ప్రధాన వార్తలు

నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే స్ఫూర్తి.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ఫాదర్స్ డే సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్ మోడల్, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025

‘సూపర్ సిక్స్ కాదు.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్’
సాక్షి, హైదరాబాద్: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్ సిక్స్ ఏమో కానీ.. ఫస్ట్ బాల్కే కూటమి ఔట్ అని సెటైర్లు వేశారు. ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు. ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్కు మా బడ్జెట్కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి. అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.ఉద్యోగులకు మోసం.. ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

indrayani river bridge collapses: పూణెలో ఘోర ప్రమాదం
మహరాష్ట్ర: పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై (indrayani river bridge collapses) పురాతన కూలిన వంతెన కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు.పోలీసుల సమాచారం మేరకు.. పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund MalaRead in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR— Punekar News (@punekarnews) June 15, 2025పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్డీఆర్ఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #Maval Bridge collapsed ,5 tourist feared to be dead.On weekend huge #ITcrowd visit these places we pray for everyones saftey . Morethan 25 are missing .30We hope govt should audit all tourist hot spot to ensure everyones saftey .#IndrayaniRiver #Kundamala #BridgeCollapse pic.twitter.com/IOU6XJj0Fy— Forum For IT Employees - FITE (@FITEMaharashtra) June 15, 2025

మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032

Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. విమాన భయం అధిగమించేందుకు..భయం పోయేలా 4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్ హెడ్సెట్ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్)

చిన్నారికి ఎంత కష్టం.. వైద్యానికి రూ. 16 కోట్లు అవసరం!
కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు.

'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో
'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికఖాయం
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025

చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే
టెంబా బావుమా.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గత 27 ఏళ్ల అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా తన దేశానికి తీసుకొచ్చాడు.లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ను బావుమా సారథ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో సఫారీలు రెండో ఐసీసీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో బావుమా కెప్టెన్గా, ఆటగాడిగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులతో కీలక నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండరాల గాయంతో బాధపడుతూనే.. జట్టును ముందుండి నడిపించాడు. 134 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చరిత్ర సృష్టించిన బావుమా..తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్గా తొలి 10 మ్యాచ్లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్గా బావుమా నిలిచాడు.బావుమా ఇప్పటివరకు పది మ్యాచ్లలో ప్రోటీస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్లలో విజయం సాధించింది. మరొకటి డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఇంగ్లండ్కు చెందిన పెర్సీ చాప్మన్ కెప్టెన్గా తొలి 10 మ్యాచ్లలో తొమ్మిది విజయాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోయింది.బావుమా కెప్టెన్సీలో మాత్రం దక్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. చాప్మన్ 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్గా తొలి పది మ్యాచ్లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్: పొంగులేటి
సాక్షి, ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, ఏదులాపురం, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి(సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు.రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తాం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి’’ అని పొంగులేటి చెప్పారు.
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
కోరుట్లలో విషాదం.. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు
ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
ఈ సండే సూపర్ వెరైటీ స్నాక్స్ ట్రై చేయండిలా..!
టాలీవుడ్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి?
'థగ్ లైఫ్' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ వచ్చేసింది
సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
రామ్ చరణ్-ఉపాసన వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ (ఫొటోలు)
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
పెళ్లయి 16 ఏళ్లు.. సుకుమార్ భార్య ఎమోషనల్ (ఫొటోలు)
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటుడు.. తొలి ఇండియన్గా ఘనత!
‘ఏడాదంతా మోసమే.. అంతా అభూత కల్పనే’
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!
కోరుట్లలో విషాదం.. విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు
ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
ఈ సండే సూపర్ వెరైటీ స్నాక్స్ ట్రై చేయండిలా..!
టాలీవుడ్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి?
'థగ్ లైఫ్' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ వచ్చేసింది
సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్
విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
‘స్కై లవ్స్ హర్’.. ఇక కనిపించదు.. ఎయిర్ హోస్టెస్ విషాదాంతం
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
కొమ్మినేనికి ఊరట.. విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
ఈ నకిలీ డాక్టర్కు అసలు ‘హృదయం’ లేద్సార్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరిచయాలు పెరుగుతాయి
వచ్చే ఎన్నికల్లో నేను.. నా కోడలు పోటీచేస్తాం
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
అహ్మదాబాద్లో విమాన ప్రమాదం - 241 మంది మృతి
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్గా
సినిమా

'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో
'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

మోస్ట్ వయొలెంట్ చిత్రానికి సీక్వెల్.. సారీ చెప్పిన ఉన్ని ముకుందన్!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్ వయొలెంట్గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా కూడా ఉంటుందని అభిమానులు భావించారు. దీంతో ఓ అభిమాని సైతం మార్కో-2 ఎప్పుడొస్తుందని ట్విటర్ వేదికగా హీరోను ప్రశ్నించాడు.దీనికి ఉన్ని ముకుందన్ కూడా రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో క్షమించండి.. మార్కో సిరీస్ను కొనసాగించాలనే ఉద్దేశాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్పై ఎక్కువగా నెగెటివిటీ ఉంది.. అయితే మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో మార్కో సీక్వెల్ వస్తుందని భావిస్తోన్న అభిమానులకు నిరాశ ఎదురైంది.కాగా..2024 డిసెంబర్లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.

మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్
టాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఇదివరకే ప్రమోషన్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కొచ్చిలో.. నటుడు మోహన్ లాల్ చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇదే ఈవెంట్లో మోహన్ లాల్-మోహన్ బాబు మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అలానే మోహన్ బాబు ఓ పెద్ద కోరికని బయటపెట్టారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా)'కన్నప్ప'లో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తాజాగా కొచ్చిలో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మోహన్ లాల్ మాట్లాడుతుండగా.. మీ సినిమాలో తాను విలన్ చేస్తానని మోహన్ బాబుతో అన్నాడు. బదులుగా మీ మూవీలో తాను విలన్గా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అలా అయితే తొలి సీన్లో మిమ్మల్ని కాల్చి పడేస్తానని మోహన్ లాల్ అనేసరికి స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.మరోవైపు ఇదే వేడుకలో మాట్లాడిన మోహన్ బాబు.. కేరళలో 'తుడరుమ్' చిత్రాన్ని 'కన్నప్ప' అధిగమించాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ 'కన్నప్ప'కు రావాలని తాను అనుకుంటున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ చివర్లో రిలీజైన మోహన్ లాల్ 'తుడరుమ్'.. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి మోహన్ బాబు చాలా పెద్దగా ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)#Mohanlal: You be the hero, I’ll play the villain in that film.#MohanBabu: No, I really want to act as a villain in your film, please...#Mohanlal: Then I’ll shoot and kill you in the first scene in that film!— #Kannappa Event | Kochi pic.twitter.com/8fGqUsXGUc— Whynot Cinemas (@whynotcinemass_) June 14, 2025

ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించగా.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బావుమా తిరిగి మళ్లీ వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు. ఇక చారిత్రత్మక విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్లో 282 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్పై 282 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్పై 344 పరుగుల టార్గెట్ను విండీస్ చేధించింది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా

వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా
సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత రెండో ఐసీసీ టైటిల్ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సఫారీలు.. టెస్టు ఛాంపియన్షిప్ గదను సొంతం చేసుకుకున్నారు.ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ 5 వికెట్ల కోల్పోయి చేధించింది. మ్యాన్ ఆప్ది మ్యాచ్ ఐడైన్ మార్క్రమ్(136) సౌతాఫ్రికా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు బావుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా బౌలర్లు కూడా రెండు ఇన్నింగ్స్లలో అద్బుతంగా రాణించారు.కగిసో రబాడ ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టెంబా బావుమా స్పందించాడు. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని బావుమా తెలిపాడు."ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. ముందుగా మాకు ఇక్కడ సపోర్ట్గా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి మద్దతు నాకు దక్షిణాఫ్రికాలో ఆడుతున్న అనుభూతిని కలిగించింది. ఈ క్షణం కోసమే మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము. అందుకోసం చాలా కష్టపడ్డాము. మా కంటూ ఒక రోజు వస్తుందని అని నమ్మకంతో ముందుకు సాగాము.కానీ అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉండేవి. కానీ వాటన్నంటిని ఈ రోజు మేము జయించాము. ఒక జట్టుగా మాకు ఇది గర్వించదగ్గ విజయం. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్నాము. సెమీఫైనల్స్, ఫైనల్స్లో ఓడిపోయి హృదయ వేదన అనుభవించాము. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. అదే ఎనర్జీ, అదే పోరాట పటిమతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎట్టకేలకు మా లక్ష్యాన్ని చేరుకున్నాము. కగిసో రబాడ ఇక అద్బుతమైన ఆటగాడు. రెండు రోజుల క్రితం నేను ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్కు వెళ్లాను. రాబోయే కాలంలో రబాడ కచ్చితంగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నాను.అతడు ఈ మ్యాచ్కు ముందు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికి ఈ ఫైనల్ మ్యాచ్లో ఛాంపియన్ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మార్క్రమ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మార్క్రమ్ టెస్టు జట్టులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. వారిందరికి మార్క్రమ్ తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు.రెండో ఇన్నింగ్స్లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆ బాధ్యతను మార్క్రమ్ తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. మా దేశ ప్రజలు కూడా మా సెలబ్రేషన్స్లో భాగం అవుతారని భావిస్తున్నాను" అని ప్రెస్ కాన్ఫరెన్స్లో బావుమా పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో టెంబా బావుమా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సౌతాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ అందిచిన కెప్టెన్గా బావుమా చరిత్ర పుటలెక్కాడు.చదవండి: WTC Final 2025: ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?

వైజాగ్లో భారత్, కివీస్ టి20
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో కివీస్ 3 వన్డేలు, ఐదు టి20 మ్యాచ్లు ఆడనుంది. దీనికి సంబంధించిన వేదికలు, షెడ్యూల్ను అపెక్స్ కౌన్సిల్ శనివారం ఖరారు చేసింది. జనవరి 11న ప్రారంభం కానున్న ఈ పర్యటన 31 జనవరితో ముగియనుంది.11న బరోడాలో తొలి వన్డే, 14న రాజ్కోట్లో రెండో వన్డే, 18న ఇండోర్లో మూడో వన్డే జరగనున్నాయి. ఇక నాగ్పూర్, రాయ్పూర్, గువాహటి, విశాఖపట్నం, త్రివేండ్రంలో టి20 సిరీస్ జరగనుంది. జనవరి 28న భారత్, న్యూజిలాండ్ నాలుగో టి20 మ్యాచ్కు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ ఎనిమిది మ్యాచ్ల్లో ఒకటి హైదరాబాద్ వేదికగా జరగడం ఖాయమే అని అంతా భావించినా... అపెక్స్ కౌన్సిల్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల... దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025–26వ సీజన్ ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. రెండు దశలుగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ప్లేట్ గ్రూప్లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు... ఎలైట్ గ్రూప్నకు అర్హత సాధించనుంది. ఎలైట్లో పేవల ప్రదర్శన చేసిన ఒక జట్టు తదుపరి సీజన్లో ప్లేట్ గ్రూప్నకు పరిమితం కానుంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయించారు. గతేడాది రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్లో ఆడిన మేఘాలయ జట్టు ఏడు మ్యాచ్ల్లోనూ ఓడింది. దీంతో ఆట నాణ్యత దెబ్బతింటుందని భావించిన అపెక్స్ కౌన్సిల్... ఈశాన్య రాష్ట్రాల జట్ల నుంచి ఎలైట్ గ్రూప్నకు ప్రమోషన్ ఇచ్చే పద్ధతిని పక్కన పెట్టింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు తొలి దశ రంజీ మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండో దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 28 వరకు నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. ఆగస్టు 28 నుంచి జోనల్ ఫార్మాట్లో దులీప్ ట్రోఫీ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఇరానీ కప్ నిర్వహించనున్నారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉన్న క్వార్టర్ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల తరహాలో కాకుండా... ఈ సీజన్ నుంచి ‘సూపర్ లీగ్’ నిర్వహించనున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. దేవజిత్ సైకియా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతించెందడంతో అపెక్స్ కౌన్సిల్ ఉత్సవాలకు సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించనుంది. ఇందు కోసం బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది. ‘ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని అపెక్స్ కౌన్సిల్ ఒక కొత్త కమిటీని నియమించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ కమిటీ విధివిధానాలు సిద్ధం చేయనుంది’ అని బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్కు మళ్లీ పరాజయమే...
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో భారత సీనియర్ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. భారత్ తరఫున అభిషేక్ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42వ ని.), జోయెల్ రింటాల (56వ ని.), టామ్ క్రెయిగ్ (60వ ని.) తలా ఒక గోల్ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్కు అర్హత సాధించాలనుకున్న భారత్కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్ లెగ్లో మొదట నెదర్లాండ్స్తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్ల్లో భారత్ ఓడింది. రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... ఆరంభంలో భారత్ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్ 8వ నిమిషంలోనే అభిషేక్ గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో మరో గోల్ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. మూడో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ ఎఫ్రామస్ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంతో భారత్కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్... ఆసీస్తో రెండో మ్యాచ్ ఆడుతుంది.
బిజినెస్

తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు.

స్పైస్జెట్ లాభాలు మూడింతలు
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో రూ.325 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం (2023–24) క్యూ4లో ప్రకటించిన రూ.119 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. నిర్వహణ ఆదాయం మాత్రం రూ.1,719 నుంచి రూ.1,446 కోట్లకు తగ్గింది. ‘‘మార్చి క్వార్టర్లో రికార్డు స్థాయి నికర లాభాన్ని ఆర్జించగలిగాము. ప్రమోటర్ గ్రూప్ క్యూ4లో రూ.294 కోట్లు సహా మొత్తం రూ.500 కోట్లు మూలధనాన్ని సమకూర్చింది. ఇది కంపెనీ దీర్ఘకాలిక దృష్టి, సామర్థ్యంపై నమ్మకాన్ని సూచిస్తుంది’’ అని స్పైస్జెట్ తెలిపింది. కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికిగానూ గత ఏడేళ్లలో తొలిసారి రూ.59 కోట్ల లాభాన్ని ప్రటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.409 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజాగా నిర్వహణ ఆదాయం 25% క్షీణించి రూ.7,050 కోట్ల నుంచి రూ.5,284 కోట్లకు దిగివచి్చంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వైమానిక పరిశ్రమ వారికి బాసటగా ఉంటుందన్నారు.

సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు.

ఆఫీస్ స్పేస్కి అమెరికన్ సంస్థల దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి. ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సరీ్వసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు.
ఫ్యామిలీ

పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు)

మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు
తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. ‘‘నీ కోసమే బతుకుతున్నా!’’ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్తో బతకాల్సి వస్తుంది. ‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా కోపానికి దారి తీస్తుంది. దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్ బిలీఫ్ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. ‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్ మైండ్ సెట్ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్తో పిల్లలు ఎదుగుతారు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్)

ఇంద్రద్యుమ్నుడి కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.∙సాంఖ్యాయన

దేవుడు ముడివేసిన బంధం
లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్ ఈజ్ గాడ్’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్. ఆ ఎమోషన్స్ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్లోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న అవనీశ్ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్ లాంటి స్పెషల్ చిల్డ్రన్ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్ ఫాదర్కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్ బెస్ట్ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్ దివిగికర్ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్ కజిన్ కరణ్.. సుశాంత్ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్ తండ్రి ప్రదీప్ దివిగికర్కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్.. సుశాంత్ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్ గే ఇండియా’ 2014 టైటిల్ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్ గే వరల్డ్’ చరిత్రలో అత్యధిక సబ్–టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఇండియన్ తనే. అదే ఏడాది సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్’ అని అభివర్ణించి ఆఫర్ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్కి ఇన్స్టాగ్రామ్లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్ అయ్యాడు. అలా, లహర్ జోషీ ఒక ‘స్టే–ఎట్–హోమ్ డాడ్’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్ని చేశారు రాజేష్. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్తంత్ర’ అనే బొటిక్ జ్యూలరీ బ్రాండ్తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్ గుజరాత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్ ఖాన్తో కబీర్, డా.కేదార్ పడ్తేఅది 2007. యూసఫ్ ఖాన్ అనే 26 ఏళ్ల మ్యూజిక్ టీచర్.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్లో ‘ద మ్యూజిక్ బాక్స్’ అనే మ్యూజిక్ స్కూల్ను నడుపుతున్న యూసఫ్.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్ 3న పనాజీలో కబీర్ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్లోనే ఉంటున్నాడు యూసఫ్. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన ‘గువో గ్యాంగ్టాంగ్’ అనే తండ్రి కథ యావత్ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్ జెన్స్ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్ సైకిల్ కొనుక్కుని, దాని వెనుక మిస్ అయిన కొడుకు ఫొటోను బ్యానర్గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్ ఆఫ్ ది సెర్చింగ్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్ఏ టెక్నాలజీతో జిన్ జిన్ ను కనుగొన్నామని, అతడు హేనాన్ ప్రాన్స్లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్ జెన్ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్ అండ్ లవ్’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్ డే!
ఫొటోలు
అంతర్జాతీయం

విమానం కూలిపోలేదు కావాలనే కూల్చేశారు!!
మీరు విన్నది నిజమే.. ఈ విమానం కూలిపోలేదు.. కూల్చేశారు.ఎందుకో తెలుసా? విమానంలో ఏ సీట్లు సేఫ్ అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం..అయితే, ఇది జరిగింది ఇప్పుడు కాదు.. 2012లో.. ఆ విమానం కూడా బోయింగ్ కంపెనీదే.. తాజా విమాన ప్రమాదంలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ మృత్యుంజయుడిలా తిరిగొచ్చిన నేపథ్యంలో 2012లో ఏం జరిగిందన్న విషయం మీ కోసం.. మెక్సికోలోని సొనొరన్ ఎడారి.. విమానాలు కూలిపోయినప్పుడు ఏ సీట్లు సేఫ్ అన్న విషయాన్ని తెలుసు కోవడం కోసం ఓ ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు అనుకున్నారు. దీన్ని డాక్యుమెంటరీగా తీయడానికి ముందుకొచ్చిన చానెల్ 4, డ్రాగన్ ఫ్లై అనే టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ.. అప్పట్లోనే దీని కోసం రూ. 13 కోట్లు ఖర్చుపెట్టాయి. విమానంలో కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. ప్రమాద సమయంలో మనుషుల్లో ఏయే ఎముకలు విరిగే చాన్సుందో తెలుసుకోవడానికి మన ఎముకల నిర్మాణం ఎలా ఉంటుందో అలాంటివే కలిగిన డమ్మీ బొమ్మలను ఉంచారు. వాటిని మూడు రకాల పొజిషన్లలో కూర్చోబెట్టారు. ఒకటి.. సీటు బెల్ట్ పెట్టుకుని, బ్రేస్ పొజిషన్ (క్రాష్ ల్యాండింగ్ టైంలో ఇదే సురక్షితమైన పొజిషన్)లో, రెండు.. బెల్ట్ పెట్టి.. మామూలుగా కూర్చోబెట్టారు. మూడు.. బెల్ట్ లేకుండా.. బ్రేస్ పొజిషన్లో కాకుండా మామూలుగా కూర్చోబెట్టారు. ఆ బోయింగ్ 727 విమానాన్ని 2,500 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాక.. పైలట్ పారాచూట్ ద్వారా బయటకు దూకేశాడు. తర్వాత ఆ విమానాన్ని వెనుక చిన్నపాటి విమానంలో వస్తున్న పైలట్ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపి, కూల్చేశాడు. బిజినెస్ క్లాస్.. భద్రత పెరగదు..బిజినెస్ క్లాస్కు రేటెక్కువ చెల్లించినంత మాత్రాన.. దానికి తగ్గట్లు భద్రత పెరగదని ఈ పరిశోధనలో తేలింది. విమానం కూలితే.. మిగిలినవారితో పోలిస్తే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్కు దగ్గర్లో ఉండే.. ఎకానమీ క్లాసులోని వారే బతికే అవకాశాలు ఎక్కువని నిర్ధారణ అయింది. ఇందులో తొలి 11 వరుసల సీట్లు పూర్తిగా చిన్నాభిన్నమైపోయాయి. ఈ సీట్లలో ఎవరూ బతికే అవకాశం లేదని తేల్చారు. వెనుక ఉన్న సీట్లలో 75% మంది (విమానం పేలిపోలేదు గనుక) బతికే అవకాశముందని శాస్త్ర వేత్తలు చెప్పారు. చదవండి: విమానంలో 11ఏ సీటును ఎందుకు ఇష్టపడరో తెలుసా?కూలిన ప్పుడు ఎయిర్క్రాఫ్ట్ బాడీ ఎంత తీవ్ర తను తట్టుకోగలదు అన్న విషయాన్నితెలుసుకోవడానికి కూడా ఈ ప్రయోగం ఉపయోగపడిందని తెలిపారు. అప్పటి 727 బ్లాక్ బాక్స్ సమాచారాన్ని విశ్లేషించిన అన్నే ఇవాన్స్.. అప్పటితో పోలిస్తే.. ఇప్పటి విమానాల్లో భద్రత బాగా పెరిగిందని చెప్పారు. అయితే.. తనను విమానంలో సీటు ఎంచుకోమన్నా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్కు దగ్గర్లో ఉన్న వరుసల్లోని సీటునే ఎంచుకుంటానని చెప్పారు. 2012 కన్నా ముందు.. ఇలాంటి పరీక్షనే 1984లో బోయింగ్ 720 విమానంతో నాసా నిర్వహించింది.

కశ్మీర్.. పాక్దంటూ తప్పుడు మ్యాప్.. వెంటనే క్షమాపణలు కోరిన ఇజ్రాయెల్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ను పాకిస్తాన్కు చెందినదిగా గుర్తిస్తూ, భారత అంతర్జాతీయ సరిహద్దుల తప్పుడు మ్యాప్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎస్) కొద్దిసేపటికి తమ పొరపాటును గమనించి, భారత్ను క్షమాపణలు కోరాయి. ఈ మ్యాప్లో సరిహద్దులను ఖచ్చితంగా చిత్రీకరించలేదని అని ఐడీఎఫ్ అంగీకరించింది. కొందరు భారతీయులు చేసిన ట్వీట్ల దరిమిలా, ఐడీఎఫ్ ఈ విధంగా స్పందించింది.భారతీయుల మండిపాటు..పలువురు యూజర్లు మ్యాప్లోని లోపాన్ని ఎత్తి చూపుతూ, ఇజ్రాయెల్ సైన్యం వెంటనే ఈ పోస్ట్ను ఉపసంహరించుకోవాలని కోరారు. కొందరైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తమ పోస్టులకు ట్యాగ్ చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీకి చెందిన ‘ఎక్స్’ హ్యాండిల్లో వచ్చిన ఒక ట్వీట్పై ఇజ్రాయెల్ రక్షణ దళాల స్పందించాయి. ఈ మ్యాప్ సరిహద్దులను ఖచ్చితంగా చూపించడంలో విఫలమైంది. జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాల పోస్ట్ వెలువడిన 90 నిమిషాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. Now you understand why India remains neutral. In diplomacy, no one's really your friend.— Indian Right Wing Community (@indianrightwing) June 13, 2025భారత్ ఏనాడో స్పష్టం..ఐడీఎఫ్ పోస్ట్ చేసిన తప్పుడు మ్యాప్పై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. దశాబ్దాలుగా పాకిస్తాన్, చైనాలు ఆక్రమించుకున్న జమ్ముకశ్మీర్, లడఖ్లోని కొన్ని ప్రాంతాలు దేశంలో అంతర్భాగమని భారత్ ఏనాడో స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని దీనిని పునరుద్ఘాటించారు. గత కొన్నేళ్లుగా భారత్- ఇజ్రాయెల్ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నాయి. 2017లో ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. ఈ నేపధ్యంలో భారతదేశ సరిహద్దులకు సంబధించిన తప్పుడు మ్యాప్ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. Iran is a global threat.Israel is not the end goal, it’s only the beginning. We had no other choice but to act. pic.twitter.com/PDEaaixA3c— Israel Defense Forces (@IDF) June 13, 2025ఇజ్రాయిల్ క్షిపణి సామర్థ్యం పరిధిలో..‘ప్రపంచానికున్న పెను ముప్పు ఇరాన్.. ఇదొక్కటే ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే’ అంటూ ఇజ్రాయెల్ సైన్యం పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు ప్రాంతాలను చూపించే మ్యాప్ను జత చేసింది. దీనిలో భారత సరిహద్దులను తప్పుగా చూపింది. ఈ మ్యాప్లో ఇరాన్ చుట్టూ ఎరుపు రంగు వృత్తాలు ఉన్నాయి. ఇవి టెహ్రాన్కున్న క్షిపణుల పరిధిని సూచిస్తాయి. సౌదీ అరేబియా, ఆఫ్రికాలో లిబియా, ఇథియోపియా, ఆసియాలో భారత్, చైనా, ఐరోపాలో రొమేనియా, బల్గేరియా, రష్యా, టర్కీలు ఈ వృత్తాలలో కనిపిస్తున్నాయి. ఈ మ్యాప్ వివాదిస్పదంగా మారింది. Iran is a global threat.Israel is not the end goal, it’s only the beginning. We had no other choice but to act. pic.twitter.com/PDEaaixA3c— Israel Defense Forces (@IDF) June 13, 2025 ఇది కూడా చదవండి: Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం

ఇరాన్కు టెన్షన్.. ఖమేనీ టార్గెట్గా విరుచుకుపడిన ఇజ్రాయెల్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా రెండు దేశాలు పరస్పర దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు.. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాడుల కారణంగా ఇప్పటికే 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు. ఇక, ఇజ్రాయెల్లో ఒకరు మృతి చెందగా.. 39 మంది గాయపడినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇరాన్ టాప్ లీడర్లే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.మరోవైపు.. ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. గుటెర్రస్ ట్విట్టర్ వేదికగా.. ఇరు దేశాలు ఉద్రిక్తతలను ఆపాలని పిలుపునిచ్చారు. శాంతి, దౌత్య మార్గంలో చర్చలు జరపాలన్నారు. దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.

తారాస్థాయికి ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. 10 తాజా పరిణామాలు
టెహ్రాన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పరస్పరం చోటుచేసుకున్న వైమానిక దాడులు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచాయి. తన చిరకాల శత్రువు అయిన ఇజ్రాయెల్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులకు దిగినట్లు ఇరాన్ చెబుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్ వైమానిక దాడులకు సంబంధించిన 10 ముఖ్యమైన పరిణామాలు ఇలా ఉన్నాయి.1. ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లను మోగించారు. ఇవి స్థానికులను భద్రత దిశగా పరిగెత్తేలా చేశాయి. ఇరానియన్ క్షిపణులను అడ్డుకునేందుకు తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.2. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం డజన్ల కొద్దీ క్షిపణులను ఇరాన్ నుండి ప్రయోగించారు. వాటిలో కొన్నింటిని అడ్డుకున్నారు. ఈ దాడిలో ప్రాణనష్టంపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. అయితే శిధిల ప్రదేశాలలో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.3.ఇజ్రాయెల్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం టెల్ అవీవ్లో ఒక క్షిపణి కూలిపోయింది. జెరూసలేంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దీని వెనుక ఇరానియన్ దాడులు ఉన్నాయా? లేదా ఇజ్రాయెల్ రక్షణ చర్యలు ఉన్నాయా అనేది వెల్లడికాలేదు.4. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాము మరిన్ని దాడులు చేయబోతున్నామన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిందని ఆరోపించారు.5. రాజధాని టెహ్రాన్లో కూడా భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.6. ఇరాన్ ఫార్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి రెండుసార్లు దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మూడవ దఫా వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇది జరిగింది. ఇరాన్ సైనిక స్థావరాలు, అణు ప్రదేశాలు, కమాండర్లు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.7. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇకపై సురక్షితంగా ఉండబోదని, ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.8. టెల్ అవీవ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 34 మంది గాయపడ్డారని, వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలయ్యాయని ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. తరువాత ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు.9. ఇజ్రాయెల్ దిశగా కదులుతున్న ఇరానియన్ క్షిపణులను కూల్చివేసేందుకు యూఎస్ మిలిటరీ సహాయం చేసిందని ఇద్దరు యూఎస్ అధికారులు తెలిపారు.10. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రాంతీయ ఘర్షణల భయాలను మరింతగా పెంచాయి.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
జాతీయం

వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
రాయ్పూర్: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్పై కూర్చుని కేక్ కట్ చేస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్ కటింగ్ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india)

Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడాన్ని గమనించాడు. ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న 20 మంది బాధితులను ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..

ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి
డెహ్రాడూన్: అహ్మాదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయింది. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉండగా.. పైలట్తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. Uttarakhand helicopter crash | Today, at around 5:20 am, a helicopter, which was going from Shri Kedarnath Dham to Guptkashi, has been reported to have crashed near Gaurikund. There were six passengers, including the pilot (5 adults and 1 child). The passengers in the helicopter… pic.twitter.com/AVGtuxWKGj— ANI (@ANI) June 15, 2025మృతుల వివరాలు..రాజ్వీర్- పైలట్. విక్రమ్ రావత్,వినోద్, త్రిష్టి సింగ్, రాజ్కుమార్, శ్రద్దా, రాశి(10).. #UPDATE | Uttarakhand helicopter crash: The helicopter that crashed had taken off for Gaurikund after taking devotees to Kedarnath. There were seven people on board. The place where this accident took place is a very remote area. Police and SDRF teams have left for the spot: IG…— ANI (@ANI) June 15, 2025మరోవైపు.. హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా..‘రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. Chopper Crash in Gaurikund, UttarakhandIt is a very serious situation: Harshvardhan, Aviation Expert tells @anchoramitawTimes Now's Abhishek Sinha & @RishabhMPratap share more details. pic.twitter.com/cMazWahTM4— TIMES NOW (@TimesNow) June 15, 2025 #UPDATE | The helicopter that went missing in Gaurikund has crashed. There were six people on board the crashed helicopter. More details awaited: Uttarakhand ADG Law and Order, Dr V Murugeshan https://t.co/vDaSNjtSva— ANI (@ANI) June 15, 2025

‘171’ నంబర్కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ‘ఏఐ171’అనే నంబర్ కలిగిన బోయింగ్ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగించాయి.ఇక, అహ్మదాబాద్–లండన్ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్తో పిలువనున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్171’నంబర్ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్ ఇండియా పైలట్ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఎన్ఆర్ఐ

NRI News : వెన్నుపోటు దినం యూకేలో ఎన్ఆర్ఐల నిరసన
జూన్ 4 వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో UK లోని ఈస్ట్ లండన్ మరియు లెస్టర్ నుంచి నిరసన తెలియజేసారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అనేక సంక్షేమ పథకాలనుతుంగలోకి వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి , చల్లా మధుసూదన్ యాదవ్ , ప్రణయ్ గడిమే ఆనంద్ అక్కిదాసు, రామిరెడ్డి జయచంద్రా రెడ్డి , చలపతి గుర్రం,యశ్వంత్ గరికపాటి,సాయి ప్రదీప్ పాల్గన్నారు.ఒకరికి ముగ్గురు చొప్పున( చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పురందరేశ్వరి ) చెప్పిన అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విద్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!

బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్ఆర్ఐలు
సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్ఆర్ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

న్యూయార్క్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు. సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: న్యూజిలాండ్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Dallas: తెలుగు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్
డల్లాస్: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు అండగా ఉంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో(Telangana Formation Day) పాల్గొని ప్రసంగించారాయన. డల్లాస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్(KTR) మాట్లాడుతూ..‘అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. 2001లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్పూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చారు. జూన్ 2.. 60 ఏండ్ల కల నిజమైన రోజు! దశాబ్దాల ఆశయాలు.. ఆశలు.. ఆకాంక్షలు.. కలలు ఫలించిన రోజు!అసాధ్యాలను సుసాధ్యం చేయడమే తెలంగాణ స్టైల్. అసంభవం అనుకున్న ఎన్నో కార్యాలను సంభవం చేసి చూపించింది తెలంగాణ, దేశానికి దిక్సూచిగా మారింది. దశాబ్దాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద రాష్ట్రాలను… pic.twitter.com/LkVA8BXOZL— BRS Party (@BRSparty) June 2, 2025.. నిన్నటి వరకు తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నాను.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్లో ఉంది. అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్(BRS Legal Cell) ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది’ అని కేటీఆర్ హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: అదే స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించాలి: కేసీఆర్
క్రైమ్

రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.విజయ్చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్చంద్ర అప్పులపాలయ్యాడు.ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది.ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విద్యుత్ కార్మికులకు కరెంట్ షాక్..
డోర్నకల్ /కేసముద్రం/నల్లబెల్లి/ముస్తాబాద్ (సిరిసిల్ల) /మల్లాపూర్: ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో నలుగురు విద్యుత్ కార్మికులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, సిరిసిల్ల జిల్లాలో కిందపడిన విద్యుత్ తీగను సరిచేస్తూ షాక్కు గురై ఓ కూలీ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన బి.క్రాంతికుమార్ (32) ఐదేళ్లుగా డోర్నకల్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మున్నేరువాగు వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ ప్రత్యేక యాప్ ద్వారా అనుమతి కోరగా.. సరఫరా నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ట్రాన్స్ఫార్మర్పైకి వెళ్లి మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. అతడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోల్పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణంవిద్యుత్ స్తంభంపైకెక్కి తీగలు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన దుంపేట రాజేశం (40) కొత్తదాంరాజుపల్లి సబ్స్టేషన్ పరిధిలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాల్గొండలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్కు గురై స్తంభంపై నుంచి కిందపడి మృతిచెందాడు. కరెంట్షాక్తో కూలీ దుర్మరణంరాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి రాజయ్య(48) ఇంట్లో శనివారం విద్యుత్ సర్వీస్ తీగ తెగిపడింది. దానిని పక్కకు తీస్తూ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాజయ్య భార్య గతంలోనే చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.మరో రెండు ఘటనల్లో ఇద్దరికి గాయాలు..వరంగల్ జిల్లా పంతులుపల్లికి చెందిన నీలం శ్రీనివాస్ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గోవిందాపూర్ ఫీడర్లో ఎల్సీ తీసుకుని శివారు లైన్తండాలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేపడుతున్నాడు. అయితే ఏఎల్ఎం బాసు.. మద్యం మత్తులో ఉండి ఎల్సీ తీసుకున్న విషయం మరిచిపోయి ఫీడర్ను ఆన్ చేశాడు. దీంతో శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. ఏఎల్ఎం బాసు మద్యం తాగినట్లు గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ బూర్గుల అంబేడ్కర్ రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి సమీప వ్యవసాయక్షేత్రంలో ట్రాన్స్ఫార్మర్ను బిగించే క్రమంలో షాక్కు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి పంపించారు.

భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
కర్ణాటక: భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేని భార్య నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో భర్త ఆస్పత్రిలో చనిపోయాడు. కావేరిపట్టణం వద్ద ఈ సంఘ టన జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాం తానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47), అతని భార్య కవిత(44). ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సూర్య (23) కొడుకు న్నాడు.రంగస్వామి తాగుడుకు అలవాటు పడ డంతో పాటు గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీం తో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 9వ తేదీన రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రంగస్వా మిపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలేర్పడిన అతన్ని కొడుకు సూర్య చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకె ళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలితంలేక బుధవారం రాత్రి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సొంతూరు వెళ్లొస్తానని.. కారులో శవమై..
జి.కొండూరు(ఎన్టీఆర్): సొంతూరు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కారులో శవమై కనిపించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రెడ్డిగూడెం మండల పరిధి మొద్దులపర్వ నివాసి అన్నెబోయిన నాగరాజు(38). జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన అక్క కూతురు శివపార్వతితో అతనికి 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు గిరికుమార్, కూతురు రేష్మ ఉన్నారు. నాగరాజు వెలగలేరులోనే నివసిస్తూ జేసీబీ ఆపరేటర్గా చేస్తున్నాడు. మొద్దులపర్వ వెళ్తున్నానని చెప్పి.. ఈ క్రమంలో గురువారం విజయవాడ వెళ్లి కారును అద్దెకు తీసుకున్న నాగరాజు, ఇంటికొచ్చి సొంత గ్రామం మొద్దులపర్వ వెళ్తున్నానని భార్యకు చెప్పి సాయంత్రం వేళ వెళ్లాడు. మరుసటిరోజు శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో భార్య శివపార్వతికి నాగరాజు ఫోన్ చేశాడు. మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం అమ్ముతున్నట్లు, ఇక అప్పులు అన్నీ తీరిపోతాయని, చార్జింగ్ లేదని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు అతని భార్య చెబుతున్నారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి వెలగలేరు వద్ద ఓ హోటల్ ఎదురుగా కారు ఆగి ఉండడాన్ని స్థానికులు గమనించారు. దానిలో శవం ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారుని పరిశీలించగా కారులో నాగరాజు శవమై కనిపించాడు. మైలవరం ఏసీపీ ప్రసాదరావు, సీఐ దాడి చంద్రశేఖర్, జి.కొండూరు ఎస్ఐ సతీష్ కుమార్లు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయాలంటూ బెదిరింపు!కారులో శవమై కనిపించిన నాగరాజు భార్య శివపార్వతితో ‘సాక్షి’ నేరుగా మాట్లాడింది. ఈ క్రమంలో శివపార్వతి.. వెలగలేరులో ఇంటి నిర్మాణం నిమిత్తం విస్సన్నపేటకు చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద తన భర్త నాగరాజు మొద్దుల పర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలం తనఖా పెట్టి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 15రోజుల క్రితం సదరు వడ్డీ వ్యాపారి కుటుంబ సభ్యులతో వెలగలేరు వచ్చి అప్పు వెంటనే చెల్లించడం లేదా మొద్దులపర్వలో ఉన్న ఇల్లు, ఇళ్ల స్థలాన్ని జూన్ నెల 13వ తేదీ లోపు తన పేరుతో శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలని కోరారని చెప్పింది. చెప్పినట్లు చేయకపోతే తడాఖా చూపిస్తానంటూ సదరు వడ్డీ వ్యాపారి బెదిరించినట్లు ‘సాక్షి’కి వివరించారు. ఇంతలోనే భర్త శవమై కనిపించడంపై శివపార్వతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో ఒక్కడే వచ్చాడా? కారులో శవమై కనిపించిన నాగరాజు శుక్రవారం ఉదయం ఒక్కడే కారులో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11గంటల సమయంలో వెలగలేరు వద్ద హోటల్ ఎదురుగా కారు ఆపిన నాగరాజు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు వద్ద కిందకు దిగి తూలుతూ ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న నాగరాజు బడ్డీ కొట్టు వద్ద పడుకోబోతున్న క్రమంలో అతని నుంచి విపరీతమైన వాసన వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లాలని ఆ పక్కనే నివసిస్తున్నవారు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి సాయంతో నాగరాజు కారులో ఎక్కి కూర్చున్నట్లు సమాచారం. కొద్ది గంటలు గడిచాక నాగరాజు కారులో నుంచి దిగకపోవడంతో స్థానికులకు ఆనుమానం వచ్చి డోరు తెరిచి చూడగా నాగరాజు శవమై కనిపించాడు. అతను తూలుతూ కనిపించడంతో పాటు గొంతు వద్ద కాలినట్లు తోలు లేచిపోయి ఉండటంతో నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగరాజుది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేల్చేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలను సేకరిస్తున్నారు. కారు ఆగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు సైతం నాగరాజు ఒక్కడే కారులో వచ్చినట్లు గుర్తించారని తెలుస్తుంది. అయితే అతనికి కారులో ఊపిరాడక మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.