Kalyan ram
-
అదే పౌరుషం.. అదే రోషం: విజయశాంతి
‘‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయమని చాలామంది నన్ను కోరారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun Son Of Vyjayanthi) చిత్రంలో అలాంటి యాక్షన్ కుదిరింది. నా అభిమానులకి ఈ సినిమాతో ఫుల్ మీల్స్ దొరుకుతుంది. చాలా రోజుల తర్వాత యాక్షన్ చేశాను.. నేను చేస్తానని యూనిట్ వాళ్లు ఊహించలేదు. అయితే అదే పౌరుషం.. అదే రోషం.తగ్గేదేలే. ఎంత వయసు అయినా ఇలానే స్ట్రాంగ్గా ఉంటాను. క్రమశిక్షణగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది’’ అని నటి విజయశాంతి(Vijayashanti) చెప్పారు. కల్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా, విజయశాంతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్లాంచ్లో విజయశాంతి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్రామ్కి సినిమా అంటే చాలా ప్యాషన్. రామారావుగారు నేర్పించిన అంకితభావం అది. ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలి’’అన్నారు. కల్యాణ్రామ్ మాట్లాడుతూ–‘‘ అమ్మ (విజయశాంతి) చేసిన ‘కర్తవ్యం’ సినిమాని ఎవరూ మర్చిపోలేం. ఆ మూవీలోని వైజయంతి పాత్రకి కొడుకు పుడితే ఎలాంటి ఘటనలు జరుగుతాయి? అనేది ఈ చిత్ర కథ.నేను నటించిన ‘అతనొక్కడే’ సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. అలాగే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కూడా మరో 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది’’ అని తెలిపారు. ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ–‘‘కల్యాణ్ రామ్గారు ఈ కథ విని.. విజయశాంతిగారు ఒప్పుకుంటేనే చేద్దామన్నారు. మేడంగారు ఒప్పుకోవడంతో ఈప్రాజెక్టు ముందుకెళ్లింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత సునీల్ బలుసు. ఈ కార్యక్రమంలో నటుడు పృథ్వీరాజ్, రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడారు. -
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
కల్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
కల్యాణ్ రామ్ కొత్త మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే ఓ పేరుని టైటిల్ గా అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. ఈ మేరకు క్రేజీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.'బింబిసార'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్.. దీని తర్వాత రెండు ఫ్లాప్స్ చవిచూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ తల్లికొడుకులుగా నటిస్తున్నారని క్లారిటీ వచ్చింది. ఈ మేరకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' అనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ లుక్ పై ఎందుకింత ట్రోలింగ్?)పోలీస్ డ్రస్సులో విజయశాంతి, పక్కనే కల్యాణ్ రామ్ నడుస్తున్నట్లు ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'ప్రతి స్త్రీ ఒక కొడుకును పెంచుకుంటుంది. వైజయంతి ఐపీఎస్ ఇక్కడ అర్జున్ అనే సైన్యాన్ని పోషిస్తోంది'' అని పేర్కొన్నారు. .గతంలోనూ విజయశాంతి.. వైజయంతి పేరుతో ఓ సినిమా చేశారు. అందులో ఆర్మీ ఆఫీసర్ కాగా.. ఇప్పుడు పోలీస్ గా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. త్వరలో రిలీజ్ వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి (ఫొటోలు)
-
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్(Kalyan Ram) హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా రాణించి ఆపై నాయకుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన తమ తాత నందమూరి తారక రామారావు సేవల గురించి వారు మరోసారి గుర్తుచేశారు. ఈ సందర్భంగా రామారావు అభిమానులు నివాళీలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నేడు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.ఆ రోజు నుంచి ఏర్పాట్లన్నీ చూసుకుంటుంన్న తారక్సుమారు ఆరేళ్ల క్రితం రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా తాతయ్య సమాధి వద్దకు చేరుకున్నారు. జయంతి సందర్భంగా పూలతో కళకళలాడాల్సిన సమాధి అలంకరణ లేక బోసి పోవడం చూసి తారక్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో వారు వెంటనే పూలు తెప్పించి సమాధిని ఘనంగా అలంకరించారు. తమ అభిమానుల సాయంతో కొన్ని నిమిషాల్లోనే సమాధి మొత్తం పూలతో కళకళలాడేలా చేశారు. (ఇదీ చదవండి: ఇండియన్–3 సినిమాపై శంకర్ ప్రకటన)ఆ తర్వాత వారిద్దరూ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా తారక్ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్కు సంబంధించిన కార్యక్రమం ఏదైనా సరే ఆయన సమాధిని పూలతో అలంకరిస్తూ వస్తున్నారు. గతేడాదిలో కూడా తారక్ దగ్గరుండి తాత సమాధిని పూలతో అలంకరణ చేశారు. అయితే, తండ్రికి నివాళి అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అక్కడ ఎక్కువగా తారక్ ఫ్లెక్సీలు కనిపించడంతో వాటిని తొలగించాలని తన అభిమానులతో చెప్పారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీలు తొలగించిన చోటే మళ్లీ తారక్ అభిమానులు కొత్త కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆపై వాటికి పాలతో అభిషేకం చేశారు. అయితే, ఈ సారి బసవతారకం ఆసుపత్రిలో తన తండ్రి ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి అర్పించనున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).@tarak9999 And @NANDAMURIKALYAN Paid His Tributes To Anna #NTR Gaaru At NTRGhat 🙏#ManOfMassesNTR #NTRVardhanti pic.twitter.com/5YqqK4sqbM— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 18, 2025 -
‘ఎన్కేఆర్ 21’లో విలన్గా...
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయశాంతి, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు. శుక్రవారం (డిసెంబరు 20) సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్కేఆర్ 21’లో ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘‘సోహైల్ ఖాన్ చేస్తున్న విలన్ పాత్ర, హీరో, ఈ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కల్యాణ్ రామ్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, సంగీతం: అజనీష్ లోక్నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్. -
‘దేవర’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
విశ్వంభర డైరక్టర్ బీభత్సమైన ట్విస్ట్..
-
వైజయంతి... ఒక యుద్ధం!
పవర్ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా ‘కర్తవ్యం’ (1990)లో విజయశాంతి నటనను అంత సులువుగా మరచిపోలేం. లేడీ అమితాబ్ అనిపించుకున్న ఈ యాక్షన్ స్టార్ మళ్లీ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించనున్నారు. కల్యాణ్రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనే వైజయంతి పాత్రలో కనిపించనున్నారు విజయశాంతి. సోమవారం (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె లుక్, క్యారెక్టర్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. చీరకట్టులో హుందాగా, ఖాకీ దుస్తుల్లో పవర్ఫుల్గా విజయశాంతి కనిపించగా, ‘వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫామ్కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...’ అంటూ ఆమె పాత్ర గురించి కల్యాణ్ రామ్ తన వాయిస్ ఓవర్తో ఆ వీడియోలో వివరించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. -
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులున్నాయి: లక్ష్మీపార్వతి
హైదరాబాద్, సాక్షి: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంది’’ అని అన్నారామె. అంతకు ముందు.. మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఎన్టీఆర్కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.ఇదీ చదవండి: మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం! -
కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్ కాలి బూడిద అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ సంఘటన వల్ల నిర్మాతకు కూడా భారీ నష్టం వాటిల్లందని టాక్.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్.. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) -
'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్ రామ్కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్-2 డైరెక్టర్గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రామ్ చరణ్తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్ చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్ చరణ్తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్ను నేను డైరెక్ట్ చేయడం లేదు. పార్ట్-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఇదే విషయాన్ని కల్యాణ్ రామ్తో చెప్పి ఆపై ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణ్ రామ్ డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. బ్రిటీష్ కాలంలోని గూఢచారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ట్వీట్ చేశారు. థియేటర్లలో చూడడం మిస్సయినవారు ఎంచక్కా కుటుంబంతో కలిసి చూసేయండి. Wishing everyone a happy Sankranti! Can't wait to watch #Devil on Amazon Prime Video on Jan 14. @NANDAMURIKALYAN @iamsamyuktha_ #Devilthemovie - The British Secret Agent. @amazonIN pic.twitter.com/VAfWJQ8Gw5 — ABHISHEK PICTURES (@AbhishekPicture) January 13, 2024 -
తారక్పై కోపం కల్యాణ్ రామ్ మీద తీర్చుకున్న చంద్రబాబు, బాలయ్య బ్యాచ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైంది. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్తో వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రచారమే దక్కింది. సినిమా విడుదలకు ముందు కల్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలతో డెవిల్ నష్టపోయాడని తెలుస్తోంది. మరోవైపు జూ ఎన్టీఆర్ మీద ఉన్న కోపాన్ని టీడీపీ సోషల్ మీడియా విభాగం కల్యాణ్ రామ్ మీద చూపించిందా..? అంటే నిజమే అని నేటి డెవిల్ కలెక్షన్స్ చెబుతున్నాయి. డెవిల్ విడుదలకు ముందు కల్యాణ్ రామ్ ఏం అన్నారు 2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారని ఒక ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్కు ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా ఆయన ఇలా చెప్పారు. 'ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు.. ఫ్యామిలీ అంతా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. అందువల్ల ఫ్యామిలీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చెబుతాను.' అన్నాడు. వెంటనే కల్యాణ్ రామ్కు మరో ప్రశ్న ఎదురైంది. ఫ్యామిలీ అంటే ఎవరు..? మీరు, ఎన్టీఆర్నే కదా.. ఇంకెవరు లేరు కదా.. అని మళ్లీ అడిగితే, అవును, మేమిద్దరమే మిగిలాం.. ఇద్దరమే కలిసి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ తన తాత గారి సొంతమైన టీడీపీ పార్టీ ఉంది కదా.. అటువైపే ఉంటామని ఆయన చెప్పలేదు. దీంతో టీడీపీలో గుబులు ఏర్పడింది. తారక్ మీద టీడీపీ బ్యాచ్లో కోపం.. ఎఫెక్ట్ చూపిన డెవిల్ కలెక్షన్స్ చంద్రబాబు, బాలకృష్ణ ఇద్దరూ ఒకవైపు ఉంటే జూ ఎన్టీఆర్ మరోవైపు ఉన్నాడు. వారి మధ్య అనేక విభేదాలతో కూడిన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నారా లోకేష్కు తారక్ ఎక్కడ పోటీ తగులుతాడో అని కావాలనే టీడీపీకి జూ ఎన్టీఆర్ను దూరం చేశాడు చంద్రబాబు. ఈ విషయం జగమెరిగిన సత్యం. టీడీపీ కోసం గతంలో ప్రాణాలకు తెగించి ఎన్టీఆర్ పనిచేశాడు. అతనిలోని టాలెంట్ను గమనించి చంద్రబాబు జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రచారం చేసిన అన్నీ ప్రాంతాల్లో టీడీపీ ఓడిపోయిందని పచ్చ మీడియాలో ప్రచారం చేపించాడు. దీంతో తారక్ పార్టీకి దూరం అయ్యాడు. కాలక్రమేనా అలాంటి పాపాలే చంద్రబాబును వెంటాడాయి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కానీ తారక్ రియాక్ట్ కాలేదని, టీడీపీ బ్యాచ్ ఓపెన్గానే గగ్గోలు పెట్టింది. అలా తారక్తో వైరంతో పాటు దూరం పెరిగింది. చాలా ఏళ్ల నుంచి చంద్రబాబు, బాలయ్యకు తారక్ దూరంగానే ఉన్నాడు. దీంతో తారక్పై టీడీపీ నేతలు కోపం పెంచుకున్నారు. ఇదే తన అన్నగారు అయిన కల్యాణ్ రామ్ చిత్రంపై ఎక్కువగా ప్రభావం పడింది. టీడీపీకి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాల నుంచి బహిరంగంగానే పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ అభిమానులు ఎవరూ డెవిల్ సినిమా వైపు వెళ్లకండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. డెవిల్ సినిమాను బహిష్కరిస్తున్నట్లు వారు ఓపెన్గానే ప్రచారం చేశారు. సినిమా బాగున్నా కూడా ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్స్ రావడం ఏంటి..? అంటూ ట్రేడ్ అనలిస్ట్లే ఆశ్చర్య పోతున్నారు. తారక్, కల్యాణ్ రామ్ ఇద్దరూ టీడీపీ వైపు రాకుంటే వారి సినిమాలకు టికెట్లు కూడా చిరగవు అని భయపెడుతూ పచ్చ మిడీయాలో డిబెట్లు కూడ జరిగిన విషయం తెలిసిందే. కానీ అక్కడ ఉండేది టైగర్ అని టీడీపీ మంద మరిచిపోయినట్లు ఉంది. -
కళ్యాణ్ రామ్ సంయుక్త మీనన్ ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
రామ్ చరణ్ పేరు ఎత్తగానే కళ్యాణ్ రామ్ రియాక్షన్ చూడండి
-
దేవర గురించి అప్డేట్ అడిగితే కళ్యాణ్ రామ్ ఏమన్నాడో చూడండి
-
అమెరికాలో జాబ్ చేసుకునే వాడిని సినిమాల్లోకి ఎందుకు వచ్చానంటే..!
-
Devil Movie Review: డెవిల్ మూవీ రివ్యూ
టైటిల్: డెవిల్ నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా నిర్మాణ సంస్థ: అభిషేక్ పిక్చర్స్ కథ-మాటలు: శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: డిసెంబర్ 29,2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది.స్వాతంత్రం కోసం పని చేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటీష్ ఆర్మీ.. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ(అభిరామి) హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కల్యాణ్ రామ్)కు అప్పజెప్పుతారు. డెవిల్కి విజయ కజిన్ నైషేద(సంయుక్త మీనన్)పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్ను పట్టుకునే ఆపరేషన్కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య అనుచరుడు త్రివర్ణ ఎవరు? బోస్ ఇండియాకు వస్తున్నట్లు బ్రిటీష్ సైన్యానికి ఎలా తెలిసింది? నైషేదను రహస్యంగా కలుస్తున్న వ్యక్తి ఎవరు? ఈ కథలో మాళవిక నాయర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డెవిల్ కథ, కథనం రెండూ పాతవే. హీరో సీక్రెట్ ఏజెంట్గా ఉండి ఓ ఆపరేషన్లో పాల్గొనడం.. అతను తన ఒరిజినాలిటీ కప్పిపుచ్చి మరోలా నటించడం.. ప్రీక్లైమాక్స్ అసలు విషయం తెలియడం.. ఆ తర్వాత ఓ భారీ ఫైట్.. శుభం కార్డు.. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డెవిల్ కథ కూడా అదే. కాకపోతే సుభాష్ చంద్రబోస్ చుట్ట కథను నడిపించడం ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత. కథనం మాత్రం కొత్త సీసాలో పాత సారానే అన్నట్లుగా సాగుతుంది. ఊపిరి బిగపట్టుకొని చూసే సన్నివేశాలను సైతం చాలా సింపుల్గా తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ పాయింట్తో కథను చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆ తర్వాత కథంతా జమీందారు కూతురు హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది సస్పెన్స్లో పెట్టి ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కహనీ మాత్రం కథను పక్కదోవ పట్టించడమే కాకుండా.. నీరసంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుటుంది. అలాగే అక్కడ ట్విస్ట్ రివీల్ చేసి ద్వితియార్థంపై ఆసక్తి కలిగించేలా చేశారు. సెకండాఫ్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. అయితే ఈ తరహా ట్విస్టులు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇక అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక కథపై ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇక చివర్లో హీరో చేసే యాక్షన్ సీన్ మరింత బోరింగ్ అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ మరింత పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మారడం.. చివరకు అభిషేక్ నామానే ఆ బాధ్యతలు తీసుకొని తెరకెక్కించాడు. అయితే నిర్మాతగా ఆయన సినిమాను రిచ్గా తెరకెక్కించగలిగాడే తప్ప.. దర్శకుడిగా మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ఎవరెలా చేశారంటే.. కల్యాణ్ రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో జీవిస్తాడు కూడా. నెగెటివ్ షేడ్స్ ఉన్న డెవిల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగోలేదు కానీ కల్యాణ్ రామ్ ఉన్నంతలో చక్కగా నటించాడు. నైషేదగా సంయుక్త మీనన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఇక మాళవిక నాయర్కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. ఆమె నిడివి తక్కువే అయినా..గుర్తిండిపోయే పాత్ర తనది. శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, ఎస్తర్ నోరోన్హా, సెఫీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి స్పీడ్ బ్రేకర్లుగా అడ్డు తగులుతాయే తప్ప ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
Devil Twitter X Review: ‘డెవిల్’ ట్విటర్ రివ్యూ
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ఫై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలేమీ లేవు కానీ.. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్లు ఫస్ట్ డే ఫస్ట్షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెవిల్ ఎలా ఉంది? కల్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్(ఎక్స్)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. డెవిల్ చిత్రానికి ఎక్స్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ వన్మ్యాన్ షో అని చెబుతున్నారు. అదే సమయంలో వీఎఫ్ఎక్స్ విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. #Devil review : Decent First half with Good interval block👌 Very good second half with good twist and turns 💥💥 Hituuuuuu bommmaaaaaaa👌 3.5/5 — Chennai Tarak (@chennaitarak) December 29, 2023 ఫస్టాఫ్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండాఫ్లో వచ్చే మలుపులు, ట్విస్టులు ఆకట్టుకున్నాయంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Devil Review: 2.75/5 Average 1st Half ,Decent 2nd Half👍 Slow Screenplay, seems dragged at times BGM is Good👍@NANDAMURIKALYAN acting 👍 Songs are okay, few twists worked. Overall An Average Movie. Can give it a try for its setup and visuals#Devara #Salaar #GunturKaaram pic.twitter.com/mCHfwT4zG8 — GS (@Thanks2Cinema) December 28, 2023 ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ డీసెకంట్, స్లో స్క్రీన్ప్లే, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. కల్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది అంటూ మరో నెటిజన్ 2.75/5 రేటింగ్ ఇచ్చాడు. Slow paced with good interval...Few scenes are boring 🥱....Bad screenplay, director has good stry but unable to potray..May be because of last moment director changes..#Devil — karthik (@karthik170920) December 28, 2023 Good 1st Half 👍 Good story point A Bit slow to takeoff but Gripped well and maintained intriguingly well Perfect blend of Commercial elements and investigative narration Bgm👍 Interval bang is good Vfx could have been much better #Devil — PKC (@PKC997) December 28, 2023 #Devil First Half : “DECODING BEGINS” 👉INTERESTING FIRST HALF WITH GOOD INTERVAL BLOCK 👉@NANDAMURIKALYAN Excellent Performance with Extraordinary Production Values 👉#HarshavardhanRameshwar impresses with his BGM#DevilReview #NandamuriKalyanRam — PaniPuri (@THEPANIPURI) December 29, 2023 ' -
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఈ హిట్తో ఈ ఏడాదికి వీడ్కోలు
∙‘డెవిల్’ సినిమా సీక్వెల్కి 50 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘డెవిల్’ కి వచ్చే స్పందన బట్టి సీక్వెల్ చేయాలా? వద్దా అనేది ప్రకటిస్తాం. తమ్ముడి (ఎన్టీఆర్) ‘దేవర’ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తయింది. మేం చేసే సినిమాల ఔట్పుట్ గొప్పగా ఉండాలనుకుంటాం.. అందుకే జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. నేను, తారక్ ‘దేవర’ విషయంలో క్లియర్గా ఉన్నాం. మేం సంతృప్తి చెందిన వెంటనే సినిమా గురించి అప్డేట్ ఇస్తాం. అంతేకానీ అప్డేట్ ఇవ్వాలనే ఒత్తిడితో పని చేయలేం కదా? ► ‘‘నటుడిగా ఇరవై ఏళ్ల ప్రయాణంలో (మొదటి చిత్రం ‘తొలి చూపులోనే’ – 2003) చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వృత్తిలో చాలా నేర్చుకున్నాను.. వేరే వృత్తిలో అయితే ఇంత నేర్చుకోలేకపోయేవాడినేమో? సినిమాల వల్ల ఎంతోమందితో మాట్లాడటం, పని చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వ్యక్తిగతంగా ఓ మంచి తండ్రిగా, భర్తగా పరిణితి చెందాను’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు.అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డెవిల్’. కల్యాణ్ రామ్ హీరోగా, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ చెప్పిన విశేషాలు. ► 2021లో ‘బింబిసార’ షూటింగ్ టైమ్లో రచయిత శ్రీకాంత్ విస్సా నాకు ‘డెవిల్’ కథ చెప్పారు. 1940 బ్యాక్డ్రాప్తో సాగే ఈ కథలో హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. నన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశారా? అని అడిగాను. ‘‘నేను ‘డెవిల్’ని కథగానే రాశాను. అభిషేక్ నామాగారు మీకు చెప్పమన్నారు. మీరు కమర్షియల్ హీరో కదా.. ఇలాంటి కథ ఒప్పుకుంటారా?’’ అని శ్రీకాంత్ విస్సా అన్నారు. హీరో క్యారెక్టర్, బ్యాక్డ్రాప్ అలాగే ఉంచి, కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్లో మార్పులు చేయమన్నాను. శ్రీకాంత్ రెండు, మూడు నెలలు సమయం తీసుకుని మార్పులు చేర్పులు చేయడంతో సినిమాప్రారంభించాం. ► ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రాలు అందించేందుకు ప్రయత్నిస్తుంటాను. అయితే ఒక్కోసారి వాణిజ్య అంశాలు మిస్ అవుతుంటాను. నా గత చిత్రం ‘అమిగోస్’కి మరికొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన నాకు ఆ రోజు రాలేదు. డైరెక్టర్తో మాట్లాడి ఆ పని చేసుండాల్సింది.. ఆ తప్పు నాదే. అందువల్ల మిస్ఫైర్ అయిందనుకుంటున్నాను. కానీ, ‘డెవిల్’లో వాణిజ్య అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అవడం నాకు కొత్తగా అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అనుభూతి చెందుతారు. ‘డెవిల్’ హిట్తో 2023కి వీడ్కోలు పలుకుతామనే నమ్మకం ఉంది. ► ‘డెవిల్’లో నా క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వివరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రాన్ని అభిషేక్ నామాగారు అద్భుతంగా తీశారు. నా అంచనాలకు మించి సౌందర్ రాజన్గారు విజువల్స్ ఇచ్చారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్తో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను. ‘డెవిల్’లో నా పాత్ర కోసం దాదాపు 90 కాస్ట్యూమ్స్ని వాడాం. నా పాత్రకి భారతీయతను ఆపాదించే ప్రయత్నం చేశారాయన. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి నేపథ్య సంగీతం అందించారు. ‘బింబిసార’కి కీరవాణిగారిలా ‘డెవిల్’ విషయంలో హర్షవర్ధన్ న్యాయం చేస్తాడా? అనుకున్నాను. అయితే సినిమా చూసిన తర్వాత సంతోషంగా అనిపించింది. ‘బింబిసార’ హిట్ తర్వాత సంయుక్తా మీనన్తో మళ్లీ నటించాను. హీరోకు సమానంగా తన పాత్రకిప్రాధాన్యత ఉంటుంది. మాళవిక పాత్ర కూడా చక్కగా ఉంటుంది. ప్రతి పాత్రకుప్రాధాన్యం ఉంటుంది. నేను ఒకే సమయంలో రెండు పడవల ప్రయాణం (నటుడు–నిర్మాత) చేయాలనుకోను. నటనకు ఎంత కష్టపడాలో.. నిర్మాణంలో అంతకు మించి కష్టపడాలి. ‘ఓం’ సినిమా విషయంలో నాకు ఆ విషయం అర్థమైంది. అప్పటి నుంచి మా బ్యానర్లో చేసే సినిమాలకు సంబంధించిన సినిమాల కథ మాత్రమే నేను వింటాను. మిగిలిన విషయాలన్నీ మా హరిగారు చూసుకుంటారు. -
Devil Movie: కళ్యాణ్ రామ్ 'డెవిల్' రన్టైమ్ ఎంతంటే?
సినీ లవర్స్.. ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో ‘డెవిల్’ రానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రన్ టైమ్ ఎంతంటే? గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాదిని ‘డెవిల్’తో ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అద్భుత స్పందన లభించింది. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా డెవిల్ రన్ టైమ్ను ఫిక్స్ చేశారు. నెక్స్ట్ లెవల్.. ప్రతి ఫ్రేమ్ని రిచ్గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం వీటన్నింటినీ నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లేలా ఉంది. డెవిల్ సినిమా ఈ నెల 29న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. తమ్మిరాజు ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా ఛాన్స్ నాకే దక్కింది: మ్యూజిక్ డైరెక్టర్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. సంయుక్తా మీనన్ హీరోయిన్గా, మరో హీరోయిన్ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ– ‘‘డెవిల్’ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి ప్రత్యేక వాయిద్యాలను వాడాం. ‘దూరమే..’ పాటను బుడాపెస్ట్లో షూట్ చేశాం. అలాగే ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటను ర్యాపర్ రాజకుమారితో పాడించాం. ఈ పాట సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది. అలాగే నేపథ్య సంగీతం చాలా బాగుంటుంది. అయితే సంగీత దర్శకులు, నటీనటులు ఎంత ఎఫర్ట్ పెట్టినా విజువల్ సపోర్ట్ ఉండాలి. ఈ విషయంలో ఈ చిత్రం కెమెరామేన్ సౌందర్ రాజన్గారు ప్రాణం పెట్టి అద్భుతంగా వర్క్ చేశారు. సెకండాఫ్లోని ఓ ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్లో కల్యాణ్రామ్ గారి నట విశ్వరూపాన్ని ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు రావొచ్చని నాకనిపిస్తోంది’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘భవిష్యత్లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరు గిటారిస్ట్స్ మాత్రమే ఉండేలా ఓ సినిమా, డ్రమ్స్ శివమణిగారి బయోపిక్ తీయాలని ఉంది. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి. ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగా గారు చేయనున్న ‘స్పిరిట్’ సినిమాకు సంగీతం అందించనున్నాను’’ అన్నారు. -
బింబిసార 2 మూవీకి డైరెక్టర్ ఎవరు..?
-
డెవిల్ ట్రైలర్లో సంయుక్త మీనన్ స్పీచ్
-
దేవర టీజర్ విధ్వంసం గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్
-
కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ట్రైలర్
-
రాసుకోండి...‘డెవిల్’ బాగుంటుంది: కల్యాణ్రామ్
‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్స్కి వద్దన్నా వస్తారని ‘బింబిసార’ సినిమా టైమ్లో చెప్పాను. దాన్ని మీరు (ఫ్యాన్స్, ఆడియన్స్) నిజం చేశారు. అదే కోవలో ‘డెవిల్’ మంచి కథా కథనాలతో వస్తోంది. రాసుకోండి.. సినిమా చాలా బావుంటుంది. ఈ చిత్రం సరికొత్త కథతో ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా, మాళవికా నాయర్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఖర్చుకి వెనకాడకుండా ‘డెవిల్’ని రూపొందించిన అభిషేక్ నామాగారికి థ్యాంక్స్. సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే వచ్చే ఆనందమే వేరు. ‘బింబిసార 2’ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో మొదలుపెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా గ్లింప్స్ని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘డెవిల్’ కోసం రెండేళ్ల పాటు కల్యాణ్ రామ్గారు మరో సినిమా చేయకుండా పని చేశారు. ఇందులో ఆయన యాక్షన్, నటన అదిరిపోతాయి. మా ‘డెవిల్’ హిట్తో 2023 ముగుస్తుంది’’ అన్నారు అభిషేక్ నామా. -
'డెవిల్' ట్రైలర్ ఇంట్రెస్టింగ్.. అంతా బాగానే ఉంది కానీ?
కల్యాణ్ రామ్ కొత్త సినిమా 'డెవిల్'. ఇప్పటికే రిలీజై పోవాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 29న పాన్ ఇండియా రేంజులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ మధ్యే అధికారికంగా ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అంచనాలు పెంచేస్తున్న ఈ పెంచేస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే? (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) అభిషేక్ నామా నిర్మిస్తూ-దర్శకత్వం వహిస్తున్న 'డెవిల్' సినిమాలో కల్యాణ్ రామ్.. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నాడు. అదే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. ఓ అమ్మాయి చావుని ఎంక్వైరీ చేసే క్రమంలో ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో చూపించబోతున్నారు. ట్రైలర్ బాగుంది, సినిమాపై హీరో కల్యాణ్ రామ్ కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. కానీ 'సలార్' రిలీజైన వారం రోజులకే ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుంది. ప్రభాస్ సినిమా హిట్ అయితే.. మూవీ లవర్స్ అదే మాయలో ఉంటారు. ఇదే జరిగితే మాత్రం 'డెవిల్'కి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) -
డెవిల్ కోసం కళ్యాణ్రామ్ ఎన్ని కాస్ట్యూమ్స్ మార్చాడో తెలుసా?
కల్యాణ్ రామ్ టైటిల్ రోల్లో రూపొందిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూ΄పొందించిన చిత్రం ఇది. ఈ నెల 29న ఈ పీరియాడికల్ డ్రామాని విడుదల చేయనున్నారు. బ్రిటిష్వారు భారతదేశాన్ని పరిపాలించిన కాలానికి సంబంధించిన కథ ఇది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ భారతీయుడు అయినప్పటికీ బ్రిటిష్ గూఢచారి డెవిల్ పాత్రలో కనిపించనున్నారు. భారతీయత ఉట్టిపడటంతో పాటు స్టైలిష్ గూఢచారిగా చూపించేందుకు కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్తో 90 కాస్ట్యూమ్స్ తయారు చేయించారు అభిషేక్ నామా. ఈ దుస్తుల గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో లుక్ కొత్తగా ఉండేలా ట్రై చేశాం. ధోతి, పైన ఒక వెయిస్ట్ కోటుతో ఆయన కాస్ట్యూమ్స్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్ ఊల్తో 60 బ్లేజర్స్, దేశీ కాటన్తో కుర్తాలు, ధోతీలు తయారు చేశాం. 25 వెయిస్ట్ కోట్స్ కుట్టాం. బ్లేజర్ జేబు పక్కన వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్ను ప్రత్యేకంగా తయారు చేయించాం’’ అన్నారు. -
డెవిల్ డేట్ ఫిక్స్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించారు. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘‘ఈ చిత్రంలో ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కల్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
దిస్ ఈజ్ లేడీ రోజ్..
కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అంటూ సాగే రెండో పాటను సోమవారం విడుదల చేశారు. చిత్రసంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యం అందించగా, రాజకుమారి పాడారు. ఈ పాటలో కల్యాణ్ రామ్తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ కాలు కదిపారు. ‘‘ప్రేక్షకులకు ఈ పాట ఓ కనువిందులా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్. -
కొత్త సినిమా షురూ
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, విజయశాంతి క్లాప్ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్నాథ్, కెమెరా: సి. రామ్ ప్రసాద్. -
‘డెవిల్’ పాట కోసం విదేశీ వాయిద్యాలు..స్పెషలేంటి?
ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల ‘మాయే చేసే..’పాటను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డెవిల్ చిత్రం 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో విదేశీ వాయిద్యాలు వాడారట. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్లోకి తీసుకెళ్లేలా చేయాయని చిత్ర యూనిట్ పేర్కొంది. నవంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. -
జూ. ఎన్టీఆర్కు ఆ పేరు ఎలా వచ్చింది.. ఆయనకున్న బలం ఎవరు?
సైమా అవార్డ్స్- 2023 ఉత్తమ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలో తన అద్భుత నటనకు గాను ఈ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నామినేషన్ లిస్ట్లో రామ్ చరణ్ ఉన్నా అవార్డు మాత్రం కొమురం భీం పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్కే దక్కింది. 2016లో జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆయన మొదటిసారి ఈ అవార్డును అందకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. (ఇదీ చదవండి: సైమా అవార్డ్స్- 2023 విజేతలు వీరే.. ఎన్టీఆర్, శ్రీలీల, మృణాల్ హవా!) ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు మెచ్చకోని ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషాల్లో కూడా ఆడియన్స్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ ఒకే పాత్రలో చూపించి దేశం మొత్తం తనవైపు తిప్పుకున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా జరిగింది 1983 మే 20న జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాత గారు అయిన సీనియర్ ఎన్టీఆర్ను చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్మ్యాన్ను పిలిచి తారక్కు మేకప్ వేయమని చెప్పారు. మేకప్ పూర్తి అయిన తర్వాత తారక్ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావ్ అని కితాబు ఇచ్చారు. మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్కు తెలిపారు. అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు. అప్పటికి ఆయన హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు. సినిమాల వల్ల చదువుని అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు. ఎన్టీఆర్కు ఆ పేరు ఎలా వచ్చింది ఎన్టీఆర్కు మొదట పెట్టిన పేరు 'తారక్ రామ్'. కానీ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తారక్ ఇలా చెప్పారు. 'ఓ రోజు తాత గారి నుంచి నుంచి కబురు వచ్చింది. అప్పట్లో ఆయన అబిడ్స్లో ఉండే వారు. ఆయన్ను కలిసేందుకు వెళ్లగానే.. 'లోపలికి రండి' అంటూ తాత నుంచి గంభీరమైన స్వరంతో ఆహ్వానం. నేను ఆయన ముందుకు వెళ్లగానే.. పేరేంటి..? అని ఆయన అడగ్గా.. తారక్ అని చెప్పాను. దీంతో వెంటనే, హరికృష్ణ గారిని పిలిచి 'నందమూరి తారక రామారావు' అని పేరు మార్చమని చెప్పారు. ఆ క్షణం నుంచి నేను తాత చేయి వదల్లేదు. ఆయనా నన్ను వదిలి ఉండేవారు కాదు.' అని ఓ సందర్భంలో తాతతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నాడు. ఎన్టీఆర్కు 'అమ్మ' బలమైతే.. 'నాన్న' ప్రాణం హరికృష్ణ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆయనకు శాలిని గారితోనే (జూ. ఎన్టీఆర్ అమ్మ) ఎక్కువ అనుబంధం ఉంది. హైదరాబాద్లోనే తన బాల్యం అంతా గడిచింది. బాల్యంలో బాగా అల్లరితో పాటు స్నేహితులతో క్రికెట్, సినిమాలు, షికార్లు, గొడవలు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తుండటంతో ఒకసారి బాగా విసిగిపోయిన వారి తల్లిగారు శాలిని హ్యాంగర్తో కొట్టారని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పుకొచ్చారు. 'నేనంటే అమ్మకు ఎంతో ప్రాణం.. ఆమెకు సర్వసం నేనే.. అలాగని ఎప్పుడూ గారాబం చేసేది కాదు. జీవితంలో వాస్తవంలో మాత్రమే బతకాలని నాకు అమ్మే నేర్పింది. నేను ఎప్పుడైనా నిరుత్సాహ పడితే నాలో ఆత్మవిశ్వాసం నింపేది ఆమ్మే. నా జీవితంలో ఆమె నా బలం, బలగం.' అని ఎన్టీఆర్ తెలిపారు. ప్రాణంగా భావించే తన నాన్న హరికృష్ణను రోడ్డు ప్రమాదంలో కోల్పోయినప్పుడు ఆయన ఎంతలా కన్నీరు పెట్టుకున్నాడో అందరం చూశాం. హరికృష్ణ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో బతికారని గతంలో జూ. ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఆయనలా బతకడం చాలా కష్టం అని కూడా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోవడంతో ... ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే అభిమానులకు తారక్ విజ్ఞప్తి చేస్తుంటారు. అభిమానులే తన కుటుంబ సభ్యులని, వారే తన బలగం అని ఆయన పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. తారక్ జీవితంలో ఇవన్నీ ఎవర్గ్రీన్ ♦ తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ♦ పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. ♦ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట. ♦ యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు. ♦ తారక్ బాల్యంలోనే ప్రఖ్యాత కళాకారుల దగ్గర కూచిపూడి నేర్చుకుని పలు వేదికలపై ప్రదర్శనలూ ఇచ్చారు. ♦ 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ♦ ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో నటించగా.. జై లవ కుశలో త్రిపాత్రాభినయం చేశారు. ♦ పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ♦ జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైంది. ♦ నంబర్ 9 అంటే తారక్కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు. ♦ మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం. ♦ 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్లో రెండు సార్లు నిలిచాడు. ♦ సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు. ♦ తారక్కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట ♦ తన సోదరుడు, హీరో కల్యాణ్ రామ్ అంటే ఎన్టీఆర్కు ఎంతో ప్రేమ. ♦ తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. -
మాయే చేసే...
‘బింబిసార’ వంటి హిట్ మూవీ తర్వాత కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సత్య ఆర్వీ సాహిత్యం అందించిన ఈ పాటను, సిధ్ శ్రీరాం పాడారు. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’. నటుడిగా కల్యాణ్ రామ్లోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ప్రేక్షకులు చూస్తారు. సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈఓ: వాసు పొతిని,కెమెరా: సౌందర్ రాజన్ ఎస్. -
డెవిల్స్ ఏంజిల్
కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెవిల్’. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సోమవారం (సెప్టెంబర్ 11) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డెవిల్’ చిత్రంలో సంయుక్త పోషించిన నైషధ పాత్ర ఫస్ట్ లుక్పోస్టర్ను ‘డెవిల్స్ ఏంజిల్’ అంటూ మేకర్స్ విడుదల చేశారు. ‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 24న విడుదల చేస్తాం’’ అన్నారు అభిషేక్ నామా. -
కళ్యాణ్ రామ్: తన భార్య గురించి మనసులో మాట
-
Nandamuri Suhasini Son Marriage Photos: నందమూరి సుహాసిని కుమారుడి వివాహం (ఫొటోలు)
-
డెవిల్ వస్తున్నాడు
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించారు. నవీన్ మేడారం దర్శకత్వంలో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమాను నవంబరు 24న విడుదల చేస్తున్నట్లుగా ఆదివారం చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని చేధించే ఓ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్గా కల్యాణ్రామ్ ఆకట్టుకోబోతున్నారు’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్. -
మెగా ఆఫర్ రాగానే నందమూరి హీరోను పక్కన పెట్టిన డైరెక్టర్ వశిష్ట్
-
బిమ్బిసార సీక్వెల్ నుండి తప్పుకున్న వశిష్ఠ
-
ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్ రామ్ అమిగోస్,స్ట్రీమింగ్ ఎక్కడంటే..
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్ ఇటీవలె ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆషిక రంగనాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్రామ్ నటించిన సినిమా కావడంతో రిలీజ్కు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగున్నా, కథ, ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఫలితంగా డిజాస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ అమిగోస్ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది.నేడు(ఏప్రిల్1)నుంచే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లో మెప్పించలేకపోయిన అమిగోస్ ఓటీటీలో అలరిస్తుందేమో చూడాల్సి ఉంది. -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్మెంట్కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Ashika Ranganath Latest Photos: హాట్ ఫోజులతో కవ్విస్తున్న అమిగోస్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఫొటోలు
-
ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అమిగోస్? ఎప్పుడు.. ఎక్కడంటే!
‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్ర స్పందన అందుకుంది. ‘డోప్ల్ గ్యాంగర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా చూసి కొందరు బాగుందంటే మరికొందరు అసలు కథ స్ట్రాంగ్లో లేదని అభిప్రాయం పడ్డారు. ఫలితంగా ఈ మూవీ బాక్సాఫీసు బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ డిజిటిల్ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. సాధారణంగా ఏ చిత్రమైన, ముఖ్యం స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీకి వస్తుంది. కానీ అమిగోస్ మాత్రం విడుదలైన నెల రోజులకే ఓటీటీకి రానుందని సమాచారం. డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10న నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. చదవండి: నచ్చిన వ్యక్తితోనే నా పెళ్లి.. లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు Telugu film #Amigos is expected to premiere on Netflix India on March 10th. Also in Tam, Kan, Mal. pic.twitter.com/zQ8WPQgkmZ — Streaming Updates (@OTTSandeep) March 3, 2023 -
తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
‘అమిగోస్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఫిబ్రవరి 10) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదలైన రోజే ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన సంస్థపై క్లారిటీ వచ్చేసింది. (చదవండి: అమిగోస్ మూవీ రివ్యూ) ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతానికి నిర్మాతలతో ఉన్న ఒప్పందం మేరకు 8 వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలి. కానీ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి.. 8 వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేశాడు. వాటిలో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు మరో రెండు భిన్నమైన కోణాల్లో సాగుతాయి. -
‘అమిగోస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Amigos Movie Review: ‘అమిగోస్’మూవీ రివ్యూ
టైటిల్: అమిగోస్ నటీనటులు: కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: ఫిబ్రవరి 10, 2023 బింబిసార చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కల్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు భారీ స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘అమిగోస్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అమిగోస్’ కథేంటంటే.. సిద్ధార్థ్(కల్యాణ్ రామ్).. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆర్జేగా పనిచేసే ఇషిక(ఆషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఓ వెబ్సైట్ ద్వారా తనలాంటి పోలికలు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కలుస్తాడు. వారిలో ఒకరు బెంగళూరుకు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ మంజునాథ్(కల్యాణ్ రామ్) అయితే.. మరోకరు బిపిన్ రాయ్ అలియాస్ మైఖేల్(కల్యాణ్ రామ్). ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. వీరు కలవడం కంటే ముందే బిపిన్ రాయ్ హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారిని దారుణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికే సిద్దార్థ్కి మైఖేల్గా పరిచయం చేసుకుంటాడు. ఆ కేసులో తనకు బదులుగా సిద్దార్థ్ని అరెస్ట్ చేయించడమే అతని ప్లాన్. మరి అది వర్కౌట్ అయిందా? ఎన్ఐఏ అధికారులు ఎవరిని అరెస్ట్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? బిపిన్ రాయ్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడం.. పైగా కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండటంతో ‘అమిగోస్’పై ముందు నుంచే భారీ అంచనాలు పెరిగాయి. టైటిల్ మాదిరే ఈ కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ కథనం ఆకట్టుకునేలా సాగలేదు. ఈ చిత్రంలో ఒకే రూపంతో ముగ్గురు మనుషులు ఉంటారని.. వారిలో ఒకరు విలన్ అని, తన అవసరం కోసం మిగతా ఇద్దరిని వాడుకుంటాడని ట్రైలర్లోనే చూపించారు. విలన్ కోసం ఎన్ఏఐ అధికారులు వెతకడం కూడా అందులో చూపించారు. అయితే ఎందుకు వెతుకుతున్నారు? వాళ్లు ఎలా కలిశారనేదే మిగతా కథ. ఆ కథను ఆసక్తికరంగా నడిపించే విషయంలో దర్శకుడు నిరాశపరిచాడు. కథనాన్ని చాలా చప్పగా..రొటీన్గా నడిపించాడు. సినిమా మొత్తంలో క్యూరియాసిటీ పెంచే సీన్స్ ఒక్కటంటే ఒక్కటి ఉండదు. పైగా రొటీన్ లవ్స్టోరీ ప్రేక్షకులను విసిగిస్తుంది. పస్టాఫ్లో పాత్రల పరిచయానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎలాంటి ట్విస్టులు, వావ్ మూమెంట్స్ లేకుండా చాలా రొటీన్గా ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ అక్కడ కూడా కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతాయి. దర్శకుడు కొత్త కాన్సెప్ట్నే ఎంచుకున్నాడు కానీ.. అంతే కొత్తగా, ఆసక్తికరంగా తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్గా.. మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్గా.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన కల్యాణ్ రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. రెండు, మూడు నిమిషాలు మినహా తెరపై మొత్తం కల్యాణ్ రామే కనిపిస్తాడు. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. నెగెటివ్ షేడ్స్ ఉన్న మైఖేల్ పాత్రలో కల్యాణ్ నటన చాలా బాగుంటుంది. ఇక హీరోయిన్ రిషిక పాత్ర నిడివి చాలా తక్కువ. అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించిది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ‘ఎన్నోరాత్రులు వస్తాయి కానీ..’ పాట రీమేక్ బాగా సెట్ అయింది. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Amigos Twitter Review: ‘అమిగోస్’ మూవీ ట్విటర్ రివ్యూ
బింబిసార లాంటి సూపర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల అమిగోస్ ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘అమిగోస్’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు అవేంటో చూసేయండి. #Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution! The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part. Rating: 2.25-2.5/5 — Venky Reviews (@venkyreviews) February 10, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సినిమా బాగుందని కొందరు చెబుతుంటే..అంతగా ఆకట్టుకునే చిత్రం కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అమిగోస్’ మూవీ కాన్సెప్ట్ బాగుంది. కానీ కథనం నాసిరకంగా ఉంది. కొన్ని ట్విస్టులు అదిరిపోయాయి. కానీ కథనం మాత్రం స్లోగా సాగుతుంది’అంటూ 2.25-2.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Amigos 1st half: characters building sequences👍🏻, interval 👍🏻 Average 1st half 2nd half: Good Racy screenplay in parts👍🏻,Action scenes,Climax👍🏻 Good 2nd half Overall: Good👍🏻 3/5@NANDAMURIKALYAN Hit streak continues👍🏻🔥#AmigosOnFeb10th #Amigosreview #kalyanRam — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) February 10, 2023 ఫస్టాఫ్ యావరేజ్గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్లో స్క్రీన్ప్లే స్పీడ్గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్గా అమిగోస్ సినిమా బాగుంది అంటూ 3 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్ Just watched #Amigos and it's a feel-good film with laughter, friendship, and heartwarming moments! The cast is fantastic and their chemistry shines on screen. Highly recommend for a movie night with your own amigos 🎥🍿#AmigosReview #MovieReview #FriendshipGoals #eshwarweb pic.twitter.com/5jhpPvtLPk — Eshwar Web (@EshwarWeb) February 10, 2023 ఇప్పుడే సినిమా చూశాను. కామెడీతో పాటు ఫ్రెండ్షిప్ గొప్పదనాన్ని తెలియజేశాఉ. కొన్ని సీన్స్ హృదయలను హత్తుకుంటాయి. నటీనటుల ఎంపిక బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మీ స్నేహితులతో కలిసి చూసే సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Amigosreview First half is a passable love story with not much intrigue.Twists unravel in the second half making the movie a decent one-time watch.But can't vouch for excitement that audience expect from it.Triple roles,drama so unrealistic.#AmigosOnFeb10th #KalyanRam #JrNTR pic.twitter.com/38Vse4brud — KLAPBOARD (@klapboardpost) February 10, 2023 #Amigos 1st half review: ⭐️kalyan ram characterization. ⭐️3 characters builded nicely. 👎🏼songs and bgm could have been better 👎🏼 production values are not good by mythri for the first time because of camera work. Looks like outdated camera. Totally on 2ndhalf.#AmigosOnFeb10th pic.twitter.com/ReJ1ZzE1wy — ReviewMama (@ReviewMamago) February 10, 2023 #AmigosReview Movie was FreshLook To Audience moreover Story Lineup is More content Ultra Mass Eliments added BGM Looks Pleasent Songs Mixed Melody Pure Family Action Drama Sequence Overall Rating :-4/5 ⭐⭐⭐⭐@tarak9999 @NANDAMURIKALYAN @NtrMurali9999 #ManOfMassesNTR — ReNaa (@Piger175) February 10, 2023 #Amigosreview Kalyan Ram 2.0 Malli kottesadu ra Kalyan Ram Super Hit🔥 Back to Back @RajendraReddy_ Gari direction 👌@NANDAMURIKALYAN Acting🔥 — PavantaRRRakⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@PavanTarakroyal) February 10, 2023 Decent first half 👌@NANDAMURIKALYAN Played fantastic in Triple Role 🔥🔥🔥#Amigosreview — Deva (@DevaNtrfan) February 10, 2023 Overall, #Amigos is an entertaining film with an interesting concept of doppelgängers, good performances and impressive technical elements. This is likely to be a second successive HIT for #KalyanRam after #Bimbisara.#AmigosReview — Cinemania (@CinemaniaIndia) February 9, 2023 -
అమిగోస్’లో 2.17 గంటలు నేనే కనిపిస్తా: కల్యాణ్ రామ్
‘బింబిసార’ చిత్రానికి ముందే ‘అమిగోస్’ కథ విన్నాను. రాజేంద్రగారు స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల లక్ష్యం ఏంటి? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ►‘బింబిసార’ హిట్ తర్వాత నేను కథలు ఎంచుకునే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలానే ఉన్నాను. ఎందుకంటే ‘బింబిసార’, ‘అమిగోస్’, ‘డెవిల్’ సినిమాల కథలను 2020లోనే ఓకే చేశాను. ‘బింబిసార’ హిట్ తర్వాత కొత్తగా ఏ కథనీ ఎంచుకోలేదు. అయితే ఆ సినిమా విజయం నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఇంకా పెద్ద విజయాన్ని నా నుంచి ఆశిస్తారు. అందుకే మంచి కాన్సెప్ట్, స్టోరీ ఉన్నవి ఒప్పుకోవాలి. లక్కీగా నాకు అన్నీ అలాంటి మంచి కథలు వస్తున్నాయి. ► ‘అమిగోస్’ చిత్రంలో నేను త్రిపాత్రాభినయం చేశాను. సిద్ధార్థ్ చాలా చురుకుగా ఉంటాడు. మంజునాథ్ది చాలా సైలెంట్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్. మైఖేల్ పాత్ర గ్యాంగ్స్టర్ని పోలిన విలన్లా ఉంటుంది. విలన్లా నటించడం చాలా కొత్తగా అనిపించింది. ట్రిపుల్ రోల్ చిత్రంలో కనీసం ఇద్దరు కథానాయికలైనా ఉంటారు. కానీ ఇది రెగ్యులర్ సినిమాలకు పూర్తి విభిన్నమైనది కావడంతో ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది. పైగా ఈ మూవీలో విలన్ ఉండకపోవడం ఓ విశేషం. ► మనిషిని పోలిన మనుషులను ‘డాపుల్ గాంగర్’ అంటారని రాజేంద్రగారు చెప్పారు. ఈ సినిమాకి ‘అమిగోస్’ టైటిల్ అనుకున్నప్పుడు అందరికీ అర్థం అవుతుందా? అన్నాను. అమిగో అనే పదం సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య బాగా వాడుతున్నారని చెప్పడంతో ఫిక్స్ చేశాం. సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది. ఈ మధ్య సూపర్ హిట్ అయిన ‘కాంతారా’ టైటిల్ అర్థం నాకు తెలీదు. దాని గురించి వెతికితే ‘వైల్డ్ ఫారెస్ట్’ అని అర్థం అయింది. ► కోవిడ్ సమయంలో నన్ను నేను బాగా తెలుసుకున్నాను. నేను చేసిన కొన్ని సినిమాలు పరాజయం కావడానికి కారణం ఏంటి? నేను చేసిన తప్పులు ఏంటి? అని తెలుసుకున్నాను. ‘అమిగోస్’ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంటే.. అందులో రెండు గంటల పదిహేడు నిమిషాలు కల్యాణ్ రామ్నే చూస్తారు.. సినిమాలో జస్ట్ రెండు నిమిషాలు మాత్రమే కనబడను. ఆ పాత్రకి అంత ప్రాధాన్యం ఉంటుంది. ► ప్రస్తుతం నేను నటిస్తున్న ‘డెవిల్’ మూవీ చిత్రీకరణ మే నెలలో పూర్తవుతుంది. ‘బింబిసార 2’ షూటింగ్ని ఈ ఏడాది ఆఖరులో ప్రారంభిస్తాం. ► తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో నేను చెబితే బాగుండదు. వైద్యం అందిస్తున్న ఆస్పత్రి వర్గాలు చెబితేనే బాగుంటుంది. -
హీరోయిన్ ఆషికకు ప్రపోజ్ చేసిన కల్యాణ్ రామ్!
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్. ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్ రామ్ ఓ ఫన్నీ టాస్క్లో భాగంగా హీరోయిన్ ఆషికకు లవ్ ప్రపోజ్ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను’ అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్గా ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్ రామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
షూటింగ్ సమయంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమిగోస్ డైరెక్టర్
‘‘నవీన్, రవిశంకర్గార్లు నిర్మించిన రెండు చిత్రాలు(వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి) ఈ సంక్రాంతికి విడుదలై సూపర్హిట్స్ అయ్యాయి. అంత సుడి ఉన్న నిర్మాతలు తీసిన ‘అమిగోస్’ కూడా బ్లాక్ బస్టర్ అయి హ్యాట్రిక్ సాధించాలి’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ చదివిన రాజేంద్రగారు వారి తల్లిదండ్రులు వద్దంటున్నా ఇండస్ట్రీకి వచ్చారు. ‘అమిగోస్’ మొదలయ్యేలోపు వారి అమ్మగారు కాలం చేస్తే, లాస్ట్ షెడ్యూల్ సమయంలో నాన్నగారు కూడా చనిపోయారు. రాజేంద్రగారి తల్లితండ్రులు భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన సాధించిన ఈ మొదటి మెట్టు విజయాన్ని వారు చూశారు. ‘జై లవ కుశ’లో నేను మూడు పాత్రలు చేశా. మూడు విభిన్న పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘అమిగోస్’ లో కల్యాణ్ అన్న మూడు పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించారు’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్న నాకు ‘అమిగోస్’ పర్ఫెక్ట్ మూవీ. 18 ఏళ్ల పాటు నన్ను ఆదరిస్తూ, భరిస్తూ వచ్చిన మీకు (ప్రేక్షకులు, అభిమానులు) చాలా థ్యాంక్స్. ఈ సినిమా చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడరు’’ అన్నారు. ‘‘నన్ను, ‘అమిగోస్’ స్క్రిప్ట్ను నమ్మి అవకాశం ఇచ్చిన కల్యాణ్రామ్గారికి, నిర్మాతలు రవి, నవీన్ గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు రాజేంద్ర రెడ్డి. ‘‘అమిగోస్’ని హిట్ చేసి, మాకు హాట్రిక్ (‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’) విజయాలను అందించాలి’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘బింబిసార’ తర్వాత కల్యాణ్గారి నెక్ట్స్ లెవల్ పెర్ఫార్మెన్స్ను ఈ చిత్రంలో చూస్తారు’’ అన్నారు వై.రవిశంకర్. ఈ వేడుకలో డైరెక్టర్ బుచ్చిబాబు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కొరటాల శివగారు, నా కాంబినేషన్లో సినిమా ఈ నెలలో ప్రారంభించి, మార్చిలో షూటింగ్ మొదలుపెడతాం. 2024 ఏప్రిల్ 5న ఆ సినిమాని విడుదల చేస్తాం. – ఎన్టీఆర్ -
కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ (ఫోటోలు)
-
'బింబిసార' సెంటిమెంట్ను కంటిన్యూ చేయనున్న కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్లో నటించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ హాజరయ్యాడు. ఈ సినిమా సూపర్హిట్ కావడంతో ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయనున్నారు కల్యాణ్ రామ్. 3 letters which will take the tale of 3 doppelgangers to the next level - N T R 🔥#Amigos Pre Release Event with @tarak9999 as the chief guest 💥 On 5th Feb at HYD💥 - https://t.co/T63ceTMvmD#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @shreyasgroup pic.twitter.com/szVI9VT10P — Mythri Movie Makers (@MythriOfficial) February 4, 2023 -
కల్యాణ్ రామ్ అమిగోస్ నుంచి సెకండ్ సింగిల్, బాలయ్య హిట్ సాంగ్కు రీమిక్స్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్, పాటలు సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్కు ఇది రీమిక్స్. గతంలో బాలయ్య నటించిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను దివంగత లెజెండరి సింగర్ బాలు - చిత్ర ఆలపించారు. అదే పాటలను అమిగోస్లో రిమేక్ చేయించాడు కల్యాణ్ రామ్. గిబ్రాన్ సింగీతం అందించిన ఈ పాటను ఎస్పీ చరణ్-సమీరా భరద్వాజ్లు ఆలపించారు. కాగా ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. Evergreen Romantic Melody is here❤️#EnnoRatrulosthayi Full Video Song from #Amigos out now 🕺💃 - https://t.co/foMaW1GPNB#AmigosOnFeb10th @NANDAMURIKALYAN @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial #SriVeturi #SpbCharan #SameeraBharadwaj @adityamusic pic.twitter.com/ouc4OQHVmI — Mythri Movie Makers (@MythriOfficial) January 31, 2023 -
అలాంటి సినిమాల్లో నటించాలనేది నా కల: ఆషికా రంగనాథ్
‘‘తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో నటించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాను. గతంలో కొన్ని కథలు నచ్చకపోవడం, మరికొన్ని నా డేట్స్ కుదరక చేయలేదు. కానీ ‘అమిగోస్’ కథ వినగానే నచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద ప్రొడక్షన్లో నా తొలి చిత్రం చేయడం నా అదృష్టం. ‘అమిగోస్’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని ఆషికా రంగనాథ్ అన్నారు. ‘‘బింబిసార’ వంటి హిట్ చిత్రం తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమిగోస్’లో నేను రేడియో జాకీ పాత్ర చేశాను. నేటితరం అమ్మాయిలకు నా పాత్ర బాగా నచ్చుతుంది. స్క్రీన్పై నా పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. ఇక తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్గార్ల డ్యాన్స్ అంటే ఇష్టం. రాజమౌళిగారు తీసిన ‘బాహుబలి’ లాంటి సినిమాలో నటించాలనేది నా కల. ప్రస్తుతం కన్నడ, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి’’ అన్నారు. -
క్రిటికల్గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్సాంగ్ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్ రామ్..
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా..“నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ”అంటూ ట్వీట్ చేశారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను . Get well soon and get back to complete health brother. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 28, 2023 -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కల్యాణ్ రామ్ 'అమిగోస్' టీజర్
బింబిసార సూపర్ హిట్తో ఫామ్లోకి వచ్చిన కల్యాణ్ రామ్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజాచిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న పోస్టర్ సినిమాపై మాంచి హైప్ను క్రియేట్ చేస్తుండగా తాజాగా ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ‘‘హాయ్ దిస్ ఈజ్ మైఖెల్ ఫ్రమ్ కోల్కతా’’ అంటూ కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలువతుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. -
‘బింబిసార’ బ్లాక్బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్
‘బింబిసార’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘అమిగోస్’. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లో 19వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్ను ఖరారు చేసింది చిత్రం బృందం. చదవండి: చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు అంతేకాదు ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ‘దె సే వెన్ యు మీట్ సమ్బడీ దట్ లుక్స్ జస్ట్ లైక్ యు, యు డై’ (నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు) అనేది పోస్టర్పై క్యాప్షన్గా ఉంది. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాన్ని పంచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి సీక్వెల్ బింబిసార-2 ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. వశిష్ఠ మాట్లాడుతూ.. 'సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చిన బింబిసారను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వారంతా ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా పైసా వసూళ్ అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో అక్టోబర్21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్ అవుతోంది. కాగా బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించారు. Get ready to fall back into the time of #Bimbisara and his Trigartala, streaming from MIDNIGHT TODAY! #BimbisaraonZEE5 @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial @zee5telugu @ZEE5Tamil @ZEE5Kannada @zee5keralam pic.twitter.com/q9KrE2yjC2 — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 20, 2022 -
అఫీషియల్: 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. బింబిసార ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబరు 21 నుంచి తెలుగు, కన్నడతో పాటు తమిళం, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్గా నిలిచింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటించారు. Bimbisaaaraa!! Echoing all over south India - Coming to you in 4 languages Enjoy #Bimbisara in Telugu, Kannada, Tamil & Malayalam Meet #BimbisaraOnOctober21#BimbisaraonZEE5@NANDAMURIKALYAN @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2022 -
షూటింగ్ను పూర్తి చేసుకుంటున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా
కల్యాణ్రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్తో షూటింగ్ దాదాపు పూర్తయింది. ఫైనల్ షెడ్యూల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి, మాథ్యూ వర్గీస్, రాజీవీ పిళ్లై, రవి ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. -
దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ని ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈచిత్రం ఇప్పుడు ఈమూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీకి తీసుకువస్తోంది. అక్టోబర్ 21న ఈ మూవీని ఓటీటీలో కానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. -
ఓటీటీ రిలీజ్కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార.రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది. చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా వారు మోసం చేశారు’ ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుంది. దీంతో దసరాకు బింబిసార మూవీని జీ5లో అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ దసరా కానుకగా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు అక్టోబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 నిర్వహకులు అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. -
‘బింబిసార’ కోసం కల్యాణ్రామ్ ఇంత కష్టపడ్డారా... మేకింగ్ వీడియో
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ని కళకళలాడించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు నెలలుగా హిట్ లేక విలవిలలాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి అందించింది. ఈ చిత్రం విడుదలై పది రోజలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్’పేరిట మేకింగ్ వీడియోని విడుదల చేసింది. (చదవండి: గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్) ఈ చిత్రంలోని ఫైటింగ్ సీన్స్ ఎలా షూట్ చేశారు?సెట్ నిర్మాణానికి మేకర్స్ పడిన కష్టమేంటి? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. -
కల్యాణ్రామ్ 'బింబిసార' సినిమాపై బాలయ్య పొగడ్తలు
నందమూరి కల్యాణ్రామ్ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బింబిసార బృందాన్ని అభినందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్రామ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️ The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM — NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022 -
బింబిసార ర్యాప్ సాంగ్ విన్నారా?
సరైన హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆగస్టు 5న రిలీజైంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజైంది. ఇందులో పాటతో పాటు పలు ముఖ్య సన్నివేశాలను సైతం చూపించారు. అంతేకాదు, కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగులను సైతం ర్యాప్ సాంగ్లో పొందుపరచడం విశేషం. ఆదిత్య అయ్యంగార్, లిప్సిక, పృథ్వీచంద్ర పాడిన ర్యాప్ సాంగ్కు కీరవాణి సంగీతం అందించాడు. చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్కు యత్నించిన నటుడు డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్స్పిరేషన్.. -
నందమూరి హీరోలను కాపాడుతున్న ‘చిట్టితల్లి’
అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు అనేవి భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలంలో నందమూరి హీరోలకు ‘పాప’ ఫ్యాక్టర్ అనేది ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడిందనేది వాస్తవం. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించిన పాప చుట్టే దర్శకుడు బోయపాటి శ్రీను సెకండ్ హాఫ్ మొత్తం కూడా నడిపించాడు.అలాగే సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసమే.ఈ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది తారక్ క్యారెక్టర్ తోనే.తాజాగా రిలీజైన బింబిసార సినిమాలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇది దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార చిత్రాలలో చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషల్ అనే చెప్పాలి.ఇంకా అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. నందమూరి ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ రేంజ్ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బింబిసార 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు. -
‘బింబిసార’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
'బింబిసార'లో అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ పాప ఎవరంటే?
త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్ రామ్ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్ ట్రావేల్ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్కు చాలా గ్యాప్ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు, విజువల్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్ రామ్తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్లో నివాసముండగా, శ్రీహరి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్, రామా రావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) -
'బింబిసార' ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన దిల్రాజు
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. .నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్రామ్కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్ను హర్షవర్ధన్తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్ను కల్యాణ్ రామ్కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
బింబిసార బ్లాక్బస్టర్.. ధన్యవాదాలు చెప్పిన కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తొలి రోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక మూవీ మంచి విజయం సాధించిడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్ ట్విట్ చేస్తూ బింబిసార బ్లాక్బస్టర్గా నిలిపినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా? ఈ మేరకు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘2019లో బింబిసార షూటింగ్ ప్రారంభించినప్పుడు ఎప్పుడెప్పుడు పూర్తి చూసి ప్రపంచానికి ఈ చిత్రాన్ని పరిచయం చేయాలా ఆసక్తిగా ఎదురు చూశాం. కానీ కరోనా, లాక్డౌన్ వల్ల మా ఉత్సాహన్ని కాస్తా ఆందోళనగా మార్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూవీ లవర్స్ కోసం మా చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం మా బింబిసార టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. చదవండి: మళ్లీ ప్రేమించేందుకు సిద్ధమా?.. చై సమాధానం ఇదే! థియేటర్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. చివరికి రిలీజ్ అనంతరం మా సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మా నీరిక్షణకు ఫలితం దక్కింది అనిపించింది’ అంటూ కల్యాణ్ రామ్ రాసుకొచ్చాడు. ఇక ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో భిన్నమైన కథగా వచ్చిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. Thank You ❤️#Bimbisara pic.twitter.com/PFH1ei9hhs — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) August 6, 2022 -
Bimbisara Box Office Collection: బాక్సాఫీస్పై ‘బింబిసారుడి’ దాడి.. తొలి రోజు ఎంతంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. (చదవండి: 'బింబిసార' మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది (చదవండి: బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్) కల్యాణ్ రామ్ కెరీర్లో ఫస్ట్డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. కల్యాణ్ రామ్ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే.. ఎంత మంచివాడవురా రూ.2.20 కోట్లు, 118 రూ.1.60 కోట్లు, నా నువ్వే రూ.0.75 కోట్లు, ఎంఎల్ఏ రూ. 2.72 కోట్లు, ఇజం 3.09 కోట్ల షేర్స్ అందుకున్నాయి. రూ.40 కోట్ల బడ్జెట్తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.2.15 కోట్లు ► సీడెడ్ - రూ.1.29 కోట్లు ► ఈస్ట్ - రూ.43 లక్షలు ► వెస్ట్ - రూ.36 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.90 లక్షలు ► గుంటూరు- రూ.54 లక్షలు ► కృష్ణా - రూ. 34 లక్షలు ► నెల్లూరు - రూ.26 క్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.0.32 లక్షలు ► ఓవర్సీస్ రూ.65లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్ (రూ.11.50 కోట్ల గ్రాస్) -
Bimbisara Movie OTT Release Details: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్ట్ 5న) గ్రాండ్గా రిలీజైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్టాక్ తెచ్చుకుంది. ట్రైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కల్యాణ్ రామ్ బింబిసార అనే రాజుగా కనిపించాడు. చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ నెట్టింట చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసి మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పొట్టి పడ్డాయట. చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం జీ5 ‘బింబిసార’ను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్లోనే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. చదవండి: ‘లేడీ సూపర్స్టార్’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ మరోవైపు ఆగస్ట్ చివరిలో వారంలోనే రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా డిజిటల్ స్ట్రీన్పై బింబిసార చూడాలంటే నెలన్నరకు పైగా వేచి చూడక తప్పందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా కొత్త డైరెక్టర్ వశిష్ఠ రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈచిత్రానికి ఎమ్ఎమ కీరవాణి సంగీతం అందించారు. -
అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్
-
అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్
ఇటీవల నందమూరి ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం(ఆగస్ట్ 1న) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతితో మరోసారి నందమూరి ఫ్యామిలీ విషాదంలోకి వెళ్లింది. కాగా కొంతమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో బుధవారం ఉమా మహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. మేనత్త అంత్యక్రియల్లో నందమూరి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబం కనిపించలేదు. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్న ఇండియాకు తిరిగొచ్చిన తారక్ తన భార్య ప్రణతి, తల్లి శాలినితో పాటు అన్న కల్యాణ్ రామ్తో కలిసి మేనత్త ఇంటికి వెళ్లాడు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మేనత్త మృతిపై కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. కాగా ఉమ అంత్యక్రియల్లో నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు -
బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే
నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండేళ్ల గ్యాప్ అనంతరం కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ఫస్ట్ షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. థియేటర్లు నందమూరి ఫ్యాన్స్ ఈళలతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు బింబిసార మూవీపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ తాజాగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బింబిసార' గురించి గొప్ప విషయాలు వింటున్నా. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు అత్యుత్సహం చూపిస్తుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఎలా తొలిసారి సినిమా చూసినప్పుడు వచ్చే ఫీలింగ్లా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్వీట్లో ‘కల్యాణ్ అన్నయ్యా... బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక? డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్’ అంటూ తారక్ బింబిసార టీంకు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా రోటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో కెథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .@NANDAMURIKALYAN anna you are irreplaceable as King Bimbisara. @DirVassishta handled the film like a pro. The legendary @mmkeeravaani garu is the backbone of #Bimbisara. Shoutout to all the actors and technicians who made this a success. — Jr NTR (@tarak9999) August 5, 2022 -
'బింబిసార' మూవీ రివ్యూ
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా బింబిసార టీం యాంకర్ సుమతో. కల్యాణ్ రామ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర టీం కలిసి సుమతో లంచ్ చేస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ కాగా ఈ మూవీ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందడంతో సుమ ఈ ప్రశ్నతోనే ఇంటర్య్వూను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కీరవాణిని మీరు టైం ట్రావెల్ అవ్వాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటారని అడగ్గా.. కీరవాణి తాను 2018 ఆగస్ట్ 28కి వెళ్తానన్నారు. ‘అప్పుడు నేను హరికృష్ణ గారికి కాల్ చేసి మనం కంపోజింగ్ పెట్టుకుందాం, ఓ రెండు రోజులు నాతో ఉండిపోండి అని చెప్పేవాడి. అలా చెప్పడం వల్ల ఆయన ఆగస్ట్ 29న జర్నీ చేయరు కదా. ఎందుకంటే హరికృష్ణ గారికి నా కంపోజింగ్ అంటే చాలా ఇష్టం. నేను అలా కాల్ చేసుంటే కచ్చితంగా ఆయన నాతోనే ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ కల్యాణ్ రామ్ని మీ తండ్రి చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తాను ఇంట్లోనే ఉన్నానన్నాడు. చదవండి: సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్తో చై చర్చలు.. అందుకేనా? ‘ఉదయం 5:30 ఆ సమయంలో నేను ఇంట్లో బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నా. అప్పుడే నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆయన నాన్నతో(హరికృష్ణ) కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైందా అని శివాజీ గారు శివాజీ గారు అని అన్నాను. కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది’ అని చెప్పాడు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్ చేసి.. కొన్ని ఫొటోలు పంపించారని గుర్తు చేసుకుని కల్యాణ్ రామ్ ఏమోషనల్ అయ్యాడు. కాగా 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆయన సోదరి, కల్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
తమ్ముడితో పాన్ ఇండియా సినిమా పక్కా.. కథ కుదిరితే బాబాయ్తోనూ..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు’ అనే మాటలను నేను నమ్మను. ఇతర భాషలతో పోలిస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు.. సినిమాలను ప్రేమిస్తారు. కథ బాగుంటే తెలుగు చిత్రాలనే కాదు.. పరభాషా సినిమాలను కూడా ఆదరిస్తారు’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ► వశిష్ఠ్ చెప్పిన ‘బింబిసార’ కథ వినగానే ఎగ్జయిటింగ్గా అనిపించింది. పైగా సరికొత్త పాయింట్ కావడంతో ఓకే చెప్పేశాను. కథ బాగుండటం, చక్కని టీమ్ కుదరడంతో తను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు వశిష్ఠ్. ► మా తాతగారు (ఎన్టీఆర్), బాబాయ్ (బాలకృష్ణ)లు రాజులుగా చేసి, మెప్పించారు. ఈ చిత్రంలో బింబిసారుడు అనే రాజు పాత్ర అనగానే నేను సెట్ అవుతానా? అనిపించింది. రాజు అంటే ఇలాగే ఉంటాడు అనేలా ఈ తరం నటుల్లో ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. నా లుక్ విషయంలో ముందు కొన్ని అనుకున్నా ఫైనల్గా మూవీలోని లుక్ ఫిక్స్ చేశాం. ఈ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ► ‘ఏ కథలో ఏ హీరో నటించాలో రాసిపెట్టి ఉంటుంది. ఏ కథ అయినా ఆ హీరోని వెతుక్కుంటుంది’ అని మా నాన్న (హరికృష్ణ) చెప్పేవారు. ‘అతనొక్కడే’ చిత్రకథ కూడా ఎందరో విన్నా ఫైనల్గా నేను చేశా. అలా ‘బింబిసారుడు’ కథ నా కోసం పుట్టింది. ప్రేక్షకుల అంచనాలను వందశాతం రీచ్ అవుతాం. ► కోవిడ్కి ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. అప్పుడు ఇతర భాషల్లో చేద్దామనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం సమయం పడుతుంది. అంత టైమ్ మాకు లేదు.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. ఇక్కడ హిట్ అయిన తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. ► తెలుగువాళ్లకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. కుటుంబంతో కలిసి థియేటర్కి వెళ్లి సినిమా చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. మనం మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. ఓ సినిమా బాగుందంటే వచ్చే మౌత్ పబ్లిసిటీకి చాలా పెద్ద స్పాన్ ఉంది. నా ‘అతనొక్కడే’ చిత్రం కూడా తొలి ఆట నుంచే మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయింది. ఈ మధ్య రిలీజ్ అయిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల్లో మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ► ఓ నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.. నా దృష్టంతా నటనపైనే ఉంటుంది. ప్రస్తుతం ‘బింబిసార’ ప్రమోషన్స్తో బిజీగా ఉండటంతో తెలుగులో షూటింగ్ల బంద్ విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా విడుదల తర్వాత స్పందిస్తాను. రొమాంటిక్ సినిమాలు నాకు సెట్ అవ్వవు.. అందుకే చేయను (నవ్వుతూ). ‘బింబిసార 2’కి కథ రెడీగా ఉంది. నేను నిర్మాతగా తమ్ముడితో(ఎన్టీఆర్) ఓ పాన్ ఇండియా సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరితే బాబాయ్ (బాలకృష్ణ)తోనూ ఓ సినిమా నిర్మిస్తాను. -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
నీతో ఉంటే చాలు.. హత్తుకునేలా 'బింబిసార' గీతం
Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥 Tune into the Lyrical Video now 🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX — NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022 చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. సల్లూ భాయ్కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? -
‘బింబిసార’కోసం త్రిగర్తల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం : దర్శకుడు
‘బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. ఆయన చరిత్రకి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కల్పిత కథ. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది’ అన్నారు యువ దర్శకుడు వశిష్ట్. ఆయన దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట సినిమా గురించి విశేషాలు.. ► 2018లో ‘బింబిసార’ జర్నీ ప్రారంభమైంది. కథంతా ఓ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత కల్యాణ్ రామ్ని కలిశాను. నేను చెప్పిన పాయింట్ ఆయనకు బాగా నచ్చేసింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరిగారికి కథ నెరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. తర్వాత సినిమా ఎలా ముందుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే. ► నాకిది తొలి సినిమా. నా సబ్జెక్ట్ని కళ్యాణ్రామ్, నిర్మాత హరి నమ్మారు. బింబిసార వంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటాగారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్గారు, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ► నాకు ముందు నుంచి డైరెక్షన్ అంటేనే ఇష్టం. అయితే మధ్యలో ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. చివరకు నాకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవటం ఉత్తమం అనిపించింది. దాంతో మళ్లీ దర్శకత్వ శాఖ వైపు అడుగు లేశాను. ► ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓరకంగా చెప్పాలంటే నాకు కూడా ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం. ► మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ. ► బింబిసార సినిమా అనుకోగానే కీరవాణిగారినే మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నాం. అయితే అప్పటికే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన్ని కలవలేకపోయాం. అప్పుడు చిరంతన్ భట్ గారిని అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఆయన ఈ టైప్ ఆఫ్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణిని చేసున్నారు. ఆయన్ని కలిసి కథ చెప్పిన తర్వాత కర్మ సాంగ్ను ఇచ్చారు. తర్వాత మరో సాంగ్ను ఇచ్చారు. మూడో సాంగ్ను వరికుప్పల యాదగిరి ఇచ్చారు. ఫోక్ సాంగ్ కావాలి. కానీ.. రొటీన్ ఫోక్ కాకూడదనిపించి.. వరికుప్పల యాదగిరికి విషయం చెబితే ఆయనే ట్యూన్ కంపోజ్ చేశారు. తర్వాత టీజర్కి సంతోష్ నారాయణ్మ్యూజిక్ అందించారు. తర్వాత ఆయన బిజీగా ఉండటంతో కీరవాణిగారిని కలిశాం. ఆయన సినిమా చూసి ఏమంటారోనని కాస్త ఆలోచించాం. కానీ ఆయన సినిమా చూసి వర్క్ చేస్తానని చెప్పారు. ► సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు రాజుల పాత్రల్లో మనల్ని అలరించారు. వారికి దగ్గర పోలికల్లో మన సినిమాలో హీరో లుక్ ఉండకూడదని అనిపించింది. ఆ సమయంలో మా డిజైనర్ రాము కొన్ని స్కెచెస్ ఇచ్చారు. అందులో ఇప్పటి లుక్ అందరికీ నచ్చింది. ► బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. కాబట్టి రెండు భాగాలు చేయాలని అనుకుంటున్నాం. స్క్రిప్టింగ్ టైమ్లోనే ఈ ఆలోచన ఉంది. బింబిసారుడు అనే క్యారెక్టర్ ఓ సూపర్ మ్యాన్లాంటి క్యారెక్టర్ దీన్ని 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చు. -
బింబిసారుడిగా కొత్త అవతారం ఎత్తిన కళ్యాణ్ రామ్
-
ఆ సినిమా దెబ్బకొట్టింది, చాలా నష్టపోయా: కల్యాణ్ రామ్
పటాస్, 118 వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడీ హీరో. ప్రస్తుతం అతడు నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ తనను బాగా దెబ్బ తీసిన సినిమా పేరును వెల్లడించాడు. 'అతనొక్కడే, పటాస్, 118 సినిమాలతో సక్సెస్ రుచి చూశాను. కానీ ఓం సినిమా ఫలితం చూసి బాగా ఫీలయ్యాను. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ మా లెక్కలు తప్పాయి. ఓం నన్ను ఆర్థికంగా దెబ్బ తీసింది. కానీ పటాస్ వచ్చి అది మొత్తం రికవరీ చేసింది. బింబిసార సినిమాను తమ్ముడు తారక్ చూశాడు. బాలకృష్ణ కర్నూలు షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఇంకా ఈ సినిమా చూడలేదు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: సౌత్ హిట్స్తో బాలీవుడ్ బేజార్.. స్పందించిన బాలీవుడ్ నిర్మాత గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్తో సునీల్ దత్ లవ్స్టోరీ.. -
అభిమాని మృతిపై స్పందించిన ‘బింబిసార’ యూనిట్
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అభిమాని సాయిరాం మృతిపై చిత్ర యూనిట్ స్పందించింది. సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేశారు. ‘పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలానికి చెందిన పుట్ట రాంబాబు కొడుకు సాయిరాం శుక్రవారం రాత్రి జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్కి వచ్చి మృతి చెందడం బాధాకరం. అతని కుటుంబానికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. సాయిరాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’అంటూ బింబిసార టీమ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఓ లేఖని సోషల్ మీడియాలో వదిలారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. An unfortunate and heartbreaking incident. May his soul rest in peace. Om shanti. pic.twitter.com/1faIb6n5fk — NTR Arts (@NTRArtsOfficial) July 30, 2022 -
‘బింబిసార’ ఈవెంట్లో విషాదం, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుమానాస్పద మృతి
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ మూవీ ప్రిరిలీజ్ వేడుక నిన్న(శుక్రవారం) శిల్పకళా వేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు. చదవండి: స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈసారి ఎవ్వరినీ డిసప్పాయింట్ చేయను: కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. శుక్రవారం బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద సినిమాను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్ చేయను. 200% మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమాకు మూలకారకుడైన తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్.. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. ఆ సమయంలో ఈ సినిమా డైలాగ్ రైటర్ అయ్యాడు. సినిమాకు ప్రాణం పోసిన వ్యక్తి కీరవాణి. బింబిసార కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా -
బింబిసార ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అన్న సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశాడు జూనియర్ ఎన్టీఆర్. 'హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు, ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..' అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. 'నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని చెప్పే డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నందమూరి తారకరామారావు నూరవ జయంతి సంవత్సరం కాబట్టి బింబిసారను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు కల్యాణ్ రామ్. Another peek in to the grand world of #Bimbisara. A big screen experience awaits you on August 5th. https://t.co/p1rBGLeMxu#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @ChirantannBhatt @NTRArtsOfficial — Jr NTR (@tarak9999) July 27, 2022 చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ -
గ్లామర్ని డ్రెస్తో కనెక్ట్ చేయకూడదు: సంయుక్తా మీనన్
‘‘భాష తెలియకుండా నటిస్తే చేసే పాత్రతో సగం కనెక్షన్ మిస్ అయిపోతాం. నా పాత్రకు వేరే వారు డబ్బింగ్ చెప్పడం నాకిష్టం ఉండదు. అందుకే లాక్డౌన్లో ట్యూటర్ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను’’ అన్నారు సంయుక్తా మీనన్. కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, కేథరీన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – ‘‘నటిని అవుతానని అనుకోలేదు. అనుకోకుండా నటిగా అవకాశం రావడంతో సినిమాలు చేశాను. మలయాళంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ ‘బింబిసార’, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం సైన్ చేశాను. ఆ నెక్ట్స్ పవన్ కల్యాణ్గారి ‘భీమ్లా నాయక్’, ధనుష్గారి ‘సర్’ చిత్రాలు అంగీకరించాను. ‘భీమ్లా నాయక్’, ‘సర్’ చిత్రాల ఆఫర్స్ ఒకేరోజు వచ్చాయి. ఇక ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. ఫ్లాష్బ్యాక్, ప్రెజెంట్ సిట్యువేషన్స్లో స్క్రీన్ ప్లే సాగుతుంది. ప్రెజెంట్ సాగే కథలో నేను కాస్త మోడ్రన్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాను. ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలను కుంటున్నాను. నా వస్త్రధారణ కాస్త నిండుగా ఉంటుంది. నా తరహాలో నేను గ్లామర్గానే ఉన్నాను. గ్లామర్ను డ్రెస్తో కనెక్ట్ చేసి చూడటం అనేది తప్పని నా ఫీలింగ్’’ అని అన్నారు. -
బింబిసార.. అందమైన చందమామ కథ
‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం.. చదివాం.. వెండితెరపై చూశాం. తాతగారు (దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్) చేసిన ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, బాబాయ్ (బాలకృష్ణ) చేసిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’.., చిరంజీవిగారు చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, మా జనరేషన్లో తమ్ముడు (ఎన్టీఆర్) చేసిన ‘యమదొంగ’, రామ్చరణ్ చేసిన ‘మగదీర’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలు గమనిస్తే.. అందమైన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అర్థమవుతుంది. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అదే మా ‘బింబిసార’. ఈ ఏడాది మా తాతగారు ఎన్టీఆర్ నూరవ జయంతి సంవత్సరం కాబట్టి ఆయనకు మా ‘బింబిసార’ను అంకితం ఇస్తున్నాను’’ అని నటుడు–నిర్మాత కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. జూలై 5న కల్యాణ్రామ్ బర్త్ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్ను లాంచ్ చేశారు. ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి, సపోర్ట్ చేసిన నిర్మాత హరికి, ప్రోత్సహించిన నా బింబిసారుడు కల్యాణ్రామ్గారికి ధన్యవాదాలు’’ అన్నారు వశిష్ఠ్. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్
-
'బింబిసార' టీజర్ రిలీజ్.. టైమ్ ట్రావెల్ సినిమా అంటారా మాస్టారు !
Kalyan Ram Bimbisara Movie Teaser Released: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత్రం 'బింబిసార'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్లైన్. వశిష్ట్ దర్శకుడిగా పరిచియమవుతున్న ఈ సినిమా టీజర్ను ఇవాళ విడుదల చేశారు మూవీ మేకర్స్. సినిమా టీజర్ 'బింబిసారుడి' పాత్ర గురించి పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది. 'ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే' అంటూ బింబిసారుడి పొగరు, పరాక్రమం, ధైర్యసాహాసాల గురించి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. బింబిసారుడిగా యుద్ధ రంగంలో కత్తి దూస్తూ కల్యాణ్ రామ్ అలరించారు. సినిమాలో యుద్ధ సన్నివేశాలు భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బింబిసారుడిగా అలరించిన కల్యాణ్ రామ్ టీజర్ చివరలో ఈ జనరేషన్ యువకుడిలా కనిపిస్తారు. అయితే ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తారా.. లేదా బింబిసారుడే ఈ జనరేషన్లోకి వస్తే ఎలా ఉంటుందో అని చూపిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ట్యాగ్లైన్ చూస్తే మాత్రం 'చెడు నుంచి మంచికి మారిన రాజు ప్రయాణం' అనే కోణంలోనే సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. టైమ్ ట్రావెల్లా కనిపిస్తున్న ఈ టీజర్లో విజువల్స్తోపాటు సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. -
పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నందమూరి కల్యాణ్ రామ్
హీరో కల్యాణ్రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటికే బింబిసారుడు అనే పీరియాడికల్ మూవీలో నటిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశారు. నవీన్ మేడారం దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు డెవిల్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన డెవిల్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కల్యాణ్రామ్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పంచెకట్టులో చేతిలో రివాల్వర్తో కల్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నారు. పోస్టర్ను బట్టి ఇది 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకొని ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ లుక్తో సినిమాపై అంచనాలు పెరిగాయి. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. డెవిల్తో పాటు మరో మూడు సినిమాలు ప్రస్తుతం కల్యాణ్ రామ్ చేతిలో ఉన్నాయి. ఈసారి హిట్టు కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కల్యాణ్ రామ్. -
జూలైలో బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీరే
చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు జూలైలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. అందులో ముందుగా నందమూరి హీరో కల్యాణ్ రామ్, రియల్ హీరో సోనూసూద్, నటకిరీటీ రాజేంద్రప్రసాద్ పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్, హీరోయిన్ కియారా అద్వాని తదితరులు ఉన్నారు. ఈ నెలలో బర్త్డేలు, జయంతిలను జరుపుకుటుంటన్న సినీ ప్రముఖులు ఎవరో ఓ లుక్కేద్దాం. జూలై 1న రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. జూలై 1 రియా చక్రబర్తి బర్త్డే జూలై 2.. కృష్ణ భగవాన్ పుట్టిన రోజు జూలై 4న ఎంఎం కీరవాణి పుట్టినరోజు జూలై 5న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు. జూలై 6న సింగర్ మాలవిక పుట్టిన రోజు. జూలై 10 న మంజరీ ఫడ్నీస్ బర్త్ డే జూలై 10న సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు పుట్టిన రోజు జూలై 14న తనికెళ్ల భరణి పుట్టిన రోజు జూలై 19న రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు. జూలై 21న హీరో వరుణ్ సందేశ్. జూలై 23న తమిళ స్టార్ హీరో సూర్య బర్త్ డే. జూలై 27న డైలాగ్ కింగ్ సాయి కుమార్ పుట్టిన రోజు. జూలై 27న ప్రముఖ సింగర్ కే.ఎస్. చిత్ర బర్త్ డే. జూలై 27న హీరోయిన్ కృతి సనన్ బర్త్ డే . జూలై 30న రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే. జూలై 31న హీరోయిన్ కియారా అద్వానీ పుట్టిన రోజు -
MAA Elections 2021: అవన్నీ పుకార్లే నమ్మకండి: కళ్యాణ్ రామ్
హైదరాబాద్: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికలు సెప్టెంబర్లో జరగాల్సి ఉండగా ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైనట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అధ్యక్ష పోటీలో బరిలోకి దిగిన పోటీదారులే గాక ఎన్నికలకు సంబంధించి వస్తున్న పుకార్లనే చెప్పాలి. ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ రేసులో మరో పోటీదారుడిగా జూ.ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్రామ్ ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా దీనిపై కళ్యాణ్ రామ్ స్పందించారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి తాను పోటీలో లేనని కళ్యాణ్రామ్ క్లారిటీ ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే తనకు లేదని, ఇది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టిపారేశారు. -
Balakrishna: బాబాయ్కి అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బర్త్డే విషెస్
నందమూరి నటసింహం బాలకృష్ణ 61వ పుట్టిన రోజు నేడు(జూన్ 10). ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చిరంజీవి చేసిన ట్వీట్లు, చెప్పిన విషెస్ వైరల్ అవుతున్నాయి. తన బాబాయ్కు ఎర్లీ మార్నింగ్ బర్త్డే విషెస్ తెలియజేశాడు ఎన్టీఆర్. ‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాబాయ్ బాలయ్యది ఓ అరుదైన ఫోటో పంచుకున్నారు. కల్యాణ్ రామ్ సైతం ‘61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను’అని బాబాయ్కి బర్త్డే విషెస్ తెలియజేశాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/fbR1nfmqn5 — Jr NTR (@tarak9999) June 10, 2021 61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/05b5VisjNs — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2021 ఇక మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ చేశారు. ‘మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని ట్వీట్ వేశారు. మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐 #NBK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021 చదవండి: Akhanda: బాలయ్య బర్త్డే సర్ప్రైజ్.. నవ్వుతూ నటసింహం అలా.. మీ వల్లే ఇంతటివాడినయ్యాను, ప్లీజ్..: బాలయ్య -
మిస్ యూ నాన్న: జూనియర్ ఎన్టీఆర్
నేడు(బుధవారం) దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 64వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని హీరో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. "ఈ అస్థిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు" అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు. (ఆర్ఆర్ఆర్: ‘క్లైమాక్స్ అద్భుతం..!’) 'మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న'! అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. వెండితెరపై సీతయ్యగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. (మీ మరణంతో నా జీవితంలో శూన్యం) మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... Miss You Nanna! pic.twitter.com/GG11AnPbIY — Jr NTR (@tarak9999) September 2, 2020 -
‘ఎన్హెచ్కే’ ఏర్పాటు వైపు ఎన్టీఆర్ అడుగులు?
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’అనే ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. తమకున్న క్రేజ్ను కాసులుగా మల్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని, నితిన్, సందీప్ కిషన్ లాంటి వాళ్లందరూ ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. తమ సినిమాల్లో వీటిని భాగస్వామ్యం చేసి లాభాల్లో వాటాను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం చేరబోతున్నాడని టాలీవుడ్ టాక్. ఎన్హెచ్కే(నందమూరి హరికృష్ణ) ఆర్ట్స్ బ్యానర్ పేరిట సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన తదుపరి సినిమాల్లో ఎన్హెచ్కే నిర్మాణ సంస్థను భాగస్వామిని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్హెచ్కేను స్లీపింగ్ పార్ట్నర్గా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడట ఎన్టీఆర్. ఇక తన తదుపరి అన్ని చిత్రాల్లో ఎన్హెచ్కే స్లీపింగ్ పార్ట్నర్గా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా నిర్మించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నడని టాలీవుడ్ టాక్. ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను ఎన్టీఆర్కు అత్యంత ఆప్తమిత్తుడైన ఒకరు చూసుకుంటారని సమాచారం. నటుడిగా గొప్ప విజయాలను అందుకున్న ఎన్టీఆర్.. నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. చదవండి: జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క -
ఎన్టీఆర్ వర్ధంతి : నివాళులు అర్పించిన తారక్
-
మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది
కల్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహరీన్ కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాస్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కల్యాణ్రామ్ మాట్లాడుతూ–‘‘ఇతరుల బాధలు తనవి అనుకుని వారితో అనుబంధాన్ని పంచుకునే పాత్రలో నటించాను. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేశాననే అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. నేను మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చారు సతీష్. ఈ చిత్రంలో నా నటన, డైలాగ్ డెలివరీ, స్టైల్ బాగున్నాయని మా కుటుంబ సభ్యులు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు నా కెరీర్లో ఇదే ఉత్తమ చిత్రమని ప్రశంసించారు’’ అని అన్నారు. ‘‘కల్యాణ్రామ్గారితో ఓ మంచి సినిమా తీస్తానని నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్. కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా ఫలితం కోసం నిద్రపోకుండా ఎదురు చూశాం.మొదట్లో ఫెయిల్ అన్నారు. ఆ తర్వాత పాస్ అయ్యామని చెప్పారు. ఫస్ట్ షో తర్వాత సెకండ్ క్లాస్లో పాసయ్యామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కల్యాణ్రామ్గారి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది’’ అని అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా తీశాం. మా నమ్మకం నిజమైంది. మౌత్టాక్తో వసూళ్లు పెరుగుతున్నాయి. చక్కటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, తనికెళ్లభరణి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ
టైటిల్: ఎంత మంచివాడవురా! జానర్: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: కళ్యాణ్ రామ్, మెహరీన్, ప్రవీణ్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, విజయ్కుమార్, నరేశ్, సుదర్శన్ వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల సంగీతం: గోపీ సుందర్ దర్శకత్వం: సతీష్ వేగేశ్న నిర్మాతలు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నందమూరి కళ్యాణ్రామ్-మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ‘శతమానం భవతి’తో నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే, నా నువ్వే, 118 లాంటి వరుస పరాజయాలతో వెనకపడ్డ ఈ నందమూరి హీరో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని భావిస్తుండగా.. ‘శతమానం భవతి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో అదే ఫీల్ను కంటిన్యూ చేయలేకపోయారు సతీష్. దీంతో హీరోగా కళ్యాణ్ రామ్కు.. దర్శకుడిగా సతీష్ వెగేశ్నకు ఈ చిత్రం ఎంతో ప్రెస్టేజ్గా మారింది. ఇక సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎంత మంచివాడవురా!’ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంది? కళ్యాణ్రామ్ విషయంలో ఎన్టీఆర్ కన్న కల ఎంత మేర విజయం సాధించింది? సంక్రాంతి బరిలోకి దిగిన నందమూరి ఇంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో’ చిత్రాలకు గట్టి పోటీనిస్తుందా? అనేది సినిమా సమీక్షలో చూద్దాం. కథ: బాలు(కళ్యాణ్ రామ్)కు బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బర్త్డే కానుకగా చుట్టాలందిరినీ పిలిచి పండగ టైప్లో ఎంజాయ్ చేయాలని తన తండ్రిని బాలు కోరుతాడు. ఎందుకంటే చుట్టాలంటే తనకు ఇష్టమని పేర్కొంటాడు. అయితే సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఈ సమయంలో నా అనుకున్న బంధువులు బాలు చేతిలో జాలిగా ఏమైనా కొనుకొమ్మని డబ్బులు పెడతారే తప్ప చేయందించి తామున్నామనే భరోసా ఇవ్వరు. ఈ తరుణంలో నందిని (మెహరీన్)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. అయితే బాలు తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతారు. అయితే ఈ విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్కు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఆ కారణం తెలుసుకొని వారికి అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్ పెడతాడు. అక్కడి నుంచి అసలు కథ, ఎమోషన్స్ మొదలవుతాయి. అయితే ఈ కథలోకి మిగతా తారాగణం ఎందుకు ఎంటరవుతుంది? ఇంతకీ ఆచార్య, రిషి, సూర్య, శివ, బాలు అందరూ ఒక్కటేనా లేక వేరువేరా? స్నేహితుల దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్ ఏంటి? అది సత్ఫలితాన్ని ఇచ్చిందా? లేక ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: కళ్యాణ్ రామ్ తన పంథా మార్చుకుని చేసిన సినిమా ‘ఎంత మంచివాడవురా!’. కెరీర్ ప్రారంభంలో ఒకే రకమైన చిత్రాలు చేసిన ఈ నందమూరి హీరో ఈ మధ్య కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో కుటుంబ కథానాయకుడిగా పక్కా ఆప్ట్ అయ్యాడు. అన్ని రకాల హావభావాలను ప్రదర్శించాడు. నటన పరంగా కళ్యాణ్ రామ్ అన్ని వేరియేషన్స్ చూపించాడు. కామెడీతో పాటు ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక కళ్యాణ్ రామ్ తర్వాత ఈ సినిమాలో మరొకరి గురించి చెప్పుకోవాలంటే హీరోయిన్ మెహరీన్. సినిమా అద్యంతం కళ్యాణ్ రామ్తోనే ఉండే ఈ అందాల బొమ్మకు మంచి సీన్సే పడ్డాయి. అల్లరి, కామెడీ, హీరోపై తనకుండే ప్రేమను ఇలా అన్ని రకాల భావాలను అవలీలగా పండించింది. అంతేకాకుండా హీరో కోసం పరితపించే అమ్మాయిగా ఆకట్టుకుంది. నటిగా ఈ చిత్రంతో మెహరీన్ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. చాలా కాలం తర్వాత విలన్గా కనిపించిన రాజీవ్ కనకాల తనదైన పెర్మార్మెన్స్ కనబర్చాడు. ఇక మిగతా తారాగణం విషయానికి వస్తే సుహాసిని, శరత్ బాబు, తనికెళ్ల భరిణి, నరేశ్ వీరంతా సీనియర్స్ కావడంతో వారి పాత్రలను చాలా సులువుగా చేసేశారు. వెన్నెల కిశోర్, సుదర్శన్, భద్రం, ప్రవీణ్లు తమ కామెడీతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నా తండ్రిని విశాలమైన ఇంట్లో ఉంచాను.. ఆయన తిరగడానికి కారును కొనిచ్చా.. అమ్మ లేకపోవడంతో తినడానికి ఇబ్బందులు పడకూడదని వంట మనిషిని పెట్టాను. ఇంతంకంటే ఓ తండ్రిని ఆనందంగా ఉంచడానికి ఏం చేస్తారు’ ప్రస్తుత జనరేషన్లో ఓ సగటు కొడుకు లేక కూతురు అనుకోవడం కామన్. అయితే వాటితో తమ తల్లిదండ్రులు ఆనందపడట్లేదు కేవలం సుఖపడుతున్నారనే విషయాన్ని ఈ చిత్రంతో తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఆధునిక నాగరికతకు అలవాటు పడుతున్న ప్రస్తుత యువత బంధాలు, బంధుత్వాలతో కూడిన ఎమోషన్స్కు కనెక్ట్ కాలేకపోతున్నారు. బిజీ లైఫ్లో కాస్త విరామం దొరికితే రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప కొత్త బంధాలను కలుపుకుపోవడానికి యత్నించడం లేదు. ఇలా కొన్ని పాయింట్లతో కథను అల్లుకుని నందమూరి కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ గట్స్కు హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే తమ హీరో నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్నే కోరుకుంటారు. ఇలాంటి కుటుంబకథా చిత్రాన్ని ఒప్పుకోరు. అయితే కథ నచ్చడం, కొత్తగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో కళ్యాణ్రామ్ కూడా ఈ సినిమాకు సై అన్నారు. ‘శతమానం భవతి, శ్రీనివాస్ కళ్యాణం’ వంటి చిత్రలతో కుటుంబకథా చిత్రాల దర్శకుడిగా ముద్రపడిపోయారు సతీష్ వేగేశ్న. అయితే ఓ గుజరాతీ చిత్రంకు సంబంధించిన మూల కథను తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు, నందమూరి ఫ్యాన్స్ను దృష్టిలో ఉంచుకొని కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. ఈ సినిమా కథ సగంకు పైగా ఫ్లాష్ బ్యాక్లోనే నడుస్తుంది. రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్, హీరోయిన్ వన్సైడ్ లవ్, కామెడీ, పాటలు, కోర్టు సీన్స్, ఒకటి రెండు ఫైట్లతో తొలి అర్థభాగం పర్వాలేదనిపిస్తుంది. ‘ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయిర్’ అనే కొత్త కాన్సెప్ట్ అందరినీ ఆలోచించే విధంగా ఉంటుంది. ఇక ఫస్టాఫ్లో భాగంగా వేసిన ముడులను రెండో అర్ధభాగంలో ఒక్కొక్కటి విప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అంతేకాకుండా సెకండాఫ్ను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ కామెడీ, సుహాసిని, శరత్ బాబుల ఎంట్రీ తర్వాత సినిమా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. కృష్ణవంశీ సినిమా మాదిరి ప్రతీ ఫ్రేమ్లో భారీ తారగణంతో సందడిసందడిగా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్లు చాలా రొటీన్గా ఉంటాయి. అయితే ఒకే ఫీల్తో సినిమా అంత సాగడం. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నగా.. పూర్తి కథగా, సినిమాను అందంగా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ ఎందుకో తడబడ్డట్లు అనిపిస్తుంది. ఇక కళ్యాణ్రామ్తో తనికెళ్ల భరణి, విజయ్ కుమార్, సుహాసిని, శరత్బాబులతో వచ్చే ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్లో హీరోయిన్ను హీరో కూల్ చేయడానికి ప్రయత్నించే సమయంలో వచ్చే నాగిని సాంగ్ నవ్వులు తెప్పిస్తుంది. యూట్యూబ్ థంబ్నేల్స్ కోసం సుదర్శన్ పడే కష్టాలు హాయిగా ఉంటాయి. సెకండాఫ్లో వెన్నెల కిశోర్ ఎంటరయ్యాక తన దైన స్టైల్లో కామెడీ పండించాడు. ‘బంధాన్ని కోరుకునేది మీరు, అనుబంధాన్ని పంచేది మేము, భయం ఒకడు పెడితే రాదు, ధైర్యం ఒకడిస్తే పోదు, ఆడ పిల్లల కోరికలు ఉల్లి పొరలు వంటివి, దేవుడికంటే గొప్పగా స్క్రీన్ప్లే గొప్పగా రాయలేరు, ఎమోషన్ అవసరమైన వారికి రిలేషన్ షిప్ ఇస్తాడంట, లైఫ్ పార్ట్నర్ ఇంటి నుంచి రావాలి కాని వదిలేసి కాదు, ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటి వారి సంతోషం కోసం అబద్దం ఆడిన తప్పులేదు, వాకిట్లో అన్నీ అమ్ముతున్నారు.. రిలేషన్షిప్ కూడానా’ వంటి డైలాగ్లు ఆకట్టుకున్నాయి. ఇక సాంకేతికత విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మున్నార్, హీరోహీరోయిన్లను చాలా అందంగా చూపించారు. అయితే మ్యూజిక్ చాలా మైనస్ అయింది. గోపీ సుందర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా అనిపించదు. అంతేకాకుండా థియేటర్ నుంచి బయటకి వచ్చాక పాటలు కూడా గుర్తుండవు. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్పై కాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఓవరాల్గా చెప్పాలంటే డైరెక్టర్ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. అయితే ఎమోషన్స్, ఫీల్స్ ఆడియన్స్కు కనెక్ట్ అయితే ‘ఎంత మంచి సినిమా!’ అవడం ఖాయం. ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్ నటన సెకండాఫ్లో వచ్చే కామెడీ కాన్సెప్ట్ కొత్తగా ఉండటం మాటలు ఎమోషన్ సీన్స్ మైనస్ పాయింట్స్: మ్యూజిక్ సాగదీత సీన్లు క్లైమాక్ - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
ఇమేజ్ కోసం ఆలోచించను
‘‘సంక్రాంతి పండగంటే రైతుల పండగే కాదు.. మా సినిమావాళ్లకు కూడా పండగే. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూస్తారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఎంత మంచివాడవురా..’ అనే పాట తాతయ్య (ఎన్టీఆర్) ‘నమ్మినబంటు’ చిత్రంలోనిది. డైరెక్టర్గారు ఈ సినిమాకి తొలుత ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ అనుకున్నారు.. కానీ, ఆయన సినిమాల టైటిల్ తెలుగుదనంతో ఉండటమే కరెక్ట్ అనిపించి, కథను బట్టే ఈ టైటిల్ని పెట్టాం. ► వేర్వేరు మనస్తత్వాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు? వారిని ఎలా మార్చాడు? అనేది కథ. ఇతరులకు ఇవ్వటం అనే పాయింట్ను చూపించాం. మనుషులంతా మంచోళ్లే.. వారు చేసే తప్పును తెలియచెప్పాలన్నదే మా సినిమా. ► నేనెప్పుడూ ఇమేజ్ కోసం ఆలోచించలేదు. కథ నచ్చితే సినిమాలు చేస్తూ వచ్చాను. రిపీట్ కథ, క్యారెక్టర్ లేకుండా చూసుకుంటాను. ప్రేక్ష కులకు ఏదైనా కొత్తగా చూపించాలనుకుంటాను. క్యారెక్టర్, కథ కొత్తగా ఉంటే మనం కూడా కొత్తగా ఆలోచిస్తాం. సతీష్గారి ‘శతమానం భవతి’ సినిమా చూసిన నా భార్య.. ‘మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను.. మీరెందుకు కమర్షియల్ సినిమాలు చేస్తారు? ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా?’’ అన్నారు.. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అన్నాను.. ‘ఎంత మంచివాడవురా’ తో కుదిరింది. ► మేం ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిపోతుంటే చిన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. మా ఇంట్లో ఎలా ఉంటానో ఈ పాత్రని కూడా అలా చేశాను. నా రియల్ లైఫ్గా దగ్గరగా ఉంటుంది. తారక్కి నాకు మధ్య మా సినిమాల గురించి చిన్న చర్చ జరుగుతుంటుంది. ఈ సినిమా చేస్తున్నానని చెప్పగానే తను సంతోషపడ్డాడు. పూరి జగన్నాథ్గారు, అనిల్ రావిపూడితో పనిచేసినప్పుడు ఎంత కంఫర్ట్ ఫీలయ్యానో సతీష్గారితో పని చేసేటప్పుడు కూడా అలాగే ఫీలయ్యాను. -
ఈ నెల నాకు ట్రిపుల్ ధమాకా
‘‘ఎఫ్ 2’ సినిమాలో నేను చేసిన హనీ పాత్ర, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజమ్ చాలా పాపులర్ అయ్యాయి. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్గా ఉంటాను’’ అన్నారు మెహరీన్. కల్యాణ్రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త్త నిర్మించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ కథ చెప్పగానే అద్భుతం అనిపించింది. అన్ని ఎమోషన్స్ను చూపించా ల్సిన పాత్ర. ఇలాంటి రోల్ ఇదివరకెప్పుడూ చేయలేదు. నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్లో బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్లో మెచ్యూర్డ్గా ఉంటా. నేను షార్ట్ ఫిలింస్ నిర్మి స్తుంటా. నా షార్ట్ ఫిల్మ్లో కల్యాణ్ రామ్గారు హీరోగా చేస్తారు. ► కేవలం కుటుంబ భావోద్వేగాలు మాత్రమే కాదు ప్రేమ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. పండగకి వస్తున్న పండలాంటి సినిమా. కథ విని, ఈ పాత్ర నేను చేయగలనా? అని దర్శకుడిని అడిగాను. ‘చేయగలవనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ► ఇది గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు దర్శకుడు. మాతృక చూస్తే ఆ పాత్ర తాలూకు ప్రభావం నా మీద పడుతుందని చూడలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కష్టపడి నేర్చుకుని సింగిల్ టేక్లో పూర్తి చేశాను. ఈ సినిమా టైటిల్ కల్యాణ్రామ్గారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. నిజాయితీగా ఉంటారు. ► సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరిస్తాం. మంచి సినిమా అందించాలనుకుంటాం. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్. ► సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నాకు అమ్మతో సమానం. ప్రస్తుతానికి బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. నా తమ్ముడు (గురు ఫతేహ్ ) బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నాడు. ► ఈ జనవరి నాకు ట్రిపుల్ ధమాకా. ‘ఎంత మంచివాడవురా!’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమిళంలో ధనుష్తో చేసిన ‘పటాస్’ 16న విడుదలవుతుంది. జనవరి 31న ‘అశ్వథ్థామ’ విడుదలవుతుంది. ► ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేయడం నా బలం. పాత్రకు పూర్తిగా కనెక్ట్ అయి నటించడానికి ప్రయత్నిస్తాను. అందుకే గ్లిజరిన్ కూడా అవసరం లేకుండా ఎమోషనల్ సన్నివేశాలు చేస్తాను. -
ఎంత మంచివాడవురా!
-
యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్
నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’. ట్రైలర్కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్ రెండు మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్రామ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ట్రైలర్ ‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్షిప్, ఎమోషన్ అనే పాయింట్కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్లకు కొదువుండదు. ఈ ట్రైలర్లకూడా పలు డైలాగ్లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ వేడుక
-
నా కల నిజమవుతోంది
‘కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. కమర్షియల్, థ్రిల్లర్, మాస్ సినిమాలు చేశారు. నాకు ఎప్పటి నుంచో ఓ వెలితి ఉండేది. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో అన్నని చూడాలని ఉండేది.. అది ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో ఈరోజు వేగేశ్న సతీష్గారి ద్వారా నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘శివలెంక కృష్ణప్రసాద్గారు మా కుటుంబానికి ఒక నిర్మాత కాదు.. బాబాయ్తో (బాలకృష్ణ) ఎన్నో సినిమాలు తీసిన ఆయన మా కుటుంబంలో ఓ సభ్యుడు. అలాంటి కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తగారి నిర్మాణంలో ఓ మంచి సినిమా మీ ముందుకొస్తోంది. గోపీసుందర్గారు మంచి సంగీతం అందించారు. ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. మంచి మనసుతో మంచి చిత్రాన్ని ఆదరించేటటువంటి గొప్ప గుణం మీ అందరిలో ఉంది.. మన తెలుగు ప్రేక్షక దేవుళ్లలో ఉంది. మీరందరూ గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సహాయ, సహకారాలు అందజేస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటన్నా. మీరందరూ మంచి ఆనందం, కోలాహలంతో ఉన్నారు.. ఇదే ఆనందం మీ ఇంటి వరకూ వెళ్లి పంచుకోండి.. ఇక్కడున్న మీ అందరి ప్రాణం మీ తల్లిదండ్రులకి, మీ అన్నాచెల్లెళ్లకి, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, దాని తర్వాత నాకు, కల్యాణ్ అన్నకు, మా కుటుంబానికి ఎంతో అవసరం.. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలి. ఈ పండుగ వాతావరణంలో విడుదలవుతున్న ‘దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ తో పాటు మా ‘ఎంత మంచివాడవురా’ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి, తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్లేలా దోహద పడాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్న ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తగార్లను ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నాను. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. నేడు రజనీకాంత్గారి ‘దర్బార్’ విడుదలవుతోంది. 11న మహేశ్బాబుగారు, మా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదలవుతుంది. అందరి సినిమాలూ బాగా ఆడాలని, మా సినిమా ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ సినిమా నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. బాగా కష్టపడే టీమ్తో మా మొదటి సినిమాని తీసినందుకు సంతోషంగా ఉంది. కల్యాణ్రామ్ చాలా బాగా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత వేగేశ్న సతీష్గారితో మా తొలి చిత్రం చేయడం అదృష్టం. 30ఏళ్లుగా మాకు సహకారం అందిస్తూ, ప్రోత్సహిస్తున్న చిత్ర పరిశ్రమవారికి ధన్యవాదాలు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘నందమూరి కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సీనియర్ ఎన్టీఆర్గారి నుంచి ఈ క్రమశిక్షణ అలాగే వస్తోంది. ఈ పండుగ రోజున ‘ఎంత మంచివాడవురా’ సినిమా వస్తోంది.. మనందరం ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్ గుప్తగారు నాకు ఇరవై ఏళ్లుగా మిత్రులు. ‘పటాస్, 118’ తర్వాత కల్యాణ్రామ్గారి ఈ సినిమా మా ఆధ్వర్యంలో విడుదలవుతోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కల్యాణ్గారికి ఆల్ ది బెస్ట్. మా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ సంక్రాంతికి వస్తున్నాడు.. తనకు ఆల్ ది బెస్ట్. అందరం కలిసి సంక్రాంతికి కుమ్మేద్దాం’’ అన్నారు. వేగేశ్న సతీష్ మాట్లాడుతూ– ‘‘నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, రచయితగా జన్మనిచ్చిన ముప్పలనేని శివగారికి, నన్ను దర్శకునిగా చేసిన ఈవీవీ సత్యనారాయణ, ‘అల్లరి’ నరేశ్గార్లకు, ‘శతమానం భవతి’ సినిమా ద్వారా పునర్జన్మనిచ్చిన ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్గార్లకు థ్యాంక్స్.. వారందరూ లేకుంటే ఈ రోజు నేను ఈ వేదికపైన లేను. మీరందరూ ఇప్పుడు ఈ ఎన్టీఆర్గారికి అభిమానులు.. మా నాన్నగారు 1963లోనే సీనియర్ ఎన్టీఆర్గారికి అభిమానులు.. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు కూడా. ఇద్దరి ఎన్టీఆర్లతో నేను ఫొటో దిగాను. నందమూరి హీరోతో నేను సినిమా చేసినందుకు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు.. ఆయన లేనందుకు బాధగా ఉంది. ఎన్టీఆర్ మాస్ చేస్తే ‘సింహాద్రి’.. క్లాస్ చేస్తే ‘బృందావనం’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే ఒక ‘జనతా గ్యారేజ్, అరవింద సమేత’. కల్యాణ్రామ్గారు మాస్ చేస్తే ‘అతనొక్కడే’.. క్లాస్ చేస్తే ‘118’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’. ఇంతమంచి అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి వాళ్లు ధన్యులు. ఈ సినిమాని 72రోజుల్లో పూర్తి చేయడానికి కారణం నా సాంకేతిక నిపుణులు. సినిమా చాలా బాగొచ్చింది.. ఈ సంక్రాంతికి హిట్ కొడుతున్నాం.. సినిమా గురించి సక్సెస్మీట్లో మాట్లాడతా’’ అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన ‘ఎఫ్ 2’ విడుదలైన తర్వాత మరో మంచి సినిమా చేయాలని ఐదు నెలలు ఎదురుచూశాను. సతీష్గారు ఈ కథ చెప్పినప్పుడే ఇలాంటి పాత్ర చేసే అవకాశం నాకు మళ్లీ మళ్లీ రాదనిపించింది. భావోద్వేగాలు, అనురాగాలు, ఆలోచన పరిపక్వత ఉన్న నందులాంటి పాత్ర ఈ సినిమాలో నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్నట్లు లేదు.. మా కుటుంబంతో కలిసి పండగ చేసుకున్నట్లు ఉంది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనే భావన కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు సుభాష్ గుప్త, మహేశ్ కోనేరు, నటులు శరత్బాబు, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రవీణ్, ప్రభు, భద్రం, రచ్చ రవి, హీరోయిన్ నటాష దోషి, సంగీత దర్శకుడు గోపీ సుందర్, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఆదిత్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అడిగి ఐ లవ్యూ చెప్పించుకోకూడదు’
నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్లుక్, పాటలు, టీజర్తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యంగ్టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్షిప్, ఎమోషన్ అనే పాయింట్కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్లకు కొదువుండదు. ఈ ట్రైలర్లకూడా పలు డైలాగ్లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను.. అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. -
మంచివాడు
కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ని పొందింది. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
కళ్యాణ్రామ్కి సరిపోయే టైటిల్ ఇది
‘‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నాడు. కానీ మానవ సంబంధాలు హార్దిక సంబంధాలుగా ఉండాలి’’ అని దర్శకుడు సతీష్ వేగేశ్న అన్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించారు. జనవరి 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘ఎంత మంచి వాడవురా’ నా మనసుకి దగ్గరైన సినిమా. జనవరి మొదటివారంలో ప్రీ–రిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘సంక్రాంతి రైతుల పండగ. అలాగే సంక్రాంతి సినిమావాళ్ల పండగ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్య సత్సంబంధాలు తగ్గిపోతున్నాయి. వాటి గురించి ఈ సినిమాలో బాగా చర్చించారు దర్శకుడు. కళ్యాణ్రామ్ కెరీర్లో ఇది బెంచ్మార్క్ సినిమా అవుతుంది’’ అన్నారు నరేశ్. ‘‘ఈ టైటిల్ పెట్టగానే అందరూ బావుంది అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ‘కళ్యాణ్రామ్కి పర్ఫెక్ట్ టైటిల్’ అన్నారు. ఆయన అందరితో చాలా బావుంటారు. నిర్మాతలు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. కళ్యాణ్రామ్గారి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా పాయింట్ను ఓ గుజరాతీ సినిమా నుంచి తీసుకున్నాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సతీష్గారు కథ చెప్పగానే మాటలురాలేదు. ఈ కథ అందర్నీ కదిలిస్తుంది. ఈ సినిమా టీమ్ అందరూ మంచివాళ్లే’’ అన్నారు మెహరీన్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గోపీసుందర్, శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తా, చిత్రబృందం పాల్గొన్నారు. -
ఎంత మంచివాడవురా!
-
కొత్త తరహా కథ
నందమూరి కల్యాణ్రామ్ హీరోగా నటించిన ‘118’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘కల్యాణ్రామ్గారు మా బ్యానర్లో మరో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు మహేశ్ కోనేరు. విజయ్ హీరోగా నటించిన ‘విజిల్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మహేశ్ కోనేరు. అలాగే కీర్తీ సురేష్ నటిస్తున్న ‘మిస్ ఇండియా’ చిత్రానికి కూడా ఈయనే నిర్మాత. -
సంక్రాంతి బరిలో మంచోడు
‘118’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. మెహరీన్ కథానాయిక. ‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ టైటిల్ ప్రకటించినప్పుడు మంచి స్పందన వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్తో అనుకున్న ప్లానింగ్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. అక్టోబర్లో హైదరాబాద్లో, నవంబర్లో చిక్మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నాం. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథ, మంచిహీరో, మంచి టీమ్, మంచి ఫీల్తో ఈ సినిమా చేస్తున్నాం. టైటిల్ని బట్టి హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్ వేగేశ్న. -
ఎంత మంచివాడో
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని ‘ఎంత మంచి వాడవురా.. ఎన్ని నోళ్ల పొగడుదురా...’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. 1960లో విడుదలైన ఆ సినిమా పాట ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ టీజర్ని రిలీజ్ చేశారు. మెహరీన్ కథానాయిక నటిస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఉమేష్ గుప్తా సమర్పణలో ఆదిత్య మ్యూజిక్, శ్రీదేవి మూవీస్ పతాకాలపై సుభాష్ గుప్త, శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ– ‘‘మా హీరో కల్యాణ్రామ్ స్వతహాగా మంచి మనిషి. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా ఆ విషయాన్నే ప్రతిబింబిస్తుంది. అందుకే ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్ ఖరారు చేశాం. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఊటీలో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’అన్నారు. ‘‘మా కథకు సరిపోయే టైటిల్ ఇది. దీన్నిబట్టే హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్ వేగేశ్న. వి.కె.నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావణ్ మహరాజ్ పాత్రకు ఆ పాత్రలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా చేయనున్నాడు. మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్ బ్యానర్పై ఈసినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ను పరిశీలించినా ఫైనల్గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టైటిల్తో మోహన్బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేశారు. మరి ఇప్పుడు అదే టైటిల్తో కల్యాణ్ రామ్ సినిమా అంటూ వార్తలు వస్తుండటంతో మంచు ఫ్యామిలీ స్పందన ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. 118 హిట్తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్ ఆ జోష్ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి. -
ఎమోషనల్ జర్నీ స్టార్ట్
ఆదిత్య మ్యూజిక్ కంపెనీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ తీయనున్న మొదటి చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తానికి ‘దిల్’రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముహూర్త సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపీ సుందర్ క్లాప్ ఇవ్వగా, జగదీశ్ గుప్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఉమేశ్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జూలై 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి, ఊటీ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. సతీశ్ వేగేశ్నగారు అద్భుతమైన ఎమోషన్స్తో ఈ కథను సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ ఖాన్. -
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రారంభం
-
ఫుల్ ఫామ్!
వరుస అవకాశాలను దక్కించుకుంటూ హీరోయిన్ మెహరీన్ ఫుల్ ఫామ్లో ఉన్నారు. కొంతకాలం డైరీలో ఖాళీ అన్న పదమే లేకండా కెరీర్ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. ఇటీవల సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్రామ్ హీరోగా సైన్ చేసిన సినిమాలో హీరోయిన్గా మెహరీన్ ఎంపికయ్యారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ నటించనున్న సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారామె. శనివారం అధికారిక సమాచారం వెల్లడైంది. సత్యజోతి ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కొడి’ (తెలుగులో ‘ధర్మయోగి’గా డబ్ చేశారు) ఫేమ్ ఆర్.ఎస్. ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ధనుష్తో నటించనుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్. ఇలా వరుస సినిమాలతో మెహరీన్ ఫుల్ బిజీగా ఉన్నారు. -
కల్యాణ్ రామ్తో ఆదిత్య తొలి అడుగు
ఆదిత్య మ్యూజిక్.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్రవేసిన ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా తెలుగులో తొలి సినిమా నిర్మించనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణ్రామ్కి జోడీగా మెహరీన్ నటించనున్నారు. ‘జెంటిల్మన్, సమ్మోహనం’ వంటి హిట్చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. ‘గీత గోవిందం, మజిలీ’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న గోపీసుందర్ ఈ సినిమాకి స్వరకర్త. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వేగేశ్న సతీష్ కథను సిద్ధం చేసుకున్నారు’ అని చిత్రనిర్మాత ఉమేష్ గుప్తా తెలిపారు. -
‘తుగ్లక్’గా నందమూరి హీరో
ఇటీవల 118 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. అందుకే రిస్క్ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట కల్యాణ్ రామ్. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్ కల్యాణ్ రామ్ ఓకె చెప్పటంతో ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
ఈ సక్సెస్ మా నాన్నగారికి అంకితం
‘‘షూటింగ్కు అందరికంటే ముందు వచ్చే ప్రొడక్షన్ యూనిట్, ఆలస్యంగా వెళ్లే లైట్మేన్లు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లే డ్రైవర్స్. ఇలా చాలా డిపార్ట్మెంట్స్ కష్టం ఈ సినిమాలో ఉంది. సినిమా బావుంటుందని అందరం నమ్మి పని చేశాం’’ అని కల్యాణ్రామ్ అన్నారు. కెమెరామేన్ కేవీ గుహన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘118’. కల్యాణ్రామ్ హీరోయిన్గా, షాలినీ పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్రబృందం సక్సెస్మీట్ ఏర్పాటు చేసి, సినిమాలో పని చేసిన అందరికీ షీల్డ్లను బహూకరించారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను రుణపడిపోయేలా చేశారు. నివేదా ఈ సినిమాకు సెకండ్ హీరో. సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. గుహన్గారి నెక్ట్స్ సినిమా కూడా నాతోనే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాంప్లిమెంట్ తారక్ ఇచ్చాడు. తనకు థ్యాంక్స్. జయాపజయాలు పెక్కన పెట్టి ప్రతి సినిమాకు ‘ఆల్ ది బెస్ట్ నాన్న’ అని నాన్నగారు (హరికృష్ణ) చెబుతుండేవారు. ఈ విజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను’’ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్గా 23 ఏళ్లు పూర్తి చేశాను. అందులో కొన్ని బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. వాటిలో ఈ సినిమా కూడా ఉంటుంది. మంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు. ‘‘కల్యాణ్రామ్గారితో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్ కావాలనుకుంటున్న కలను ఆయన నిజం చేశారు. 118 నిర్మాత మహేశ్ బాగా ప్రమోట్ చేశారు. సక్సెస్తో పాటు గౌరవం కూడా తెచ్చిపెట్టింది’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నం అని అందరూ అభినందిస్తున్నారు. పని చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. ‘‘కథ వినగానే సినిమాలో భాగం అవ్వాలనుకున్నాను. కాన్సెప్ట్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు షాలినీ పాండే. -
రెండింతలు వచ్చింది
‘‘ఇండస్ట్రీలోకి పాత్రికేయుడిగా వచ్చాను. సినిమాలకు రివ్యూస్ రాశాను. రివ్యూవర్స్ అభిప్రాయాలను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఒక నిర్మాతగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు.. అనే సామెతలా... సినిమా చేసి చూడు అని అనుకోవచ్చు’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. కల్యాణ్రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘118’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు చెప్పిన విశేషాలు. ∙కల్యాణ్ రామ్గారి ‘నా నువ్వే’ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాను. కానీ పూర్తిస్థాయి సోలో నిర్మాతగా ‘118’ నాకు తొలి సినిమా. ‘నా నువ్వే’ చిత్రాన్ని నమ్మి బాగా చేశాం. ఆశించిన ఫలితం రాలేదు. సినిమా వైఫల్యం చెందినప్పుడు బాధ కలిగింది. ఆ బాధ నుంచి తేరుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ∙‘నా నువ్వే’కు సరైన స్పందన రాకపోవడంతో ‘118’ చిత్రానికి కసిగా పని చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రిలీజ్ డే మార్నింగ్ కాస్త డివైడ్ టాక్ వినిపించినప్పటికీ మ్యాట్నీ నుంచి మంచి స్పందన వచ్చింది. మంచి బుకింగ్స్ లభించాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ స్క్రీన్లో బుకింగ్స్ బాగా జరిగాయి. ∙కథ విని ఈ సినిమాను ఎన్టీఆర్ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామని కల్యాణ్రామ్గారు అనుకున్నారు. కథ నచ్చి నేను నిర్మించాను. యూనిక్ పాయింట్. ఈ సినిమాతో కల్యాణ్రామ్గారికి నటన పరంగా మంచి పేరు వచ్చింది. గుహన్గారు సినిమాను మంచి థ్రిల్లింగ్ స్క్రీన్ప్లేతో తెరకెక్కించారు. కథ విన్నప్పుడే ఇందులోని ఆద్య పాత్రకు నివేథా ధామస్నే ఊహించుకున్నాం. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆమె వెంటనే అంగీకరించారు. షాలినీ పాండే బాగా నటించారు. ఈ సినిమాకు ఒక రూపాయి ఖర్చు పెడితే రెండు రూపాయలు వచ్చాయి. ∙ఈ సినిమాను ఎడిటింగ్ రూమ్లో ఎన్టీఆర్గారు చూసి, బాగుందని మెచ్చుకున్నారు. మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ తర్వాత ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరిష్లు చూశారు. ‘దిల్’ రాజుగారికి నచ్చడంతో సినిమాపై మాకున్న నమ్మకం రెట్టింపు అయింది. ∙ప్రస్తుతం కీర్తీ సురేశ్ కథానాయికగా ఓ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ నిర్మిస్తున్నాం. ఈ ఏడాది సెకండాఫ్లో రిలీజ్ ప్లాన్ చేశాం. దర్శకుడు హరీష్ శంకర్తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచన ఉంది. కొత్తవారిని ప్రోత్సహించడమే మా ఉద్దేశం. హరీష్ శంకర్ దర్శకత్వంలో మా బ్యానర్లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఓ పెద్దహీరోతో సినిమా చేయబోతున్నాం. ఎన్టీఆర్గారితో సినిమాలు చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాను. -
ఎదురీతకు న్యాయం చేస్తాం
‘సై, దూకుడు, శ్రీమంతుడు, బిందాస్, మగధీర’, ఏక్ నిరంజన్’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రావణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎదురీత’. లియోనా లిషోయ్ కథానాయిక. బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను హీరో కల్యాణ్ రామ్ విడుదల చేశారు. శ్రావణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ టైటిల్ ఏంటి? అన్నారు. ‘ఎదురీత’ అని చెప్పా. అప్పుడు ఆయన ఆ సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుగారు 1977లో నటించిన ‘ఎదురీత’ గురించి చెప్పారు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా.. ‘ఎదురీత’ టైటిల్కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా. ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తర్వాత ఏం జరిగిందనేది కథ? నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళిగారు ‘సై’ సినిమాతో బ్రేక్ ఇచ్చారు. ఆయనలా ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు మా దర్శకుడు. నాకు తండ్రి తర్వాత తండ్రిలాంటి వారు బోగారి లక్ష్మీనారాయణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు ‘ఎదురీత’ టైటిల్ నా గురించే పెట్టారేమో అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే... నా జీవితమంతా ఎదురీతే. నేను నిర్మాత కాకముందు.. సినిమా అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమే అనుకునేవాణ్ణి. నిర్మాత అయ్యాక... టికెట్ రేటు 2000 రూపాయలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. సినిమా తీయడంలో ఉన్న కష్టం అర్థమైంది’’ అని బోగారి లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘లక్ష్మీనారాయణగారికి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా తీశారు’’ అన్నారు బాలమురుగన్. ‘‘ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు లియోనా లిషోయ్. నటీనటులు జియా శర్మ, శాన్వీ మేఘన, భద్రమ్, ఫైట్ మాస్టర్ రామకృష్ణ, కెమెరామేన్ విజయ్ అర్బుదరాజ్, ఎడిటర్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అరల్ కొరెల్లి, లైన్ ప్రొడ్యూసర్: ప్రకాష్ మనోహరన్. -
సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది
‘‘పటాస్’ తర్వాత కల్యాణ్రామ్, మా కాంబినేషన్లో హిట్ కొట్టాం. ‘118’ రెగ్యులర్ మూవీ కాదు. కొత్త ప్రయత్నం. రివ్యూస్, ఆడియన్స్ రెస్పాన్స్ రెండూ పాజిటివ్గానే ఉన్నాయి’’ అని ‘దిల్’ రాజు అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘118’. నివేదా «థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని ప్రముఖ నిర్మాత, ఈ చిత్ర పంపిణీదారులు ‘దిల్’ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘118’ సినిమాను ఏపీ, తెలంగాణలలో రిలీజ్ చేశాం. రెండు రోజులకు మూడు కోట్ల షేర్ వచ్చింది. గుహన్గారితో 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా సొంత సినిమా సక్సెస్ అయినట్టుగా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త సినిమాలు తీయడానికి ప్రేక్షకుల స్పందన ప్రేరణ ఇస్తుంది. నాకు ‘దిల్’రాజుగారు గాడ్ బ్రదర్లాగా. ఆయన చేతి నుంచి సినిమా రిలీజ్ అవ్వడం సంతోషం’’ అన్నారు గుహన్. ‘‘‘పటాస్’ రిలీజ్ అయి నాలుగేళ్లయింది. అప్పుడూ ‘దిల్’ రాజుగారే సినిమాను పంపిణీ చేశారు. ఆ రోజు మమ్మల్ని నమ్మారు. మళ్లీ ఇప్పుడు. నా ప్రతి సినిమాను రాజుగారికి చూపిస్తా (నవ్వుతూ)’’ అన్నారు కల్యాణ్ రామ్. ‘‘ఫీడ్బ్యాక్ వింటుంటే చాలా çహ్యాపీగా ఉంది. ఫస్ట్ మాకు ధైర్యాన్ని ఇచ్చింది తారక్గారు. ఆ తర్వాత రాజుగారు’’ అన్నారు మహేశ్ కోనేరు. -
మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో కల్యాణ్ రామ్
హిట్టు, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే కథ ఎంపికలో కల్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దనం చూపిస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలైన 118 సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా కల్యాణ్ రామ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్ రామ్ ఓకె చెప్పాడు. ఉయ్యాల జంపాల తరువాత మజ్నుతో మరో డీసెంట్ హిట్ అందుకున్న విరించి వర్మ.. కల్యాణ్ రామ్ కోసం పల్లెటూరి నేపథ్యంలో కథను రెడీ చేశాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మేలో సినిమా షూటింగ్ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. (చదవండి : ‘118’ మూవీ రివ్యూ) -
‘118’ మూవీ ప్రెస్మీట్
-
తారక్... నీ నమ్మకం నిజమైంది
కల్యాణ్రామ్, నివేథా థామస్, శాలిని పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘118’. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించారు. ప్రముఖ కెమెరామెన్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. శుక్రవారం చిత్రం విడుదలైంది. ఫస్ట్ షోకే మంచి టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్యాణ్రామ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులందరికి థ్యాంక్స్. గుహన్గారు నాలో ఏం చూశారో నాకు ఇప్పటికీ తెలియదు. ఈ రోజు మా నిర్మాత మహేశ్ నవ్వు చూస్తున్నాను. ‘నా నువ్వే’ సినిమా రిలీజైనప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో నాకింకా గుర్తే. అప్పుడు నేను ‘మనం కొత్తగా చేయాలని ట్రై చేస్తాం, కొన్ని వర్కవుట్ అవ్వవు. నో ప్రాబ్లమ్, మన ‘118’ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని తనతో చెప్పాను. అదే నిజం అయ్యింది. మన నిర్మాత నవ్వుతూ ఉండటం కంటే ఓ హీరోకి ఏం కావాలి. మా ఎడిటర్ తమ్మిరాజు ఈ సినిమాను న మ్మి మా కంటే ఎక్కువ వర్క్ చేసారు. శేఖర్ చంద్ర ఉన్నది ఒకటే పాట కదా అని అనుకోకుండా ఈ సినిమాకు అద్భుతమైన రీరికార్డింగ్ను అందించారు. యన్టీఆర్ని ఉద్దేశించి... నాన్నా.. తారక్ నీ నమ్మకం నిజమైంది. ఫస్ట్ నువ్వే ఈ సినిమాని చూశావు. ఖచ్చితంగా హిట్ అవుతుంది’ అని చెప్పావు. మా కథ మీద నమ్మకంతో సినిమా కొన్న ‘దిల్’ రాజు, లక్ష్మణ్లకు థ్యాంక్స్’’ అన్నారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘గుహన్గారు తాను నమ్మినది తీశారు. ఈ రోజు సినిమాకు ఇంత మంచి పేరు రావటానికి కారణం అదే. కలెక్షన్లు బావున్నాయి’’ అన్నారు. గుహన్ మాట్లాడుతూ– ‘‘నేను కెమెరా ముందుకు రావటానికి ఇష్టపడను. ఈరోజు గర్వంగా కెమెరా ముందు మాట్లాడుతున్నాను. నేను తమిళ్ అయినా తెలుగు పరిశ్రమ నన్ను కన్నబిడ్డలా ఆదరించింది. కల్యాణ్రామ్ ఈ కథ విని ఎలా ఓకే చేశారు? అని నాకు ఓ కాల్ వచ్చింది. దానికి ఓ కొత్త విషయం చెప్పటానికి చాలా టాలెంట్ కావాలి. అది కల్యాణ్ గారిలో ఉంది అన్నాను’’ అని చెప్పారు. ‘‘క్రిటిక్స్ చాలామంది రాశారు ఇలాంటి స్క్రిప్ట్తో సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలని’’ అన్నారు నివేదా. సంగీత దర్శకుడు శేఖర్చంద్ర, మాటల రచయిత ‘మిర్చి’ కిరణ్, ఎడిటర్ తమ్మిరాజు, విలన్ పాత్రధారి హబీబ్ తదితరులు పాల్గొన్నారు. -
‘118’ మూవీ రివ్యూ
టైటిల్ : 118 జానర్ : థ్రిల్లర్ తారాగణం : కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : కేవీ గుహన్ నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు కెరీర్ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మరో సక్సెస్ సాధించాడా? కథ : గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్ను ఓ కల బాగా డిస్ట్రబ్ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్ రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్ గా కనిపించిన కల్యాణ్ రామ్ ఈ సారి స్టైలిష్ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్, డ్యాన్స్లకు పెద్దగా స్కోప్ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్ చూపించింది. హీరోయిన్ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, నాజర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమాటోగ్రాఫర్గా టాలీవుడ్కు సుపరిచితుడైన కేవీ గుహన్, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్ఫిక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్ప్లేతో ఆడియన్స్ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్ప్లే, థ్రిల్లింగ్ సీన్స్తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్ మార్క్స్ సాధించాడు. స్టైలిష్ టేకింగ్తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్ను తన మ్యూజిక్తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కల్యాణ్ రామ్, నివేదా థామస్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
హీరోలతో పోలికెందుకు పెట్టరు?
‘‘ఫలానా హీరోయిన్ కంటే బాగా చేశారు? అని బాగా నటించినప్పుడు ఇతర హీరోయిన్లతో పోలిక పెడుతుంటారు. మరి.. హీరోతో ఎందుకు పెట్టరు? ఎప్పుడూ హీరోయిన్లతోనే పోటీ పెడుతుంటారు. నేనెవర్నీ పోటీగా ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీగా ఫీల్ అవుతాను. స్వీయ పరిశీలన చేసుకుంటాను. నాకు నేను సవాల్ విసురుకుంటా’’ అని నివేదా థామస్ అన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘118’. కల్యాణ్రామ్, నివేదా థామస్, షాలీని పాండే హీరోహీరోయన్లు మహేశ్ కోనేరు నిర్మించారు. శుక్రవారం చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా నివేదా చెప్పిన విశేషాలు. ► పదే పదే వచ్చే ఒక కలను ఫాలో అయ్యే ఓ హీరో కథే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్. మిస్టరీ ఉంటుంది. హీరో ఆ కల గురించి లోతుగా అన్వేషణ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న అంశాల ఆధారంగా స్క్రీన్ప్లే ఉంటుంది. సినిమా నిడివి చాలా తక్కువ. చివరి 20 నిమిషాలు సినిమా హైలైట్గా ఉంటుంది. గుహన్గారి లైఫ్లోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంచెం ఫిక్షన్ కూడా ఉంది. సినిమా కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకునే వీలు ఉంటుంది. ► నాకు వచ్చిన కలే మళ్లీ మళ్లీ రాదు. ఏదైనా కొత్త ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏమైనా వచ్చానా? అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ అది కొన్ని సెకన్లపాటే ఉంటుంది. ఒక అమ్మాయి ఓ సమస్యలో పడినప్పుడు ఏం చేస్తుందో ఈ సినిమాలో నా పాత్ర అదే చేస్తుంది. నా పాత్ర గురించి ఇప్పుడు పెద్దగా చెప్పను. ఎందుకంటే సినిమాలో కీలకమైన పార్ట్ అది. ఫస్ట్టైమ్ నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది. ► ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో తారక్ వంటి మంచి నటుడు నాకు అప్రిషియేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పెర్ఫార్మెన్స్ను ఆడియన్స్ కూడా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ‘అన్వేషణ’ సినిమాను నేను చూడలేదు. ఆ సినిమాతో ఈ సినిమాను ఎందుకు పోల్చుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అలాగే హాలీవుడ్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్ కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుందా? అంటే.. అది ఆడియన్స్ వెండితెరపై చూడాలి. ► సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉందా? లేక తక్కువగా ఉందా? అనే అంశాలను పెద్దగా పట్టించుకోను. నేను చేస్తున్న పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నానన్నదే నాకు ముఖ్యం. ఈ సినిమాలో నా స్క్రీన్ టైమ్ దాదాపు 20 నిమిషాలే ఉంటుంది. ‘నిన్నుకోరి, జెంటిల్మన్’ చిత్రాల్లో ఎక్కువ ఉంటుంది. వెంట వెంటనే సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేయాలనుకుంటాను. కొత్త విషయాలు నేర్చుకుంటూ యాక్టర్గా మెరుగవ్వాలని కోరుకుంటాను. అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను చేసిన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తాను. అది కూడా నిలబడే చూస్తాను. నెర్వస్ వల్ల కాదు. అదో ఫీలింగ్. ► ‘బ్రోచేవారెవరురా’ అనే కామెడీ చిత్రం, ‘శ్వాస’ అనే ట్రావెల్ ఫిల్మ్ చేయబోతున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది తమిళ సినిమా కూడా చేస్తాను. మలయాళ సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాదిలో నావి ఐదు సినిమాలు ఉంటాయి. రిలీజ్ల పరంగా నా కెరీర్లో ఇదో బిగ్గెస్ట్ ఇయర్గా ఉండొచ్చు. -
మహానాయకుడి మాటే ఎత్తని ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం కూడా ఆశించిన అంచనాలు అందుకోవటంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఈ సినిమాను కాపాడేందుకు ఒక వర్గం గట్టిగానే ప్రయత్నిస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ఒకే వేదిక మీదకు రావటంతో సినిమా జనాల్లో ఆసక్తి నెలకొంది. (చదవండి : బాబాయ్ స్పీచ్.. అబ్బాయ్ పాట్లు!) యన్.టి.ఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అస్సలు స్పందించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ మహానాయకుడు రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే బాలకృష్ణ, ఎన్టీఆర్.. 118 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఒకే వేదిక మీద కలుసుకోవటంతో ఎన్టీఆర్ సినిమాపై స్పందిస్తాడని నందమూరి అభిమానులు ఎదురుచూశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం దాదాపు ఏడు నిమిషాల ప్రసంగంలో యన్టిఆర్ బయోపిక్ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కేవలం బాలయ్యకు స్వాగతం, కృతజ్ఞతలు మాత్రమే చెప్పి పూర్తిగా 118 సినిమా గురించే మాట్లాడారు. చిత్రయూనిట్లో ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ప్రశంసించిన జూనియర్, బాబాయ్ సినిమా గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
‘118’ ప్రీ రిలీజ్ వేడుక
-
మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా
‘‘ఇంతింతై వటుడింతింతై అన్నట్టు.. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలి, కొత్తదనాన్ని అందించాలని కల్యాణ్లో ఓ తపన ఉంది. కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వాలనే తపనే ఆయనచేత ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ అనే సంస్థ స్థాపించి ‘అతనొక్కడే’ సినిమా తీశారు’’ అని నటుడు బాలకృష్ణ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో కల్యాణ్రామ్ బాలనటుడిగా పరిచయం అయ్యా రు. ఇవాళ కోడి రామకృష్ణగారు మనమధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన దర్శకత్వంలో ‘మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, బాలగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు’ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం నాకు కలిగింది. ‘118’ ఈ టైటిల్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా వీల్లేదు.. కానీ యువతరానికి కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిత్రం ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. గుహన్గారు ఇంకా ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించాలి. నాకు ఈ అవకాశం కల్యాణ్రామ్, తారక్లు కల్పించారు. ఎన్నో సినిమాలు చేస్తూ కళామతల్లికి మన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘గుహన్గారు నాకు చాలా ఏళ్లుగా పరిచయం. మేమిద్దరం ‘బాద్షా’ చిత్రం చేశాం. కష్టపడే మనస్తత్వం కలిగిన కెమెరామెన్ ఆయన. అంతే ఇంట్రెస్ట్తో ఆయన ‘118’ సినిమాతో మీ ముందుకొస్తున్నారు. నేను కచ్చితంగా చెబుతున్నా గుహన్సార్.. ఇది ఫెంటాస్టిక్ ఫిల్మ్ అవుతుంది. నివేథగారితో ‘జై లవ కుశ’ సినిమాలో పనిచేశా. ‘118’ సినిమా చూశా. ఓ సీన్లో నివేథ నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. షాలినీగారు ఎంతో హుందాగా తన కష్టాన్ని జోడించి చక్కని నటన కనబరిచారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి మహేశ్. ఈ సినిమా ద్వారా ఓ అద్భుతమైన హిట్ సాధించి, ఇంకెన్నో మంచి సినిమాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రంతో మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. ఎప్పుడూ ఓ కొత్త చిత్రాన్ని అందించాలి, ఓ కొత్త ధోరణిలో కథ చెప్పాలని అన్నయ్య పడే కుతూహలం బహుశా ఇంకెవరిఎవరిలోనైనా ఉంటుందేమో కానీ, నేను మాత్రం ఆయనలోనే చూశాను. ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన సినిమా ఇది.. ఆయన నటన కావొచ్చు.. డైరెక్టర్గారికి, నిర్మాతగారికి అందించిన సపోర్ట్ కావొచ్చు. ఓ నటుడు కంప్లీట్గా పాత్రకి సరెండర్ అయిపోతేకానీ ఇలాంటి నటన కనబరచడం కుదరదు.. హ్యాట్సాఫ్ కల్యాణ్ అన్న! ఈ సినిమా హిట్ అందిస్తుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా.’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మైండ్ బ్లాంక్ అయిపోయింది. బాబాయ్, తారక్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడాలనుంది. కానీ, ఈ సారి సినిమా విడుదల తర్వాత మాట్లాడదామని అనుకున్నా. మనందరి దేవుడు నందమూరి తారకరామారావుగారు.. ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే మేం ముగ్గురం ఇక్కడ ఉంటున్నాం. ప్రతిసారి ఏదో ఒక కొత్తదనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో ట్రై చేస్తున్నాను.. ఫెయిల్ అవుతున్నా.. ఈ విషయం నాకూ తెలుస్తోంది.. మీకూ బాధ ఉంది.. ప్రతిసారీ ట్రై చేస్తున్నావ్ హిట్ రాదేంటి? అని. బట్.. ‘టెంపర్’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తమ్ముడు చెప్పినట్టు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం.. అదే మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని మెప్పించే వరకూ ట్రై చేస్తూనే ఉంటా. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. గుహన్గారికి, టీమ్కి థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గుహన్ అసిస్టెంట్ కెమెరామెన్గా నాకు పరిచయం.. ‘ఖుషి’ సినిమా చేశాడు. ఆయన ఈ రోజు కల్యాణ్రామ్గారితో తీసిన ‘118’ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే ఎంత నావల్పాయింట్ తీసుకున్నాడో అర్థం అవుతోంది. సినిమా సినిమాకి ఏదో కొత్తదనం చేయాలని కల్యాణ్రామ్గారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పీఆర్వోగా స్టార్ట్ అయిన మహేశ్ నిర్మాతగా మారి నందమూరి ఫ్యామిలీతో అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా మా సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు. కె.వి. గుహన్ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్సార్.. కొత్తగా చేయాలనే మీ ఐడియాకి థ్యాంక్స్. అందువల్లే మీరు నా లైన్ని, కథని విన్నారు. చిన్న లైన్గా అనుకున్న ఈ కథ ఇంతవరకూ వచ్చిందంటే అది మీవల్లే.. నాకు చాలా ఎగై్జటింగ్గా ఉంది. ఈ స్క్రిప్ట్ మొత్తుం నివేథా చుట్టూ నడుస్తుంది. స్క్రిప్ట్లోని తన పాత్రకి నటనతో ఊపిరి పోశారు. ‘అర్జున్రెడ్డి’ తర్వాత షాలినీ క్రేజ్ ఏంటో నాకు తెలుసు. ‘118’ సినిమా కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్. నిర్మాత కోనేరుగారు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. టీమ్ అందరి సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా చేయగలిగా. ‘దిల్’రాజుగారు మా సినిమా చూసి, నచ్చడంతో విడుదల చేస్తూ మా టీమ్కి ఎనర్జీ ఇచ్చారు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాత మహేశ్ కోనేరు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, షాలినీ పాండే, నివేథా థామస్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నో డౌట్.. చాలా నమ్మకంగా ఉన్నాను
‘‘హరేరామ్’ లాంటి డిఫరెంట్ మూవీని పదేళ్ల క్రితమే ట్రై చేశాం. కొత్త తరహా సినిమాలు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. ‘118’ కథ వినగానే చాలా నచ్చింది. నా బ్యానర్లో చేద్దామనుకున్నాను. దర్శకుడు కేవీ గుహన్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని కథ తయారు చేశారు. నో డౌట్.. ఈ సినిమా సక్సెస్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను’’ అని కల్యాణ్రామ్ అన్నారు. కెమెరామేన్ గుహన్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ, కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ పలు విశేషాలు పంచుకున్నారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి థ్రిల్లర్లో నటించాను. ట్రైలర్లోనే సినిమా కథంతా చూపించాం. ట్రైలర్ని మూడు నాలుగుసార్లు చూస్తే కథ అర్థం అవుతుంది. ట్రైలర్ బావుందని మంచి రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. కామెడీ కానీ, కమర్షియల్ సాంగ్స్ కానీ ఏవీ కావాలని పెట్టినట్లుగా ఉండవు. గుహన్గారి లైఫ్లో ఒక సంఘటన రిపీటెడ్గా జరిగింది. దీన్నే కథగా ఎంచుకొని హీరో దాన్ని ఛేదించుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అనే అంశంతో స్క్రిప్ట్ తయారు చేశారు. మొదట చాలా టైటిల్స్ అనుకున్నాం ‘రక్షణ, అన్వేషణ’ ఇలా.. అయితే కొత్తగా, డిఫరెంట్గా ఉండాలని ‘118’ ఫిక్స్ చేశాం. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ స్క్రీన్ప్లే. పరిగెడుతుంది. హీరో కూడా ప్రేక్షకుడిలానే ఉంటాడు. ప్రేక్షకులకు, హీరోకు సర్ప్రైజ్లు ఒకేసారి తెలుస్తుంటాయి. ఈ సినిమా కోసం లుక్ మార్చానంటున్నారు. మరీ రొటీన్గా ఉంటే ప్రేక్షకులు కూడా రొటీన్ ఫీల్ అవుతారు. ‘ఇజం’ నుంచి కొత్త లుక్ ట్రై చేస్తూ వస్తున్నా. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర నాది. మొదట ఈ క్యారెక్టర్లోకి వెళ్లడానికి కొంచెం టైమ్ పట్టింది. ప్రొడక్షన్లో నిర్మాత మహేశ్ కోనేరు కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ముంబై వెళ్లి మరీ షూట్ చేశాం. నాకు ఈత రాదు. నేర్చుకొని మరీ చేశా. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. చివరి 30 నిమిషాలు సినిమాకే హైలైట్. విజువల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గుహన్గారు లేకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదని నమ్మకంగా చెబుతున్నాను. నివేదా థామస్ ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతారు. ఈ పాత్రకు ఫస్ట్ ఆప్షన్ ఆమె. షాలినీ పాండే కూడా బాగా చేశారు. హిట్, ఫ్లాప్స్ ఎఫెక్ట్ కచ్చితంగా మా మీద ఉంటుంది. ఫ్లాప్ సినిమాకి బాధపడతాం. ఆ తర్వాత సినిమా వైఫల్యానికి కారణాలేంటో లెక్కలేసుకొని రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇది ట్రై అండ్ ట్రై ప్రాసెస్ అంతే. వరుస హిట్స్ సాధించాలని ఏ నటుడికైనా ఉంటుంది. మంచి సినిమా ఆడియన్స్కు ఇద్దాం అనుకునే సినిమాలు తీస్తాం. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. మనం మళ్లీ హిట్ సాధిస్తాం అనే నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడం వెనక ఉన్న ముఖ్యోద్దేశం మంచి సినిమాలు తీయడమే. ‘ఇంత చెత్త సినిమా తీశాడేంట్రా’ అని ప్రేక్షకుడు అనుకోకూడదు. మా బ్యానర్లో పరిచయమైన సురేందర్రెడ్డి, అనిల్ రావిపూడి మంచి హిట్స్ సాధించడం హ్యాపీగా ఉంది. కొన్ని కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను. మా బ్యానర్పై వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నాం. టీనేజ్ లవ్స్టోరీతో ఆ సిరీస్ సాగుతుంది. ఇదివరకు సినిమా రిలీజైన 6 నెలలకు టీవీలో వచ్చేది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల నెల రోజులకే అమేజాన్, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తున్నాయి. కనీసం ఓ 2 నెలలు అయినా ఆగితే బావుంటుందన్నది నా అభిప్రాయం. సినిమా వంద రోజులాడే రోజులు పోయాయి. నాలుగు వారాలాడితే సూపర్హిట్. -
సూపర్ స్టార్ బాటలో కల్యాణ్ రామ్
హీరోగానే కాక నిర్మాతగానూ తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఎక్కువగా తన సినిమాలు తానే నిర్మించుకున్న ఈ హీరో రవితేజ హీరోగా కిక్ 2, ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టిన కల్యాణ్ రామ్, నిర్మాతగా తన పరిధిని మరింత విస్తరించే పనిలో ఉన్నాడు. త్వరలో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై వెబ్ సిరీస్ను నిర్మించేందుకు ప్లాన్చేస్తున్నట్టుగా వెల్లడించాడు ఈ హీరో. ప్రేమ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో కూడిన వెబ్ సిరీస్ను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెబ్ సిరీస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. చార్లీ పేరుతో ఓ డిటెక్టివ్ తరహా కథతో వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు మహేష్. -
ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే కథ
నందమూరి కల్యాణ్రామ్ హీరోగా నటించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటించారు. మహేశ్ కోనేరు నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్రామ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ మనం పట్టించుకోం.. వదిలేస్తాం. ట్రైలర్ను లోతుగా గమనిస్తే సినిమా ఏంటో అర్థమైపోతుంది. నివేదా థామస్ పాత్ర ఆధారంగానే సినిమా అంతా సాగుతుంది. ఆమె బాగా నటించారు. గుహన్గారి సినిమాటోగ్రఫీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. నిర్మాత మహేశ్ నాకు కుటుంబ సభ్యుడితో సమానం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేద్దామనేంత బాగా నచ్చింది ఈ సినిమా స్క్రిప్ట్. అయితే పూర్తి కథ విని మహేశ్ నిర్మించడానికి రెడీ అయ్యారు. తమ్మిరాజుగారి సపోర్ట్ మర్చిపోలేనిది. మార్చి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి కథతో మిళితమైన థ్రిల్లర్ చిత్రమిది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకునిగా మారిన తర్వాత ఒక సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడతారో అర్థం అయింది. కల్యాణ్రామ్గారి యాక్టింగ్ సూపర్. ఒక వ్యక్తిగా ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారు. నివేదా థామస్ ఓ బాధ్యతాయుతమైన పాత్రలో నటించారు. షాలినీ పాండే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేశ్గారికి థ్యాంక్స్. శేఖర్చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు కె.వి. గుహన్. ‘‘కల్యాణ్రామ్గారి నటన, గుహన్గారి టేకింగ్, నివేదా, షాలినీల పెర్ఫార్మెన్స్... ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇది నాకు స్పెషల్ మూవీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది’’ అన్నారు మహేశ్ కోనేరు. ‘‘118 అంటే ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. తక్కువ టైమ్లో చాలా ఎక్కువగా వర్క్ చేసిన చిత్రమిది. చాలెంజింగ్గా అనిపించింది’’ అన్నారు నివేధా థామస్. -
‘118’ ట్రైలర్ విడుదల