కూటమికి జపాన్, జీ20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతోపాటు ఈ ఏడాది ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కో–ఆపరేషన్(ఏపీఈసీ)కి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ‘క్వాడ్’ అజెండా అమలు కోసం సన్నిహితంగా కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అనంతరం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఢిల్లీలో ‘రైజినా డైలాగ్’లో పాల్గొన్నారు. -
సరిహద్దులో శాంతిపైనే చర్చ
న్యూఢిల్లీ: జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దు వెంట బలగాల మొహరింపు, ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి నెలకొల్పడంపైనే చర్చలో ప్రధానంగా దృష్టిపెట్టినట్లు జైశంకర్ గురువారం చెప్పారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సవాళ్లుగా నిలుస్తున్న సమస్యలు భేటీలో చర్చకొచ్చినట్లు ఆయన ఆ తర్వాత ట్వీట్చేశారు. డిసెంబర్లో చైనా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్విన్తో జైశంకర్ భేటీ కావడం ఇదే తొలిసారి. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎజెండాపైనా క్విన్తో మాట్లాడారు. గతంలో చివరిసారిగా నాటి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో బాలీలో జీ20 సదస్సు సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభనను తొలగించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. -
ఏకాభిప్రాయం సాధిద్దాం
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో గురువారం జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు. ‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో మనం కలుసుకున్నాం. మన మధ్య జరిగే చర్చలు భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల ప్రతినిధులుగా ఇక్కడ లేని వారి పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవస్థలు విఫలం ‘గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు..వంటి వాటిని ఎదుర్కొన్న విధానం చూస్తే అంతర్జాతీయ వ్యవస్థలు ఎలా దారుణంగా విఫలమయ్యాయో స్పష్టమవుతోంది. ఈ వైఫల్యం విషాదరకర పరిణామాలను అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా ఎదుర్కొన్నాయనే విషయం మనం అంగీకరించాలి. ఏళ్లపాటు సాధించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తిరోగమించే ప్రమాదం ఉంది’అని ప్రధాని హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు తమ ప్రజానీకానికి ఇంధన, ఆహార భద్రతను అందించే క్రమంలో తీవ్రమైన రుణ భారంతో అవస్థలు పడుతున్నాయన్నారు. ధనిక దేశాల కారణంగా వచ్చిన గ్లోబల్ వార్మింగ్తోనూ ఆయా దేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ వర్గం కూడా తమదే ప్రపంచ నాయకత్వమంటూ చాటుకోలేదని మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, యూకేల విదేశాంగ మంత్రులు వరుసగా ఆంటోనీ బ్లింకెన్, లావ్రోవ్, క్విన్, క్లెవెర్లీతోపాటు ఈయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు భారత్, ఇటలీలు రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. -
పెరిగిన పాస్పోర్టు సేవలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పాస్పోర్టు సేవలు మెరుగయ్యాయి. గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రాలు (ఆర్పీవోలు) ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. దరఖాస్తుల క్లియరెన్స్పై దృష్టిసారించాయి. కరోనా అనంతరం పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు దరఖాస్తులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఉపాధి, ఉన్నతవిద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్ దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ విదేశీ వ్యవహారాలశాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే దరఖాస్తుదారుల చేతికి పాస్పోర్టు లభిస్తోంది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నంలో ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రాలున్నాయి. తత్కాల్, సాధారణ అపాయింట్మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతోపాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో పాస్పోర్టుల జారీప్రక్రియ కూడా వేగవంతం అయింది. మరోవైపు పోలీసులు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేస్తూ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా పాస్పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది. వారం రోజుల్లో చేతికి.. కరోనా తర్వాత భారత్లో విదేశీ ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్పోర్టు దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్పోర్టు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. అన్నిరకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి. వాటిలో ఒక్క చిన్నతప్పు దొర్లినా.. కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్నీ ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజనిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల సమయం పట్టేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాలశాఖ జారీచేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలుంటే చాలు వారం రోజుల్లో పాస్పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్కార్డు (ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీకార్డు, పాన్కార్డు ఉండాలి. వీటితోపాటు స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామా వివరాలున్న లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు. వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్పోర్టు జారీచేసేస్తున్నారు. పోస్టాఫీసుల్లో సేవలు తపాలా కార్యాలయాల్లోను పాస్పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ ఆర్పీవో పరిధిలో రెండు పాస్పోర్టు సేవాకేంద్రాలతో పాటు 13 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవాకేంద్రాలను (పీవోపీఎస్కేలను) అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం ఆర్పీవో పరిధిలో రెండు పాస్పోర్టు సేవాకేంద్రాలతో పాటు ఏడు పీవోపీఎస్కేలున్నాయి. వీటన్నింటి ద్వారా రోజూ 3,020 మంది దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఈ పీవోపీఎస్కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభతరంగా మారింది. పెరుగుతున్న దరఖాస్తులు కోవిడ్ తర్వాత సేవలు మొదలైనప్పుడు ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రాలకు రోజుకు సగటున 250 మంది మాత్రమే దరఖాస్తు దారులు వచ్చేవారు. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, పరిస్థితులు చక్కబడిన తర్వాత స్లాట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. విజయవాడ కార్యాలయంలో రోజుకు 1,860 వరకు అపాయింట్మెంట్స్ ఉండగా, విశాఖ కార్యాలయంలో 1,160 దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. శనివారం కూడా పాస్పోర్టు సేవలందిస్తుండటంతో తత్కాల్, సాధారణ పాస్పోర్టుల కోసం దరఖాస్తులు గణనీయంగా పెరుగుతున్నాయి. పారదర్శకంగా పాస్పోర్టు సేవలు ఏపీలో రెండు ప్రాంతీయ పాస్పోర్టు కేంద్రాల్లో సేవలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కోవిడ్ తర్వాత దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తున్నాం. పాస్పోర్టు కోసం దళారుల్ని ఆశ్రయించవద్దని సూచిస్తున్నాం. పాస్పోర్టు సేవల పనిదినాలు కూడా తగ్గాయి. సాధారణ పాస్పోర్టు దరఖాస్తులకు 15, సాధారణ తత్కాల్ దరఖాస్తులకు ఎనిమిది రోజులకు పనిదినాలు కుదించాం. దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకు ఆలస్యం చేయటం సరికాదు. ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్పోర్టు మంజూరవుతుంది. – విశ్వంజలి గైక్వాడ్, విశాఖ ఆర్పీవో -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
‘డర్టీ బాంబ్’ ఆందోళనల వేళ రష్యాకు జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది. డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్సన్ ఖాళీ!! -
జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుక్రవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో విద్వేష దాడులు, భారతీయులను లక్ష్యంగా చేసుకుని నేరాలు, హింస పెరుగుతోందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఉన్న భారతీయులు, భవిష్యత్తులో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. భారతీయులు లక్ష్యంగా కెనడాలో జరుగుతున్న దాడులపై ఆ దేశంతో చర్చించినట్లు కేంద్రం పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో ఒక్క బాధ్యుడ్ని కూడా శిక్షించలేదని గుర్తుచేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడాలో 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో మూడు శాతం. అయితే ఇటీవల కాలంలో అక్కడ జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. భారతీయులు లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది. చదవండి: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి -
Elizabeth-2: అంత్యక్రియలకు వెళ్లి సెల్ఫీకి పోజులా? అదేమైనా బర్త్డే పార్టీనా?
లండన్: మెక్సీకో విదేశాంగ మంత్రి మార్సెలో ఇబ్రార్డ్ను నేటిజన్లు ఏకిపారేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు వెళ్లిన ఆయన.. భార్యతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడంపై మండిపడ్డారు. దేశం తరఫున ప్రతినిధిగా వెళ్లి రాణి అంత్యక్రియల్లో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారా? అని విమర్శలు గుప్పించారు. 'మీరు భార్యతో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి అదేం బర్త్డే పార్టీ కాదు. మెక్సీకో ప్రతినిధిగా వెళ్లారు. అది గుర్తుపెట్టుకోండి' అని ఓ నెటిజన్ ఇబ్రార్డ్కు చురకలు అంటించాడు. 'ఈయన లండన్ పర్యటనకు వెళ్లిన వింత సందర్శకుడిలా ప్రవర్తించారు. ఇతరులను ఇబ్బందిపెట్టి అందరూ తనవైపు చూడాలనుకుంటున్నారమో?' అని మరో యూజర్ విమర్శించాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం జరిగాయి. 2,000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఇబ్రార్డ్ ఒకరు. అయితే అంత్యక్రియలకు ముందు ఆయన భార్యతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇరకాటంలో పడ్డారు. En el Funeral de Estado de S.M. la Reina Isabel II pic.twitter.com/GUiNPtJrSo — Marcelo Ebrard C. (@m_ebrard) September 19, 2022 చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
‘అత్యంత క్లిష్ట దశలో భారత్-చైనా సంబంధాలు’
బ్యాంకాక్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్ చులలాంగ్కోర్న్ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్లో భారత్ విజన్పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్. ‘సరిహద్దులో డ్రాగన్ చేసిన పనికి ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్. రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్ కావడానికి ప్లాన్ చేసిన గొటబయా రాజపక్స! -
‘లంక రేవు’ను పర్యవేక్షిస్తున్నాం: జైశంకర్
బ్యాంకాక్: శ్రీలంక పోర్టు హంబన్టొటలో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 రావడంతో భారత్ భద్రతకు భంగం వాటిల్లే పరిణామమేదైనా జరుగుతుందేమోనని పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. భారత్ థాయ్లాండ్ జాయింట్ కమిషన్ భేటీ సందర్భంగా జైశంకర్ మాట్లాడారు. మా పొరుగు దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలైననా గమనిస్తూ ఉంటామని చెప్పారు. చైనాకు చెందిన హైటెక్ నౌక యువాన్ వాంగ్ 5 శాంతి, స్నేహ సంబంధాల మిషన్ అని ఆ నౌక కెప్టెన్ జాంగ్ హాంగ్వాంగ్ పేర్కొన్నారు. భారత్ అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతర్ చేస్తూ చైనా హైటెక్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్టొట రేవు పట్టణంలోకి మంగళవారం ఉదయం ప్రవేశించింది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు వెల్లడించారు. ఇంధనం నింపుకోవడానికే ఈ రేపులో ఆగినట్టుగా చైనా బయటకి చెబుతున్నప్పటికీ మన దేశ రక్షణ కార్యకలాపాలపై నిఘా వేయడం కోసమే డ్రాగన్ ఈ నౌకను పంపినట్టుగా అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక -
బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?
