Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Fathers Day 2025: Ys Jagan Emotional Tweet About His Father Ysr1
నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే స్ఫూర్తి.. వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఫాదర్స్‌ డే సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తండ్రి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.‘‘మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా’’ అంటూ వైఎస్సార్‌ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. You have always been my inspiration, aspiration and role model. నాకు నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.Happy Father’s Day! Remembering the closing Day of your historic Padayatra! pic.twitter.com/Xn8qqadyKm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 15, 2025

ysrcp Buggana Rajendranath Satirical Comments On CBN Govt2
‘సూపర్‌ సిక్స్‌ కాదు.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌’

సాక్షి, హైదరాబాద్‌: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్‌ సిక్స్‌ ఏమో కానీ.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌ అని సెటైర్లు వేశారు. ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు. ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్‌కు మా బడ్జెట్‌కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్‌ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్‌సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి. అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.ఉద్యోగులకు మోసం.. ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్‌లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్‌సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Indrayani River Bridge Collapses At Kund Mala3
indrayani river bridge collapses: పూణెలో ఘోర ప్రమాదం

మహరాష్ట్ర: పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై (indrayani river bridge collapses) పురాతన కూలిన వంతెన కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు.పోలీసుల సమాచారం మేరకు.. పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund MalaRead in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR— Punekar News (@punekarnews) June 15, 2025పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్‌డీఆర్‌ఫ్‌ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #Maval Bridge collapsed ,5 tourist feared to be dead.On weekend huge #ITcrowd visit these places we pray for everyones saftey . Morethan 25 are missing .30We hope govt should audit all tourist hot spot to ensure everyones saftey .#IndrayaniRiver #Kundamala #BridgeCollapse pic.twitter.com/IOU6XJj0Fy— Forum For IT Employees - FITE (@FITEMaharashtra) June 15, 2025

Tech skills for youth in remote villages A new chapter with the efforts of NxtWave NSDC4
మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్‌ శిక్షణ.. నెక్స్ట్‌ వేవ్‌ & ఎన్‌ఎస్‌డిసి కృషితో కొత్త అధ్యాయం

ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్‌ వేవ్‌, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆంట్రప్రైన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్‌కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్‌ వేవ్‌ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్‌లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్‌లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్‌తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్‌ వేవ్‌ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్‌ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్‌ కావురి హబ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, తెలంగాణ, 500032

Air crash victims: How to manage fear of flying5
Plane Crash: పాపం బాధితులు ఆ ఫోబియాతో..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అందులో ప్రయాణించే ప్రయాణికులే గాక, ఆ ఘటనలో మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులు, పక్కనే ఉన్న టీ స్టాల్‌లో పనిచేసే వ్యక్తుల తోసహా అందరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. అంతా క్షణాల్లో బూడిదైపోయారు. ఈ ప్రమాద ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది. అయితే ఇలాంటి ఘెర విమాన ప్రమాదం బారినపడి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయులెందరో ఉన్నారు. కానీ వారంతా మానసికంగా కోలుకోవడం అంత ఈజీ కాదట. చావుని చాలా దగ్గరగా చూసి రావడంతో విమానం అన్న, ఆ శబ్దం విన్నా..హడిలిపోతారని చెబుతున్నారు నిపుణులు.చాలామటుకు ఆయా బాధితులు ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియాతో బాధపడుతుంటారట. మళ్లీ విమానం ఎక్కే సాహసం చేయరట. ఎంత కష్టమైన కార్లు, లేదా రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారట. కొందరైతే ప్రయాణాలే చేయరట. ఇలానే ఓ మహిళ 2010లో ఓ విమాన ప్రమాదం బారినపడి తండ్రిని కోల్పోయింది. దాంతో ఆమె దాదాపు 10 ఏళ్ల వరకు విమానంలో ప్రయాణమే చేయలేదట. మరి ఇంతలా భయబ్రాంతులకు గురిచేసే ఆ విమాన ప్రమాద భయాన్ని ఎలా అధిగమించి ఇదివరకటిలో హాయిగా జీవించాలంటే..కొన్ని మానసిక ఆరోగ్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో సవివరంగా చూద్దామా..!.విమాన ప్రమాదం బారినపడిన బాధితులు విమాన ప్రయాణం అనే పదం ప్రస్తావిస్తేనే భయాందోళనకు గురై వణికిపోతుంటారట. విమానం చూడటం, సంబంధిత విమాన టికెట్‌ అన్న భయపడతారట. సాధారణంగా ఏ వ్యక్తి అయిన తీవ్రంగా ప్రభావితమవ్వడం, భయానికి గురవ్వడం జరుగుతంది. అయితే కొందరిలో ఆ భయం తీవ్ర రూపం దాల్చి ఏవియోఫోబియా లేదా ఏరోఫోబియా బారిన పడతారట.అలాంటి వ్యక్తులకు మొదట ఆందోళనకు సంబంధించిన మందులు ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత విమాన ప్రయాణం భయంకరమైనది కాదు అని తెలసుకునేలా కుటుంబసభ్యుల మద్ధుతు తోపాటు కౌన్సిలర్ల సాయం తీసుకోవాలి. విమాన భయం అధిగమించేందుకు..భయం పోయేలా 4-7-8 పద్ధతిలో శ్వాస వ్యాయామలు చేయిస్తారు. నాడీ వ్యవస్థ స్థిమిత్తంగా ఉండేలా చేసి, భయానికి సంబంధించిన ఆలోచనలు దరిచేరనివ్వకుండా చూస్తారు. విమనాలు, వాటికి సంబంధించిన ఆడియోలను వారితో షేర్‌ చేసుకుంటూ..ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వివరించడం వంటివి చేస్తారు. తాను అనుభవించిన చేదు అనుభవాలు తాత్కలికమే విషయం గ్రహించేలా చేస్తారు. తరుచుగా ఆగి ఉన్నవిమానం వద్దకు తీసుకువెళ్లడం, అందులో కూర్చొనేలా చేసి..ఆయా బాధితుల్లో దాగున్న భయాన్ని పూర్తిగా పోగొడతారు. ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పోజర్ థెరపీ (VRET)తో..విమానం ఎగిరే వివిధ దశలను (టేకాఫ్, టర్బులెన్స్ అండ్‌ ల్యాండింగ్) అనుభూతి చెందేలా వీఆర్‌ హెడ్‌సెట్‌ని ఉపయోగిస్తారు. ఆసమయంలో బాధితులు వ్యక్తికరించే వారి భావోద్వేగాలను గమనిస్తూ..కౌన్సిలర్‌ బాధితులకి ధైర్యాన్ని అందించేలా సహాయం చేస్తుంటాడు. అలా వాళ్లు నెమ్మదిగా ఆ భయాన్ని అధిగమించి తిరిగి విమాన ప్రయాణం చేయడానికి చాలా సమయమే పడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆ భయం నుంచి బయటపడటానికి ఆయా వ్యక్తుల మానసికి పరిస్థితి ఆధారంగా..కనీసం ఆరు నుంచి పదేళ్లు పడుతుందని చెబుతున్నారు. దేన్నైనా లైట్‌గా తీసుకునేవారు..సానుకూల దృక్పథంతో ఉండేవారు సులభంగా ఈ విమాన ప్రమాద భయాన్ని జయించగలరని చెబతున్నారు నిపుణులు.(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్‌)

RS 16 Crores Need To Kid Mohana In Eastgodavari 6
చిన్నారికి ఎంత కష్టం.. వైద్యానికి రూ. 16 కోట్లు అవసరం!

కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు.

Rishab Shetty Escapes Major Incident Kantara Shooting7
'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో

'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్‌కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్‪‌లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

Air India plane crash: Former Gujarat CM Vijay Rupani body identified8
Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్‌ రూపానీ భౌతికఖాయం

గాంధీ నగర్‌: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్‌ ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్‌ బీజేపీ సీనియర్‌ నేత మాజీ సీఎం విజయ్‌ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్‌ కోట్‌లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్‌వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్‌ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025

Temba Bavuma scripts history After WTC win9
చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే

టెంబా బావుమా.. ప్ర‌స్తుతం ఈ పేరు వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచ‌ర్‌, గ్రేమ్ స్మిత్‌, హ‌షీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గ‌జ కెప్టెన్‌లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గ‌త 27 ఏళ్ల అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా త‌న దేశానికి తీసుకొచ్చాడు.లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆసీస్‌ను బావుమా సార‌థ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో స‌ఫారీలు రెండో ఐసీసీ టైటిల్‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బావుమా కెప్టెన్‌గా, ఆట‌గాడిగా ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల‌తో కీల‌క నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్‌లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతూనే.. జ‌ట్టును ముందుండి న‌డిపించాడు. 134 బంతుల్లో 66 ప‌రుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు.చ‌రిత్ర సృష్టించిన బావుమా..తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయ‌ర్‌గా బావుమా నిలిచాడు.బావుమా ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది మ్యాచ్‌ల‌లో ప్రోటీస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించింది. మ‌రొక‌టి డ్రాగా ముగిసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ ఫీట్ సాధించ‌లేక‌పోయారు. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్‌మన్ కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌ల‌లో తొమ్మిది విజ‌యాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది.బావుమా కెప్టెన్సీలో మాత్రం ద‌క్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్‌ల‌లో ఒక్క‌టి కూడా ఓడిపోలేదు. చాప్‌మన్ 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్‌.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ

Ponguleti Said Schedule For Local Body Elections Likely To Be Released By End Of June10
ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్: పొంగులేటి

సాక్షి, ఖమ్మం: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, ఏదులాపురం, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి(సోమవారం) కేబినెట్ సమావేశంలో చర్చించక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు.తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని.. అవి పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని.. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వలంటూ ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి.. మీ మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటు పాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని పొంగులేటి పిలుపునిచ్చారు.రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తాం. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగింది. రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని.. ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. మీ మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలి’’ అని పొంగులేటి చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement