breaking news
Dhanush
-
బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్ వైడ్గా ఏకంగా 9వ స్థానం!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్కు కాస్తా దగ్గరగా ఉంది. -
ఇండియా లో స్టార్ అంటే ధనుష్ ఒక్కడే
-
కుబేర... తెలుగు 'వీర' లేవరా
తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగులో ఇప్పటిదాకా పలు చిత్రాలు తీశారు. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు అనే పేరు మాత్రం తెచ్చుకోగలిగారు. కానీ ఆయనతో ఇప్పటివరకు తెలుగు అగ్రనటులు ఎవరూ పనిచేయలేదు. ఎందుకని? బహుశా వైవిధ్యభరిత పాత్రలను మాత్రమే ఆయన రూపకల్పన చేస్తారనా? లేదా తమ సూపర్మ్యాన్ ఇమేజ్కి తగ్గ హీరో పాత్రల్ని ఆయన సృష్టించలేరనా? ఇప్పుడు శేఖర్ కమ్ముల పేరు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మార్మోగుతోంది. ఆయన తీసిన 'కుబేర' కమర్షియల్గా మాత్రమే కాకుండా దాదాపు 100శాతం పాజిటివ్ రివ్యూలతో అనూహ్య విజయం సాధించింది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఇటీవలి కాలంలో ఒక్కసారి పరిశీలించి చూస్తే వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ముల లాంటి తెలుగు దర్శకులు.. తమిళ హీరోలతో కలిసి పనిచేసినప్పుడు విజయవంతమైన చిత్రాలను అందించారు. సర్, లక్కీ భాస్కర్తో ఇప్పుడొచ్చిన 'కుబేర' చిత్రాలే స్పష్టమైన ఉదాహరణలు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రాణించడంతో పాటు బలమైన, వైవిధ్యభరిత కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.మరోవైపు తెలుగు స్టార్లతో కలిసి పనిచేసిన తమిళ దర్శకులేమో అంతవరకూ చవిచూడని దారుణమైన డిజాస్టర్లకు తెర తీశారు. మహేష్ బాబు 'స్పైడర్' నుంచి రామ్ 'ది వారియర్', నాగ చైతన్య 'కస్టడీ', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఇలా ఇవన్నీ తమిళ దర్శకులు తీసినవే. ఈ సినిమాలు అటు కలెక్షన్ల పరంగా, ఇటు క్వాలిటీ పరంగా ఏ వర్గం ప్రేక్షకులనూ మెప్పించలేకపోయాయి. ఈ సినిమాల పరాజయాలకు తమిళ దర్శకులేనా బాధ్యులు?(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)ఇప్పటికైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. ఆ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు హీరోలు, వారి ఆలోచనా ధోరణి మాత్రమే అని. నిజం చెప్పాలంటే 'కుబేర'లో ధనుష్ పోషించిన బిచ్చగాడి పాత్రను పోషించేంత ధైర్యం.. బహుశా ధైర్యం అనకూడదేమో! నటనపై అంతటి ఇష్టం తెలుగు హీరోలకు ఉందా? ఇమేజి, గిమేజి అంటూ చేయబోయే పాత్ర విలువ కేజీల్లో కొలవకుండా ఆ బిచ్చగాడి పాత్రకి సై అనేవారా? అసాధ్యమే అనాలి. (నిజానికి ఈ పాత్ర కోసం శేఖర్కమ్ముల ఒకరిద్దరు తెలుగు హీరోలను ఒప్పించడానికి విఫల యత్నం చేశారని సమాచారం) కానీ అదే సమయంలో తమిళ్లో టాప్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ ఆ పాత్రను అద్భుతంగా పండించాడు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకంటున్నాడు. అదే విధంగా మళయాల హీరో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' సినిమా విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను తెలుగు హీరోలు అంగీకరించలేరు. సురక్షితమైన, తమ కెరీర్కు గానీ, ఫాలోయింగ్కు గానీ ఎలాంటి ఇబ్బంది పెట్టని , హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఫ్యాన్స్కు క్రేజీ హీరోగా నిలిపి ఉంచే లాంటి పరిమితులు... తెలుగు హీరోలను అనూహ్యమైన పాత్రల ఎంపిక నుంచి దూరంగా నెట్టేస్తున్నాయి. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నట్టే, అభినయపరమైన అద్భుతాల ఆవిష్కరణలోనూ ముందుండాలంటే.. 'కుబేర' లాంటి విజయాలు చెబుతున్న పాఠాలను తెలుగు స్టార్స్ నేర్చుకోవాల్సిందే.(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?) -
'కుబేర' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అల్లు అరవింద్ వచ్చాకే మీకు సినిమాలు రాలేదు: చిరంజీవి
‘‘కుబేర’ సినిమా ఎలా ఉంటుంది? అని నాగ్ని అడిగాను. డిఫరెంట్ క్యారెక్టర్ ఎటెమ్ట్ చేశానన్నాడు. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చె΄్పాడు. ఎలా ఒప్పుకున్నావ్ నాగ్ అన్నాను. రెగ్యులర్ హీరో పాత్రలు కాకుండా కొత్తగా చేయాలనిపిస్తోందన్నాడు. నేను ‘కుబేర’ చూశాను. నాగ్ తీసుకున్న ఈ నిర్ణయం నాక్కూడా స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా తర్వాత మరో 40 ఏళ్లు ఇండస్ట్రీలో తాను ఉంటానన్న నాగ్ మాటలు వాస్తవం’’ అని హీరో చిరంజీవి అన్నారు. ధనుష్, నాగార్జున హీరోలుగా, రష్మికా మందన్నా, జిమ్ సర్బ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘కుబేర’ సినిమా సక్సెస్మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దేవా క్యారెక్టర్ చేయగల ఏకైక హీరో ధనుష్. బెస్ట్ యాక్టర్ అవార్డు ధనుష్కు మామాలైపోయింది. మాకు ఎప్పుడన్నా వస్తే వావ్... నాకొచ్చిందోచ్... నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అని నేననుకోవాలి. ఇక హ్యూమన్ ఎమోషన్స్ను టచ్ చేయగలిగి, కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ థియేటర్కు వస్తారనే భరోసా ఇచ్చావ్ (శేఖర్ కమ్ములను ఉద్దేశించి). ‘చూడాలని ఉంది’ సినిమాలో అప్పారావు వస్తాడని సౌందర్య అంటుంది.రష్మిక చేసిన క్యారెక్టర్లో నాకు సౌందర్య గుర్తుకు వచ్చింది. సునీల్... నాగార్జున ఎవరి కాళ్లకీ దండం పెట్టడు... ఒక్క మీ నాన్న (నారాయణ్దాస్ నారంగ్)గారికి తప్ప. ఆయనంటే నాకూ అంతే ఇష్టం. ‘మీతో సినిమా చేయాలని ఉంది’ అని అడిగావు. ‘సార్.. మా నాన్నగారు మీ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడంతో నైజాంలో బాగా డబ్బులు గడించాం. మీ సినిమాలంటే నైజాం కింగ్ అనుకునేవాళ్లం.ఆ తర్వాత మా నాన్నగారి బాటలో మేం కూడా మీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. మాకు కొంత డబ్బులు వచ్చాయ్ అన్నావు. కానీ అల్లు అరవింద్గారు గీతా ఆర్ట్స్ పెట్టిన తర్వాత మీకు సినిమాలు రాకుండా పోయాయి (నవ్వుతూ). అయితే మీ మూడో తరం నిర్మాత జాన్వీకి ఆల్ ది బెస్ట్. మీతో సినిమా చేస్తే మూడు జనరేషన్స్తో సినిమా చేసినట్లవుతుందని మీ (జాన్వీని ఉద్దేశించి) నాన్న (సునీల్ నారంగ్) అన్నారు. మనం చేస్తున్నాం’’ అన్నారు.నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుబేర’ ఎందుకు చేశారని ఓ జర్నలిస్ట్ అడిగితే, దీపక్ (నాగార్జున పాత్ర పేరు) క్యారెక్టర్ చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతున్నాయి. ఈ సినిమా నా సినిమా కదా? అనుకుని చేశానని చెప్పాను. దాన్ని సోషల్ మీడియా వాళ్లు సినిమాకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అంటున్నాడు... సినిమా తర్వాత నా సినిమా అంటున్నాడని మీమ్స్ చేశారు. మళ్లీ చెబుతున్నాను... ఇది దేవా సినిమా. దీపక్ సినిమా. ఖుష్బూ సినిమా. అందరి సినిమా. మోస్ట్లీ శేఖర్ సినిమా. ‘కుబేర’తో నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు శేఖర్. ఇక నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయనుకుంటున్నా. మరో నలభై సంవత్సరాలు ఉంటాను. ధనుష్ యాక్టింగ్ గురించి ఏం చెప్పినా తక్కువే. రష్మికని చూడగానే నాకు ‘క్షణం క్షణం’ సినిమాలో శ్రీదేవిగారు గుర్తొచ్చారు’’ అని చె΄్పారు.ధనుష్ మాట్లాడుతూ– ‘‘ఛాపర్స్, బాంబ్ బ్లాస్ట్స్, బ్లడ్... ఇలాంటి అంశాలున్న సినిమాలే ఆడియన్స్ను ఇప్పుడు థియేటర్స్కు తీసుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ... ‘కుబేర’లాంటి సినిమాతో చాలామంది ఫిల్మ్ మేకర్స్కు శేఖర్గారు ఓ హోప్ ఇచ్చారు. హ్యూమన్ ఎమోషన్ ను మించిన గ్రాండియర్ లేదు’’ అని అన్నారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా..’ వంటి సినిమాలపై జడ్జ్మెంట్ ఉంటుంది. కానీ ‘కుబేర’ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉండేది. ఫస్ట్ డే ఫస్ట్ షోకి నా భయాలను చెల్లాచెదురు చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?
ఈ వారం ఓ మాదిరి అంచనాలతో రిలీజైంది 'కుబేర'. రిలీజ్కి ముందు బుకింగ్స్ కూడా అలా అలా అన్నట్లే ఉన్నాయి. ఎప్పుడైతే మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ హౌస్ఫుల్స్ కావడం మొదలుపెట్టాయి. అలా తొలిరోజు యావరేజ్ వసూళ్లు రాగా.. రెండో రోజు వచ్చేసరికి ఆ నంబర్స్ కాస్త పెరిగాయి. ఇంతకీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?ధనుష్ నటించిన 'కుబేర'.. ఓ బిచ్చగాడు ఓ మల్టీ మిలియనీర్ మధ్య సాగే థ్రిల్లింగ్ డ్రామా కథతో తీశారు. బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే.. సీబీఐ అధికారిగా నాగ్ ఆకట్టుకున్నాడు. రష్మిక కూడా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కూడా తనదైన మ్యూజిక్తో మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తన రూట్ మార్చి హిట్ కొట్టేశాడు.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఇలా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'కుబేర'కు తొలిరోజు మన దేశంలో రూ.14 కోట్ల మేర నెట్ వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.16 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ప్రస్తుతం 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేశాయి. అంటే రూ.15 కోట్ల మేర వచ్చేసినట్లే. మొత్తంగా చూస్తే రూ.50 కోట్ల మార్క్ అయితే దాటేసిందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎంత డబ్బులు వస్తాయో చూడాలి?'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?) -
‘కుబేర’లో నాదే మెయిన్ క్యారెక్టర్ అనిపించింది: నాగార్జున
‘‘మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ’ వంటి సినిమాల్లో హీరో ఎవరని చెప్పలేం. అందులో కథే హీరో... అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. ‘కుబేర’ కూడా ఔట్ అండ్ ఔట్ శేఖర్ కమ్ములగారి మూవీ ఈ సినిమా కోసం తను ప్రాణం పోశారు. మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని అక్కినేని నాగార్జున చెప్పారు. అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (ఈ నెల 20న) తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. (చదవండి: నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. కర్ణుడిలా ఆయన వెంట ఉంటా : మంచు విష్ణు)శనివారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘శేఖర్ చెప్పిన ‘కుబేర’ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి పాత్ర నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్రకి వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్నిచ్చింది. నా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు’’ అని చెప్పారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతీ దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను.. అది ఈ రోజు నిజమైంది’’ అన్నారు. ‘‘కుబేర’ పెద్ద హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను’’ అని సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ‘‘మా సినిమాకి బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. నిర్మాతలుగా చాలా సంతోషంగా ఉన్నాం’’ అని పుస్కూర్ రామ్మోహన్ రావు చెప్పారు. -
'కుబేర' కలెక్షన్.. తొలిరోజు అన్ని కోట్లు వచ్చాయా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలారోజుల తర్వాత మళ్లీ జోష్ కనిపిస్తోంది. వేసవిలో స్టార్ హీరోల సినిమాలేవి రాకపోవడంతో చాలా డల్గా ఉంది. నాని 'హిట్ 3' కూడా మే నెలలోనే రిలీజైనప్పటికీ కొన్నిరోజులు మాత్రమే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ఇప్పుడు 'కుబేర' విషయంలో రిలీజ్కి ముందు పెద్ద హడావుడి గానీ హైప్ గానీ లేదు. తొలిఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తొలిరోజు వసూళ్లలో మంచి నంబర్స్ కనిపించాయి.తెలుగు రాష్ట్రాల్లో మూడు నాలుగు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు గానీ తమిళనాడులో మాత్రం సాంకేతిక కారణాలతో విడుదలకు ముందురోజు బుకింగ్స్ తెరిచారు. అయినా సరే మౌత్ టాక్ ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్గానే వస్తోంది. అలా తొలిరోజు తెలుగు, తమిళంలో కలిపి రూ.13 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ నంబర్స్ ఇంకా పెరగొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఎంత కలెక్షన్స్ వస్తాయో?(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ధనుష్, నాగార్జున, రష్మిక లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకుడు. తొలిరోజు వసూళ్ల బట్టి చూస్తే ధనుష్కి కెరీర్ పరంగా ఇది రెండో బిగ్గెస్ట్ కలెక్షన్ కాగా.. నాగార్జున, శేఖర్ కమ్ములకు మాత్రం ఇదే అత్యధికం. ఎందుకంటే నాగ్ సినిమాలన్నీ తెలుగు వరకు పరిమితం. అందువల్ల ఓ మాదిరి వసూళ్లు వచ్చేవి. ఇక దర్శకుడు కమ్ముల ఇప్పటివరకు సింపుల్ బడ్జెట్ మూవీస్ తీస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వసూళ్లు వీళ్లకు ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా) -
'కుబేర' మేకింగ్ వీడియో.. చెత్తకుప్పని కూడా
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' థియేటర్లలోకి వచ్చేసింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చాలారోజుల తర్వాత థియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయి. ధనుష్ నటనని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా కోసం నటీనటులు అందరూ ఎంత కష్టపడ్డారనే మేకింగ్ వీడియోని టీమ్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)ఈ వీడియోలో అసలు రియల్ లొకేషన్స్లో షూటింగ్ ఎలా చేశారనేది చూపించారు. అలానే సినిమాలో కొన్నిసీన్లు చెత్తకుప్పలో చిత్రీకరించారు. కొన్నిసార్లు నిజమైన డంప్ యార్డ్లో తీసినప్పటికీ మరికొన్ని సార్లు కృత్రిమంగా అలాంటి ప్రదేశాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. మేకింగ్ వీడియోలోనూ ఈ బిట్ చూపించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాలో బడా వ్యాపారులు వేల కోట్ల సంపదతో ఎలాంటి మోసాలు చేస్తున్నారనే విషయాల్ని చూపించారు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా.. నాగార్జున సీబీఐ అధికారిగా రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపించారు. ఫస్టాప్లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర కాగా.. సెకండాఫ్లో హీరోకి సాయపడే వ్యక్తిగా కనిపించారు. చాలారోజుల తర్వాత నాగ్ ఫెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. రష్మిక ఎప్పటిలానే తనదైన యాక్టింగ్తో ఆకట్టుకుంది. వీకెండ్ పూర్తయితే ఈ మూవీ రిజల్ట్పై ఫుల్ క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా) -
'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?
'కుబేర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కాస్త కళకళలాడుతున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే ఈ మూవీని కాస్త డిఫరెంట్గా తీశాడు. నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం బాగుంది. చూస్తుంటే ఈ వీకెండ్ విన్నర్ ఈ మూవీనే అవుతుందేమో అనిపిస్తుంది. మరి ఈ సినిమాలో కనిపించిన స్టార్స్కి ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు?తమిళ నటుడు ధనుష్.. 'కుబేర'లో హీరోగా నటించాడు. ఇందులో ఇతడిది బిచ్చగాడి పాత్ర. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇతడి నటనకు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే అంత సహజంగా నటించాడని అంటున్నారు. ఈ చిత్రంలో నటించినందుకుగానూ రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇదే మూవీలో మరో కీలక పాత్ర పోషించిన నాగార్జున.. రూ.14 కోట్ల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన)ఇదే సినిమాలో హీరోయిన్గా చేసిన రష్మిక రూ.4 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుందని, మ్యూజిక్తో ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నాడని అంటున్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ కమ్ముల అయితే రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో రూ.100 కోట్ల కంటే ఎక్కువగానే బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న టాక్ బట్టి చూస్తే నిర్మాతలు పెట్టిన మొత్తం రిటర్న్ రావొచ్చు అనిపిస్తుంది.'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా) -
శేఖర్ కమ్ముల కుబేర.. అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు?
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కుబేర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటనగురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇక కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది.నిజానికి నాగార్జున టాలీవుడ్లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. ఇలా టాప్ లీగ్లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఒక పాత్ర చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఆది కూడా నాగ్కి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫామెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసలు వర్షం కురుస్తోంది.శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తానని ముందుకు వస్తే.. ఆయనను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలు కూడా తన భుజాల మీదే వేసుకున్నాడు. ఒక రాకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు ఎనలేని రెస్పాన్స్ వస్తోంది. నటుడు అంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని పాత్రలో నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్.శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్లు దాదాపు చాలా నేచురల్గా ఉంటాయి, అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి పాత్రలో కూడా ఆయన నటించి, కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతం అనే ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ను ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకుని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అనే చర్చ జరుగుతోంది. -
అమ్మా.. అంటూ తిరుపతిలో భిక్షమెత్తా: హీరో ధనుష్
ఇతడు హీరో ఏంట్రా? అన్నవారితోనే.. హీరో అంటే ఇతడిలా ఉండాలి అనిపించుకున్నాడు ధనుష్ (Dhanush). నిజానికి ఈయన హోటల్ మేనేజ్మెంట్ చదివి మంచి చెఫ్ అవ్వాలనుకున్నాడు. కానీ ఫ్యామిలీది సినిమా బ్యాక్గ్రౌండ్. తండ్రి కస్తూరి రాజా.. దర్శకనిర్మాత, అన్న సెల్వరాఘవన్ కూడా డైరెక్టర్గా ప్రయత్నించాలనుకుంటున్నాడు. తమ్ముడు కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందన్నాడు. నటుడిగా ట్రై చేయమన్నాడు.స్టార్డమ్అలా తండ్రి డైరెక్షన్లో తొలి చిత్రం (తుళ్లువదో ఇలమై), అన్న డైరెక్షన్లో రెండో మూవీ (కాదల్ కొండైన్) చేశాడు. ఈ సినిమాల విజయంతో తనలోనూ కాన్ఫిడెంట్ పెరిగింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. తక్కువ కాలంలోనే టాప్ స్టార్గా ఎదిగాడు. సినిమా కోసం ఎలాంటి ట్రాన్స్ఫార్మేషన్కైనా సిద్ధమవుతాడు. కోలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలు పెట్టిందే ఈ హీరో (పొల్లాధవన్ మూవీలో ధనుష్ ఆరు ఫలకల దేహంతో కనిపిస్తాడు)! అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. ఇందులో ధనుష్ యాచకుడిగా కనిపిస్తాడు.తిరుపతిలో భిక్షాటనసినిమా షూటింగ్లో భాగంగా తిరుమలలోనూ ధనుష్ భిక్షాటన చేశాడు. ఇటీవల కుబేర ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ.. శేఖర్ కమ్ములకు ఉన్న మంచి పేరు చూసి ఈ సినిమా అంగీకరించాను. కానీ, చివరకు నన్ను తిరుపతి నడిరోడ్డుపై అమ్మా, అయ్యా అంటూ భిక్షాటన చేసేలా చేశాడు అని సరదాగా చెప్పుకొచ్చాడు. కాగా తిరుపతిలోని అలిపిరి వద్ద జనవరి నెలాఖరులో ధనుష్ భిక్షాటన చేసిన సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ కష్టం ఊరికే పోలేదు. జూన్ 20న రిలీజైన కుబేర గ్రాండ్ సక్సెస్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి నడి రోడ్ లో బిచ్చగాడి లా కూర్చోపెట్టాడు - #Dhanush#KuberaaInTheatersFromTomorrow pic.twitter.com/3ApQWtri5L— Shreyas Sriniwaas (@shreyasmedia) June 19, 2025 చదవండి: అతడు చెప్పేదంతా అబద్ధం.. తీసుకెళ్లి పిచ్చి ఆస్పత్రిలో వేయండి -
Kuberaa: ‘కుబేర’ మూవీ రివ్యూ
శేఖర్ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని వచ్చినా.. శేఖర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్గా వచ్చిన డిఫరెంట్ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉంది. లవ్స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్ క్రష్ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కుబేరా’ కథేంటంటే..?దీపక్ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్లో మరో 50 వేల కోట్లను బ్లాక్లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review). దాని కోసం దీపక్ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్ గ్యాంగ్ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్ గురించి దీపక్ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ కథలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్టైనింగ్గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్. అయితే ధనుష్ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్ స్కామ్ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్ మనీ బదిలీ ప్లాన్.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్.. ధనుష్లోని టాలెంట్ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్ దీపక్గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విలన్గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ముంబై సెట్తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కుబేర మూవీ హిట్టా...ఫట్టా?
-
ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోడు. సింపుల్గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు.నాలుగేళ్ల గ్యాప్తో మూవీఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అల్లుకున్నాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.వీడియో వైరల్జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్, ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్ అయితే.. డంపింగ్ యార్డ్లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏pic.twitter.com/rYl2BQSBUV— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025Whistles, applause and what not 🔥🔥It’s a BLOCKBUSTER WAVE that’s set @dhanushkraja & @sekharkammula’s hearts ablaze ❤️🔥This is the kind of cinema that demands to be experienced on the big screens 💥💥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa… pic.twitter.com/yJTmUKtuhQ— Kuberaa Movie (@KuberaaTheMovie) June 20, 2025 చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి' -
ధనుష్, రజనీకాంత్లతో భారీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న దర్శకుడు
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జననాయకన్ చిత్రం కథ గురించి పలు రకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా ఇది సమకాలీన రాజకీయాలను తెరపై ఆవిష్కరించే పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కథను దర్శకుడు హెచ్ వినోద్ నటుడు కమలహాసన్ కోసం తయారు చేసిందనే ప్రచారం జరిగింది. మొత్తం మీద నటుడు విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అంటే 2026 జనవరి 8వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో దర్శకుడు హెచ్ వినోద్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తదుపరి ధనుష్ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథ చెప్పడానికే హెచ్ వినోద్ నటుడు రజనీకాంత్ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన హెచ్.వినోద్ దర్శకత్వంలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రజనీతో ఛాన్స్ లేదంటే ధనుష్తో ప్లాన్ చేస్తారా అనే టాక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
'కుబేర' మూవీ HD స్టిల్స్
-
'కుబేర' ట్విటర్ రివ్యూ.. హైజాక్ చేసిన ధనుష్
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న విడుదలైంది. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో సినిమాను చూశారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుజామున మొదటి ఆట వేశారు. దీంతో సినిమా టాక్ ఏంటి అనేది సోషల్మీడియా ద్వారా టాక్ బయటకు వచ్చేసింది. కుబేరలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతిచోట కుబేర హిట్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సోషల్మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ రన్ అవుతుంది..? నాగార్జున, ధనుష్ పాత్రలు మెప్పించాయా..? అనేది చూద్దాంశేఖర్ కమ్ముల అండ్ టీం బ్లాక్ బస్టర్ని అందించారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాప్ అదిరిపోయింది అంటూనే సినిమా ప్రాణం, ఆత్మ అంతా సెకండ్ హాఫ్లోనే ఉందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని తెలుపుతున్నారు. ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ సీన్ పట్ల ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారు. ధనుష్ మాత్రమే చేయగలిగే పాత్ర అంటూ అభినందిస్తున్నారు. కుబేరలో ధనుష్ ఒక చిరస్మరణీయమైన నటనను కనబరిచాడని, అతను బిచ్చగాడి పాత్రలో జీవించాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. కథలో అత్యంత బలంగా ఉన్న పాత్ర నాగార్జునకు దక్కిందని మరికొందరు తెలుపుతున్నారు. ఇందులో రష్మిక కూడా మరో చిరస్మరణీయమైన పాత్రను పోషించిందని కాంప్లీమెంట్స్ దక్కుతున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందట. చాలా సీన్లకు ఆయన ప్రాణం పోశారని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల రచన, దర్శకత్వం చాలా బాగా వర్కౌట్ అయ్యాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. మొత్తం మీద, కుబేరుడు సినిమా అంతటా బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. సినిమా నిడివి మాత్రమే మైనస్ అంటూనే ఎక్కడా కూడా బోర్ కొట్టదు అంటున్నారు. సినిమా మొత్తం ధనుష్ హైజాక్ చేశాడని, ఇంత అద్భుతంగా ఎలా నటించావ్ బాస్ అంటూ ఆయన్ను అభినందిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఏకంగా 9 రేటింగ్ ఇస్తున్నారు. కొందరైతే 10 ఇవ్వొచ్చు అంటున్నారు. అంతలా ధనుష్ మెప్పించాడని తెలుపుతున్నారు. సినిమా చూసిన ధనుష్ అభిమానులైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు తెప్పించే సీన్లు చాలా ఉన్నాయంటూ కుబేరకు నేషనల్ అవార్డ్ తప్పకుండా వస్తుందని అభిప్రాయపడుతున్నారు.#Kuberaa [4.5/5] : Sekhar Kammula and team delivered a blockbuster. The first half of the film is good but the life and soul of the film is the second half. The emotional scenes in the second half worked out big time. Dhanush delivered a memorable performance. He just lived in…— Ramesh Bala (@rameshlaus) June 20, 2025#Dhanush – What a Phenomenal Actor!🥹Every Expression, Every Emotion… He Lives the Role! Words Fall Short to Describe His Brilliance🙏🔥Truly a Gifted Gem to Indian Cinema🤞❤️#Kuberaa | #Kubera pic.twitter.com/tQSLRZhVhj— Movies4u Official (@Movies4u_Officl) June 20, 2025#Kuberaa #KuberaaReview #Dhanush #Nagarjuna #ShekharKammula pic.twitter.com/2XX4q8bHia— TollywoodBoxoffice.IN (@TBO_Updates) June 20, 2025#Kuberaa wins your heart, powered by Dhanush’s phenomenal, arguably, career-best performance. Despite minor flaws with length, the film delivers plenty of memorable moments, making it a thoroughly enjoyable watch! ❤️❤️❤️❤️ pic.twitter.com/zqDVjS6owv— LetsCinema (@letscinema) June 20, 2025Mentaloda adhem acting ra babu 🥵 🔥🔥💥💥😭😭 @dhanushkrajaBlock buster #Kuberaa 🔥 🔥 A Must Watch Film Worth Watching 💥💥🔥🔥 #Dhanush pic.twitter.com/cB2oSHgfE2— 𝐃𝐞𝐯𝐚 🛐🛐 (@SudheerJalluri1) June 20, 2025#Kuberaa is the BEST movie in recent times🛐A shekhar kammula Film, A Dhanush’s Masterpiece A Nagarjuna’s ViswaroopamA @ThisIsDSP’s ThandavamWorth every penny, okka scene kuda bore kottaledhu🙏❤️🔥pic.twitter.com/zT2cD04oFU— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 20, 2025After the blockbuster #LoveStory, director @sekharkammula delivers yet another banger for @SVCLLP with #Kuberaa. 💥🔥This winning combo strikes gold once again with powerful storytelling and impactful cinema. A sure-shot BLOCKBUSTER! 🤘👑#SekharKammulasKuberaa pic.twitter.com/vLYFFiBSLA— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 20, 2025#Kuberaa - A WinnerA good first half followed by an emotionally charged second half made the film a good watch. The film started on a slow note but right from Dhanush’s entry sequence, the pace of the film did not drop until the climax. Dhanush delivered one of the his…— Gulte (@GulteOfficial) June 20, 2025#Kuberaa Full Positive response from Telugu shows 🔥#Dhanush's back to back hits in Telugu 🔥🔥 ( #Sir/#Vaathi & Now Kuberaa) @dhanushkraja pic.twitter.com/PyULPDjDMI— Prakash Mahadevan (@PrakashMahadev) June 20, 2025 -
ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా – అక్కినేని నాగార్జున
‘‘కుబేర’ సినిమాలో నాది బిలియనీర్ పాత్ర అని అందరూ అనుకుంటున్నారు. కానీ, నాది మధ్య తరగతి వ్యక్తి ప్రాత. సీబీఐ ఆఫీసర్గా కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య నా పాత్ర ఉంటుంది. నా క్యారెక్టర్ని శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా రాశారు. నా పాత్రలో చాలా ఛాయలుంటాయి.. అదే విధంగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి మంచి చాన్స్ దక్కింది’’ అని అక్కినేని నాగార్జున తెలి పారు. అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పంచుకున్న విశేషాలు. → ‘కుబేర’ లాంటి మంచి కథలు రావాలంటే స్టార్ హీరోలు కలిసి పని చేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు కలిసి చేశాను. గతంలో నాన్నగారు(ఏఎన్ఆర్), ఎన్టీఆర్, కృష్ణ, శోభన్బాబు గార్లు... ఇలా చాలా మంది కలిసి మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో చేశారు. పైగా శేఖర్ కమ్ములగారితో పని చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ‘ఆనంద్’ సినిమా నుంచి ఆయన ఏంటో, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన కథల్లో సామాజిక సంబంధిత అంశాలు ఉంటాయి. అందుకే శేఖర్గారి సినిమాలు నాకు బాగా ఇష్టం. తన సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు ఇతర వాణిజ్య అంశాలు కూడా ఉంటాయి. → ‘కుబేర’లో మంచి యునిక్ పాయింట్ ఉంది. ప్రస్తుత సమాజానికి ఆ పాయింట్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. అవన్నీ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. బిలియనీర్, మధ్యతరగతి, బిలో పావర్టీ లైన్... ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. వైవిధ్యమైన ఈ కథలో రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఉండదు... రొటీన్ క్యారెక్టర్స్ కనిపించవు. ఇందులో ఏ పాత్ర కూడా హీరో, హీరోయిన్ అనడానికి లేదు. తెరపై మేము కాకుండా ప్రేక్షకులకు అన్నీ పాత్రలే కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం కావాలి. → ఈ సినిమాలో నా ఇమేజ్కి తగ్గట్టు స్క్రిప్ట్లో శేఖర్గారు ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు.. మార్చితే కథ మారిపోతుంది. మా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్గారితో పని చేశారు. ‘కుబేర’లో చేయడానికి ఆయన వర్కింగ్ స్టైల్ గురించి నాగ చైతన్యని అడిగాను. ఎందుకంటే రీసెంట్గా తను ‘లవ్ స్టోరీ’ మూవీ చేశాడు కాబట్టి. ‘శేఖర్గారి వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చె ప్పాడు. ‘కుబేర’లో నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్... అన్నీ కూడా కొత్తగా శేఖర్గారి శైలిలో ఉంటాయి. తమిళ్ వెర్షన్లోనూ నేనే డబ్బింగ్ చె ప్పాను. → ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు.. అద్భుతంగా నటించాడు. సెట్స్లో మా బాండింగ్ చాలా బాగుండేది. షాట్ గ్యాప్లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ చిత్రంలో రష్మికా మందన్న అద్భుతంగా నటించింది. ఫైనల్ కాపీ చూశాక, ఫోన్ చేసి ‘కుబేర’లో నువ్వే స్టార్’ అని చె ప్పాను.. తను చాలా సంతోషపడింది. సునీల్ నారంగ్, రామ్మోహన్గార్లు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా చాలా ΄్యాషన్తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి చాలా ముఖ్యం. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తాయి. కెమెరామేన్ నికేత్ బొమ్మరెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. → ప్రస్తుతం చాలా మంది పాన్ ఇండియా సినిమా అంటూ నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్ వేసుకుంటున్నారు. నిజం చె ప్పాలంటే పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలూ దానికి సరిపోవు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్, బిగ్ ప్రొడక్షన్ హౌస్ కలిసి పెద్ద సినిమా చేసినప్పటికీ కథలో విషయం లేకుంటే ఉపయోగం లేదు. ఈ మధ్య అలాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ ‘కోర్ట్’ లాంటి చిన్న సినిమా సూపర్ హిట్ అయింది. నా దృష్టిలో ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా. అలాగే మంచి కథ ఉన్నదే పెద్ద సినిమా. → నా కెరీర్లో వందో సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్తో చేస్తున్నాను. ‘కింగ్ 100’ అని వర్కింగ్ టైటిల్ పెట్టాం. ఈ చిత్రాన్ని మా అన్నపూర్ణ స్టూడియోస్పై నిర్మిస్తాం. అయితే వందో సినిమా వంద కోట్ల బడ్జెట్తో రూ పొందనుందనే వార్తల్లో నిజం లేదు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంలో నేను నటించడం లేదు. నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి పూర్తి స్థాయిలో ఓ సినిమా చేయాలని మా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడప్పుడే అలాంటి సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మా ముగ్గురికి సరిపడే కథతో ఇప్పటివరకూ ఎవరూ నన్ను కలవలేదు. → నటుడిగా దాదాపు నలభై ఏళ్ల కెరీర్ నాది. ఎన్నో పాత్రలు చేశాను. అయితే ఫలానా పాత్ర చేయాలనే కల నాకు లేదు. నాకు నచ్చిన, వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళుతుంటాను. రజనీకాంత్గారి ‘కూలీ’ సినిమాలో ప్రాపర్ విలన్గా కనిపిస్తాను. లోకేశ్ కనగరాజ్ చక్కగా తీశారు. అయితే ‘కూలీ’లోలా మళ్లీ విలన్ పాత్ర చేయను. క్యారెక్టర్ నచ్చితే కామెడీ కూడా చేస్తాను. ఏం చేసినా నాకు కొత్తగా అనిపించాలి. నేను నటించిన ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నాం. 4కే పనులు పూర్తయ్యాయి. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతోంది. ఒక రీల్ చూశాను.. క్వాలిటీ అద్భుతంగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లలో సినిమాకి చర్చలు జరిగాయి. అదే విధంగా ‘బ్రహ్మాస్త్ర 2’ లోనూ నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చె ప్పారు. -
ఏపీలో 'కుబేర' సినిమా టికెట్ ధరలు పెంపు..
ధనుష్- నాగార్జున-రష్మిక కలిసి నటించిన 'కుబేర' సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా రూ. 150 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్కినేని ఫిదా, లవ్స్టోరీ వంటి భారీ విజయాల తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'కుబేర' కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకున్నారు.ఏపీలో టికెట్ ధరలు ఇలాఏపీలోని అన్ని మల్టిప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్స్లలో టికెట్ ధరపై రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 10 రోజులపాటు కొనసాగించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, హయ్యర్ (1st) క్లాస్ టికెట్స్కు మాత్రమే ధరలు పెంచాలని సూచించింది. కుబేర టికెట్ ధరల పెంపు కోసం తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా ఆ చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సినిమా టికెట్ ధరలును పెంచలేదు. పాత ధరలనే యథాతథంగా ఉంచింది. ఏపీలో కుబేర సినిమా చూడాలంటే మల్టిప్లెక్స్లలో అయితే రూ. 270, సింగిల్ స్క్రీన్స్లలో రూ. 240 వరకు చెల్లించాల్సి ఉంటుంది. #Kuberaa AP Tickets Hiked!Single screens upto ₹236!!Multiplexes upto ₹265.50! pic.twitter.com/ZhFLAFA2TH— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 19, 2025 -
పారితోషికం తీసుకొని చాలా నష్టపోయా : శేఖర్ కమ్ముల
‘‘నా కెరీర్లోని మ్యూజికల్, లవ్స్టోరీ చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. దీంతో నా పై ఓ మార్క్ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. ‘లీడర్’ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. ‘హ్యాపీడేస్’ కాలేజ్ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. ‘కుబేర’ సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే... నేను కథను డైరెక్ట్ చేయడం కాదు... కథే నన్ను డైరెక్ట్ చేస్తుంటుంది’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. (చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల)ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు విడుదల కానున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ⇢ ‘కుబేర’ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం... ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే... బెగ్గర్ వర్సెస్ బిలియనీర్. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉంటుందీ సినిమా. ⇢ ‘మనం, ఊపిరి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నాగార్జునగారు నటించారు. ‘కుబేర’లో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్గా నటించారు. ధనుష్ బెగ్గర్గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించలేరు. రష్మికా మందన్నా తన యాక్టింగ్తో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్కు తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ను బట్టీ పట్టి మరీ చక్కగా చెప్పారు. నా గత చిత్రాలతో పోలిస్తే నా మార్క్ ‘కుబేర’ సినిమాలో పదింతలు ఎక్కువగా ఉంటుంది. ⇢ నా పాతికేళ్ల జర్నీని చూసుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయంలో కూడా నాకింత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగను.. పారితోషికం తీసుకుంటానంతే. దీని వల్ల చాలా నష్టపోయాను. అయినా బాధలేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ నా జీవితంలో నేను చూసిన, నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లోనివారివే. ఇక ‘లీడర్’కు సీక్వెల్ ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో, ప్రజల్లో మార్పులొచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి. ఇక నానీతో చేసే సినిమాకు వర్క్ జరగాల్సి ఉంది. -
త్వరలో యాక్టింగ్ కు గుడ్ బై చెప్పనున్న ధనుష్?
-
కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రిలీజ్ ఒక్క రోజే సమయం ఉండడంతో మేకర్స్ కుబేర చిత్రంలో నాలుగో పాటను విడుదల చేశారు. నా కొడుకా అంటూ సాంగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించగా.. నందకిశోర్ లిరిక్స్ అందించగా.. సిందూరి విశాల్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తోంది.కాగా.. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ నటించగా.. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.The soul touching #Kuberaa4thSingle is out now ♥️A Rockstar @ThisIsDSP musical 🎶#NaaKoduka - https://t.co/EF9sJ4w7xW#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #Kuberaa #KuberaaBookings #KuberaaOn20thJune pic.twitter.com/B3Zqmyr86y— Kuberaa Movie (@KuberaaTheMovie) June 18, 2025 -
శేఖర్ కమ్ముల కుబేర.. భారీగా కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డ్!
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కించారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.అయితే ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న కుబేర చిత్రానికి భారీగానే కట్స్ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో 181 నిమిషాలు ఉండగా.. తమిళంలో 182 నిమిషాలు రన్టైమ్తో సీబీఎఫ్సీ అనుమతిచ్చింది. అయితే కుబేర సినిమాలోని 19 సన్నివేశాలకు కట్ చెప్పింది. దీంతో రన్టైమ్ దాదాపు 14 నిమిషాలు తగ్గిపోయింది. సెన్సార్ బోర్డ్ ట్రిమ్ చేసిన సీన్స్లో ధనుశ్, రష్మిక మందన్న, నాగార్జున కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 19 సన్నివేశాలు కట్ చేసిన సెన్సార్ బోర్డ్ యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 13 ఏళ్లలోపు పిల్లలు ఈ మూవీ చూసేందుకు అనుమతి లేదు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవలే కుబేర ట్రైలర్ విడుదల కాగా సినిమాపై అంచనాలు పెంచేసింది. -
కుబేర మూవీ ట్రైలర్ రిలీజ్
-
‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కుబేర' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం విశేషం. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ట్రైలర్ని తాజాగా లాంచ్ చేశారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్ టికెట్స్ను లాంచ్ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు. -
విమాన ప్రమాదం.. 'కుబేర' ఈవెంట్ వాయిదా
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం వల్ల 'కుబేర' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో నేడు (జూన్ 13)న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశం మొత్తం దుఃఖంలో ఉండగా తామా కుబేర వేడుకను చేయలేమని వారు తెలిపారు. అభిమానులు దీనిని గ్రహిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ధనుష్- నాగార్జున-రష్మిక కలిసి నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈ నెల 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. మొత్తం 265 మంది మృతి చెందారు. అందులోని 229 మంది ప్రయాణికులు ఉండగా 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం వైద్యకళాశాల మీద పడటంతో 24 మంది విద్యార్థులు మరణించిన వారిలో ఉన్నారు. ఈ ఘటనతో దేశం మొత్తం తీవ్రమైన దుఃఖంలో ఉంది. దీంతో కుబేర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈ ఆదివారం ఈ వేడుక జరగవచ్చని సమాచారం. -
నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోలేం : కుబేరా నిర్మాతలు
దర్శకుడు శేఖర్ కుబేరా కథ చెప్పినప్పుడే ఇందులో హీరోగా ధనుష్ అయితే బాగుంటుందని చెప్పారు. ధనుష్ కూడా కథ విని 20 నిమిషాల్లోనే సైన్ చేశాడు. ఇక ఇందులో మరో కీలక పాత్రని నాగార్జున చేశాడు. శేఖర్ మొదటి నుంచి ఈ పాత్రకు నాగార్జున తప్పితే మరొకరు చేయలేరని చెప్పాడు. నాగ్కి కూడా ఈ కథ బాగా నచ్చింది. దీంతో వెంటనే ఓకే చేశాడు. ఆ పాత్రలో నాగార్జునని తప్ప మరొకరిని ఊహించేకోలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశాడు. సినిమా ప్రతి ఒక్కరికి కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు . శేకర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ కుబేరా. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఈ విశేషాలు..- శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత కుబేరా కథ మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ గారు అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ గారు కథ 20 నిమిషాలు విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాము.- ధనుష్ గారు పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గారు గురించి అందరికీ తెలుసు. ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్ గారు, నాగార్జున గారు. రష్మిక గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు.- కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నామ. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.- శేఖర్ కమ్ముల గారు మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.- శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.- శేఖర్ గారు మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.- రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాము. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని సూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్.మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది. - దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ గారు రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్ గారు, దేవిశ్రీ గారి కలెక్టివ్ డెసిషన్.- శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు. -
Kuberaa: ‘పిపీ డుమ్ డుమ్... ’ అంటున్న రష్మిక
ధనుష్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల గిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పిపీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చైతన్య పింగలి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి చౌహాన్ అద్భుతంగా ఆలపించారు. -
ముంబయిలో ‘కుబేర’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
'ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్'.. రష్మికపై నాగార్జున ప్రశంసలు!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హీరో నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికపై ప్రశంసలు కురిపించారు.ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అని నాగార్జున కొనియాడారు. రష్మిక గత మూడేళ్లుగా సినిమాల్లో అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. మేము ఎవరూ చేయలేని.. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల సినిమాలు రష్మిక మాత్రమే చేయగలదని అన్నారు. మా అందరికంటే రష్మికనే పెద్ద చిత్రాలు చేసిందని నాగార్జున ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత)కాగా.. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. -
చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే 'కుబేర'.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.(ఇదీ చదవండి: డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!)ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో 'కూలీ'తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి 'కుబేర'.. బిగ్ స్క్రీన్పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?) -
మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్ను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది. -
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
ధనుష్, నాగార్జున, నటి రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రం కుబేర( Kuberaa). శ్రీవెంకటేశ్వర ఫిలింస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటి రష్మిక మందన్న( Rashmika Mandanna) మాట్లాడుతూ తనను ఈ చిత్రంలోకి ఆహ్వానించినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు ధనుష్తో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నాననీ, అయితే ఈ సారి పూర్తి ప్రేమ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత తదితర బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు ధనుష్ అంటూ ప్రశంసించారు. కుబేర అద్భుతమైన చిత్రం అని పేర్కొన్నారు. నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడుతూ అడయార్లో పుట్టి, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి, చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవితాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. చెన్నై ప్రేక్షకులు తనకు అందిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. కుబేర చిత్రం తరువాత రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఎదురు చూస్తోందని నాగార్జున పేర్కొన్నారు. నటుడు ధనుష్(Dhanush) మాట్లాడుతూ ఇది కలికాలం అనీ, వ్యతిరేకత, అసూయ పడేవారి కాలం అనీ, చెడు మంచి కంటే పెట్రేగిపోతోందని అన్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవత మాదిరి స్వచ్ఛమైన మనసు కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి పని చేసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్ కథపై అపార నమ్మకంతో ఈ చిత్రాన్ని బ్రహా్మండంగా నిర్మించారని పేర్కొన్నారు. -
అందరిని మెప్పించేలా 'కుబేర' కొత్త సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 20న కుబేర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. తాజాగా విడుదలైన 'అనగనగా కథ' పాటను చంద్రబోస్ రచించారు. హైడ్ కార్తీ, కరీముల్లా ఆలపించారు. -
ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుశ్పై ప్రశంసలు కురిపించారు.శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. "ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు. -
'అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి'.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈ మూవీ రిలీజ్కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్గా మాట్లాడారు.(ఇది చదవండి: శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!)ధనుష్ మాట్లాడుతూ.. "మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి 'కుబేర' లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 'అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025 -
కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?
మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.20 ఏళ్లకు విడాకులుసూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g— Rajinikanth (@rajinikanth) May 31, 2025 చదవండి: ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్ -
నాగార్జున ఫ్లాప్ సినిమా నచ్చిందంటున్న ధనుష్
నాగార్జున హీరోగా సినిమాలు చేయట్లేదు. అలా అని ఖాళీగా ఏం లేరు. కుబేర, కూలీ లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్తో కలిసి 'కుబేర'లో నటించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ధనుష్.. నాగ్తో పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు.నాగార్జునతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ధనుష్.. ఆయన సినిమాల్లో 'రక్షకుడు' అంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. దీంతో అసలు ఏంటి సినిమా అని కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో మాత్రం నాగ్ సినిమాలు చేశారు గానీ అప్పట్లో తమిళంలోనూ పలు చిత్రాలు చేశారు. అలాంటి ఓ మూవీనే రక్షకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)ప్రవీణ్ గాంధీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాని కుంజుమోన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైంది గానీ ఘోరమైన డిజాస్టర్గా నిలచింది. అక్కడక్కడ కొన్ని ఫ్యాన్ మూమెంట్స్... అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇది తప్పితే స్టోరీ పరంగా తేలిపోవడంతో ఫ్లాప్ అయింది. అలాంటి మూవీ ధనుష్కి నచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బయటపెట్టాడు.నాగ్ ప్రస్తుతం హీరోగా కంటే కీలక పాత్రలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చివరగా 'నా సామి రంగ' మూవీ చేశారు. తర్వాత అదిగో ఇదిగో అంటున్నారు గానీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు కుబేర, కూలీ లాంటి క్రేజీ మూవీస్ చేశారు. జైలర్ 2లోనూ నాగ్ విలన్గా చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. (ఇదీ చదవండి: 'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్) -
శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర బృందం టీజర్ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. -
అబ్దుల్ కలామ్ బయోపిక్లో ధనుష్.. పోస్టర్ విడుదల
జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కలాం’ అనే టైటిల్తో పాటు "ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే ట్యాగ్లైన్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘తానాజీ: ది అన్సంగ్ వారియర్’, ‘ఆదిపురుష్’ లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు.ఈ భారీ ప్రాజెక్ట్ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లతో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, నిర్మిస్తున్నారు. డాక్టర్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆవిష్కరించిన ‘కలాం’ సినిమా టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. డాక్టర్ కలాం సిల్హౌట్తో పాటు, ఒక మిస్సైల్ చిత్రం ఆవిష్కరణాత్మకంగా రూపొందించబడింది, ఇది ఆయన భారత మిస్సైల్ టెక్నాలజీకి చేసిన కృషిని సూచిస్తుంది.భారతీయ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన ధనుష్, డాక్టర్ కలాం పాత్రను పోషించేందుకు చాలా ఫిజికల్ బాడీ ట్రాన్స్ ఫర్ మిషన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించినా ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. ఈ చిత్రం డాక్టర్ కలాం జీవితాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవన ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప సినిమాగా రూపొందనుంది. -
రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్తో ఇప్పుడు కోలీవుడ్లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. -
ప్రేమ కబుర్లు?
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 20న విడుదల కానుంది.ప్రస్తుతం ఈ సినిమాపోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్, రష్మిక మాట్లాడుకుంటున్న ఓ కొత్తపోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ధనుష్, రష్మిక చిరునవ్వులు చిందిస్తూ, ఏవో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఈపోస్టర్ ఉంది. తమిళ్, తెలుగు,హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో (Retro Movie). ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో అతడి తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ చిత్రపరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా సూర్య కంటే ముందు ఎవరైనా సిక్స్ ప్యాక్తో రావడం చూశారా? అని ఓ ఈవెంట్లో ప్రశ్నించాడు.సిక్స్ ప్యాక్ ట్రెండ్ఇది విన్న సినీప్రియులు.. అదేంటి? కోలీవుడ్లో అంతకుముందే విశాల్ (Vishal) సిక్స్ ప్యాక్తో వచ్చాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. అసలు సిక్స్ప్యాక్ ట్రెండ్కు కోలీవుడ్లో నాంది పలికింది ఎవరన్న ప్రశ్నకు తాజాగా విశాల్ స్పందించాడు. మొదట్టమొదటిసారి ధనుష్ పొల్లాధవన్ మూవీలో సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత నేను సత్యం, మదగజరాజ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించాను. జనాలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటాను అని చెప్పుకొచ్చాడు.మర్చిపోయారా?వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'పొల్లాధవన్' 2007లో రిలీజైంది. ఇందులో ధనుష్ సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత విశాల్ 'సత్యం' సినిమాలో ఆరుఫలకల దేహంతో కనిపించాడు. ఈ మూవీ 2008 ఆగస్టులో విడుదలైంది. అనంతరం సూర్య.. 2008 నవంబర్లో వచ్చిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో తొలిసారి సిక్స్ప్యాక్ ట్రై చేశాడు. ఇక రెట్రో విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 న విడుదల కానుంది.చదవండి: అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..! -
అట్నే ఉండు
‘ఏ... వన్ డే హీరో నువ్వే ఫ్రెండు... నీ కోసమే డప్పుల్ సౌండు... అస్సల్ తగ్గక్... అట్నే ఉండు... మొక్కూతారు కాళ్లూ రెండు...’ అంటూ ఊర మాస్ పాట పాడారు హీరో ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా ముఖ్య తారలుగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ చిత్రంలో ‘పోయిరా మామా...’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా ధనుష్ పాడారు. శేఖర్ వీజే నృత్య రీతులు సమకూర్చారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 20న హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. -
కుబేర నుంచి ఫస్ట్ సాంగ్.. 'పోయిరా మావా' అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)- దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ ఆలపించగా భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ధనుష్కు జోడీగా రష్మిక నటిస్తుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తొలి పాటలోనే ఆయన మార్క్ చూపించారు. -
ఫుల్ మాస్...
అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో విజిల్ వేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు ధనుష్. ఫుల్ మాస్గా ఈ పాట ఉంటుందని సమాచారం. -
కోలీవుడ్లో విషాదం.. ధనుశ్తో సినిమా తీసిన డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్కు చెందిన ఎస్ఎస్ స్టాన్లీ( 57) అనారోగ్య సమస్యలతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 15న వలసరవక్కంలోని విద్యుత్ శ్మశానవాటికలో జరగనున్నాయి.కాగా.. స్టాన్లీ 'ఏప్రిల్ మాధతిల్', 'పుదుకోట్టైయిలిరుండు శరవణ్', 'మెర్క్యురీ పౌక్కల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2000ల దశకంలో పలు కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 'ఏప్రిల్ మాధతిల్' (2002)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ధనుశ్ హీరోగా నటించిన 'పుదుకోట్టైయిలిరుందు శరవణన్' మూవీకి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించడంతో పాటు 'నినైతలే ఇనిక్కుమ్', 'నన్బన్' వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో నటనలోకి అడుగుపెట్టారు. అతను చివరిగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రంలో కనిపించారు. -
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు). నటి రీమాసేన్, ఆండ్రియా కథానాయకిలుగా నటించిన ఇందులో పార్థిబన్ ముఖ్యపాత్రలు పోషించారు. సెల్వ రాఘవన్( Selvaraghavan) దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో విడుదలై అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సెల్వరాఘవన్ అప్పుడే ప్రకటించారు. అయితే, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కాగా 2021లో ధనుష్ కథానాయకుడిగా యుగానికి ఒక్కడు చిత్రానికి సీక్వెల్ చేస్తానని దర్శకుడు పేర్కొన్నారు. అది జరగలేదు. తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. యుగానికి ఒక్కడు సీక్వెల్ చేయాలని తనకు బలంగా ఉందని మరోసారి అన్నారు. అయితే ఆ చిత్రాన్ని చేయాలంటే భారీగా బడ్జెట్ అవసరం ఉందన్నారు. పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వస్తేనే సాధ్యం అవుతుందని తెలిపారు. అలా రూపొందే చిత్రంలో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రను పోషిస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. కానీ, మీరో కార్తీ(Karthi) లేకుండా మాత్రం ఈ సినిమా ఊహించుకోలేమన్నారు. ఆయన ఉంటేనే ఈ చిత్రానికి రెండవ భాగం రూపొందుతుందని సెల్వరాఘవన్ పేర్కొన్నారు. ఈ ఇద్దరు హీరోలు ఏడాది పాటు ఈ చిత్రానికి కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం కార్తీ, ధనుష్ ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే అనుమానం ప్రేక్షకులకు కచ్చితంగా కలుగుతుంది.7/జీ బృందావన కాలని సీక్వెల్పై కామెంట్స్కాగా ప్రస్తుతం దర్శకుడు సెల్వరాఘవన్ తాను ఇంతకుముందు తెరకెక్కించిన 7/జీ బృందావన కాలని 2 చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికీ 50 శాతం పూర్తి చేసుకుందని సమాచారం. 'రవికృష్ణ హీరోగా పార్ట్ 1 క్లైమాక్స్లో కదీర్ (హీరో పాత్ర పేరు)కు జాబ్ రావడం ఆపై అతను ఒంటరిగా మిగిలిపోవడం వరకు మాత్రమే చూపించాం. ఆ తర్వాత పదేళ్లలో అతని జీవితం ఎలా సాగిందనే అంశాలతో సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ కథ ఎలా ఉంటుందో పార్ట్ 1లో క్లూ ఇచ్చాం. అఇయతే, ప్రస్తుత రోజుల్లో దీనిని చిన్న చిత్రంగా విడుదల చేయలేం' అని అన్నారు. -
ఇడ్లీ కొట్టు వాయిదా
ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. ఈ చిత్రంలో ధనుష్కి జోడీగా నిత్యా మీనన్ నటించారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ మూవీ నిర్మించారు. ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్ని ప్రకటిస్తూ, ధనుష్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ నటించిన రెండో చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ పోస్ట్ప్రోడక్షన్ పనులు పూర్తి కానందునే వాయిదా వేశారని కోలీవుడ్ టాక్. -
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (Nilavuku En Mel Ennadi Kobam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అనేది 24 కళలతో రూపొందేది. అంటే 24 కళలకు సంబంధించిన కళాకారులు ఓ సినిమా కోసం పని చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మల్టీ టాలెంటెడ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 24 కళలలో ఓ మూడు నాలుగు కళలు ఒక్కరే చేసేస్తున్నారు. అలా సినిమాలోని కొన్ని శాఖలను ఒక్కరే చేసి, ఓ సినిమాకి సింగిల్ కార్డుతో 80వ దశకంలోనే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారు శ్రీకారం చూట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది.‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ అనేది ఓ తమిళ సినిమా. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అన్నది తెలుగు డబ్బింగ్ వెర్షన్. ప్రముఖ హీరో ధనుష్ తాను కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను రాసిన కథకు తానే నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఇది ఓ రకంగా రిస్క్ అనే చెప్పాలి. అయినా ఈ సినిమాని మాత్రం ఈ తరం యంగ్ జనరేషన్తో పాటు నిన్న, మొన్నటి తరాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దారు ధనుష్. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను కదలనివ్వదు. అంత ప్లెజెంట్గా ఉంటుంది.సినిమా టైటిల్ కూడా కొంటెగా పెట్టడంలోనే తెలిసిపోతుందీ సినిమా విషయం. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో లభ్యమవుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రభు ఓ మంచి చెఫ్. తన గర్ల్ఫ్రెండ్ నిలాతో విడిపోయిన తరువాత ప్రభు తల్లిదండ్రులు ప్రీతితో వివాహం నిశ్చయించి, సంబంధం కుదుర్చుకోవడానికి ప్రీతి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ప్రీతికి నిలా కథ చెబుతాడు. నిలా, ప్రభు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీలో కలిసి ప్రేమలో పడతారు. ఓ అనుకోని సంఘటన వల్ల నిలాకి దూరమవుతాడు ప్రభు. దాంతో నిలాకి కోపమొచ్చి తండ్రి చూసిన సంబంధానికి తలూపుతుంది. నిలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని స్నేహితులందరినీ గోవాకి పిలుస్తుంది. నిలా పెళ్లి ఆహ్వానం ప్రభుకి కూడా అందుతుంది. ప్రభు ఫ్రెండ్స్ అందరూ అతన్ని వారించినా నిలా పెళ్లికి వెళతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రభుకి అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? తరువాత ప్రీతి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. ఇది చాలా సింపుల్ స్టోరీ. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నారు ధనుష్. ఈ సినిమాలోని పాత్రధారులంతా ఫ్రెష్గా అనిపించడంతో పాటు ప్రతి పాత్ర ప్రేక్షకులను కనువిందు చేస్తుందనే చెప్పాలి. హ్యాట్సాఫ్ టు ధనుష్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఇడ్లీ కొట్టు మూవీ వాయిదా.. ఏకంగా ఆరు నెలలు తర్వాత!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం ఇడ్లీ కడై(తెలుగులో ఇడ్లీ కొట్టు) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది రాయన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టార్ కొత్త ఏడాదిలో స్వీయ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. 'తిరుచిత్రంబలం' ఈ జంట మరోసారి అభిమానులను మెప్పించనుంది. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్ పతాకాలపై ధనుశ్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. ఇడ్లీ కడై సినిమాను అక్టోబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మూవీ వాయిదా వేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.అయితే ఈ ఏప్రిల్ 10వ తేదీన అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అందువల్లే ఇడ్లీ కడై సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా ఆరు నెలల వరకు రిలీజ్ వాయిదా వేయడమే అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది.కాగా.. ఇడ్లీ కడై మూవీని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, రాజ్కిరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. The wait is over! 🍿🔥 Experience #IdlyKadai on the big screen worldwide from October 1st! A Film by @dhanushkraja A @gvprakash MusicalProduced by @AakashBaskaran & #Dhanush @Kiran10koushik #PrasannaGK @jacki_art @PeterHeinOffl #BabaBaskar @kavya_sriram #PraveenD #Nagu… pic.twitter.com/kjfDcZGUZ1— Wunderbar Films (@wunderbarfilms) April 4, 2025 -
OTT: సడెన్గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్లో సడెన్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు. -
ధనుష్ దర్శకత్వంలో అజిత్ సినిమా ?
-
అజిత్ నీ డైరెక్ట్ చేయబోతున్న ధనుష్
-
సీనియర్ హీరోతో 'మమితా బైజూ' రొమాన్స్
కాలాల మాదిరి హీరోయిన్లకు ఒక సీజన్ ఉంటుందనిపిస్తోంది. తెలుగు పరిశ్రమలో మాదిరే కోలీవుడ్లో కూడా ఇప్పుడు యువ హీరోయిన్ల సీజన్ నడుస్తోందనే చెప్పవచ్చు. ప్రేమలు చిత్రానికి ముందు మమితా బైజూ(Mamitha Baiju) చిన్న చిన్న పాత్రల్లోనే నటించింది. ఆమె కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం ప్రేమలు చిత్రమే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్, టాలీవుడ్ల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా రెబల్ చిత్రం ద్వారా కోలీవుడ్కు నాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినా, ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న జననాయకన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అదేవిధంగా విష్ణువిశాల్కు జంటగా ఇరండు వానం చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా డ్రాగన్ చిత్ర హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన ఒక చిత్రంలో నటించే అవకాశం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు సమాచారం. కాగా తాజాగా ధనుష్తో రొమాన్స్ చేసే లక్కీచాన్స్ మమితా బైజూను వరించినట్లు తెలిసింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్. కాగా ప్రస్తుతం ఇడ్లీ కడై చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న కుబేర చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్రను పోషించగా, రష్మిక మందన్నా నాయకిగా నటించారు. ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ మరో తమిళ చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. దీన్ని పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించినున్నారని, ఈ క్రేజీ భారీ యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రాన్ని డా.ఐసరి గణేశ్ తన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో కథానాయకుడికి దీటుగా కథానాయకి పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు నటి మమితాబైజూను ఎంపిక చేసినట్లు ప్రచారం సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ స్టోరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ గతనెల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లో రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?)అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21 నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాను వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించిన సంగతి తెలిసిందే. -
సోషల్మీడియాను షేక్ చేసిన సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గోల్డెన్ స్పారో' సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది. నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే, ఒక ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.ఈ మూవీలో ‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలయ్యే ఒక హిట్ సాంగ్ తాజాగా వీడియో వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ హిట్ సాంగ్ను జీవీ ప్రకాష్ కుమార్తో సుబ్లాషిణి, ధనుష్, అరివు ఆలపించారు. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. -
ధనుష్ దర్శకత్వంలో అజిత్
-
మరో ఓటీటీకి ధనుశ్ హాలీవుడ్ మూవీ.. దాదాపు ఆరేళ్ల తర్వాత!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2019లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో ధనుశ్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రం కోలీవుడ్ హీరో మెజీషియన్ పాత్రలో కనిపించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం యాపిల్ టీవీ ప్లస్లో మాత్రమే అందుబాటులో ఉంది.తాజాగా ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మూవీని మరో ఓటీటీలో సందడి చేయనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు మూవీ పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఈ సినిమాకు కెన్ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో ధనుష్ నటనకు హాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ధనుష్ అజాత శత్రు అనే మెజీషియన్ పాత్రలో నటించారు. రొమైన్ ప్యుర్తోలస్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. ధనుశ్ పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?
విదాముయార్చి మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వేసవిలో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది.అయితే అదే రోజు ధనుశ్ హీరోగా నటిస్తోన్న ఇడ్లీ కడై విడుదల కానుంది. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు కావడంతో ఇడ్లీ కడై మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇడ్లీ కడై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. తిరుచిత్రంబలం మూవీ తర్వాత ధనుశ్, నిత్యా మీనన్ మరోసారి జంటగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ధనుశ్ డైరెక్షన్లో అజిత్ కుమార్ నటించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ధనుశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్బార్ పిక్చర్స్ బ్యానర్లో అజిత్ కుమార్ నటించే అవకాశం ఉందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
ధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్పై చూసినప్పుడు ధనుష్ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది. ఎవర్నీ కాపీ కొట్టట్లేదుఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు. నా కళ్లకు ప్రదీప్లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనంఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్ -
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర టీమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్లో నాగార్జున్, ధనుశ్తో పాటు బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A story of power..👑A battle for wealth..💰A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. @dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation pic.twitter.com/OUATNh4iES— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 27, 2025 -
'కుబేర'కు టైటిల్ కష్టాలు..
ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ వివాధంలో చిక్కుకుంది.కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్కు కాపీ చేసుకుని టైటిల్కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ధనుష్
-
వేసవిలో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు ’
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు. -
`జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ క్రికెటర్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్కి తీసుకొచ్చారు రామ్చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్గా కెరీర్ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
నో కాంప్రమైజ్ అంటున్న శేఖర్ కమ్ముల: Kubera Movie
-
తేదీ మారలేదు
ధనుష్(Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)(తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం). నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్ర ఖని, రాజ్ కిరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్తో కలిసి ధనుష్ నిర్మిస్తున్న మూవీ ఇది. కాగా ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే ప్రచారం జరిగింది. అయితే ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10నే రిలీజ్ చేస్తామన్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అనుకున్నట్లే ‘ఇడ్లీ కడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లుగా స్పష్టమైపోయింది. ఇక ధనుష్ దర్శకత్వంలోని మరో మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా...’ అనే టైటిల్తో రిలీజ్ కానుంది. -
స్టార్ హీరోను లాక్ చేయనున్న 'లోకేశ్ కనకరాజ్'
కోలీవుడ్ నటుడు ధనుష్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించనున్నారని కోలివుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం రానున్నడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. కోలీవుడ్లో మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. తరువాత కార్తీ హీరోగా ఖైదీ–2తోపాటు మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కాగా నటుడు ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తమిళంలో పాటు, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లోనూ కథానాయకుడిగా నటిస్తూ వరల్డ్ స్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా మరిన్ని చిత్రాల్లో ధనుష్ నటించనున్నారు. తాజాగా ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ కనకరాజ్ నటుడు ధనుష్ను కలిసి కథను వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబినేషనల్ తెరకెక్కనున్న చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ధనుష్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం కమిటైన చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు
ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్ కృతీ సనన్(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్స్టోరీ ‘తేరే ఇష్క్ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు.కాగా ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘శంకర్... (ధనుష్ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్ హిందీలో డైలాగ్స్ చెబుతూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
ధనుష్ హానెస్ట్ రాజ్?
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
కేజీఎఫ్ నేపథ్యంలో...
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ కాంబినేషన్లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్’ (2019) వంటి సక్సెస్ఫుల్ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్లో 25 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆడియన్స్కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్–వెట్రిమారన్ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. కాగా ధనుష్తో వెట్రిమారన్ చేయనున్న మూవీ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్ సమాచారం. -
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
జూన్లో కుబేర?
జూన్లో థియేటర్స్లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి తాజాగా ధనుష్తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
నటుడు చంద్రబాబు బయోపిక్లో ధనుష్
ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషకం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటుడి బయోపిక్ను తెరకేక్కించేందుకు గోపాల్ వన్ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు రామన్ తేడియ సీతై, చారులత, అలోన్, నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. కాగా తాజాగా రచయిత దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని ఆయనతోపాటు యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చంద్రబాబుకు తాము సమర్పించే మర్చిపోలేని అంజలిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అదేవిధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందన్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్లో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ఇప్పటికే ఇళయరాజా బయోపిక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు బయోపిక్లో తాను నటిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ధనుష్తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార
కోలీవుడ్లో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివనన్పై ధనుష్ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్ను కోరింది. అయితే, తాజాగా సోషల్మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్ను టార్గెట్ చేసే నయన్ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.కోలీవుడ్లో నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్పై నయన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ను హెచ్చరిస్తూ నయన్ ఇలా పోస్ట్ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్ను నయన్ పంచుకుంది.సోషల్మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్లో మాత్రం ధనుష్ను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన ఫుటేజ్ను నయన్ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
మళ్లీ మొదటికి వచ్చిన ధనుష్.. నయనతారకు షాక్
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా.. నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్లో నయనతార, విఘ్నేష్ శివన్ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల నయన్ తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్ఫ్లిక్స్లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్ఫ్లిక్స్కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి -
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్కు ధనుష్ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్తో ఆమె సౌత్ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్కు మద్ధతుగా ధనుష్పై ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబ్ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే.. మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స మండి పడుతున్నారు. ధనుష్పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.ధనుష్ నిర్మాతగా ఉన్న 'నానుమ్ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్పై కాపీరైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. -
ధనుష్ క్యారెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసిన నయనతార
-
మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదు: విఘ్నేష్ శివన్
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు. మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ)ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నయనతారను 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్
-
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
జైలర్తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. దీంతో రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
రజినీకాంత్తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు. -
ధనుష్ లో ఎక్కడలేని జోష్..
-
ధనుష్ ఇడ్లీ కొట్టు!
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే టైటిల్ ఖరారైంది. గురువారం ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ధనుష్ కెరీర్లోని ఈ 52వ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ నిర్మించనున్నారు. ‘‘మా డాన్ పిక్చర్స్ సంస్థలోని తొలి సినిమాకే ధనుష్గారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఈ సినిమా ఓ మైల్స్టోన్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు ఆకాశ్ భాస్కరన్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: కిరణ్ కౌశిక్. -
వారికి కృతజ్ఞతలు.. రెడ్కార్డ్ ఎత్తివేతపై ధనుష్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ ప్రయోగించిన రెడ్కార్డ్ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో నడిగర్ సంఘం చర్చలు జరిపి ధనష్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ధనుష్పై తమిళ నిర్మాత మండలి రెడ్ కార్డ్ ప్రయోగించిన వెంటనే నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తప్పుబట్టారు. నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీకి చాలా నష్టమని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ వల్ల ఇబ్బుందులు పడుతున్నామని ఆరోపించిన త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ అధినేతలతో చర్చలు జరిపారు. దీంతో గతంలో వారి నుంచి తీసుకున్న డబ్బు ధనుష్ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పడంతో లైన్ క్లియర్ అయింది.ఇదే విషయం గురించి ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా నిర్మాతలు,త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నాకు అండగా నిలిచిన నడిఘర్ సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజాయితీగా సమస్యను పరిష్కరించారు. దీంతో మేము కొత్త సినిమా ప్రాజెక్ట్ను వెంటనే తిరిగి ప్రారంభించకలిగాము. నాజర్, కార్తీ,విశాల్, కరుణాస్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్యలను పరిష్కరించి మాకు సహాయపడటమే కాకుండా పరిశ్రమకు మంచి ఉదాహరణగా నిలిచారు.' అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. -
ధనుష్ప నిషేధం ఎత్తివేత
-
ధనుష్పై రెడ్కార్డ్ ఎత్తివేత.. కొత్త ప్రాజెక్ట్లకు లైన్ క్లియర్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ రెడ్కార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే, ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్పై రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు గతంలో TFPC పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్ ఫిల్మ్స్తో సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్లు TFPC తెలిపాయని సమాచారం. అయితే, కొన్ని షరతులపై ధనుష్ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేయబడిందని సమాచారం. -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
ధనుశ్–మహిత్ జోడీ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ బధిరుల షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకున్నాడు. జర్మనీలోని హనోవర్లో జరుగుతున్న ఈ టోర్నీనలో ధనుశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ధనుశ్ శ్రీకాంత్–మహిత్ సంధూ (భారత్) ద్వయం 17–5తో భారత్కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ ముర్తజా జంటపై గెలిచింది.ధనుశ్–మహిత్ జోడీ క్వాలిఫయింగ్లో 628.8 పాయింట్లు స్కోరు చేసి బధిరుల షూటింగ్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభినవ్ దేశ్వాల్–ప్రాంజలి ధూమల్ జంట రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అభినవ్–ప్రాంజలి ద్వయం 7–17తో ఒలెక్సిల్ లేజ్బింక్–ఇనా అఫోన్చెంకో (ఉక్రెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ముగిశాక భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలున్నాయి. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'రాయన్' మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
'రాయన్'తో లాభాలు.. ధనుష్కు గిఫ్ట్గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్గా తన ప్రతిభను రాయన్లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'రాయన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్గా కూడా ధనుష్ మెప్పించాడు. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే, సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాయన్ సినిమా ఆగష్టు 23న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఆ సంస్థ లాభాలను అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్గా నిలిచింది. సౌండ్ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట సంచలనంగా మారింది. -
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
రాయణ్ బ్లాక్ బస్టర్.. దూకుడు పెంచిన ధనుష్..
-
ధనుష్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ
ఎన్ని సమస్యలొచ్చినా.. తానుమాత్రం తగ్గేదేలే అంటున్నారు నటుడు ధనుష్. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. ఇది ఆయన 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇలా నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగా సత్తా చాటుకుంటున్న ధనుష్కు కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన ఈయన మరోసారి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఆయన నటించిన షమితాబ్, రాంజానా వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్తో ధనుష్కు మంచి బౌండింగ్ ఉంది.ఇంతకు ముందు వీరి కాంబోలో రూపొందిన రాంజానా చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరు కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఇందులో ధనుష్కు జంటగా బాలీవుడ్ క్రేజీ నటి కృతీసనన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే తెలుగులో మహేశ్బాబు సరసన నేనొక్కడినే, ప్రభాస్కు జంటగా ఆదిపురుష్ చిత్రాల్లో నటించారు. తాజాగా ధనుష్తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ధనుష్కి జోడీగా..?
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి. -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ధనుష్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి
ధనుష్.. ఇటీవల రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ధనుష్ బావ డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్(సోదరి కార్తీక భర్త) తొలిసారి ఈ మూవీలో నటించాడు. అది కూడా పోలీస్గా..! తాజాగా కార్తీక.. తన భర్త పోలీస్ గెటప్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.డాక్టర్తో యాక్టింగ్రాయన్.. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని, ఈ ఫోటోలు షేర్ చేయాలని ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నాను. డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్.. ఒక పేరున్న డాక్టర్, కార్డియాలజిస్ట్. నా సోదరుడు ధనుష్ 50వ సినిమాలో ఈయన ఒక చిన్న పాత్ర చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ధనుష్కు ఈయనలో ఏం కనిపించింది? తనను తీసుకోవడమేంటి? అని షాకయ్యాను. ఏం జరుగుతుందో చూద్దామని ఆతృతగా ఎదురుచూశాను. మురిసిపోయాధనుష్.. తన సహనటులను డైరెక్ట్ చేయడం కళ్లారా చూసి మురిసిపోయా.. ఒక డాక్టర్తో కూడా యాక్టింగ్ చేయించగలిగాడంటే తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నా భర్తను వెండితెరపై చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అంత మంచి పాత్రలో కనిపించాడంటే ఆ క్రెడిట్ అంతా ధనుష్కే దక్కుతుంది. సంతోషంగా ఉందిఅంజీ చాలా బాగా నటించాడు. ధనుష్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన మూవీలో ఈయన భాగమవడం గౌరవప్రదంగా ఉంది. ఇందుకు నా తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక సోదరిగా, భార్యగా సంతోషంగా ఉంది. రాయన్ టీమ్కు థ్యాంక్స్.. అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Karthika Krishnamoorthy (@dr.karthikakarthik) చదవండి: అంతకుమించి వేదా ఉంటుంది -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
రాయన్ను అభినందించిన మహేశ్ బాబు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. విడుదల సమయంలో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. అందుకే రాయన్ టీమ్పై అభినందనల వెల్లువ వస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై అయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్గా డైరెక్ట్ చేశారు. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. SJ సూర్య, ప్రకాశ్ రాజ్,సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. మూవీ టీమ్కు కంగ్రాట్స్' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ధనుష్ కూడా రియాక్ట్ అయ్యారు. 'మీ ప్రశంసలతో మా టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు' అంటూ తెలిపారు. ఎస్.జే సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కూడా మహేశ్ బాబుకు తిరిగి సమాధానంగా కృతజ్ఞతలు తెలిపారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ధనుష్ 50వ సినిమాగా రాయన్ సినిమా తెరకెక్కింది. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. దీంతో తొలి మూడురోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్తో పాటు తెలుగులో కూడా రాయన్ చిత్రానికి మంచి ఆదరణ లభించడం విశేషం.#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch… Congratulations to the entire…— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024 -
ధనుష్కు మద్ధతుగా నిలిచిన నడిగర్ సంఘం
తమిళ టాప్ హీరో ధనుష్పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్లు తీసుకొని ఆపై షూటింగ్స్కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్కు మద్ధతుగా నిలిచింది.ధనుష్తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. -
సరికొత్త కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.ఆదివారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కుబేర’ సినిమా నుంచి ధనుష్ కొత్తపోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ధనుశ్ బర్త్ డే స్పెషల్.. ఈ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. -
ట్రెండ్ ఫాలో అయిన ధనుష్.. 50వ చిత్రం సూపర్ హిట్..
-
ధనుష్ పుట్టినరోజు స్పెషల్.. సోదరీమణులతో ఫోటోలు వైరల్
-
'రాయన్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అక్కడ కేవలం రూ. 20 లక్షలే
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్'. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న విడుదలైన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించేలా రాయన్ ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ యాక్టర్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను రాయన్ చేరుకోలేకపోయింది.రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాపై మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ రాయన్కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయని తెలుస్తోంది. ధనుష్కి తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సార్, తిరు లాంటి సినిమాలతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రాయన్ మూవీ విడుదలైన తొలి రోజు భారత్లో రూ. 13.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా తమిళ వెర్షన్కు రూ. 11.85 కోట్లు వచ్చాయి. అయితే హిందీ నుంచి కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్గా ధనుష్ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్