FATF kept Pakistan on the grey list: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాకిస్తాన్ని గ్రే లిస్ట్(బ్లాక్ లిస్ట్)లో ఉంచిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా పాక్ త్వరలోనే ఆ గ్రే లిస్ట్ నుంచి బయటపడునుందని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖార్ చెబుతున్నారు. అంతేకాదు ఆ బ్లాక్లిస్ట్ నుంచి బయటపడేందకు పాక్ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ పాక్ని బ్లాక్లిస్ట్లో ఉంచింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్ బయటపడేందకు పలు రకాలుగా కృషి చేసింది. ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ తీవ్రవాదం, మనీలాండరింగ్కు సంబంధించిన ఫైనాన్సింగ్ విషయాల్లో సాధించిన పురోగతిని ధృవీకరించింది. అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను రక్షించడానికి జీ7 దేశాలు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్డాగ్ పాక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం 34 అంశాలను కవర్ చేస్తూ.. రెండు కార్యాచరణ ప్రణాళికలను గణనీయంగా పూర్తి చేసింది. దీపిలె భాగంగా అక్టోబర్లో జరిగే తదుపరి ఎఫ్ఏటీఎఫ్ సమావేశాని కంటే ముందే ఇస్లామాబాద్లో పర్యటించనున్నట్లు ఎఫ్ఏటీఎప్ తెలిపింది. ఆ పర్యటనలో ఇస్లామాబాద్లో ఉగ్రవాదం, మనీలాండరింగ్ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏర్పాటు చేసిన చట్టాలు, తీసుకుంటున్న చర్యలను గురించి ఎఫ్ఏటీఎప్ తనీఖీలు చేయనున్నట్లు పేర్కొంది ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ మాట్లాడుతూ...ఈ జాబితా నుంచి పాక్ కచ్చితంగా తప్పుకుంటుందని విశ్వసిస్తున్నాం. పాక్లో త్వరలో కొత్త సంస్కరణ జరుగుతాయి. ఇది ఒక రకంగా పాక్ ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. గ్రే లిస్ట్ నుంచి నిష్క్రమించడం వల్ల విదేశీ పెట్టుబడులు, పెరుగడమే కాకుండా, ఐఎంఎప్ రుణాలను కూడా పొందగలుగుతుంది. మళ్లీ పాక్ ఇలాంటి గ్రే లిస్ట్లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటాం " అని అన్నారు. (చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్బై!) -
అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్
న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేతలు మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి రావడం విశేషం. అయితే ప్రవక్త వ్యాఖ్యలను ఉద్దేశించి.. ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన ఆసక్తికర ప్రకటనను కాసేపటికే ఇరాన్ డిలీట్ చేసింది. ప్రధాని మోదీతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్ భేటీ అయ్యారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతోనూ ఆయన చర్చలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వ్యతిరేక వాతావరణానికి దారితీసినట్టు ఆయన అజిత్ దోవల్ కు తెలియజేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది. అందుకు బదులుగా భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేసిందని, ఈ అంశంలో ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి ఓ ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు.. నిందితుల పట్ల భారత్ అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాసేపటికే భారత ప్రభుత్వం ఖండించింది. దీంతో ‘ఇతరులకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు’ లైన్ను తొలగించి.. మరో ట్వీట్ చేశారు. ఇక విదేశాంగ మంత్రి వద్ద గానీ అసలు ప్రవక్త వ్యాఖ్యల అంశమే రాలేదని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మరో ట్వీట్ చేశాడు ఇరాన్ విదేశాంగ మంత్రి. Pleased to meet PM Modi, FM Jaishankar & other Indian officials to advance our bilateral strategic dialogue. Tehran & New Delhi agree on the need to respect divine religions & Islamic sanctities & to avoid divisive statements. 🇮🇷🇮🇳 determined to bring relations to new heights. — H.Amirabdollahian امیرعبداللهیان (@Amirabdolahian) June 8, 2022 -
నా తండ్రి ధైర్యాన్ని చూస్తే గర్వంగా ఉంది - ఆనంద్ మహీంద్రా
దాదాపు 75 ఏళ్ల పాటు రహస్య సమచారంగా ఉన్నటువంటి ఓ విషయాన్ని ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. స్వాతంత్రానికి పూర్వం బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని దుయ్యబడుతూ తన తండ్రి రాసిన వివరాలను ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా తెలిపారు. అమెరికాలోని మసాచుసెట్స్కి చెందిన ప్రముఖ పాఠశాల ఫ్లెచర్. ఇటీవల ఈ స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆనంద్ మహీంద్రాకి ఆహ్వానం పలికింది. ఈ సందర్భంగా గతంలో ఆనంద్ మహీంద్రా తండ్రి ఈ పాఠశాలలో చదివినప్పుడు (1945) తన భవిష్యత్తు లక్ష్యాలను వివరిస్తూ స్కూల్ యాజమాన్యానికి రాత పూర్వకంగా తెలిపిన అభిప్రాయాలను ఆనంద్ మహీంద్రాకు అప్పగించింది. ఆ లేఖలో విషయాలను చూసిన ఆనంద్ మహీంద్రా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఫ్లెచర్ స్కూల్ యజమాన్యానికి రాసిన లేఖలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద విదేశాంగ విధానం దాని పర్యవసానంగా భారత్కి జరుగుతున్న నష్టాలను ఆనంద్ మహీంద్రా తండ్రి అందులో సోదాహారంగా వివరించారు. ఇండియాకు ఇప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానం లేదంటూ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా వాస్తవాలను విశ్లేషించారు. భవిష్యత్తులో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రయోజనాలు లక్ష్యంగా స్వతంత్ర ఫారిన్ పాలసీ ఇండియాకి అవసరం అంటూ ఆనంద్ మహీంద్రా తండ్రి స్పష్టం చేశారు. అందువల్లే తాను ఫారిన్ సర్వీస్ను ఎంపిక చేసుకుంటానని తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో తెలిపారు. తన లాంటి మరెందరికో అంతర్జాతీయ వ్యవహారాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ తెలిపారు. స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ రాజ్లో జీవిస్తూ.. అప్పటి తెల్లదొరల దమననీతిని ఎండ గడుతూ తన తండ్రి చూపిన తెగువను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వారితో ఎక్కువగా మాట్లాడుతూ.. వారికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటూ నేటి యువతకు ఆయన సూచించారు. When I was at the @FletcherSchool to deliver the Class Day Address, they very graciously gave me copies of my father’s application to Fletcher in 1945. These documents are mandatorily confidential for 75 years & by a wonderful coincidence, were declassified just last year! (1/2) pic.twitter.com/oOfYfR43ZV — anand mahindra (@anandmahindra) June 4, 2022 చదవండి: హైదరాబాద్లో బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్ మహీంద్రా ఆగ్రహం! -
Sakshi Cartoon: ఆయన అలానే వస్తారట!
ఆయన అలానే వస్తారట! -
వారిని నేరుగా విజయవాడకు తరలించండి
సాక్షి, న్యూఢిల్లీ/మద్దికెర/చీమకుర్తి/చిలమత్తూరు/గన్నవరం: ఉక్రెయిన్ నుంచి స్లోవేకియా చేరుకోనున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్ని నేరుగా విజయవాడకు తరలించాలని కేంద్ర విదేశాంగ శాఖకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్ మంగళవారం లేఖ రాశారు. తెలుగు విద్యార్థులు ఇప్పటివరకు ఢిల్లీ, ముంబైలకు వచ్చి అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు చేరుకుంటున్నారని.. కానీ, అలా కాకుండా.. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులందరినీ ఒకే విమానంలో విజయవాడకు తరలించాలని కోరారు. తద్వారా విద్యార్థులు వారివారి స్వస్థలాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. రైలులో 900 మంది విద్యార్థులు హంగేరీకి తరలింపు ఇక భారత్కు చెందిన మరో 900 మంది విద్యార్థులను ఉక్రెయిన్లోని జపరోజ్జియా నుంచి 1,400 కి.మీ. దూరంలోని హంగేరీ దేశానికి అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన సాయితేజ అనే విద్యార్థి మంగళవారం తన తల్లిదండ్రులు ధనుంజయ, పద్మావతిలకు ఈ సమాచారం ఇచ్చారు. హంగేరీ నుంచి ఢిల్లీ లేదా ముంబై చేరుకునేందుకు అధికారులు విమాన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీఎం కార్యాలయ తక్షణ స్పందన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పుణ్యవతి, శ్రీనివాసులు కుమారుడు కదిరిసాని అరవింద్ గౌడ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోగా.. ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అరవింద్ విషయాన్ని తల్లి పుణ్యవతి సోమవారం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కార్యాలయ అధికారులు వేగంగా స్పందించారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రావడానికి వీలుగా ఏర్పాట్లుచేయించారు. ఫలితంగా అరవింద్ ఇప్పటికే రుమేనియాకు చేరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా సమాచారం అందిందని పుణ్యవతి చెబుతూ సర్కారు స్పందించిన తీరుపై హర్షం వ్యక్తంచేశారు. 17మంది తెలుగు విద్యార్థులు రాక మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి మంగళవారం 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఏపీ వారు కాగా, 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల అధికారులు తెలిపారు. ఆయా విద్యార్థులకు భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు వారు వివరించారు. విజయవాడకు చేరుకున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్లు నత్తల జగన్మోహన్రావు, సరళాదేవి దంపతుల కుమారుడు నత్తల సుధేష్ క్షేమంగా తన ఇంటికి చేరుకున్నారు. అధికారులు సురక్షితంగా ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకు చేర్చినట్లు సుధేష్ తెలిపారు. కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, మరో ఇరువురు విద్యార్థినులు మంగళవారం రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీకి వచ్చిన తూర్పు గో దావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన ఎ.అంజనీకుమారి, ప్రకా శం జిల్లా చీరాలకు చెందిన వై.అఖిల వేర్వేరు విమానాల్లో ఇక్కడికి చేరుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వీరిరువురినీ ప్రభుత్వ వాహనంలో అధికారులు ఇంటికి పంపించారు. అఖిల, అంజనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో ఆహారం, నీరు దొరకని పరిస్ధితి నెలకొందని.. అతికష్టం మీద నడుచుకుంటూ రొమేనియా బోర్డర్కు వచ్చామన్నారు. తమను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల రక్షణకు ఏర్పాట్లు చేయించడంతోపాటు అక్కడి నుంచి క్షేమంగా వారిని రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రాన్ని రాష్ట్రం సంప్రదించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారని చెప్పారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసిందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల విషయమై మంత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థుల భద్రతకు చర్యలు చేపడుతున్నందున వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటికే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఆయా విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో నోడల్ అధికారిని, విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు వీలుగా ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటుచేశామని తెలిపారు. ఉక్రెయిన్లోని ఏపీ విద్యార్థులతో ఇప్పటికే నేరుగా మాట్లాడి వారికి «ధైర్యం చెప్పామన్నారు. అక్కడి భారత ఎంబసీ కూడా విద్యార్థులకు అనేక సూచనలు అందించిందని, వాటి ప్రకారం నడచుకోవాలని తెలిపామన్నారు. ప్రత్యేక ఫోన్ నెంబర్లు, వెబ్లింక్ ఏర్పాటు విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు వారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రత్యేక ఫోన్ నెంబర్లను ఏర్పాటుచేయించామన్నారు. అలాగే, భారత ఎంబసీ అధికారులు కూడా ప్రత్యేక వెబ్లింక్ను ఏర్పాటుచేశారని, దాని ద్వారా కూడా వారు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైన సహకారం అందించేలా ఏర్పాట్లుచేస్తున్నారన్నారు. ఇక ఉక్రెయిన్లో ఆకాశమార్గాన్ని మూసేసినందున అక్కడికి విమానాలను సైతం పంపేందుకు వీల్లేని పరిస్థితులున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తోందని మంత్రి సురేష్ తెలిపారు. -
ఏపీ విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా రప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ‘ఉక్రెయిన్లో ప్రస్తుత అనిశ్చితి, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు రక్షించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని సహాయం కోరిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. తాత్కాలికంగా దేశాన్ని విడిచి వెళ్లాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు సలహా ఇచ్చినందున వారికి అవసరమైన మద్దతు, సహాయం అందించడానికి.. విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశాంగ శాఖ అధికారులతో ఏపీ అధికారులు నిరంతరం మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుంది. ఏ విధమైన సహకారం కావాలన్నా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లేదా ఏపీలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విదేశాంగ శాఖ అధికారులు సంప్రదించవచ్చు’ అని సీఎం వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ భవన్ సిద్ధం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకునే విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకునేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఏపీ భవన్ సిద్ధమైంది. విద్యార్థులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఏపీ భవన్ను సంప్రదించాలని భవన్ అధికారులు పేర్కొన్నారు. ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు ఎంవీఎస్ రామారావు (ఫోన్ 9871990081), ఏఎస్ఆర్ఎన్ సాయిబాబు (ఫోన్ 9871999430), భవన్ ఓఎస్డీ, నోడల్ అధికారి పి.రవిశంకర్ (ఫోన్ 9871999055) విమానాశ్రయంలో సహాయ సహకారాలు అందిస్తారని ఏపీ భవన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఉక్రెయిన్లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: గౌతమ్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్ ‘‘అక్కడివారు తిరిగి రాష్ట్రానికి రావడానికి సహాయం కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగశాఖతో టచ్లో ఉంది. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుంది. ఉక్రెయిన్లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్లో ఉంది. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి మా వంతు సహకారం అందిస్తున్నామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
హిజాబ్ వ్యవహారం మా అంతర్గతం: భారత్
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు. సుప్రీంలో పిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
భారత్కి ఫ్రెంచ్ కోర్టు షాక్! పారిస్లో భారత్ ప్రభుత్వ ఆపార్ట్మెంట్ జప్తు
న్యూఢిల్లీ: దేవాస్ షేర్హోల్డర్లు దాఖలు చేసిన ఒక దావాలో ఫ్రెంచ్ కోర్ట్ ఒకటి కీలక రూలింగ్ ఇచ్చింది. పారిస్లోని భారత్ ప్రభుత్వ అపార్ట్మెంట్ను జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన దేవాస్– ఇస్రో వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ ఉపగ్రహ ఒప్పంద వివాదానికి సంబంధించి 1.3 బిలియన్ అమెరికా డాలర్ల ఆర్బ్రిట్రేషన్ అవార్డును అమలు చేయాలని కోరుతూ ఈ దావా దాఖలైంది. ఈ భవనం గతంలో ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంగా ఉంది. అపార్ట్మెంట్ విలువ దాదాపు 3.8 మిలియన్ యూరోలు ఉంటుందని అంచనా. ‘భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులు ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేము మరిన్ని జప్తులను ప్లాన్ చేస్తున్నాము’’ అని దేవాస్ వాటాదారుల సీనియర్ సలహాదారు జే న్యూమాన్ పేర్కొన్నారు. అయితే దేవాస్ తాజా చర్యపై ఇటు ఇస్రో నుంచి కానీ లేదా ప్రభుత్వం నుండి తక్షణ స్పందన ఏదీ వెలువడలేదు. కెయిర్న్ కేసులోనూ ఇదే ఆస్తి... కాగా రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్ర్బిట్రేషన్ ఇచ్చిన అవార్టుకు అనుగుణంగా భారత్ ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్ డాలర్లను రాబట్టుకోడానికి బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ గత ఏడాది జూలైలో ఇదే ఆస్తిపై జప్తు ఆదేశాలు తెచ్చుకుంది. అయితే అటు తర్వాత దాదాపు నెల రోజులకు భారత్ ప్రభుత్వం రెట్రాస్పెక్టివ్ పన్ను ఉపసంహరణ ప్రకటన, తదుగుణమైన చర్యల్లో భాగంగా ఈ కేసును కెయిర్న్ ఎనర్జీ ఉపసంహరించుకుంది. తరువాత దేవాన్ షేర్హోల్డర్స్ 2021 సెప్టెంబర్లో ఫ్రెంచ్ కోర్టును ఆశ్రయించారు. వివాదమిది... క్లుప్తంగా చూస్తే, ఎస్–బ్యాండ్ శాటిలైట్ స్పెక్ట్రమ్ని ఉపయోగించి మొబైల్ వినియోగదారులకు మల్టీమీడియా సేవలను అందించడానికి ఆంట్రిక్స్తో 2005లో దేవాస్ మల్టీమీడియా ఒక అవగాహన కుదుర్చుకుంది. అయితే 2011లో ఈ ఒప్పందం రద్దయ్యింది. బ్రాడ్బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలంలో మోసం జరిగిందన్న ఆరోపణలు, జాతీయ భద్రత–ఇతర సామాజిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి ఎస్–బ్యాండ్ శాటిలైట్ స్పెక్ట్రమ్ అవసరమన్న వాదన తత్సబంధ అంశాలు దీనికి నేపథ్యం. ఈ విషయంలో ఆర్ర్బిటేషన్ ట్రిబ్యునల్ దేవాస్ షేర్హోల్డర్లకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దేవాస్ షేర్హోల్డర్లలో అమెరికా పెట్టుబడి గ్రూపులు కొలంబియా క్యాపిటల్, టెలికం వెంచర్స్, డ్యుయిష్ టెలికంలు ఉన్నాయి. -
ఎంపీ ప్రత్యేక చొరవ.. సౌదీలో చిక్కుకున్న బాధితులకు విముక్తి
సాక్షి, వైస్సార్ కడప: సౌదీలో యజమాని చెరలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప వాసులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విముక్తి కల్పించారు. కడపకు చెందిన గొరెంట్ల రమణయ్య, సతీష్ చౌదరి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీవెళ్లారు. ఆ తర్వాత సౌదీ యజమాని వారి నుంచి పాస్పోర్టులు లాక్కొని సరైన ఆహరం పెట్టకుండా పొలం పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులు తమవారి బాధను ఎంపీ మిథున్రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ అధికారులు బాధితులకు రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించి, త్వరలోనే తిరిగి వారి స్వస్థలాలకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
జి–20 సదస్సుకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇటలీలోని రోమ్లో ఈ నెల 30న ప్రారంభం కానున్న జి–20 దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రధాని ఈ నెల 29 నుంచి నవంబర్ 2వ తేదీదాకా ఇటలీతోపాటు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో పర్యటిస్తారని తెలియజేసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–26 ప్రపంచ దేశాల అధినేతల సదస్సులోనూ ఆయన పాల్గొంటారని పేర్కొంది. జి–20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈ నెల 30, 31న.. రోమ్లో రెండో రోజులపాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జి–20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. 1999 నుంచి జి–20 సదస్సును ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. కాప్–26 సదస్సు ఈ నెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది. -
Afghan: అఫ్గన్ కేంద్రంగా దాడులు జరగనివ్వం
కాబూల్: అఫ్గాన్ను ఉగ్రశిబిరాలకు అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్ నేతృత్వంలోని నూతన అఫ్గాన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్ ఖాన్ ముత్తఖి స్పష్టంచేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమిర్ ఖాన్ తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తమ తాత్కాలిక తాలిబన్ ప్రభుత్వం ఎంతకాలం మనుగడలో ఉండనుందో, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారో లేదో తదితర అంశాలపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. చదవండి: క్వారంటైన్లోకి పుతిన్ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. అల్–ఖాయిదా తదితర ఉగ్రసంస్థలతో ఇకపై సంబంధాలను తెంచుకుంటా మని గత ఏడాది అమెరికాతో చర్చల సందర్భంగా తాలిబన్లు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ మేరకు, అఫ్గాన్ గడ్డపై ఉగ్రసంస్థల కార్యకలాపాలను జరగనివ్వబోమని ఆమిర్ ఖాన్ స్పష్టంచేశారు. ఉగ్రసంస్థల పట్ల నూతన ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపై ఇలా ఒక కేబినెట్ మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి. -
బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్ భేటీ
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ అధికారిక పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్ మహమూద్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. 'బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్ మహమూద్ని కలిసినందకు చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది' అంటూ జైశంకర్ ట్వీట్ చేశారు. (చదవండి: ‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’) Glad to meet Bangladesh Information and Broadcasting Minister, Hasan Mahmud. Our bilateral cooperation is progressing steadily across all domains. Discussed media and public perceptions in that regard. pic.twitter.com/CfaKun1D0t — Dr. S. Jaishankar (@DrSJaishankar) September 7, 2021 -
ఖతార్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ చర్చలు
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్–థానీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ భేటీ జరిగింది. అఫ్గానిస్తాన్లో తాలిబన్ల దుశ్చర్యలు, తాజా పరిణామాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ విషయాన్ని జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్కు తిరుగు ప్రయాణమైన ఆయన ఖతార్లో ఆగారు. కాబూల్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం అఫ్గాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకురావడమే లక్ష్యంగా భారత వాయు సేనకు చెందిన సీ–17 విమానం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కాబూల్కు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీ–17 ద్వారా 250 మంది భారతీయులను వెనక్కు తీసుకురావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద 400 మంది భారతీయులు అక్కడ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు
ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం! ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్కు చెందిన పార్లమెంటరీ ఫారెన్ అఫైర్స్ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్వే హౌస్ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి. ఆరింటిపై కన్ను ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ ఆఫీసు(ఓహెచ్సీహెచ్ఆర్)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో నైన్త్ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది. డబ్బుతో కొనేస్తుంది కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు. అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్ ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్పోల్లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన నేరçస్తులపై జారీ చేసే రెడ్కార్నర్ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్వే నివేదిక తెలిపింది. పరోక్షంగా కూడా ప్రభావం కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్ఓ అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ ఛాన్ హాంకాంగ్కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. -
మామిడి దౌత్యం.. పాక్కు చైనా సహా 32 దేశాల ఝలక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు మామిడి పండ్ల షాక్ తగిలింది. స్నేహపూర్వకంగా పండ్లు పంపిస్తే.. వద్దని తిప్పి పంపించాయి కొన్ని దేశాలు. ఈ లిస్ట్లో మిత్ర దేశం చైనాతో పాటు అమెరికా, కెనెడా, నేపాల్, శ్రీలంక.. ఇలా 32 దేశాలున్నాయి. అయితే ఈ మామిడి పండ్ల దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనా వైరస్ క్వారంటైన్ కారణంగా చూపిస్తూ మామిడి పండ్లను వెనక్కి పంపాయి. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ కార్యాలయానికి ఆయా పార్శిళ్లు వెనక్కి వచ్చేశాయి. కాగా, మేలిమి రకాలైన అన్వర్రొట్టోల్, సింధారి రకాలు కరోనా ప్రభావంతో ఈసారి పండించకపోవడంతో.. చౌన్సా రకపు మామిడి పండ్లను పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వి పేరు మీదుగా ఆయా దేశాలకు పంపింది పాక్. గల్ఫ్ దేశాలు టర్కీ, యూకే, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా సహా.. అన్ని దేశాలు వద్దని పంపించడం విశేషం. ఇక ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయానికి పంపినట్లు పాక్ చెప్తున్నప్పటికీ.. అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ప్రతీ ఏడాది ఇలా స్నేహ పూర్వక సంబంధాల కోసం పాక్ ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పంపడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో నరేంద్ర మోదీ, ప్రణబ్ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, సోనియా గాంధీకి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీప్ మామిడి పండ్లు పంపించాడు కూడా. -
‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’
వాషింగ్టన్: కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు భారత్ బాసటగా నిలిచిందని, ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ తెలిపారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఎస్ జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రిని కలిశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశాన్ని పర్యటించిన తొలి భారతీయ విదేశాంగా మంత్రి ఎస్ జైశంకర్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మేము ఐక్యంగా ఉన్నామని బ్లింకన్ అన్నారు. యుఎస్, భారతదేశం మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది, ప్రస్తుతం అది మరింత ముందుకు వెళ్తుందన్నారు. అంతకుముందు, జైశంకర్ యుఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా అభివృద్ధి చేయడం గురించి చర్చించారు. మా వ్యూహాత్మక ,రక్షణ భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి సమగ్ర సంభాషణ జరిగిందని సమావేశం తరువాత ట్వీట్ చేస్తూ, వారితో కలిసి ఉన్న ఫోటోను జైశంకర్ పంచుకున్నారు. A warm meeting with US @SecDef Lloyd Austin. A comprehensive conversation about further developing our strategic and defence partnership. Exchanged views on contemporary security challenges. Expressed appreciation of the US military role in responding to the Covid situation. pic.twitter.com/ea0iBezGQZ — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 28, 2021 చదవండి: రండి.. వ్యాక్సిన్ వేసుకోండి.. 840 కోట్ల ప్రైజ్మనీ గెలుచుకోండి -
దిగొచ్చిన అమెరికా
ఇంగ్లిష్లో ‘ఆల్ వెదర్ ఫ్రెండ్స్’ అనే మాట వుంది. అన్ని సమయాల్లోనూ మనతో నిలబడే స్నేహితుల గురించి చెప్పినమాట అది. మిత్ర దేశమైన మనల్ని ఈ కరోనా కష్టకాలంలో అమెరికా దూరం పెట్టిందని ఇటీవల విమర్శలొచ్చాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగపడే ముడి పదార్థాలను మనకు ఇవ్వడానికి ఆ దేశం నిరాకరించడం అందుకు కారణం. అప్పటినుంచీ ఆ దేశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యలే వచ్చాయి. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి కూడా డొనాల్డ్ ట్రంప్ గెలిచి పోవాలని బలంగా కోరుకున్నవారు పనిలో పనిగా ‘ఆయనే వుంటేనా...’ అంటూ ట్వీట్లు చేశారు. కొందరైతే ట్రంప్ను వ్యతిరేకించిన ఉదారవాదులపై ‘మరి ఇప్పుడేం చెబుతారు...’ అంటూ విరుచుకుపడ్డారు. ఇంకొందరు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మూలాలు మరిచారంటూ ఎత్తిపొడిచారు. భారత్ పేరు చెప్పి డెమొక్రాటిక్ పార్టీకి దండిగా ఓట్లు రాబట్టి ఇప్పుడు మౌనంగా వుండి పోయారని విమర్శించారు. రెండు ప్రభుత్వాల మధ్య సాగిన దౌత్య ఫలితమో, భారత ప్రజల్లో తమపై వ్యతిరేకత అలుముకుందన్న అభిప్రాయమో... మొత్తానికి అమెరికా తన వైఖరిని మార్చుకుంది. మన దేశం కోరినట్టు వ్యాక్సిన్ ముడిపదార్ధాల సరఫరాకు అమె రికా అంగీకరించింది. అంతేకాదు... ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు కూడా అందిస్తామని తెలియ జేసింది. కష్టకాలంలో అమెరికాకు సాయపడినందుకు మీకూ అదేవిధంగా సాయం చేయదల్చుకు న్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతూ చెప్పారని అంటు న్నారు. మొత్తానికి వారం పదిరోజులుగా ఈ విషయంలో వినబడిన చిటపటలు సర్దుకున్నాయి. సాధారణంగా దౌత్యపరమైన అంశాలను ప్రజానీకం పట్టించుకోరు. ఇందుకు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కొంత మినహాయింపు. శ్రీలంకలో తమిళులపై లేదా వారి తరఫున పోరాడిన తమిళ టైగర్ సంస్థపై అక్కడి ప్రభుత్వం నిర్బంధాన్ని అమలు చేసినప్పుడల్లా తమిళనాడులో ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ఆ దేశంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చేది. అలాగే తీస్తా నదీజలాలపై బంగ్లాదేశ్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ బెంగాల్లో ప్రజాగ్రహం పెల్లుబుకడం రివాజు. ఇటీవలకాలంలో అన్ని దేశాల్లోనూ జాతీయవాదం బాగా పెరిగి దౌత్యసంబం ధాలను ప్రభావితం చేస్తున్నది. ట్రంప్ అధ్యక్షుడిగా వున్నప్పుడు వీటి ప్రభావంతోనే ఆయన నిర్ణ యాలు తీసుకునే ప్రయత్నం చేసేవారు, మాట్లాడేవారు. తన మద్దతుదార్లను సంతృప్తిపరచడానికి వున్నట్టుండి చైనాపై విరుచుకుపడేవారు. కానీ అధ్యక్షుడిగా అక్కడి బహుళజాతి సంస్థల ప్రయో జనాలను కాపాడటం కోసం భిన్న సందర్భాల్లో ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మళ్లీ కొన్నాళ్లకు అవసరం పడిందనిపిస్తే చైనాపై విమర్శలు చేసేవారు. ఎంతో సన్నిహితంగా వున్నామని మనల్నేమీ వదల్లేదు. ముఖ్యంగా ఖరీదైన ద్విచక్ర వాహనం హార్లీ డేవిడ్సన్ బైక్పై మన దేశం విధించిన సుంకాలను రద్దు చేయించడానికి ఆయన సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయో గించారు. ఒకటికి పదిసార్లు చర్చలు జరిపారు. వినలేదని అలిగారు. ఆఖరికి ఒక సమావేశంలో మోదీని ఆ బైక్పై సుంకాలు ఎత్తివేయమని అడిగినప్పుడల్లా ఆయన జవాబిచ్చే తీరును అనుకరిస్తూ అవహేళన చేసేందుకు ప్రయత్నించారు. వినలేదని చివరకు మన ఉత్పత్తులపై అక్కడ భారీ సుంకాలు విధించారు. ప్రతిగా మన దేశం కూడా అమెరికా వస్తువులపై సుంకాల శాతం పెంచింది. దౌత్య సంబంధాలెప్పుడూ సరళరేఖ మాదిరి వుండవు. దేశాధినేతల రాజకీయ దృక్పథాలు, దేశ ప్రజానీకం మనోభావాలు ఎంతో కొంత ప్రభావితం చేస్తుంటాయి. ఆమేరకు హెచ్చుతగ్గులుం టాయి. అదే సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడటం, వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూడటం పాలకులకు ముఖ్యం గనుక వాటిని సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాక్సిన్ ముడిపదార్థాల ఎగుమతిపై ఆంక్షల విషయంలో బైడెన్ ప్రభుత్వానికి తన కారణాలు తనకు వుండొచ్చు. మన దేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు, సాయం చేయడానికి రష్యా, చైనా, బ్రిటన్ వంటివి ముందుకు రావడం చూశాక వెనక్కు తగ్గివుంటుంది. వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరూ ఒంటరి కాదు. ఒకరి బాధను మన బాధగా పరిగణించి ఆదుకోవడానికి ముందుకు ఉరకటం తప్పదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విషయంలో సమస్య మనది కాదు కదా అనుకునే పరిస్థితి లేదు. వ్యాపార వ్యవహారాల కోసం దేశాల మధ్య నిత్యం రాకపోకలు తప్పనిసరైనప్పుడు వేరే దేశం గురించి మనకెందుకని ఉపేక్షించే వీలుండదు. ఆ మాటెలావున్నా ముడిపదార్థాల ఎగుమతులను అనుమతించబోమన్న నిర్ణయంపై వ్యక్తమైన ఆగ్రహావేశాలు సాధారణ స్థాయిలో లేవు. అయితే దీనితో అయిపోలేదు. కరోనా వ్యాక్సిన్ల పేటెంట్లను సడలించే అంశాన్ని పరిశీలించాలి. మన దేశమే కాదు.. ఏ దేశమైనా దాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుని, తన పౌరులకందించే వీలుం డాలి. అది జరిగినప్పుడే విశ్వవ్యాప్తంగా అందరికీ ఈ మహమ్మారినుంచి విముక్తి లభిస్తుంది. ఇంత మాత్రం చేత మనం ఇతరేతర అంశాల్లో అమెరికా చేసే ప్రతిపాదనలను అంగీకరించాల్సిన పనిలేదు. ఆ దేశంతో వున్న స్నేహసంబంధాలను పెంపొందించుకుంటూనే మన ప్రయోజనాలే గీటు రాయిగా ఏ నిర్ణయాన్నయినా తీసుకోవాలి. చైనాతో, రష్యాతో తనకుండే సంబంధాలనుబట్టి మనల్ని ఆ దిశగా ప్రభావితం చేయడానికి అమెరికా ప్రయత్నించినప్పుడల్లా స్వీయ ప్రయోజనాలే మన నిర్ణయాలకు గీటురాయి కావాలి. -
పాస్పోర్ట్కూ ‘డిజి లాకర్’
సాక్షి, అమరావతి: డిజి లాకర్ సౌకర్యాన్ని కేంద్ర విదేశాంగ శాఖ పాస్పోర్ట్కు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. పాస్పోర్టు దరఖాస్తుదారులు డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని.. తమకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందులో దాచుకోవచ్చు. దీని వల్ల పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లేటప్పుడు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లే శ్రమ తప్పుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని.. నేరుగా పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లి డిజి లాకర్ ఉందని చెబితే చాలు.. డాక్యుమెంట్లను వాళ్లే వెరిఫై చేస్తారు. ఆన్లైన్లో పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే డిజి లాకర్ ఆప్షన్ కావాలా? అని అడుగుతుంది. అవసరమని జవాబిస్తే.. మీకు మంజూరయ్యే పాస్పోర్ట్ ఒరిజినల్ సైతం డిజి లాకర్లో ఉంచుతారు. దీని వల్ల మన పాస్పోర్ట్ ఎక్కడైనా పోతుందేమోననే భయం వదిలిపెట్టవచ్చు. డిజి లాకర్ అంటే.. డిజి లాకర్ అంటే డిజిటల్ లాకర్ అని అర్థం. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. విలువైన డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి చేయాల్సిందల్లా http://digilocker.gov.in అనే వెబ్సైట్కు వెళ్లి అకౌంట్ నమోదు చేసుకోవాలి. అనంతరం మన డాక్యుమెంట్లను అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. వాటిని అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. గెజిటెడ్ అటెస్టేషన్ కూడా అక్కర్లేదు.. డిజి లాకర్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎవరూ డాక్యుమెంట్లు తీసుకురానవసరం లేదు. గెజిటెడ్ అటెస్టేషన్ అక్కర్లేదు. వారం రోజులుగా దీనిపై ట్రయల్ రన్ నిర్వహించాం. పాస్పోర్ట్ను కూడా డిజిలాకర్లోదాచుకోవచ్చు. –శ్రీనివాసరావు, ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి, విజయవాడ -
తెలుగు వాళ్లు ప్రతిభావంతులు: కేంద్ర మంత్రి
సాక్షి, అమరావతి: తెలుగు వాళ్లలో ప్రతిభావంతులు ఉన్నారని, తాను ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లని కలుస్తానని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఆయన శనివారం ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా నియంత్రణ అదుపులో ఉందని, కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పురోగాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో కరోన విస్తరించినప్పుడు ఎటువంటి సేవలు అందుబాటులో లేవని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేడు దేశంలో వాక్సినేషన్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైద్య సదుపాయాలను విస్తరించామని, కరోనా వ్యాప్తి తరువాత దేశంలో పరిశ్రమ రంగం కుదేలయిందని, లాక్డౌన్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయామన్నారు. కరోన తరువాత 11 శాతం వృద్ధి దేశంలో ఉందని, కేంద్ర మంత్రి బడ్జెట్ను 6 స్థంబాలుగా విభజించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. బడ్జెట్లో అనేక రంగాలకు పెద్దపీట వేసి గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 1600 కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. బడ్జెట్లో రూ.2లక్షల కోట్లతో ఉత్పత్తి రంగాన్ని ఆదుకోవడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దేశంలో 5 మెట్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా డీబీటీల ద్వారా పేదలను అదుకున్నామని, ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఏపీలో త్వరలో మూడు క్లస్టర్స్ ఏర్పాటు కాబోతున్నాయని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశం ఆర్ధికంగా స్థిరపడుతుందన్నారు. బడ్జెట్పై చాలామంది విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రాల వారిగా బడ్జెట్ను చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రాల విమర్శలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, ఆయా రాష్ట్రాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ను రూపొందించామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం బడ్జెట్పై విమర్శలు చూస్తున్నారని, ఏపీలో గ్లోబల్ ఇంపాక్ట్ ఉందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతుందన్నారు. చైనా సరిహద్దుల వెంబడి జరుగుతున్న వివాదంపై కేంద్రం చర్యలు చేపడుతోందని, కేంద్ర రక్షణా శాఖ మంత్రి ఇప్పటికే సరిహద్దుల వెంబడి పర్యటించి పరిస్థితులు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రక్షణా రంగానికి అధికంగా నిధులు కూడా కేటాయించారని, కేంద్ర మంత్రుల బృందం ఈ అంశంపై భేటీ అవుతుందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం నా పరిధిలోకి రాదన్నారు. సంబంధిత శాఖ మంత్రులు ఈ అంశం పై స్పందిస్తారని పేర్కొన్నారు. ప్రధానితో అన్ని దేశాల అధ్యక్షులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. -
అమెరికాలో చదువుకు శ్రీకాకుళం విద్యార్థులు ఎంపిక
రాజాం: అమెరికా విదేశాంగశాఖ స్పాన్సర్ చేసే కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రొగ్రాం (సీసీఐపీ)నకు శ్రీకాకుళం విద్యార్థినులు ఇద్దరు ఎంపికయ్యారు. రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వహిస్తున్న జీసీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బెహరా మౌనిక, సోపేటి హేమశ్రీ ఈ ప్రొగ్రామ్కి ఎంపికయ్యారు. వీరు అమెరికాలో తమకు నచ్చిన కోర్సులు అభ్యసించే అవకాశాన్ని పొందారు. వీరిని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ఎంపిక చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సీసీఐసీ కింద వివిధ దేశాలకు చెందిన అర్హులను ఎంపిక చేసి.. ఏదైనా ఒక అమెరికన్ కమ్యూనిటీ కాలేజీలో ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తారు. వీరి చదువుకయ్యే ఖర్చులు, వసతి సదుపాయం, ఇతర ప్రయాణ ఖర్చులు అమెరికాయే భరించడంతోపాటు నెలవారీ స్టయిఫండ్ కూడా చెల్లిస్తుంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి జీఎంఆర్ వీఎఫ్ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఈ విధంగానే మౌనిక, హేమశ్రీ శిక్షణ పొందారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి మౌనిక.. మౌనిక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని. జీఎంఆర్ వీఎఫ్ గిఫ్టెడ్ చిల్ర్డన్ కోటాలో ఆమె ఉచితంగా జీసీఎస్ఆర్లో చదువుతోంది. ఎన్విరాన్మెంటల్ హార్టికల్చర్ కోర్సును ఎంపిక చేసుకున్న మౌనిక ఇల్లినాయిస్ స్టేట్లో ఉన్న కాలేజ్ ఆఫ్ డూపేజ్లో చదువుకోనుంది. విజయనగరం జిల్లాకు చెందిన హేమ తండ్రి బ్యాంకులో మెసెంజర్గా పనిచేస్తున్నారు. హేమశ్రీ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కోర్సును ఎంచుకుంది. ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్లో వాలెన్సియా కాలేజీలో చదవనుంది. -
అమెరికాను అగ్రపథంలో నిలుపుతాం!
వాషింగ్టన్: ‘‘అమెరికా ఈజ్ బ్యాక్’’ నినాదంతో పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ చెప్పారు. కీలకమైన జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించి తన హయాంలో పనిచేయబోయే అధికారులను ఆయన వెల్లడించారు. ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా సంక్షోభం, క్లైమేట్ చేంజ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాలని, సరికొత్త స్నేహితాలు రూపొందించుకోవాలని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రపంచానికి పెద్దన్నగా అమెరికా పోషించిన పాత్రను తిరిగి చేపట్టాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయన్నారు. స్నేహితులతో కలిసి పని చేస్తే అమెరికా బలమైనదన్న తన అభిప్రాయానికి తన బృందం గట్టి మద్దతన్నారు. కొత్త టీమ్ ఇదే.. ► సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్. ► ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్ ఫర్ క్లైమేట్(పర్యావరణ అంశాల ప్రతినిధి) జాన్ కెర్రీ. ► సెక్రటరీ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ అలెజాండ్రో మయోర్కస్. ► డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అవ్రిల్ హెయిన్స్. ► ఐరాసలో యూఎస్ దౌత్యవేత్త లిండా థామస్ గ్రీన్ఫీల్డ్. ► నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివన్. ► చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్. ► కోట్ల ఓట్లతో గెలిచిన అధ్యక్షుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 8 కోట్లపై చిలుకు ఓట్లతో గెలిచిన తొలి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా జోబైడెన్ చరిత్ర సృష్టించారు. కౌంటింగ్ కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. మంగళవారానికి బైడెన్కు 8కోట్ల 11వేల ఓట్లు రాగా, ట్రంప్నకు 7.38 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇది కూడా ఒక రికార్డేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ను అభినందించారు. రెండు దేశాల నడుమ సత్సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు. -
గిల్గిత్–బాల్టిస్తాన్ నుంచి వెళ్లిపోండి
న్యూఢిల్లీ: గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రాంతానికి ప్రొవెన్షియల్ హోదా కల్పించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని భారత్ తప్పుపట్టింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్–బాల్టిస్తాన్ను పాకిస్తాన్ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చిచెప్పారు. ప్రొవెన్షియల్ హోదా పేరిట ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టేందుకు పాక్ పన్నాగాలు పన్నుతోందన్నారు. హోదా మార్చడం కాదు.. ఆక్రమిత ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లిపోవాలని పాకిస్తాన్కు హితవు పలికారు. గిల్గిత్–బాల్టిస్తాన్కు ప్రొవెన్షియల్ హోదా ఇస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించినట్లు మీడియా వెల్లడించింది. -
సోదరికి సగం అధికారాలు?
సియోల్: ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన సోదరి కిమ్ యో జాంగ్ను రెండో అధికార కేంద్రంగా ఎదిగేలా కీలక చర్యలు తీసుకున్నారు. ఎన్నో అధికారాలను జాంగ్కు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారని దక్షిణ కొరియా నిఘా విభాగం వెల్లడించింది. అమెరికా, దక్షిణ కొరియాతో సంబంధాల వ్యవహారాలన్నీ ఇక పై జాంగ్ పర్యవేక్షిస్తారు. కిమ్ నిర్ణయంతో దేశంలోని రెండో శక్తిమంతమైన మహిళగా జాంగ్ ఎదిగారు. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జాంగ్కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్ తర్వాత దేశాన్ని నడిపించే రెండో కమాండర్గా ఆమె వ్యవహరిస్తున్నారని దక్షిణ కొరియా ఎంపీ హా తాయ్ క్యెంగ్ వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాలలో వైఫల్యాలు ఎదురైతే తన చేతికి మరక అంటకుండా అనారోగ్య కారణాలతో పని భారాన్ని తగ్గించుకోవడానికి కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కిమ్ మరణించారన్న వదం తులు ప్రచారమైనప్పుడు కూడా జాంగ్కే దేశ పగ్గాలు అప్పగిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోదరిపై కిమ్కు ఎనలేని విశ్వాసం తన నీడను కూడా నమ్మని కిమ్కు సోదరి జాంగ్ పట్ల ఎనలేని విశ్వాసం ఉంది. కిమ్ సలహాదారుల్లో ఒకరైన ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా కిమ్ పక్కనే కనిపిస్తున్నారు. తొలిసారిగా ఆమె పేరుతో అధికారిక ప్రకటన ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. దక్షిణ కొరియా విధానాలపై విరుచుకుపడుతూ ఆమె ప్రకటన ఇచ్చారు. అమెరికాతో దౌత్య వ్యవహారాలకు సంబంధించి జూలైలో తన వ్యక్తిగత అభిప్రాయాలంటూ ఆమె కొన్ని కామెంట్లు చేశారు. 1988లో జన్మించిన జాంగ్ స్విట్జర్లాండ్లో విద్యాభ్యాసం చేశారు. 2011లో తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మరణానంతరం సోదరుడు కిమ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆమె కూడా పార్టీలో చేరారు. నెమ్మది నెమ్మదిగా పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీలో ఎదుగుతూ కిమ్ విశ్వాసాన్ని పొందారు. -
భారత్తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
బీజింగ్: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాల ను సామరస్యంగా పరిష్కరించుకోవ డానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు మా దేశంపై సవాల్ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్ ప్రపంచానికే మేలు చేస్తుందని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు. -
పది లక్షల మంది భారతీయులు వెనక్కి!
న్యూఢిల్లీ : వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందేభారత్ మిషన్లో భాగంగా దాదాపు 10 లక్షల మందిని భారత్కు తిరిగితెచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఈ మిషన్ను మే 7న ఆరంభించారు. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 1.3 లక్షల మంది వివిధ దేశాలకు విమానాల ద్వారా వెనక్కు వెళ్లారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం వందేభారత్ మిషన్లో 5వ దశ నడుస్తోంది. ఇందులో దాదాపు 1.3 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి : మానవాళికి మంచిరోజులు! ) -
వేగంగా బలగాలు వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో భారత్ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్ జనరల్ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్ లోయలో జూన్ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్ల్లోని ఎల్ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం. చైనా నోట మళ్లీ అదే మాట.. గల్వాన్లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్ పేర్కొన్నారు. జూన్ 15 నాటి గల్వాన్ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన తూర్పు లద్దాఖ్లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్ను అందించారు. లద్దాఖ్లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్ పోస్ట్ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ యోగేశ్ కుమార్ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. -
విదేశాంగ శాఖకు సీఎం వైఎస్ జగన్ లేఖ
-
కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి : లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం జగన్ గురువారం లేఖ రాశారు. కాగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ ద్వారా ప్రత్యేక విమానాలను నడిపిన విషయం తెలిసిందే. -
‘వందే భారత్’ కొనసాగుతుంది: విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ‘వందే భారత్’ కార్యక్రమం కొనసాగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ కార్యక్రమ రెండో దశ మే 22తో ముగియనుంది. అయితే, అది జూన్ 13 వరకు కొనసాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నానికి వివిధ దేశాల నుంచి 23,475 మందిని భారత్కు తీసుకువచ్చామన్నారు.జూన్ 13 తరువాత మూడో దశ ‘వందేభారత్’ కార్యక్రమం ఉంటుందన్నారు. అమెరికా, యూరోప్ దేశాలకు కూడా విమానాల సంఖ్యను పెంచుతాం’ అని వివరించారు. అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, పెరు, మంగోలియా తదితర దేశాల నుంచి కూడా భారతీయులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 98 దేశాల్లోని 2.59 లక్షల మంది భారతీయులు స్వదేశం వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. వెయ్యి రెట్లు పెరిగిన కోవిడ్ పరీక్షలు! కోవిడ్ మహమ్మారికి కళ్లెం వేసే క్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) గణనీయమైన ప్రగతి సాధించింది. ఒక్కరోజులో చేయగల పరీక్షల సంఖ్యను రెండు నెలల్లోనే వెయ్యి రెట్లు పెంచుకోగలిగామని తెలిపింది. 20వ తేదీ ఉదయం తొమ్మిద గంటలకు మొత్తం 25,12,388 పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. రెండు నెలల క్రితం ఒక రోజులో చేయగల పరీక్షల సంఖ్య కేవలం వంద ఉండగా..ఇప్పుడదని లక్షకు చేరుకుందని వెల్లడించింది. -
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం. చదవండి : హోలీ వేడుకలకు దూరంగా ఉందాం! -
జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్లో చిక్కుకున్న టీసీఎల్ అనుబంధ సంస్థ ట్రైనీ ఉద్యోగి, కర్నూలు జిల్లా వాసి అన్నెం జ్యోతి క్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చైనాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఆ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ వైఎస్సార్సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్ చేసింది. సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్లతో పాటు జ్యోతి తల్లి ప్రమీలాదేవి, జ్యోతి బంధువులు అమర్నాథ్రెడ్డి, సురేష్రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ను కలిశారు. జ్యోతిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని విన్నవించారు. వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి.. చైనాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. జ్యోతిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ ప్రశాంత్ కె సోన సోమవారం సాయంత్రం ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మెయిల్ చేశారు. కుమార్తె కోసం కన్నీటిపర్యంతమైన జ్యోతి తల్లి ప్రమీలాదేవిని ఎంపీ వంగా గీత ఓదార్చారు. -
కరోనా కల్లోలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో కరోనా వైరస్ ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గురువారానికి మరింత పెరిగింది. ఈ వైరస్ బారిన పడి గురువారం నాటికి మొత్తం 637 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 73 మంది గురువారం రోజే చనిపోయారు. వారిలో వైరస్కు కేంద్ర బిందువుగా మారిన వుహాన్ పట్టణం ఉన్న హ్యుబయి ప్రావిన్స్లోనే 69 మంది మృతి చెందారు. అలాగే, చైనా వ్యాప్తంగా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 31 వేలకు చేరుకున్నట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైరస్ బారినపడి చికిత్స ద్వారా కోలుకున్న 1,540 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. కాగా, జపాన్లో నౌకాశ్రయంలోనే నిలువరించిన ఓ నౌకలో 41 మందికి వైరస్ సోకినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తొలిసారి కరోనా వైరస్ ఉనికిని గుర్తించి అందరినీ హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ మరణంపై చైనా శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. డాక్టర్ లీ మరణంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో చైనా ఉన్నత స్థాయి బృందం ఒకదాన్ని విచారణ కోసం వుహాన్కు పంపింది. ప్రస్తుతం భారత్ సహా 27 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. భారత్లో మూడు సహా చైనాయేతర దేశాల్లో మొత్తం 220 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా సాకుగా చూపుతూ పలు విమానయాన సంస్థలు చైనాకు విమానాలను రద్దు చేయడంపై ఆ దేశం ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కు ఫిర్యాదు చేసింది. షాంఘైకి చెందిన టీఎంఐరాబ్ సంస్థ తయారు చేసిన 30 ప్రత్యేక రోబోలను ఆసుపత్రుల్లో మందులు చల్లడంతోపాటు వార్డుల్లో ఆహారం, మందుల సరఫరాకు ఉపయోగిస్తున్నారు. చైనాలోని వుహాన్ కేంద్రంగా పలు దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ను కట్టడి చేసే ప్రయత్నాల్లో రోబో సేవలను ఉపయోగించుకుంటున్నారు. నౌకాశ్రయాల్లోనూ కరోనా స్క్రీనింగ్ కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో దేశంలోని మొత్తం 12 ప్రధాన నౌకాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనుమానితులను ప్రత్యేక గదుల్లో ఉంచి చికిత్స అందించడం తక్షణమే ప్రారంభించాలని అన్ని నౌకాశ్రయాలను ఆదేశించామని తెలిపింది. చైనా నుంచి భారత్ రావాలనుకుంటున్న వారి వీసాలను రద్దు చేశామని రాజ్యసభలో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా, వైరస్ కారణంగా జపాన్ తీరంలో నిలువరించిన నౌకలో భారతీయ సిబ్బంది, ప్రయాణీకులు ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. కొద్ది రోజులుగా కేరళలో కరోనా వైరస్ కొత్త కేసులు వెలుగుచూడకపోవడంతో విపత్తు హెచ్చరికను ఆ రాష్ట్రం శుక్రవారం ఎత్తేసింది. ట్రంప్, జిన్పింగ్ చర్చ కరోనా విజృంభణ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. కరోనా రోగుల చికిత్సకు, వైరస్ కట్టడికి ‘పీపుల్స్వార్’ను ప్రారంభించామని ట్రంప్నకు వివరించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రజల సహకారంతో విస్తృత, దీర్ఘకాలం పోరు అనే ఉద్దేశంతో ‘పీపుల్స్ వార్’ అనే సైద్ధాంతిక భావనను మావో తొలిసారి ఉపయోగించారు. -
స్వదేశానికి చేరుకున్న జాలర్లు
-
స్వదేశానికి 20 మంది మత్స్యకారులు
సాక్షి, న్యూఢిల్లీ: గత 14 నెలలుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న 20 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు సోమవారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. గుజరాత్ తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో వీరంతా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. మత్స్యకారులు తాము బందీలుగా ఉన్న మాలిర్ జిల్లా జైలు నుంచి ఆదివారం సాయంత్రం విడుదలయ్యారు. వారిని పాకిస్తాన్ అధికారులు కరాచీ నుంచి లాహోర్ వరకు రైలులో తీసుకొచ్చారు. అనంతరం సోమవారం రాత్రి 7 గంటలకు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతాదళానికి అప్పగించారు. జాలర్లను ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లేందుకు వచ్చిన మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు. ఈ 20 మందిని మంగళవారం ఉదయం ఢిల్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వారు మీడియాతో మాట్లాడాక సాయంత్రం విమానంలో విశాఖపట్నం పంపనున్నారు. స్వదేశం చేరుకున్న ఉత్తరాంధ్ర జాలర్లు వీరే: ఎస్.కిశోర్, ఎన్.ధన్రాజ్, గురుమూర్తి, రాంబాబు, ఎస్.అప్పారావు, జి.రామారావు, బి.అప్పన్న, ఎం.గురువులు, ఎన్.అప్పన్న, ఎన్.నర్సింగ్, వి.శామ్యూల్, కె.ఎర్రయ్య, డి.సూర్యనారాయణ, కె.మణి, కె.వెంకటేశ్, ఎస్.కల్యాణ్, కె.రాజు, బి.బవిరుడు, సన్యాసిరావు, సుమంత్. మత్స్యకారులకు అండగా ఉంటాం మత్స్యకార కుటుంబాలు ప్రజాసంకల్ప యాత్రలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పాకిస్తాన్లో బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులను కాపాడాలని విన్నవించారని మంత్రి మోపిదేవి చెప్పారు. ఆయన ఆదేశాలతో అప్పటి నుంచే తమ పార్టీ ప్రత్యేక చొరవ చూపి విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపిందన్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ.. పాకిస్తాన్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపడంతో మత్స్యకారులు విడుదలయ్యారని వెల్లడించారు. ఇది వారికి పునర్జన్మ అని, ఇప్పటికైనా విడుదల కావడం సంతోషకరమన్నారు. మత్స్యకారులంతా సీఎం వైఎస్ జగన్కు రుణపడి ఉన్నామని చెప్పారన్నారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరో ఇద్దరు మత్స్యకారులు డాక్యుమెంట్లు, తదితర సాంకేతిక కారణాలతో విడుదల కాలేదని, వారిని కూడా విడుదల చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పాకిస్తాన్లో భారత మత్స్యకారులు మరో 237 మంది వరకు ఉన్నారని అక్కడి అధికార వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. -
పొరుగుదేశాలపై భారత్ ప్రభావం: బంగ్లా మంత్రి
ఢాకా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ)భారత్ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ అన్నారు. అయితే, భారత్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల ప్రభావం పొరుగు దేశాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఏఏ నిరసనలు తగ్గి త్వరలోనే శాంతియుత పరిస్థితి నెలకొంటుందని ఆకాంక్షించారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం నెలకొంటే ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. అలాగే భారత్లో ఏ మాత్రం అనిశ్చితి నెలకొన్నా మాకూ ఆందోళనగానే ఉంటుంది’అని అబ్దుల్ మొమెన్ అన్నారు. -
..అందుకే పాస్పోర్ట్లో కమలం
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తున్న పాస్పోర్ట్ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్పోర్ట్లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతాచర్యల్లో భాగమని తెలిపింది. ‘కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్దతిలో ముద్రిస్తామని వివరించారు. ఈ అంశాన్ని బుధవారం లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు ఎంకే రాఘవన్ ఈ అంశాన్ని లేవనెత్తి.. కేరళలోని కోజికోడ్లో కమలం గుర్తు ముద్రించిన పాస్పోర్ట్లు జారీ అయ్యాయని, ఇది ప్రభుత్వ కాషాయీకరణలో భాగమని విమర్శించారు. -
స్టాండింగ్ కమిటీలో ఇద్దరు తెలంగాణ ఎంపీలు
నిర్మల్: విదేశీ వ్యవహారాల శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు నియమితులయ్యారు. ఇటీవల ప్రకటించిన ఈ కమిటీలో సోయం బాపురావు(ఆదిలాబాద్–బీజేపీ), బోర్లకుంట వెంకటేష్ నేత (పెద్దపల్లి – టీఆర్ఎస్)లకు స్థానం దక్కింది. తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వీరిద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే. ఈ కమిటీకి చైర్మన్గా రాజస్థాన్లోని పాళికి చెందిన బీజేపీ ఎంపీ ప్రేమ్ప్రకాష్ చౌదరి నియమితులయ్యారు. ఇందులో 21 మంది లోక్సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపీలు నియమితులు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
నిమిషాల్లో ఈ-పాస్పోర్ట్ జారీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: పాస్పోర్ట్ సేవలకు ఈ–టోకెన్ విధానం సత్ఫలితాన్నిస్తోంది. ఆన్లైన్లో పాస్పోర్ట్ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ–టోకెన్ నంబర్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్కు అందుతుంది. దీంతో పాస్పోర్ట్ సేవా కేంద్రానికి అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అక్కడి సిబ్బందికి మీ సెల్ఫోన్కు అందిన మీ దరఖాస్తు రిఫరెన్స్ నంబర్ (ఏఆర్ఎన్) చూపితే చాలు. ఈ పాస్పోర్ట్ జారీ ప్రక్రియను అక్కడి సిబ్బంది నిమిషాల్లో పూర్తి చేస్తారు. అమీర్పేట్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అమలు చేసిన ఈ ప్రయోగాత్మక విధానం సఫలీకృతం కావడంతో ఇటీవల మరో 4 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 23 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ అమలు చేస్తున్నట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. దేశంలో ఢిల్లీ తర్వాత ఈ విధానాన్ని మన నగరంలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక ఏఆర్ఎన్ ద్వారా తమ పాస్పోర్ట్ అప్లికేషన్ ఏస్థాయిలో ఉందన్న అంశాన్ని ఈ–ట్రాకింగ్తో తెలుసుకునే సౌలభ్యాన్ని విదేశాంగ శాఖ కల్పించడం విశేషం. 6 నెలల ముందే అలర్ట్.. పాస్పోర్టు గడువు తీరిన వినియోగదారుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ అందించే సేవలను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభించింది. వినియోగదారులకు 6 నెలల ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేయడం ద్వారా వారు రెన్యువల్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులందరి పాస్పోర్ట్ డేటాను డిజిటల్ మాధ్యమంలో భద్రపరిచామని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ అలర్ట్ సైతం కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్గా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేయడం విశేషం. దరఖాస్తు సమయంలో జాగ్రత్త.. పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకునే వినియోగదారులు విధిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ https://www.passportindia.gov.in/ నుంచే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఇతర లింక్లను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. రోజూ 3 వేల దరఖాస్తులు.. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యాటకం, మెడికల్ టూరిజం ఇలా విదేశాలకు వెళుతోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో పాస్పోర్ట్ దరఖాస్తులు సైతం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పాస్పోర్ట్ కార్యాలయాలకు సుమారు 3 వేల దరఖాస్తులు అందుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీస్ క్లియెరెన్స్ అందిన 3–4 రోజుల్లో పాస్పోర్టును జారీ చేస్తున్నామని, పోలీసులు సైతం వెరిఫికేషన్ను సత్వరం పూర్తి చేస్తున్నారన్నారు. -
విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా పర్యటన
న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. గత వారం భారత్ జమ్ము కశ్మీర్ను రెండుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేశీ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, విదేశాంగ మంత్రిగా జైశంకర్ తొలి చైనా పర్యటన ఇది. ఆదివారం చైనా బయల్దేరిన జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అవుతారు. కశ్మీర్ విభజన, ద్వైపాక్షిక వాణిజ్యం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం పర్యవసానాలు వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ పర్యటనను కూడా ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం సోమవారం సాయంత్రం రెండు దేశాల విదేశాంగ మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొంటారు. -
ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి
అల్గునూర్ (మానకొండూర్): ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ అయిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాధితుడు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ‘సాక్షి’లో ‘ఎడారిలో బందీ’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడారు. వీరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి సౌదీ అరేబియాలోని విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు వీరయ్య ఉన్న ప్రదేశానికి చేరుకుని అతడిని వెంటనే భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అక్కడి నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం స్థానికంగా నివాసముండే తెలుగువారికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ప్రత్యేక వీసా వీరయ్య వీసా ముగియడంతో అతడిని స్వదేశానికి పంపించేందుకు అధికారులు ప్రత్యేక వీసా తయారు చేయించారు. ఈనెల 25న విమానం టికెట్ బుక్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముంబై వరకు టికెట్ బుక్ చేయడంతో వీరయ్య ఈ నెల 26న వేకువ జామున సౌదీ అరేబియా నుంచి బయల్దేరాడు. 27వ తేదీన ముంబై చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బస్సులో జగిత్యాలకు వచ్చి శుక్రవారం కరీంనగర్ చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల ఉద్వేగం క్షేమంగా ఇంటికి వచ్చిన వీరయ్యను చూసి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని చూసిన ఆనందంలో వీరయ్య కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తాను మళ్లీ ఇంటికి చేరుతానని అనుకోలేదని ఈ సందర్భంగా వీరయ్య తెలిపాడు. తాను ఇంటికి రావడానికి సహకరించిన కేటీఆర్, సుష్మాస్వరాజ్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై సౌదీ వెళ్లిన తాను అక్కడ నరకం అనుభవించానని, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అన్ని సక్రమంగా ఉంటేనే వెళ్లాలని పేర్కొన్నాడు. తమకు స్థానికంగా ఉపాధి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. -
భారత్తో కలిసి పనిచేస్తాం: అమెరికా
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్న పాంపియో గురువారం భారత్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. భారత విదేశాంగ మంత్రిగా నియమితులైన జయశంకర్కు పాంపియో అభినందనలు తెలిపారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ నేత ఒకరు భారతలో పర్యటించడం ఇదే ప్రథమం. 28నుంచి జపాన్లో జరిగే జి–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో పాంపియో భారత పర్యటనకు ప్రాధాన్యం లభించింది. పర్యటనలో భాగంగా పాంపియో విదేశాంగ మంత్రి జయశంకర్, తదితర మంత్రులతో సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.‘భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పరం లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఈ పర్యటన చక్కని అవకాశంగా భావిస్తున్నాం.’అని కుమార్ అన్నారు. -
‘హెచ్1బీ’ కోటాలో కోత లేదు
వాషింగ్టన్: విదేశీ కంపెనీలు సేకరించే సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కోరే దేశాలకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాల్లో ఎలాంటి కోత విధించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. డేటా ప్రవాహంపై భారత్తో అమెరికా జరుపుతున్న చర్చలకు, హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ యంత్రాంగం చేస్తున్న సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. విదేశీ కంపెనీలు భారత్లో సేకరించిన సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని కేంద్రం గతంలోనే సూచించింది. దీంతో అమెరికా కంపెనీలపై ఇలాంటి నిబంధనలు విధించే దేశాలకు జారీచేస్తున్న హెచ్1బీ వీసాల్లో 10–15 శాతం కోత విధించాలని అగ్రరాజ్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వీటిని ఖండించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా హెచ్1బీ సహా అన్ని వర్క్ వీసా ప్రోగ్రామ్లను ప్రభుత్వం సమీక్షిస్తోందని ఆయన తెలిపారు. ‘ఈ సమీక్షలు ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకుని నిర్వహించడం లేదు. భారత్తో జరుగుతున్న చర్చలకు, హెచ్1బీ సమీక్షలకు ఎలాంటి సంబంధం లేదు. దేశాల సరిహద్దును దాటి సమాచారం స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన అవసరంపై అమెరికా భారత్తో చర్చిస్తోంది’ అని వెల్లడించారు. డేటాను గ్లోబల్ సర్వర్లలో కాకుండా స్థానికంగా భద్రపరచాల్సివస్తే వ్యయాలు పెరుగుతాయని విదేశీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు తమదేశంలో పనిచేసేందుకు వీలుగా ఏటా హెచ్1బీ వీసాలను అమెరికా జారీచేస్తోంది. మరోవైపు అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని పలువురు ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రస్తుత ఇమిగ్రేషన్ చట్టానికి సవరణ చేస్తేనే ఇది సాధ్యమనీ, అయితే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు, సెనెట్లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇది జరగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. భారత్కు జారీచేస్తున్న హెచ్1బీ కోటాలో కోత విధిస్తే నిపుణుల రాక తగ్గి అంతిమంగా అమెరికాయే నష్టపోతుందని హెచ్చరించారు. -
భారత్కు వస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో జూన్ 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఓ దేశ విదేశాంగ శాఖ మంత్రి భారత్కు రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య బంధాలను బలపరిచేలా సమావేశాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 28, 29 తేదీలలో జపాన్లోని ఒసాకా పట్టణంలో జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో మైఖేల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తోపాటు ఇతర అధికారులతోనూ భేటీలు జరగనున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాతో చెప్పారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంతో పాటు ప్రపంచ సమస్యలను గురించి చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. హెచ్ 1బీ వీసాలపై అమెరికా నిబంధనలు విధిస్తున్న అంశం గురించి మీడియా ప్రతినిధులు రవీశ్ వద్ద ప్రస్తావించగా, ఈ విషయం గురించి అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదన్నారు. భారత్కు రానున్న పాంపియో ఏ విషయాలు మాట్లాడాలో ఇప్పుడే ఊహించడం సరికాదన్నారు. అమెరికాలో భారత నిపుణులు ప్రతి రంగంలో ఉన్నారని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంలో వీరు కూడా తమ వంతు కృషి చేస్తున్నారని అన్నారు. కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో అమెరికాతో సంబంధాల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇలా ఆలోచిస్తే సంబంధాలు బలంగానే ఉన్నాయన్నారు. ఇరుదేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, వాణిజ్యం రూ. పదిలక్షల కోట్లకు పెరిగిందన్నారు. భారత్ పర్యటన అనంతరం పాంపియో శ్రీలంక, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కూడా వెళ్లనున్నారు. ఇండో–పసిఫిక్ దేశాలతో యూఎస్ సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. -
ఆ నౌక జాడ తెలియరాలేదు
న్యూఢిల్లీ: దాదాపు ఐదు నెలల క్రితం కేరళలో 243 మందితో బయలుదేరిన నౌక అదృశ్యమైన ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నౌక గురించి అన్ని దేశాలను అప్రమత్తం చేశామని.. అయితే ఆయా దేశాల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం వెల్లడించారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబమ్ నుంచి జనవరి 12న బయలుదేరిన ‘దేవ మాతా–2’అనే పేరున్న నౌక గల్లంతైన విషయం తెలిసిందే. ‘ఇది పసిఫిక్ సముద్రం దిశగా వెళ్లినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రీజియన్లోని అన్ని దేశాలనూ అప్రమత్తం చేశాం’అని రవీశ్ చెప్పారు. కాగా, గల్లంతైన నౌకలో 85 మంది చిన్నారులు ఉన్నట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. వీరిలో 12 రోజుల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలు, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా గుర్తించారు. నెలలు గడుస్తున్నా తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని కనిపెట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు సైతం లేఖ రాశారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి త్వరలో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ను కలవాలని వారు యోచిస్తున్నారు. -
సౌదీ నుంచి స్వదేశానికి..
మోర్తాడ్: సౌదీ అరేబియాలోని జేఅండ్పీ కంపెనీ క్యాంపులో దాదాపు ఏడాదిన్నర కాలంగా పనిలేక మగ్గిపోయిన తెలంగాణకు చెందిన 39 మంది కార్మికులు సోమవారం స్వదేశానికి రానున్నారు. విదేశాంగ శాఖ చొరవతో హైదరాబాద్ చేరుకోనున్నారు. జేఅండ్పీ కంపెనీ సౌదీ అరేబియాలో నిర్మాణరంగంలో పనులు నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వివిధ దేశాల నుంచి కార్మికులను రప్పించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఎంతో మంది కార్మికులు జేఅండ్పీ కంపెనీలో పని చేయడానికి వెళ్లారు. 2018 ఏప్రిల్ వరకు కంపెనీ కార్యకలాపాలు బాగానే నడిచాయి. ఆ తర్వాత కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్మికులకు పని కల్పించలేదు. అంతేకాకుండా నెలల తరబడి వేతనాలు కూడా ఇవ్వలేదు. కార్మికుల అకామాలను రెన్యూవల్ చేయకపోవడంతో వారు బయట తిరగలేక పోయారు. కంపెనీ యాజమాన్యం క్యాంపుల్లో ఉన్న కార్మికులకు భోజన సదుపాయాన్ని కల్పించినా నాసిరకం భోజనాలను అందించిందని కార్మికులు పేర్కొంటున్నారు. కనీసం ఇళ్లకు పంపించడానికి కూడా జేఅండ్పీ కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకోలేదని ఆరోపించారు. కంపెనీ తీరుతో కార్మికులు విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో సౌదీ లేబర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కార్మికుల వేతన బకాయిలు చెల్లించడానికి కొంత సమయం ఇచ్చిన లేబర్ కోర్టు.. కార్మికులను ఇళ్లకు పంపించడానికి ఎగ్జిట్ వీసా ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో విదేశాంగ శాఖ కార్మికులకు టికెట్లు సమకూర్చడంతో సోమవారం 39 మంది కార్మికులు సౌదీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి సహాయం విదేశాంగ శాఖ చొరవతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న కార్మికులు ఎయిర్పోర్టు నుంచి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందించనుంది. గతంలో కార్మికులకు రవాణా చార్జీల కోసం రూ. 500 చొప్పున చెల్లించేవారు. ఆ మొత్తాన్ని ప్రస్తుతం రెట్టింపు చేశారు. ఎయిర్పోర్టులో కార్మికులు అడుగిడిన వెంటనే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులు ఆర్థిక సహాయం అందిస్తారు. కేరళ తరహాలో పునరావాసం కల్పించాలి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటి దారి పడుతున్న కార్మికుల సంక్షేమానికి కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకోవాలి. పునరావాసానికి శాశ్వత ప్రాతిపదికన సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్వగ్రామాలకు కార్మికులు వచ్చిన తరువాత తగిన ఉపాధి లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోయి.. కుటుంబ పోషణ భారంకావడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాగే గల్ఫ్ దేశాల్లో కార్మికులు సంపాదించుకున్న నైపుణ్యాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
‘మిషన్ శక్తి’పై మెత్తబడ్డ అమెరికా
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. అంతరిక్ష రంగంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ఇరు దేశాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చింది. మిషన్ శక్తి తరువాత అంతరిక్షంలో 400 శకలాలు మిగిలిపోయాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పాలడినో బుధవారం మాట్లాడుతూ అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు మిగిలిపోవడం ఆందోళనకరమే అయినా, ఈ సమస్యను పరిష్కరించేలా పరీక్షను నిర్వహించామని భారత్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. భారత్తో అమెరికాకు పటిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు దేశాలు కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
చైనా వేదికగా పాక్ కుటిలనీతిపై సుష్మా ఫైర్
బీజింగ్ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ చేపట్టిన మెరుపుదాడులు కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద మౌలిక వసుతలను ధ్వంసం చేసే లక్ష్యంతోనే సాగాయని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సైనిక స్ధావరాలు లక్ష్యంగా ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. భారత్లో జైషే మహ్మద్ మరో దాడికి సన్నద్ధమవుతున్నదన్న నేపథ్యంలో అలాంటి పరిస్థితి చోటుచేసుకోరాదన్నదే భాతర అభిమతమని, తాము బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. జైషే ఆగడాలపై సవివర ఆధారాలతో తాము పాకిస్తాన్కు నివేదించినా పాకిస్తాన్ ఉగ్ర దాడులపై తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజింగ్లో భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల భేటీలో ఆమె పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జైషే మహ్మద్, ఇతర ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ సమాజం పిలుపు మేరకు కఠినంగా వ్యవహరించాల్సిన పాకిస్తాన్ దాడిపై తమకు ఎలాంటి సమాచారం లేదని పాక్ నిరాకరించిందని, దాడికి పాల్పడినట్టు జైషే వెల్లడించడాన్నీ విస్మరించిందని సుష్మా ఆక్షేపించారు. -
ఎన్నారై భర్తల ఆగడాలకు చెక్ పెడతాం!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఇందులో భాగంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆమె విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. (ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్) ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బిల్లులో పొందపరచాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న 25 మంది ఎన్నారై భర్తల పాస్పోర్టులను ఇప్పటికే రద్దు చేశామని గుర్తు చేశారు. -
‘భారత్లో అలాంటి ప్రదేశం లేదు’
న్యూఢిల్లీ : సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరించడంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ముందుంటారు. కానీ కొత్త పాస్పోర్ట్ కావాలంటూ ఓ వైద్య విద్యార్థి చేసిన ట్వీట్ మాత్రం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. విషయమేమిటంటే.. జమ్మూ కశ్మీర్కు చెందిన షేక్ అతీక్.. ‘నేను జమ్మూ కశ్మీర్కు చెందిన వ్యక్తిని. ఫిలిప్పీన్స్లో వైద్య విద్యనభ్యసిస్తున్నాను. నా పాస్పోర్టు దెబ్బతినడంతో నెల రోజుల క్రితం కొత్తదాని కోసం దరఖాస్తు చేసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేనందున ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు నాకు తప్పక సాయం చేయాలం’టూ ట్వీట్ చేశాడు. అయితే అతడి ప్రొఫైల్ను చెక్ చేసిన సుష్మా స్వరాజ్.. ‘మీరు జమ్మూ కశ్మీర్కు చెందిన వ్యక్తి అయితే.. మీకు తప్పక సాయం చేస్తాము. కానీ మీ ప్రొఫైల్లో మీరు భారత ఆక్రమిత కశ్మీర్కు చెందిన వారని ఉంది. భారత్లో అయితే అలాంటి ప్రదేశం లేదంటూ’ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఒక విదేశాంగ మంత్రిగా అతడికి సాయపడాల్సిన అవసరం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొందరు అతడికి ఎటువంటి సాయం చేయవద్దంటూ ట్వీట్ చేస్తున్నారు. నెటిజన్ల స్పందనతో కంగుతిన్న అతీక్ వెంటనే తన ప్రొఫైల్ లొకేషన్ మార్చాడు. ఈ విషయాన్ని గమనించిన సుష్మా.. ‘ నీ ప్రొఫైల్ మార్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జయదీప్.. ఇతను(అతీక్) జమ్ము కశ్మీర్కు చెందిన భారతీయడు. కాబట్టి ఇతడికి సాయం చేయండి’ అంటూ అధికారులను కోరుతూ మరో ట్వీట్ చేశారు. If you are from J&K state, we will definitely help you. But your profile says you are from 'Indian occupied Kashmir'. There is no place like that. @indembmanila https://t.co/Srzo7tfMSx — Sushma Swaraj (@SushmaSwaraj) May 10, 2018 1. @SAteEQ019 - I am happy you have corrected the profile. 2. Jaideep - He is an Indian national from J&K. Pls help him. @indembmanila https://t.co/rArqxIQoN3 — Sushma Swaraj (@SushmaSwaraj) May 10, 2018 -
దేవయానికి ప్రమోషన్
న్యూఢిల్లీ : పనిమనిషి పాస్పోర్టు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆమెకు సరిగా జీతం చెల్లించకుండా వేధింపులకు గురిచేశారనే కారణంగా 2013లో అరెస్టైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు సెంట్రల్ అడ్మినిస్ట్రేవ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఊరట లభించింది. 1999 బ్యాచ్కు చెందిన దేవయానికి పదోన్నతి కల్పించడంతో పాటు 2016 నుంచి దీనిని వర్తింపచేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్యాట్ ఆదేశించింది. దీంతో జాయింట్ సెక్రటరీగా ఆమె పదోన్నతి పొందనున్నారు. ఆమెపై నమోదైన కేసు విచారణలో జాప్యం చేసినందుకు ఆ శాఖను తప్పుపట్టింది. భారత్కు చెందిన తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారనే కారణంతో 2013లో న్యూయార్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీనివల్ల భారత్- అమెరికాల మధ్యనున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చ జరగడంతో దేవయానిపై విమర్శలు వెల్లువెత్తాయి. తన పిల్లల పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసిందనే కారణంగా విదేశీ వ్యవహారాల శాఖ ఆమె ప్రమోషన్ను నిలిపివేసింది. అంతేకాకుండా తండ్రితో పాటు అమెరికాలో నివసిస్తున్న దేవయాని ఇద్దరు కుమార్తెలకు భారత పౌరసత్వాన్ని తిరస్కరించింది. ఇండియన్ పాస్పోర్టు, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించించారన్న ఆరోపణలతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం గురించి దేవయాని మాట్లాడుతూ... ‘ఈ కేసులో పిటిషనర్ తల్లి(దేవయాని) ఎప్పుడూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. తన భర్త, తనపై ఆధారపడిన వారి గురించి కూడా విదేశీ పౌరసత్వం కల్పించాలని కోరలేదు. భారత విదేశీ విధానం-1961 నిబంధనల ప్రకారం ఇది చట్టాన్ని మీరినట్టు కాదు. 16 ఏళ్ల సర్వీసులో నేను చాలా బాగా పనిచేశానని’ పేర్కొన్నారు. ఈ అంశాల గురించి అఫిడవిట్లో కూడా ప్రస్తావించారు.