కశ్మీర్ ఘటనపై అమెరికా ఆందోళన | US concerned over Kashmir killings, calls it India's affair | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ఘటనపై అమెరికా ఆందోళన

Published Tue, Jul 12 2016 11:47 AM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM

US concerned over Kashmir killings, calls it India's affair

కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30 మంది ప్రాణాలుకోల్పోవడం తమను బాధించిందని అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు.

వాషింగ్టన్: కశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 30 మంది ప్రాణాలుకోల్పోవడం తమను బాధించిందని అమెరికా పరిపాలన అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఓ ప్రకటనలో చెప్పారు. అదే సమయంలో అది భారతదేశ వ్యక్తిగత వ్యవహారం అని కూడా స్పష్టం చేశారు.

ఎలాంటి సమస్య అయినా ఓ శాంతిపూర్వకమైన పరిష్కారంతో ఎవరు ముందుకొచ్చినా తాము దానికి మద్దతు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఇది ముఖ్యంగా భారతదేశ వ్యవహారం అయినందున ఇంతకంటే ఎలాంటి ప్రకటనలు చేయబోమని అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement