ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ' | Anu emmanuel Acting In Dhanush Direction | Sakshi

ప్రేమపెళ్లి చేసుకుంటా!

Sep 21 2018 9:06 AM | Updated on Jul 21 2019 4:48 PM

Anu emmanuel Acting In Dhanush Direction - Sakshi

అ రోజుల్లోనే ఆ నలుగురు ప్రేమిస్తున్నామని తిరిగారు అంటోంది నటి అనూ ఇమ్మాన్యుయేల్‌

సినిమా: అ రోజుల్లోనే ఆ నలుగురు ప్రేమిస్తున్నామని తిరిగారు అంటోంది నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ . అమెరికన్‌ ఇండియన్‌ అయిన ఈ బ్యూటీ మాలీవుడ్‌కు బాలతారగా పరిచయమైంది. ఆ తరువాత అక్కడే కథానాయకిగా అవతారమెత్తి ఆపై కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొడుతోంది. అయితే తెలుగులో తొలి చిత్రం మజ్ను మంచి విజయాన్ని అందించడంతో అక్కడ క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కు జంటగా నా పేరు సూర్య చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుని మరింత పాపులర్‌ అయ్యింది. ఇక ఇటీవల నాగచైతన్యకు జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. గత ఏడాదే విశాల్‌కు జంటగా తుప్పరివాలన్‌ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఆ చిత్రం హిట్‌ అయినా ఆ తరువాత మరో అవకాశం రావడానికి ఏడాది పట్టింది. అవును ఈ అమ్మడు ధనుష్‌ మెగాఫోన్‌ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్‌ నటించడానికి ఎంపికైంది. ఇందులో టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున ఒక హీరోగా నటించనున్నారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ ఏం సమాధానం ఇచ్చిందో చూడండి. ప్రేమ గురించి చెప్పాలంటే అది ఓ అద్భుతమైన భావన. రెండు మససుల అందమైన కలయిక. నిజం చెప్పాలంటే నేను చదువుకునే రోజుల్లోనే నలుగురు అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ తిరిగారు. అయితే నేనెవరినీ ప్రేమించలేదనుకోండి.  ఇప్పటికీ నా మనసులో ఎవరూ లేరు. అయితే భవిష్యత్‌లో ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాలపైనే. చాలా చిత్రాలు చేయాలి. కాగా తుప్పరివాలన్‌ చిత్రంలో అమ్మడికి నటించడానికి పెద్ద స్కోప్‌ లేదు. మరి నటుడు ధనుష్‌ చిత్రంతోనైనా కోలీవుడ్‌లో స్ట్రాంగ్‌గా పాగా వేస్తుందేమో చూడాలి. అన్నట్టు శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనున్న ఇందులో ఈ అమ్మడు నాగార్జునకు జంటగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement