ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది! | Allu arjun and Surender Reddy on Race Gurram Sequel | Sakshi
Sakshi News home page

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

Published Mon, Aug 24 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

‘‘రామ్‌చరణ్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకుంటుండగా కళ్యాణ్‌రామ్‌గారు నాతో  సినిమా చేద్దామనుకున్నారు. అలా ‘కిక్-2’ స్టార్ట్ అయింది’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన  ‘కిక్-2’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆదివారం పాత్రికేయులతో అన్నారు సురేందర్ రెడ్డి. మరికొన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘‘కిక్’ తండ్రి కథ, ఇది కొడుకు కధ కాబట్టి ‘కిక్-2’ అని డిసైడయ్యాం. షూటింగ్ త్వరగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పట్టింది.
 
 ఈలోపు ‘బాహుబలి’ విడుదల కావడంతో, మా సినిమా విడుదలకు కొంత గ్యాప్ తీసుకున్నాం. బడ్జెట్ ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోను. అయితే ద్వితీయార్ధంలో నిడివి ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపించాయి. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేశాం. అన్నీ కుదిరితే ‘కిక్-2’, ‘రేసుగుర్రం’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను. రామ్‌చరణ్‌తో చేయబోయే చిత్రానికి కోన వెంకట్ కథ చెడీ చేశారు. త్వరలో ఆ కథను రామ్‌చరణ్‌కు వినిపించబోతున్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని ఉంది. బాండ్ తరహా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement