Dhanush
-
నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ధనుష్
-
వేసవిలో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు ’
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు. -
`జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ క్రికెటర్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్కి తీసుకొచ్చారు రామ్చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్గా కెరీర్ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
నో కాంప్రమైజ్ అంటున్న శేఖర్ కమ్ముల: Kubera Movie
-
తేదీ మారలేదు
ధనుష్(Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)(తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం). నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్ర ఖని, రాజ్ కిరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్తో కలిసి ధనుష్ నిర్మిస్తున్న మూవీ ఇది. కాగా ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే ప్రచారం జరిగింది. అయితే ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10నే రిలీజ్ చేస్తామన్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అనుకున్నట్లే ‘ఇడ్లీ కడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లుగా స్పష్టమైపోయింది. ఇక ధనుష్ దర్శకత్వంలోని మరో మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా...’ అనే టైటిల్తో రిలీజ్ కానుంది. -
స్టార్ హీరోను లాక్ చేయనున్న 'లోకేశ్ కనకరాజ్'
కోలీవుడ్ నటుడు ధనుష్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించనున్నారని కోలివుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం రానున్నడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. కోలీవుడ్లో మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. తరువాత కార్తీ హీరోగా ఖైదీ–2తోపాటు మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కాగా నటుడు ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తమిళంలో పాటు, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లోనూ కథానాయకుడిగా నటిస్తూ వరల్డ్ స్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా మరిన్ని చిత్రాల్లో ధనుష్ నటించనున్నారు. తాజాగా ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ కనకరాజ్ నటుడు ధనుష్ను కలిసి కథను వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబినేషనల్ తెరకెక్కనున్న చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ధనుష్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం కమిటైన చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు
ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్ కృతీ సనన్(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్స్టోరీ ‘తేరే ఇష్క్ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు.కాగా ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘శంకర్... (ధనుష్ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్ హిందీలో డైలాగ్స్ చెబుతూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
ధనుష్ హానెస్ట్ రాజ్?
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
కేజీఎఫ్ నేపథ్యంలో...
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ కాంబినేషన్లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్’ (2019) వంటి సక్సెస్ఫుల్ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్లో 25 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆడియన్స్కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్–వెట్రిమారన్ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. కాగా ధనుష్తో వెట్రిమారన్ చేయనున్న మూవీ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్ సమాచారం. -
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
జూన్లో కుబేర?
జూన్లో థియేటర్స్లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి తాజాగా ధనుష్తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
నటుడు చంద్రబాబు బయోపిక్లో ధనుష్
ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషకం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటుడి బయోపిక్ను తెరకేక్కించేందుకు గోపాల్ వన్ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు రామన్ తేడియ సీతై, చారులత, అలోన్, నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. కాగా తాజాగా రచయిత దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని ఆయనతోపాటు యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చంద్రబాబుకు తాము సమర్పించే మర్చిపోలేని అంజలిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అదేవిధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందన్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్లో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ఇప్పటికే ఇళయరాజా బయోపిక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు బయోపిక్లో తాను నటిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ధనుష్తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార
కోలీవుడ్లో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివనన్పై ధనుష్ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్ను కోరింది. అయితే, తాజాగా సోషల్మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్ను టార్గెట్ చేసే నయన్ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.కోలీవుడ్లో నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్పై నయన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ను హెచ్చరిస్తూ నయన్ ఇలా పోస్ట్ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్ను నయన్ పంచుకుంది.సోషల్మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్లో మాత్రం ధనుష్ను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన ఫుటేజ్ను నయన్ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
మళ్లీ మొదటికి వచ్చిన ధనుష్.. నయనతారకు షాక్
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా.. నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్లో నయనతార, విఘ్నేష్ శివన్ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల నయన్ తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్ఫ్లిక్స్లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్ఫ్లిక్స్కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి -
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్కు ధనుష్ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్తో ఆమె సౌత్ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్కు మద్ధతుగా ధనుష్పై ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబ్ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే.. మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స మండి పడుతున్నారు. ధనుష్పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.ధనుష్ నిర్మాతగా ఉన్న 'నానుమ్ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్పై కాపీరైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. -
ధనుష్ క్యారెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసిన నయనతార
-
మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదు: విఘ్నేష్ శివన్
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు. మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ)ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నయనతారను 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్
-
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
జైలర్తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. దీంతో రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
రజినీకాంత్తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు. -
ధనుష్ లో ఎక్కడలేని జోష్..
-
ధనుష్ ఇడ్లీ కొట్టు!
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే టైటిల్ ఖరారైంది. గురువారం ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ధనుష్ కెరీర్లోని ఈ 52వ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ నిర్మించనున్నారు. ‘‘మా డాన్ పిక్చర్స్ సంస్థలోని తొలి సినిమాకే ధనుష్గారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఈ సినిమా ఓ మైల్స్టోన్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు ఆకాశ్ భాస్కరన్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: కిరణ్ కౌశిక్. -
వారికి కృతజ్ఞతలు.. రెడ్కార్డ్ ఎత్తివేతపై ధనుష్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ ప్రయోగించిన రెడ్కార్డ్ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో నడిగర్ సంఘం చర్చలు జరిపి ధనష్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ధనుష్పై తమిళ నిర్మాత మండలి రెడ్ కార్డ్ ప్రయోగించిన వెంటనే నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తప్పుబట్టారు. నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీకి చాలా నష్టమని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ వల్ల ఇబ్బుందులు పడుతున్నామని ఆరోపించిన త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ అధినేతలతో చర్చలు జరిపారు. దీంతో గతంలో వారి నుంచి తీసుకున్న డబ్బు ధనుష్ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పడంతో లైన్ క్లియర్ అయింది.ఇదే విషయం గురించి ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా నిర్మాతలు,త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నాకు అండగా నిలిచిన నడిఘర్ సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజాయితీగా సమస్యను పరిష్కరించారు. దీంతో మేము కొత్త సినిమా ప్రాజెక్ట్ను వెంటనే తిరిగి ప్రారంభించకలిగాము. నాజర్, కార్తీ,విశాల్, కరుణాస్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్యలను పరిష్కరించి మాకు సహాయపడటమే కాకుండా పరిశ్రమకు మంచి ఉదాహరణగా నిలిచారు.' అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. -
ధనుష్ప నిషేధం ఎత్తివేత
-
ధనుష్పై రెడ్కార్డ్ ఎత్తివేత.. కొత్త ప్రాజెక్ట్లకు లైన్ క్లియర్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ రెడ్కార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే, ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్పై రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు గతంలో TFPC పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్ ఫిల్మ్స్తో సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్లు TFPC తెలిపాయని సమాచారం. అయితే, కొన్ని షరతులపై ధనుష్ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేయబడిందని సమాచారం. -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
ధనుశ్–మహిత్ జోడీ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ బధిరుల షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకున్నాడు. జర్మనీలోని హనోవర్లో జరుగుతున్న ఈ టోర్నీనలో ధనుశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ధనుశ్ శ్రీకాంత్–మహిత్ సంధూ (భారత్) ద్వయం 17–5తో భారత్కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ ముర్తజా జంటపై గెలిచింది.ధనుశ్–మహిత్ జోడీ క్వాలిఫయింగ్లో 628.8 పాయింట్లు స్కోరు చేసి బధిరుల షూటింగ్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభినవ్ దేశ్వాల్–ప్రాంజలి ధూమల్ జంట రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అభినవ్–ప్రాంజలి ద్వయం 7–17తో ఒలెక్సిల్ లేజ్బింక్–ఇనా అఫోన్చెంకో (ఉక్రెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ముగిశాక భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలున్నాయి. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'రాయన్' మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
'రాయన్'తో లాభాలు.. ధనుష్కు గిఫ్ట్గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్గా తన ప్రతిభను రాయన్లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'రాయన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్గా కూడా ధనుష్ మెప్పించాడు. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే, సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాయన్ సినిమా ఆగష్టు 23న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఆ సంస్థ లాభాలను అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్గా నిలిచింది. సౌండ్ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట సంచలనంగా మారింది. -
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
రాయణ్ బ్లాక్ బస్టర్.. దూకుడు పెంచిన ధనుష్..
-
ధనుష్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ
ఎన్ని సమస్యలొచ్చినా.. తానుమాత్రం తగ్గేదేలే అంటున్నారు నటుడు ధనుష్. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. ఇది ఆయన 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇలా నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగా సత్తా చాటుకుంటున్న ధనుష్కు కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన ఈయన మరోసారి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఆయన నటించిన షమితాబ్, రాంజానా వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్తో ధనుష్కు మంచి బౌండింగ్ ఉంది.ఇంతకు ముందు వీరి కాంబోలో రూపొందిన రాంజానా చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరు కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఇందులో ధనుష్కు జంటగా బాలీవుడ్ క్రేజీ నటి కృతీసనన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే తెలుగులో మహేశ్బాబు సరసన నేనొక్కడినే, ప్రభాస్కు జంటగా ఆదిపురుష్ చిత్రాల్లో నటించారు. తాజాగా ధనుష్తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ధనుష్కి జోడీగా..?
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి. -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ధనుష్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి
ధనుష్.. ఇటీవల రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ధనుష్ బావ డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్(సోదరి కార్తీక భర్త) తొలిసారి ఈ మూవీలో నటించాడు. అది కూడా పోలీస్గా..! తాజాగా కార్తీక.. తన భర్త పోలీస్ గెటప్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.డాక్టర్తో యాక్టింగ్రాయన్.. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని, ఈ ఫోటోలు షేర్ చేయాలని ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నాను. డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్.. ఒక పేరున్న డాక్టర్, కార్డియాలజిస్ట్. నా సోదరుడు ధనుష్ 50వ సినిమాలో ఈయన ఒక చిన్న పాత్ర చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ధనుష్కు ఈయనలో ఏం కనిపించింది? తనను తీసుకోవడమేంటి? అని షాకయ్యాను. ఏం జరుగుతుందో చూద్దామని ఆతృతగా ఎదురుచూశాను. మురిసిపోయాధనుష్.. తన సహనటులను డైరెక్ట్ చేయడం కళ్లారా చూసి మురిసిపోయా.. ఒక డాక్టర్తో కూడా యాక్టింగ్ చేయించగలిగాడంటే తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నా భర్తను వెండితెరపై చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అంత మంచి పాత్రలో కనిపించాడంటే ఆ క్రెడిట్ అంతా ధనుష్కే దక్కుతుంది. సంతోషంగా ఉందిఅంజీ చాలా బాగా నటించాడు. ధనుష్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన మూవీలో ఈయన భాగమవడం గౌరవప్రదంగా ఉంది. ఇందుకు నా తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక సోదరిగా, భార్యగా సంతోషంగా ఉంది. రాయన్ టీమ్కు థ్యాంక్స్.. అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Karthika Krishnamoorthy (@dr.karthikakarthik) చదవండి: అంతకుమించి వేదా ఉంటుంది -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
రాయన్ను అభినందించిన మహేశ్ బాబు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. విడుదల సమయంలో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. అందుకే రాయన్ టీమ్పై అభినందనల వెల్లువ వస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై అయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్గా డైరెక్ట్ చేశారు. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. SJ సూర్య, ప్రకాశ్ రాజ్,సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. మూవీ టీమ్కు కంగ్రాట్స్' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ధనుష్ కూడా రియాక్ట్ అయ్యారు. 'మీ ప్రశంసలతో మా టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు' అంటూ తెలిపారు. ఎస్.జే సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కూడా మహేశ్ బాబుకు తిరిగి సమాధానంగా కృతజ్ఞతలు తెలిపారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ధనుష్ 50వ సినిమాగా రాయన్ సినిమా తెరకెక్కింది. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. దీంతో తొలి మూడురోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్తో పాటు తెలుగులో కూడా రాయన్ చిత్రానికి మంచి ఆదరణ లభించడం విశేషం.#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch… Congratulations to the entire…— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024 -
ధనుష్కు మద్ధతుగా నిలిచిన నడిగర్ సంఘం
తమిళ టాప్ హీరో ధనుష్పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్లు తీసుకొని ఆపై షూటింగ్స్కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్కు మద్ధతుగా నిలిచింది.ధనుష్తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. -
సరికొత్త కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.ఆదివారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కుబేర’ సినిమా నుంచి ధనుష్ కొత్తపోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.