బోయపాటిని పరామర్శించిన బన్నీ.. | Allu Arjun Visits Boyapati Srinu House In Guntur | Sakshi
Sakshi News home page

బోయపాటిని పరామర్శించిన బన్నీ..

Published Fri, Jan 24 2020 7:10 PM | Last Updated on Fri, Jan 24 2020 7:20 PM

Allu Arjun Visits Boyapati Srinu House In Guntur - Sakshi

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నటుడు అల్లు అర్జున్‌ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన బన్నీ.. బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు. బోయపాటితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడ్‌ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోవైపు బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement