Anu Emmanuel
-
సిడ్నీలో సమంత చిల్.. మాల్దీవుస్లో సాక్షి అగర్వాల్!
సిడ్నీ వైల్ట్ లైఫ్ పార్క్లో చిల్ అవుతోన్న సమంత..హీరోయిన్ శ్రద్దాదాస్ గ్లామరస్ పిక్స్...పింక్ డ్రెస్లో రకుల్ ప్రీత్ సింగ్ హోయలు..మాల్దీవుస్ వీడియోను షేర్ చేసిన సాక్షి అగర్వాల్..శారీలో టాలీవుడ్ యాంకర్ లాస్య మంజునాథ్ పోజులు..టీ గ్లాస్తో అను ఇమ్మానియేల్ అలాంటి లుక్.. View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
అను ఇమ్మాన్యుయేల్ సైకలాజికల్ థ్రిల్లర్.. టీజర్ గ్లింప్స్ చూశారా?
అను ఇమ్మాన్యుయేల్, శివకందుకూరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బూమరాంగ్ (Boomerang Movie). ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బూమరాంగ్ టీజర్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ చిత్రాన్ని ఓ సందేశాత్మక సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆండ్రూ బాబు దర్శకత్వం వహించారు. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీసినట్లు డైరెక్టర్ వెల్లడించారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రోడక్షన్ బ్యానర్పై లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
అనూ ఇమ్మాన్యుయేల్ కొత్త సినిమా వివరాలివే
అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో, శివ కందుకూరి మరో లీడ్ రోల్ ఓ థ్రిల్లింగ్ మూవీ తెరకెక్కుతోంది. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై 3 ఆర్ట్స్ పతాకాలపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న సినిమా ఇది. బుధవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, లండన్ లొకేషన్స్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని యూనిట్ తెలిపింది. ‘‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. వైవా హర్ష, వెన్నెల కిశోర్, ఎస్. నివాసిని, ‘షకలక’ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్. -
చీరలో అను అందం.. సెల్ఫీతో క్యూట్గా రమ్య!
పట్టుచీరలో బుట్టబొమ్మలా నభా నటేశ్ఒయ్యారాలతో వావ్ అనిపిస్తున్న బిగ్ బాస్ స్రవంతి'మిస్టర్ బచ్చన్' జ్ఞాపకాల్లోనే హాట్ బ్యూటీ భాగ్యశ్రీసోదరుడి నిశ్చితార్థంలో హీరోయిన్ ప్రియాంక చోప్రాచీరలో అందాలన్నీ చూపించేస్తున్న అను ఇమ్మాన్యుయేల్పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అమీ జాక్సన్ఫారెన్ ట్రిప్ ఫొటోలతో బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్లర్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mangli chauhan (@iammangli) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
ప్రాపర్టీ షోలో నటి అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫొటోలు)
-
Anu Emmanuel: అందానికి చీర కడితే అను ఇమ్మాన్యుయేల్లా ఉంటుందేమో (ఫోటోలు)
-
Anu Emmanuel Pics: అను ఇమ్మాన్యుయేల్ టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలు)
-
Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ
టైటిల్: జపాన్ నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు దర్శకత్వం: రాజు మురుగన్ సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్ని పోలీసులు పెట్టే టార్చర్ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది. హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్కు గురిచేస్తాయి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. పోలీసు అధికారి శ్రీధర్గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్ విజయం ఖాయం: కార్తీ
క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్, సర్థార్, పొన్నియిన్సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని ,రవివర్మన్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్, విజయ్ మిల్టన్ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. -
చిల్ అవుతున్న వరలక్ష్మీ.. లుక్ మార్చిన నభా
బీచ్లో చిల్ అవుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ బ్లాక్ డ్రస్లో రెచ్చిపోయిన హీరోయిన్ తమన్నా 'జపాన్' సినిమాతో వచ్చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ భూటాన్లో చికిత్స తీసుకుంటున్న హీరోయిన్ సమంత పసుపు పచ్చ రంగు డ్రస్లో మెరిసిపోతున్న శ్రీలీల షాడో వెలుగులో మతి పోగొడుతున్న నభా నటేశ్ జిగేలు మంటున్న బుల్లితెర బ్యూటీ నియా శర్మ బర్త్డే సెలబ్రేషన్స్లో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
'జపాన్'లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను: అను ఇమ్మాన్యుయేల్.
హీరో కార్తిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. అతను గొప్ప నటుడు మాత్రమే కాదని,ఆఫ్ స్క్రీన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అంటోంది. కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్.. 'దీపావళి' కానుకగా నవంబర్ 10న విడుదత కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో ముచ్చటిస్తూ.. హీరో కార్తి గురించి, జపాన్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ► కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్. ఆఫ్ స్క్రీన్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతాడు. స్టార్లా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ► 'జపాన్'ట్రైలర్ చూస్తేనే ఇదొక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ► ఈ చిత్రంలో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ► రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ►నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను -
జపాన్ సంతృప్తి ఇచ్చింది
‘‘మా డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ‘జపాన్’ సినిమా పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 10న విడుదలవుతోంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ–‘‘రాజు మురుగన్ ఏదైనా విషయాన్ని నవ్విస్తూనే ఆలోజింపజేసేలా చెబుతారు. ‘జపాన్’ లో మానవత్వం గురించి చెప్పారు. ఇందులో కార్తీగారి జపాన్ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. నాగార్జునగారు ‘జపాన్’ టీజర్, ట్రైలర్ చూసి ‘ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎలా చేయగలుగుతున్నావ్’ అంటూ కార్తీగారిని అభినందించారు. సినిమా విషయంలో నిర్మాత సుప్రియగారు, మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి’’ అన్నారు. -
Anu Emmanuel: ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన అనూ ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
కార్తీ ‘జపాన్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు
‘‘ఈగ’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత నేను ఎప్పుడు చెన్నై వెళ్లినా.. నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు. అలాగే కార్తీని చూస్తే చాలామంది తెలుగు ప్రేక్షకులు తెలుగబ్బాయిలా ఉన్నాడంటారు. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు కార్తీని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హిట్స్ సాధించి ఇప్పుడు ‘జపాన్’తో ముందుకొస్తున్నాడు కార్తీ. దీపావళికి వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో నాని అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ – ‘‘జపాన్’ లాంటి చిత్రం తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభం కాదు. కానీ, ఈ మూవీ ట్రైలర్ చూశాక టీమ్ ఎనర్జీ, నమ్మకం నాకు కనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్ నా ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ‘జపాన్’ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో భాగస్వామ్యం అయినట్లు అనిపించింది. ప్రభుగారు మంచి సినిమాలు నిర్మిస్తుంటారు. లెక్కలు చూసుకుని పని చేసే నిర్మాత కాదు.. ఫ్యాషన్తో,ప్రాణం పట్టి పనిచేసే నిర్మాతలాగా అనిపిస్తారు. ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ రాజు మురుగన్కి అభినందనలు’’ అన్నారు. ‘‘జపాన్’ నా మనసుకు బాగా దగ్గరైంది’’ అన్నారు కార్తీ. ‘‘జపాన్’ అంతా రాజు మురుగన్ శైలిలో ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎస్ఆర్ ప్రభు అన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘కళకు భాషతో సంబంధం లేదు. తెలుగు ప్రేక్షకులు సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. భారతీయ సినిమాకి ఐకానిక్గా గుర్తింపు పోందింది టాలీవుడ్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు సునీల్, రాకేందు మౌళి, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
కార్తీ 'జపాన్' గుర్తుండేలా.. వాళ్లకు రూ 1.25 కోట్ల విరాళం
కార్తీక్ శివకుమార్... ముద్దుగా కార్తీ అని అభిమానులు పిలుస్తుంటారు.. తమిళనాడులో తనకు ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారో టాలీవుడ్లో కూడా అదే రేంజ్లో ఉన్నారు. వరుస హిట్ సినిమాలు చేస్తూ.. తన అభిమానులకు ట్రీట్ ఇస్తున్న కార్తీ.. గతేడాది పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో మెప్పిస్తే.. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో అదిరిపోయే హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. దివాళి సందర్భంగా కార్తీ నటించిన 25వ సనిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ కెరియర్లో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ లాంటిది. కాబట్టి ఈ సినిమా తన అభిమానులకు మరింత స్పెషల్గా ఉండాలని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. (ఇదీ చదవండి: ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి.. నేను లోకేష్ కనగరాజ్ కాదు: సాయి రాజేష్) తన అన్నయ్య సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని కార్తీ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా రూ. 1.25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. జపాన్ తన కెరియర్లో 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, 25 పాఠశాలను సెలెక్ట్ చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష రూపాయలు. అలాగే 25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేశారు. మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు పేదవారికి అన్నదానం చేయాలని ఆయన ఏర్పాట్లు చేశారు. వీటిలో ఇప్పటికే అన్నదానం కార్యక్రం జరుగుతుంది. కనీస అవసరాల కోసం 25 ఆస్పత్రులు,స్కూళ్లను గుర్తించి వాటికి లక్ష రూపాయల చొప్పున కార్తీ సాయం చేయనున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న జపాన్ సినిమాలో కార్తీ దొంగగా నటిస్తున్న విషయం తెలిసిందే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12న దివాళీ సంబర్భంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) -
హీట్ పెంచిన హాట్ బ్యూటీ.. అలా కాక రేపుతున్న ఐశ్వర్య!
హాట్నెస్ పెంచుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ ఎర్ర చీరలో క్యూట్గా అను ఇమ్మన్యుయేల్ స్కిన్ టైట్ డ్రస్ లో కాక రేపుతున్న దక్ష సెలబ్రేషన్ చేసుకుంటున్న హీరోయిన్ మెహ్రీన్ అందాల విందు చేస్తున్న ఐశ్వర్యా మేనన్ డిఫరెంట్గా కనిపించిన హీరోయిన్ శ్రుతిహాసన్ స్విమ్ సూట్లో అబ్బా అనిపిస్తున్న హంస నందిని గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
జపాన్ ట్రైలర్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి
పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్లో తెలుస్తుంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో ఉంది. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
కార్తీ 'జపాన్' సినిమా కోసం నాగార్జున కీలక నిర్ణయం
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్లో ఇదొక బెంచ్మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు. తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
జపాన్ రేంజే వేరు
‘హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఆర్డర్ లాఠీ ఊపుతూ కూర్చుందా?’ అనే డైలాగ్తో ‘జపాన్’ చిత్రం టీజర్ విడుదలైంది. కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్పై ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ని బుధవారం విడుదల చేశారు. ‘‘ఇండియా అంతటా జపాన్పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయి. నాలుగు రాష్ట్రాల పొలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ, ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు’, ‘జపాన్ రేంజే వేరు’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
'జపాన్' ఓ క్రేజీ దొంగ.. టీజర్ మాత్రం అదిరింది!
హీరో కార్తీ మంచి నటుడు. పేరుకే తమిళ హీరో కానీ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. కార్తీ నుంచి ఓ మూవీ వస్తుందంటే చాలా మన ఆడియెన్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే కాన్సెప్టులు కాస్త డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు 'జపాన్'గా మాములు సందడి చేయలేదు. (ఇదీ చదవండి: భగవంత్ కేసరి సినిమా రిలీజ్కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) టీజర్ ఎలా ఉంది? కార్తీ హీరోగా నటిస్తున్న 25వ సినిమా 'జపాన్'. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్లో భాగంగా కథేంటి? సినిమా ఎలా ఉండబోతుందనేది ఆల్మోస్ట్ చెప్పేశారు. కార్తీ లుక్ దగ్గర నుంచి డైలాగ్ మాడ్యులేషన్ వరకు అన్నీ వింటేజ్ స్టైల్లో డిఫరెంట్గా ఉన్నాయి. బంగారం దొంగతనం, బంగారు పళ్లతో కార్తీ కనిపించడం అన్నీ చూస్తుంటే.. 'జపాన్' బంగారం చుట్టూ తిరిగే ఓ యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. కథేంటి? 'జపాన్' అనే దొంగ. రూ.200 కోట్ల విలువైన నగల్ని ఓ బంగారం షాప్ నుంచి దొంగిలిస్తాడు. అతడిపై అప్పటికే 182 కేసులు ఉంటాయి. 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుంటారు. ఇక మనోడికి గోల్డ్, అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అలాంటోడు పోలీసులు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథలా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే ఈసారి కార్తీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్ చివర్లో.. 'రేయ్ ఎన్ని బాంబులేసిన ఈ జపాన్ని ఎవరూ ఏం పీకలేరురా' అని కార్తీ చెప్పిన డైలాగ్ వెరైటీగా ఉంది. (ఇదీ చదవండి: కార్తీ 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
Anu Emmanuel: వికారాబాద్ లో సినీ తార అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫోటోలు)
-
షాపింగ్మాల్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
డబ్బింగ్ షురూ
కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్’ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ‘జపాన్’ చిత్రంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. -
ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్
సినీ పరిశ్రమలో సర్దుకుపోవడం (కాస్టింగ్ కౌచ్) అనే పదం ఇటీవల మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. నటి అను ఇమ్మానుయేల్ కూడా అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయింది. ఆ తర్వాత 2016లోనే 'నాని' కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంలో కిరణ్మై పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన 'నమ్మవీట్టు పిళ్లై' చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆ చిత్రం విజయాన్ని సాధించిన అను ఇమ్మానుయేల్ను మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి. తాజాగా కార్తీక్ జంటగా 'జపాన్' చిత్రంలో నటించింది. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ. అను ఇమ్మానుయేల్ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!
కోలీవుడ్లో పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన కార్తీ ఇప్పటికి 24 చిత్రాల్లో నటించారు. వీటిలో 90 శాతం హిట్ చిత్రాలు కావడం విశేషం. ఇటీవల కార్తీ నటించిన విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు వరుసగా విడుదలై హిట్ కావడంతో హ్యాట్రిక్ సాధించారు. కాగా తాజాగా తన 25వ చిత్రం జపాన్ పూర్తి చేశారు. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి అనూ ఇమాన్యుల్ నాయకిగా నటిస్తున్న జపాన్ చిత్ర టైటిల్కు విశేష స్పందన వచ్చింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) అదేవిధంగా ఇందులో కార్తీ వివిధ గెటప్పులు ధరించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కాగా దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కాగా విచిత్ర వ్యాపారం ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. జపాన్ చిత్ర ప్రీ బిజినెస్ మాత్రమే రు.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి: ఫీమేల్ గెటప్లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు) ఇప్పటివరకు కార్తీ నటించిన చిత్రాలన్నిటికంటే అత్యధికంగా వ్యాపారం జరిగిన చిత్రం ఇదే అవుతుంది. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి నలన్ కుమార సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్లో పూర్తి అవుతుందని సమాచారం. తదుపరి 96 చిత్రం ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది నవంబర్లో సెట్ పైకి వెళ్లనుంది ఆ తర్వాత కార్తీ నటించే సర్దార్– 2, ఖైదీ– 2 చిత్రాలు 2024లో ప్రారంభం అవుతాయని సమాచారం. -
'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్కి అక్క?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తారు. కరెక్ట్గా చెప్పాలంటే మనసు దోచుకుంటారు. అలా ఇప్పుడు శ్రీవిష్ణు 'సామజవరగమన'లో నటించిన రెబా మోనికా జాన్.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఓ హీరోయిన్కు ఈమె కజిన్(అక్క) అని అంటున్నారు. అసలు ఇంతకీ ఇందులో నిజమెంత? రెబా ఏం చెప్పింది? (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) ఎవరీ భామ? బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్.. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేసిన రెబా.. పలు యాడ్స్ లోనూ నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా నటించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. తెలుగులోకి అలా! దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్బాల్ మ్యాచ్లో జట్టుని గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన 'బూ'లోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది. ఆ హీరోయిన్తో బంధుత్వం? రెబా మోనికా జాన్కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఇప్పటికే కంటిన్యూ అవుతోందని రెబా చెప్పుకొచ్చింది. వికిపీడియా, గూగుల్ లోనూ అలానే చూపిస్తోందని.. అయితే దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రామ్చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) -
షాపింగ్లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
రావణాసుర విజయంపై నమ్మకం ఉంది
‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్ డిజైన్ క్రెడిట్ నిర్మాత అభిషేక్కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్తో సుధీర్ వర్మ నెక్ట్స్ లెవల్కి వెళ్లాలి. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్బోన్స్ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్. ‘‘రావణాసుర’ బ్లాక్బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్గా నన్ను సెలక్ట్ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ హండ్రెండ్ పర్సెంట్ థ్రిల్ అవుతారు’’ అన్నారు సుధీర్వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, రైటర్ శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...
‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. ముల్లోకాల ఏ మూల ఉన్నా నీ అందాల సంకీర్తనే’ అని పాడుతున్నారు రావణాసుర. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుశాంత్ కీ రోల్ చేసిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రవితేజ, అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేశ్ ‘సూర్య ఐపీఎస్’ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాలకు..’ పాటకు ఇది రీమిక్స్ వెర్షన్. అప్పట్లో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అనురాగ్ కులకర్ణి ఈ లేటెస్ట్ వెర్షన్ను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్. -
మాస్ హీరో రవితేజ ‘రావణాసుర’ టీజర్ స్టిల్స్ (ఫోటోలు)
-
రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ‘రావణా..’ అంటూ సాగే థీమ్ సాంగ్ని విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్ని కంపోజ్ చేయగా, పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్ని ఆలపించారు. ‘‘హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. రవితేజను లాయర్ పాత్రలో చూపిస్తున్నారు సుధీర్ వర్మ. కథలో ఊహించని మలుపులుంటాయి. ఏప్రిల్ 7న మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
జపాన్ : మేడ్ ఇన్ ఇండియా!
బంగారు చొక్కా, మెడలో బంగారు గొలుసు, ఒక చేతిలో బంగారు తుపాకీ, మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్... ఇదీ హీరో కార్తీ కొత్త గెటప్. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసమే. కార్తీ కెరీర్లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో కార్తీ రెండు గెటప్లతో కనిపిస్తుండటం విశేషం. ‘‘ఓ చమత్కారమైన వ్యక్తి పాత్రలో నటిస్తూ ఓ కొత్త సినిమా జర్నీని స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. జపాన్: మేడ్ ఇన్ ఇండియా’’ అని పేర్కొన్నారు కార్తీ. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, డీవోపీ: రవివర్మన్. -
ఆసక్తికర టైటిల్తో కార్తీ కొత్త సినిమా
విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు విజయంతో మంచి జోష్లో ఉన్న నటుడు కార్తీ తాజాగా కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి జపాన్ అనే టైటిల్ నిర్ణయించారు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్, ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇంతకుముందు కార్తీ హీరోగా శకుని, కాష్మోర, ధీరన్ అధికారం ఒండ్రు, సుల్తాన్ తదితర సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ ఆరో చిత్రం అవుతుంది. కాగా ఈ సంస్థ ఇంతకుముందు రాజు మురుగన్ దర్శకత్వంలో నిర్మించిన జోకర్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న జపాన్ చిత్రానికి రాజు మురుగన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇందులో నటి అను ఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, రవివర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ను తూత్తుకుడిలో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కాగా కార్తీ, దర్శకుడు రాజమురుగన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే మంచి అంచనాలు నెలకొంటున్నాయి. -
అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్
నటి అను ఇమ్మానుయేల్ కోలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్లో పలు చి త్రాల్లో నటించిన ఈమె తమిళంలో విశాల్కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే. గుర్తింపు అంతంత మాత్రమే. ఆ తర్వాత శివ కార్తికేయన్కు జంటగా నమ్మవీటి పిళ్లై చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కోలీవుడ్లో కనిపించలేదు. అయితే తాజాగా కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చదవండి: Anushka Shetty: ‘నేను యోగ టీజర్గా పనిచేశానని అందరికి తెలుసు.. కానీ అది ఎవరికి తెలియదు’ చిత్రం సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది. కాగా అను ఇమ్మానుయేల్ గురించి ఇటీవల ఒక వదంతి వైరల్ అవుతోంది. ఈమె తెలుగులో అల్లు శిరీష్ జంటగా ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ వర కు బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే అను ఇమాన్యుల్ నటుడు అల్లు శిరీష్తో ప్రేమాయణం అంటూ ప్రచారం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన ఆమె తాను అనుకోకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ ప్లాప్ చిత్రాల్లోనూ నటించానని చెప్పింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తాజాగా తెలుగులో అల్లు శిరీష్ సరసన నటించడంతో ఆయనతో ప్రేమలో పడ్డట్టు వదంతులు పుట్టిస్తున్నారని చెప్పింది. ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అయితే తన తల్లి ఏడ్చేసిందని తెలిపింది. దీంతో అమ్మ వేదన చూసి తనకు బాధ కలిగిందని చెప్పింది. నిజానికి ఊర్వశివో.. రాక్షసివో చిత్రం షూటింగ్కు ముందు అల్లు శిరీష్ గురించి తనకు తెలియదని ఆయన్ని చూసింది కూడా లేదని చెప్పింది. చిత్ర షూటింగ్ పూజ సమయంలోనే తాను అల్లు శిరీష్ను కలిశానని చెప్పింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కాఫీ తాగితే కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని నటి అను ఇమ్మానుయేల్ ఆవేదన వ్యక్తం చేసింది. -
'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈ రోజు కోసమే ఎదురు చూశాను : అల్లు అర్జున్
‘‘నా సినిమా హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉండను.. నా తమ్ముడు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ తో హిట్ కొట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది.. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘ఊర్వశివో రాక్షసివో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఈ సినిమా మా గీతా ఆర్ట్స్కి, మా నాన్న–అమ్మలకు, నాకు, శిరీష్కి చాలా స్పెషల్ ఫిల్మ్. ఇకపై ఈ బ్యానర్లో ఎన్ని హిట్స్ వచ్చినా ‘ఊర్వశివో రాక్షసివో’ మరచిపోలేని అనుభూతి. ఈ హిట్ ఇచ్చిన రాకేష్ శశికి కృతజ్ఞతలు. శిరీష్తో హిట్ కొట్టిన మా నాన్నకి కంగ్రాట్స్. ఈ చిత్రంలో శిరీష్ నటన బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా తనని మరో మెట్టు ఎక్కించింది. ‘పుష్ప 1’ తగ్గేదే లే.. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే. ఈ సినిమా పాజిటివ్గా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘ఐకాన్స్టార్గా ఆల్ ఇండియా స్థాయికి వెళ్లిపోయిన మన బన్నీ(అల్లు అర్జున్). ఇప్పుడిప్పుడు సక్సెస్ చూస్తూ స్టార్గా ఎదుగుతున్న మన శిరీష్. వాళ్లిద్దరూ ఇక్కడ ఉంటే నాకంటే ఆనంద పడేవారు ఎవరుంటారు. ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘20 ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో నేను, సుకుమార్, బన్నీ కలిసి ప్రయాణం స్టార్ట్ చేశాం. ఈ రోజు మేము, మా సంస్థ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయాం. ‘ఆర్య’ చేసేందుకు ముఖ్య కారణం అల్లు అరవింద్గారు. ‘ఊర్వశివో రాక్షసివో’తో మంచి సక్సెస్ అƇదుకున్న టీమ్కి అభినందనలు. శిరీష్తో నేను ఓ సినిమా చేయాలి.. త్వరలో చేసి, తన బాకీ తీర్చేస్తాను’’ అన్నారు. ‘‘ఊర్వశివో రాక్షసివో’ ప్రయాణంలో నాకు సపోర్ట్ చే సిన అరవింద్, బన్నీవాస్గార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా సక్సెస్ని అల్లు శిరీష్గారిని అభిమానించే వారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు రాకేష్ శశి. ‘‘అరవింద్గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్ని అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు.. తన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు శిరీష్. ఈ వేడుకలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఎస్కేఎన్, నటుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్గా అల్లు అర్జున్
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ) ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. 𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi — Geetha Arts (@GeethaArts) November 5, 2022 -
Urvasivo Rakshasivo Review: ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
టైటిల్: ఊర్వశివో రాక్షసివో నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: రాకేశ్ శశి సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్) సినిమాటోగ్రఫీ: తన్వీర్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 4, 2022 గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు. మరోవైపు శ్రీకుమార్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్తో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్తో సాగడంతో ఎక్కడా బోర్కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్డెస్క్ -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
అందాలతో మత్తెక్కిస్తున్న అను ఇమ్మానియేల్ (ఫొటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్గారి అసోసియేషన్తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిపోర్టర్పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
-
రిపోర్టర్పై హీరోయిన్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
మజ్ను సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయెల్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా అల్లు శిరీష్తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్పై హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యింది. ''మీరు అల్లు అర్జున్తో నా పేరు సూర్య చేశారు. ఇప్పుడు శిరీష్తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ''? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో అసహనానికి గురైన అను మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ కోప్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా అను, శిరీష్ ఇద్దరు లవ్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి ఫస్ట్ లవ్సాంగ్ వచ్చేసింది
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్ను రిలీజ్ చేయగా,అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ని విడుదల చేసింది. ‘‘దీంతననా దీంతననా నీ చూపుల దాడి.. చేసిందే చేసిందే ఈ గారడీ’’అంటూ సాగే ఈ సాంగ్ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. -
అను ఇమ్మాన్యుయేల్కు మరో చాన్స్
తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ గ్లామరస్ కథానాయకిగా ముద్ర వేసుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. తెలుగులో అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. అయినా సరైన సక్సెస్ కోసం ఇంకా ఎదురు చూస్తునే ఉంది. ఇక తమిళంలోనూ విశాల్, శివకార్తికేయన్ సరసన నటించింది. ఇక్కడ కూడా సరైన గుర్తింపు కోసం ఎదురుచూసోంది. తాజాగా ఓ సూపర్ చాన్స్ ఈ అమ్మడిని వరించినట్లు తెలుస్తోంది. విరుమాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు కార్తీ. తాజాగా దీపావళికి సర్ధార్ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి రాశీఖన్నా, రెజీనా విజయన్ హీరోయిన్లుగా నటించారు. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈయన నూతన చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో బాలీవుడ్ నటి నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి అను ఇమ్మాన్యుయేల్కు ఈ అదృష్టం వరించిందని సమాచారం. -
యూత్ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్
అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. యూత్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్పై పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రావణాసుర షురూ
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ షురూ అయింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. దర్శకులు కేయస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొంది చిత్రబృందం. ‘‘యాక్షన్ థ్రిల్లర్గా ‘రావణాసుర’ రూపొందనుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని అభిషేక్ నామా అన్నారు. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సీఈఓ: పోతిని వాసు. -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. -
సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
‘‘నాకు చాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్లా సెట్కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్ వర్కింగ్.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్ ప్రాక్టీస్ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్–బృందా మాస్టర్తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు. -
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్గారు. సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
ప్రీ లుక్తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇటీవల సిక్స్ ప్యాక్తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్కి ముద్దులు ఇస్తున్న పోస్టర్ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ — Allu Sirish (@AlluSirish) May 29, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి -
అద్దం చాటున శిరీష్ ముద్దులు.. రొమాంటిక్ లుక్ రిలీజ్
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ లుక్ని విడుదల చేసింది చిత్రబృందం. మే 30న(శిరీష్ బర్త్డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇందులో శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. తాజా చిత్రంలో లిప్ లాక్ ఇచ్చినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel's #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅ Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/18CIGvgeW6 — Geetha Arts (@GeethaArts) May 27, 2021 -
ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా?
నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్ ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కెరీర్తో ఇంతరకు ఆశించిన స్థాయిలో హిట్ పడలేదు. అయితే ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్తో లవ్ ట్రాక్ కొనసాగిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్తోనూ రూమర్స్ రాని శిరీష్ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్తో క్లోజ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడటం లేదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్లతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా లాంగ్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్ చేయగా ఓ నెటిజన్ నుంచి ఊహించని విధంగా రియక్షన్ వచ్చింది. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి : కొన్నాళ్లుగా హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! అను ఇమాన్యుయేల్తో అల్లు శిరీష్ చాట్ వైరల్ -
హీరోయిన్కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్, స్పెషలేంటో?
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమాన్యుయేల్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్..ఇమాన్యుయేల్తో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడంతో వీరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్ బర్త్డే సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్డే సైకో అంటూ అల్లు శిరీష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్ హాట్ టాపిక్గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్కు అల్లు శిరీష్ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్పై ప్రింట్ చేయించి అను ఇమాన్యుయేల్కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్ని వియర్డో అంటూ సంభాషించింది. దీన్ని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసిన శిరీష్..వియర్డోనా...మనలో చాలా కామన్ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్గా ఈ భామపై సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్-అను ఇమాన్యుయేల్ మధ్య జరిగిన ఈ చాట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. శిరీష్ తన పోస్టులో మై ఫేవరెట్...అంటూ గ్యాప్ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్గా నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్పై ఇప్పటిదాకా శిరీష్ స్పందించలేదు. చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
అను ఇమ్మాన్యుయేల్ గ్లామరస్ ఫోటోలు
-
హీరోయిన్తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్
ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్థింగ్, సమ్థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్నెస్పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి : వకీల్సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్! -
మిల్కీ బ్యూటీ అందాల విందు.. సెగలు రేపుతున్న మాళవికా
► సముద్రతీరంలో సరదాగా గడుపుతోంది అను ఇమ్మాన్యుయెల్ ► కాలానికి.. ప్రపంచానికి దూరంగా.. అంటూ మాళవిక మోహనన్ ఒక ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది ► పింక్ కలర్ డ్రెస్లో ఫోటోకి ఫోజులిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ► సండే రెస్ట్డే అంటూ తన పెట్ డాగ్పై తలపెట్టి నిద్రపోతున్న సమంత View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్!
తెర మీద హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. తెర వెనుక కూడా చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమలో పడతారు. అయితే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2017లో నటించిన 'ఆక్సిజన్' సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. ఇక ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కాగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడే ఈ జ్యోతి కృష్ణ. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే.. 'యాక్షన్ హీరో బైజు' చిత్రంతో హీరోయిన్గా అడుగు పెట్టిందీ బ్యూటీ. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ అనుకు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగులోనే. అలా టాలీవుడ్లో తొలి చిత్రం 'మజ్ను'లో నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు. ఇక 'శైలజా రెడ్డి' అల్లుడు తర్వాత ఇక్కడ పూర్తిగా స్లో అయిన అను ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్'లో నటించింది. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కోలీవుడ్లోనూ రెండు, మూడు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి! చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’.. -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్కూ, ప్రకాశ్ రాజ్కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ
టైటిల్ : అల్లుడు అదుర్స్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ నిర్మాణ సంస్థ : సుమంత్ మూవీస్ నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : జనవరి 14, 2021 వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ. నటీనటులు గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. రియల్ హీరో సోనూ సూద్ తన నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రకాష్ రాజు ఎప్పటిలాగే తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు. విశ్లేషణ 'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. -
సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో మా అందరికీ ధైర్యం వచ్చింది. సంక్రాంతి అనేది అల్లుళ్ల పండుగ. అల్లుడు ఎలాంటివాడైనా అత్తమామలకు అదుర్సే.. అందుకే ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ టైటిల్తో వస్తున్నాం’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నభానటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు అదుర్స్’ కథ చెప్పగానే బెల్లంకొండ సురేష్గారు ‘రాక్షసుడు’ తర్వాత సాయితో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమా చేయాలని చూస్తున్నాను. తప్పకుండా మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. నా ‘కందిరీగ’ సినిమాలో ఉన్నట్టే ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చేసి సంతోషంగా ఇంటికెళ్తారు. కరోనా తర్వాత సోనూ సూద్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. దేవిశ్రీ ప్రసాద్గారి సంగీతంతో మా సినిమా రేంజ్ పెరిగింది. బేసిక్గా నేను సినిమాటోగ్రాఫర్ని కాబట్టి 150 రోజుల్లో తీసే సినిమాని 110 రోజుల్లో పూర్తి చేయగలను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలూ మంచి విజయం సాధించి ఇండస్ట్రీకి మంచి రెవెన్యూ వస్తే ఫిబ్రవరిలో మరికొన్ని మంచి సినిమాలు వస్తాయి. ‘కందిరీగ’ సీక్వెల్ ‘కందిరీగ 2’ ఐడియా రెడీగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
సంక్రాంతికి మంచి వినోదం ఇస్తాం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక తారాగణం పాల్గొనగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో మోనాల్ గజ్జర్ నర్తిస్తున్నారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు శ్రీను’ తర్వాత నేను చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులందరినీ వినోదంతో అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్తో మా సినిమా విందుభోజనంలా ఉంటుంది’’ అన్నారు సంతోష్ శ్రీనివాస్. ‘‘నిర్మాత బెల్లంకొండ సురేశ్గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాతో పాటు విడుదలయ్యే అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు సోనూ సూద్. ‘‘దాదాపు ఐదేళ్ల తర్వాత నేను పెర్ఫామ్ చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు మోనాల్ గజ్జర్. -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
మహా సముద్రంలో..
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అదితీ రావ్ హైదరీ ఒక హీరోయిన్గా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోనూ సూద్ ఎంట్రీ
‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్ సోమవారం షూటింగ్లో ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ టైటిల్కు, ఫస్ట్ లుక్ పోస్టర్కు చక్కని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
అల్లుడు షూటింగ్ షురూ
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో సోమవారం పునఃప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్ రాజ్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గొర్రెల మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ‘అల్లుడు అదుర్స్’ టైటిల్కు, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్ను విడుదల చేస్తాం. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్కుమార్ గంజి. -
వేరే ప్రపంచంలో...
‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిరాశకు గురి కాకుండా ఆశావహ దృక్పథంతో ఉండాలి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి’’ అంటున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. యూఎస్లో పుట్టి, పెరిగి హీరోయిన్ కావాలనే ఆలోచనతో ఇండియా వచ్చారు అను. తెలుగులో ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించారీ బ్యూటీ. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ లాక్డౌన్లో ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని అనూ ఇమ్మాన్యుయేల్ చెబుతూ – ‘‘మనం చదివే ప్రతి పుస్తకంలోనూ కొత్త కథ ఉంటుంది. అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం. అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది. షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు’’ అన్నారు. -
హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఫోటోలు
-
అల్లు శిరీష్తో.. అనూ ఇమ్మాన్యుయేల్..!
‘శైలజారెడ్డి అల్లుడు (2018)’ తర్వాత తెలుగులో కాస్త స్లో అయినట్లున్నారు హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. మళ్లీ స్పీడ్ను అందుకోవాలనే ఆలోచనతో తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేశారట. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్గా నటించబోతున్నారని సమాచారం. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శశి. -
చిన్న గ్యాప్ తర్వాత
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు అనూ ఇమ్మాన్యుయేల్. చిన్న గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్ ఓ కథానాయిక. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ని మరో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అనూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘సినిమాలో ఇద్దరి కథానాయి కలకూ ప్రాధాన్యముంటుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. ఆయనకు జంటగా అనుఇమ్మాన్యువేల్ నటించింది. ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్లో నటించిన చిత్రం ఇది. ఇకపోతే ఇందులో మరో నటి ఐశ్వర్యరాజేశ్ శివకార్తికేయన్కు చెల్లెలిగా ముఖ్య పాత్రలో నటించింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన మరో గ్రామీణ కథా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు నట్టి, ఆర్కే.సురేశ్, సూరి, యోగిబాబు, వేలరామమూర్తి, నాడోడిగళ్ గోపాల్, సుబ్బుపంజు, అర్చన, షీలా, సంతానలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. దీనికి నీరవ్షా ఛాయాగ్రహణం అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ పొందింది. కాగా నమ్మవీట్టుపిళ్లై చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈ చిత్రంపై నటుడు శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన చిత్రాలు వరుసగా నిరాశపరచడమే ఇందుకు కారణం. అదీ కాకుండా శివకార్తికేయన్ తొలి రోజుల్లో పాండిరాజ్ దర్శకత్వంలో మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రాల్లో నటించారు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా నటించిన నమ్మవీట్టుపిళ్లై వీరి కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. -
నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!
నమ్మవీట్టు పిళ్లై చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నమ్మవీట్టుపిళ్లై. నటి అనుఇమ్మాన్యువేల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా నమ్మవీట్టు పిళ్లై చిత్ర షూటింగ్ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్ అనుఇమ్మాన్యువేల్ తన ఇస్స్ట్రాగామ్లో పేర్కొంది. కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మవీట్టు పిళ్లై ఈయన ఇంతకుముందు శివకార్తికేయన్ హీరోగా మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నమ్మవీట్టు పిళ్లై చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం శివకార్తికేయన్కు, నటి అనుఇమ్మాన్యువేల్ల కెరీర్లకు కీలకంగా భావిస్తున్నారు. నటుడు శివకార్తికేయన్ సరైన హిట్ చూసి చాలాకాలమైంది. ఆయన నటించిన సీమదురై, మిస్టర్ లోకల్ వంటి చిత్రాలు చాలా నిరాశపరిచాయి. ఇక నటి అనుఇమ్మాన్యువేల్కు కోలీవుడ్లో చెప్పుకోతగ్గ చిత్రం లేదు. ఇంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. భారీ తారాగణంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న నమ్మవీట్టు పిళ్లై చిత్రంపై కోలీవుడ్లో మంచి అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ఈ నెలలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. View this post on Instagram Wrap! for #nammaveettupillai See you in theatres very soon 🤗 A post shared by Anu Emmanuel (@anuemmanuel) on Sep 6, 2019 at 11:17pm PDT -
శివకార్తికేయన్ కొత్త సినిమా ఫస్ట్లుక్
అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. సన్పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ను మంగళవారం విడుదల చేశారు. దీంతో పాటు చిత్ర టైటిల్ను ప్రకటించారు. ఆ పేరే నమ్మ వీట్టు పిళ్లై. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం తరువాత శివకార్తీకేయన్ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. నటి అనుఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుండగా, శివకార్తికేయన్కు చెల్లెలుగా ఐశ్వర్యరాజేశ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెకు జంటగా నట్టి నటిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతాన్ని, నిరవ్షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గ్రామీణ పాత్రలో మాస్ గెటప్లో కనిపించాడు. ఇక రెండో పోస్టర్లో దర్శకుడు పాండిరాజ్ మార్క్ కనిపించేలా చిత్రంలోని పాత్రలన్నింటిని పొందుపరిచి ఒక కుటుంబంలా కనిపించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా కార్తీ హీరోగా కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మ వీట్టు పిళ్లై. చిత్రంపై శివకార్తికేయన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తదుపరి శివకార్తికేయన్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇరుంబుతిరై చిత్రం ఫేం పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు. దీన్ని లైకా సంస్థ నిర్మించనుంది. వీటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
మళ్లీ పిలుపొచ్చింది
కోలీవుడ్ నుంచి హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్ ‘తుప్పరివాలన్ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్ చేయలేదీ బ్యూటీ. అయితే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తారు. రూరల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
సింహపురిలో సినీ నటి సందడి
నెల్లూరు(బృందావనం): ‘నా పేరు సూర్య’.. ‘మజ్ఞు’.. ‘అజ్ఞాతవాసి’, తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించిన అనూ ఇమాన్యుయెల్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో గల కంచి లలిత శిల్క్స్ వంద రోజుల వేడుకల్లో భాగంగా చేపట్టిన కాస్ట్ టు కాస్ట్ సేల్ అమ్మకాలను ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత సంగటి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఈ నెల 23 వరకు తమ కంచి లలిత శిల్క్స్కు చెందిన సొంతమగ్గాలపై తయారైన వస్త్రాలను ఉత్పత్తి ధరలకే కస్టమర్లకు విక్రయించనున్నామని తెలిపారు. సొంత మగ్గాలపై పట్టుతో నేయించిన చీరలను చాలెంజ్ ధరలకు విక్రయిస్తున్నామని వివరించారు. నెల్లూరు మహిళా లోకం, యువతులు మెచ్చే పలు రకాల డిజైన్లతో వస్త్రాలను విక్రయిస్తున్నామని తెలిపారు. కంచి లలిత శిల్క్స్ మేనేజర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. పట్టు చీరలకు పెట్టింది పేరు కంచి లలిత శిల్క్స్ మేలిమి పట్టుతో నేసిన కంచి పట్టు చీరలకు నెల్లూరు కంచి లలిత శిల్క్స్ పేరుగాంచిందని అనూ ఇమ్మానుయెల్ తెలిపారు. కంచిపట్టు చీరలను ధరించి ముసిముసి నవ్వులతో అభిమానుల కేరింతల నడుమ ఫొటోలకు పోజులిచ్చారు. నెల్లూరు అంటేనే తనకు ఎంతో అభిమానమని, నెల్లూరు రుచులు మరవలేనివన్నారు. నెల్లూరు బిరియానీ, చేపల పులుసును తాను ఎంతో ఇష్టపడతానని, నగరానికి రావడం ఇది రెండో సారని చెప్పారు. అనూ ఇమ్మానుయెల్ను చూసేందుకు తరలివచ్చిన అభిమానులతో మాగుంటలేవుట్లో కోలాహలం నెలకొంది. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
అలాగైతేనే రండి!
సినిమా: అలాగైతేనే రండి అంటోంది నటి అను ఇమ్మానుయేల్. ఈ విదేశీ బ్యూటీ మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు ఎదిగిన నటి అన్నది తెలిసిందే. తొలుత మాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి, ఆపై టాలీవుడ్కు దిగుమతి అయ్యింది. తెలుగులో నటించిన మజ్ను లాంటి చిత్రాలు సక్సెస్ అవడంతో స్టార్ హీరోల దృష్టిలో పడింది. అయితే అక్కడ పవన్కల్యాణ్తో నటించిన అజ్ఞాతవాసి, అల్లుఅర్జున్తో రొమాన్స్ చేసిన నా పేరు సూర్య వంటి భారీ చిత్రాల ఢమాల్ అనడంతో ఈ అమ్మడి డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తరువాత నటించిన శైలజారెడ్డి లాంటి చిత్రాలు అనుఇమ్మానుయేల్కు ఏ మాత్రం ప్లస్ అవలేదు. దీంతో చేతిలో ప్రస్తుతం నాగార్జునతో జత కడుతున్న ద్విభాషా చిత్రం ఒక్కటే ఉంది. ఇక తమిళంలో ఈ అమ్మడికి పెద్దగా క్రేజే లేదు. ఆ మధ్య విశాల్కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయినా, ఇక్కడ పట్టించుకున్న వారు లేరు. గ్లామర్ విషయంలో అభ్యంతరాలు పెట్టకపోయినా అవకాశాలు రాకపోవడం ఏమిటో ఈ బ్యూటీకి అర్థం కావడం లేదట. దీంతో పునరాలోచనలో పడ్డ అనుఇమ్మానూయేల్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చిందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలు కాకుండా గ్లామర్ డాల్ పాత్రలను పోషించడం వల్లే తనకు అవకాశకాలు రావడం లేదని భావించిన అనుఇమ్మానూయేల్ ఇకపై అలాంటి పాత్రలపై దృష్టిసారించాలని తీసుకుందట. దీంతో ఇటీవల తనను కలిసి కథ చెప్పాలని ప్రయత్నించిన దర్శకులకు తన పాత్ర మాత్రమే కాకుండా పూర్తి కథను వినిపించాలని చెబుతోందట. అంతే కాదు ఇకపై పూర్తి బైండ్ స్క్రిప్ట్తోనే తనను కలవాలని షరతులు విధిస్తోందట. ఇంతకు ముందు హీరోహీరోయిన్లకు దర్శకులు కథను వినిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తి బైండ్ స్క్రిప్ట్ తయారు చేసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడు నటి అనుఇమ్మానూయేల్ అదే దారిలో పయనించాలని నిర్ణయించుకుందట. అయితే అసలే అవకాశాలు ముఖం చాటేస్తున్న పరిస్థితుల్లో ఈ అమ్మడి షరుతులు వర్కౌట్ అవుతాయా అన్నదే చర్చ. ప్రస్తుతం నటిస్తున్న ద్విభాషా చిత్ర నిర్మాణమే నత్త నడకన నడుస్తోందన్నది గమనార్హం. -
నా పేరు సూర్య విషయంలో అదే జరిగింది..
సినిమా: తానీరంగంలోకి వచ్చినప్పటి నుంచే తనపై వదంతులు రావడం మొదలయ్యాయని నటి అనుఇమ్మాన్యుయేల్ అంటోంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్లో నటిగా రంగప్రవేశం చేసి ఆపై టాలీవుడ్, కోలీవుడ్ అంటూ రౌండ్ కొట్టేస్తోంది. టాలీవుడ్లో తొలి చిత్రం మజ్ను బ్రేక్ ఇచ్చినా, ఆ తరువాత పవన్కల్యాణ్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అవి ఈ అమ్మడిని నిరాశపరచాయి. ఇక కోలీవుడ్లో తుప్పరివాలన్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఇదుగో ఇన్నాళ్లకి నటుడు ధనుష్ అవకాశం ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రంలో అనుఇమాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న చిట్ఛాట్.. ప్ర: తమిళంలో రీఎంట్రీ గురించి? జ: రీ ఎంట్రీ అనడాన్ని నేను అంగీకరించను. నేను తెలుగు, తమిళం రెండు ఇండస్ట్రీస్లోనూ ఉన్నాను. అవకాశాలు వచ్చినప్పుడు కాల్షీట్స్ను బట్టి ఏ భాషా చిత్రాన్ని అంగీకరించాలన్నది నిర్ణయించుకుంటాను. తుప్పరవాలన్ చిత్రం తరువాత తమిళంలో అవకాశాలు వచ్చిన మాట నిజమే. అయితే ఆ సమయంలో కొన్ని తెలుగు చిత్రాలు కమిట్ అయి ఉండడంతో తమిళ చిత్రాలను అంగీకరించలేకపోయాను. ఇప్పుడు ధనుష్ చిత్రంలో నటించే అవకాశం రావడం, అందుకు కాల్షీట్స్ ఉండడంతో నటించడానికి రెడీ అన్నాను. ప్ర: మీరు నటించిన చిత్రాలు విజయం సాధించకపోవడం గురించి? జ: తెలుగులో అజ్ఞాతవాసి చిత్రాన్ని పవన్కల్యాణ్ కోసం ఒప్పుకున్నాను. అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర మాదిరి అజ్ఞాతవాసి చిత్రంలో నా పాత్ర ఉంటుందని తెలుసు. అయినా నటించాను. ఇక అల్లుఅర్జున్కు జంటగా నా పేరు సూర్య చిత్రంలో నా పాత్ర బాగానే ఉంటుంది. ఆ చిత్రం తమిళంలోనూ విడుదలైంది. ఒక్కోసారి మనం అనుకున్నది ఒక్కటి జరిగింది మరొక్కటిలా అవుతుంది. నా పేరు సూర్య విషయంలో అదే జరిగింది. ప్ర: కమర్శియల్ చిత్రాలనే ఎంచుకుంటున్నట్టున్నారు? జ: అలా కమిట్ అయ్యి చిత్రాలను ఎంపికక చేసుకోవడం జరగదు. అవార్డు కథా పాత్రల్లో నటించనని నేనెప్పుడూ చెప్పలేదు. కమర్శియల్ చిత్రాల్లో హీరోలకే ప్రాముఖ్యత ఉంటుందని తెలుసు. అయినా అలాంటి చిత్రాలతోనే ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవగలమన్నది నిజం కాదా? అయితే నేను గ్లామర్ పాత్రలోన్నే నటిస్తానని చెప్పలేదు. తుప్పరివాలన్ చిత్రం చూసిన వారికి ఈ విషయం అర్థం అవతుంది. ప్ర: తెలుగు చిత్రం గీతాగోవిందంలో నటించే అవకాశం ముందు మీకే వచ్చిందట? జ: నిజమే. ఆ చిత్ర నిర్మాణం ఆలస్యం కావడంతో వేరే చిత్రానికి కాల్షీట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ చిత్రాన్ని చేజార్చుకున్నాను. ఇక మంచి చిత్రాన్ని కోల్పోవడం బాధగానే ఉంది. అయితే విజయ్దేవరకొండ, రష్మిక అందులో చక్కగా నటించారు. వారికా విజయం అవసరం కూడా. ప్ర: పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం గురించి? జ: సినిమా రంగంలో ఒకరు ఎదుగుతున్నారంటే ఆ వ్యక్తి గురించి రకరకాల చర్చ జరుగుతుంది. అందులో ఎక్కువగా అసత్యాలే ఉంటాయి. నేను ఈ రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచే నాపై వదంతులు మొదలయ్యాయి. అలాంటి వాటిని చదివి నవ్వుకుంటాను. వాటికి బదులు చెప్పుకుంటూ పోతే మన టైమే వృథా అవుతుంది. ఎవరైనా వారి మార్కెట్ లెవల్ను బట్టే పారితోషి కాన్ని పొందుతారు.అలా నా ప్రతిభకు , డిమాండ్కు తగ్గట్టుగా పారితోషికాన్ని పొందుతున్నాను. దాని గురించి చర్చించడం వేస్ట్ అన్నది నా అభిప్రాయం. ప్ర: కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని ఇటీవల ప్రకటించారు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా? జ: మీకు ప్రేమ వివాహంపై నమ్మకం ఉందా? అని ఒక భేటీలో అడగడంతో అలా చెప్పాను. అందుకు నేను ప్రేమలో పడ్డానని అర్థంకాదు. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు ప్రేమపై చాలా నమ్మకం ఉంది. ఆరెంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్నే బెటర్ అని భావిస్తాను. అందుకు నా కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలా నాకు తగిన వాడి కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఇప్పటి వరకూ నేనెవరినీ ప్రేమించలేదు. అయితే చాలా మంది ఐలవ్యూ చెప్పారు. స్కూల్లో చదువుతున్నప్పుడే నలుగురు లవ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రేమలేఖలు రాస్తున్నారు. -
డల్లాస్లో ఘనంగా బతుకమ్మ పండుగ
డల్లాస్ : తెలుగు పీపుల్స్ అసోసియేషన్ (టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. టీపాడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు. టీపాడ్ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బోట్ చైర్మన్ శారదా సింగిరెడ్డి, బోట్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ రఘువీర్ బండారులు బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ద్వారా సిల్వర్ స్క్రీన్కి పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) నివేథా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) మెహరీన్ డి) నభా నటేశ్ 2.చిరంజీవి 151వ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడెవరో తెలుసా? ఎ) విజయ్ బి) విజయ్ సేతుపతి సి) ధనుశ్ డి) అజిత్ 3. జగపతిబాబు విలన్గా టాప్ గేర్లో ఉన్నారు. ఆయన విలన్గా నటించిన మొదటి సినిమాకు దర్శకుడెవరో తెలుసా? ఎ) బోయపాటి శ్రీను బి) శ్రీను వైట్ల సి) వంశీ పైడిపల్లి డి) సుకుమార్ 4. ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోగా ప్రముఖ హీరో వెంకటేశ్ నటిస్తున్నారు. మరో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అఖిల్ బి) వరుణ్ తేజ్ సి) నాగచైతన్య డి) నాగశౌర్య 5 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.వి. రెడ్డి బి) చిత్రపు నారాయణరావు సి) చిత్తూరు వి.నాగయ్య డి) గూడవల్లి రామబ్రహ్మం 6. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైంది. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన నటించిన కథానాయిక ఎవరు? ఎ) విజయనిర్మల బి) విజయ లలిత సి) విజయ శాంతి డి) జయలలిత 7. ‘ అహ నా పెళ్లంట’ చిత్రంలో హాస్యానికి పెద్ద పీట వేశారు దర్శకులు జంధ్యాల. ఈ చిత్రంలో పిసినారి పాత్రలో ఒదిగి పోయిన నటుడెవరో లె లుసా? ఎ) బ్రహ్మానందం బి) కోట శ్రీనివాసరావు సి) సుత్తి వీరభద్రరావు డి) సుత్తివేలు 8. నాట్య మయూరి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పేరేంటి? ఎ) అశ్విని బి) మయూరి సి) శారధ డి) శాంభవి 9 ‘‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా’’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) మణిశర్మ బి) దేవీశ్రీ ప్రసాద్ సి) యం.యం.కీరవాణి డి) యస్.యస్. తమన్ 10. అనుష్క ‘భాగమతి’ చిత్రంలో ఓ ఆఫీసర్గా కనిపిస్తారు. ఆమె ఏ ఆఫీసర్గా కనిపిస్తారో తెలుసా? ఎ) పోలీస్ బి) డాక్టర్ సి) టీచర్ డి) కలెక్టర్ 11.‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’ అని హీరో గోపీచంద్ను ఉద్దేశించి పాడే హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) భావన సి) ప్రియమణి డి) విమలా రామన్ 12.‘వి.ఐ.పి 2’ చిత్రంలో హీరో ధనుష్తో పోటాపోటీగా నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) కాజోల్ బి) ఐశ్వర్వారాయ్ సి) కత్రినా కైఫ్ డి) ఆలియా భట్ 13. ‘అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తే పడరు... ఇంప్రెస్ అయితేనే పడతారు’ అనే డైలాగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఏ హీరోతో చెప్తుందో కనుక్కోండి? (క్లూ: ఈ డైలాగ్ రచయిత, దర్శకుడు వేగేశ్న సతీశ్) ఎ) రామ్ బి) శర్వానంద్ సి) అల్లు అర్జున్ డి) సాయిధరమ్ తేజ్ 14. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఏంటో తెలుసా? ఎ) పరమ వీర చక్ర బి) ఎర్రబస్సు సి) మేస్త్రి డి) యంగ్ ఇండియా 15.తొలి భారతీయ చిత్రనిర్మాతగా ప్రసిద్ధి కెక్కిన నిర్మాత ఎవరు? ఎ) రఘుపతి వెంకయ్యనాయుడు బి)దాదాసాహెబ్ ఫాల్కే సి) హెచ్.యం.రెడ్డి డి) పోతిన శ్రీనివాసరావు 16 . ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా నటించింది త్రిష. ఆమె స్నేహితురాలిగా నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) వేదా బి) మధుశాలిని సి) స్వాతి డి) సోనియా 17.మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నవాబ్’ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్ నటించారు. ఆమె ఓ ప్రముఖ తెలుగు నటి మేనకోడలు. ఎవరా నటి? ఎ) హేమ బి) ప్రగతి సి) శ్రీలక్ష్మీ డి) రజిత 18.‘ముద్దబంతి పూవులో మూగబాసలు... మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు..’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) చిత్ర బి) పి. సుశీల సి) యస్. జానకి డి) వాణీ జయరాం 19. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఒకప్పటి విశ్వ సుందరి.ఎవరు? ఎ) సుస్మితాసేన్ బి) ఐశ్వర్యారాయ్ సి) ప్రియాంకాచోప్రా డి) యుక్తాముఖి 20. ‘ఇంద్రజిత్’ చిత్రంలోని ఈ స్టిల్లో యస్వీఆర్తో ఉన్న హీరోయిన్ ఎవరు? ఎ) షావుకారు జానకి బి) కృష్ణకుమారి సి) అంజలీదేవి డి) జమున మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) సి 2) బి 3) ఎ 4) బి 5) డి 6) ఎ 7) బి 8) బి 9) సి 10) డి 11) సి 12) ఎ 13) బి 14) బి 15) బి 16) ఎ 17) సి 18) ఎ 19) ఎ 20) సి నిర్వహణ: శివ మల్లాల -
బాలనటి నుంచి శైలజారెడ్డి కూతురి వరకు
బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్రం ‘యాక్షన్ హీరో బిజూ’తో హీరోయిన్ అయింది. మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, శైలాజారెడ్డి అల్లుడు... చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అను అంతరంగ తరంగాలు... ►మనం ఎప్పుడూ ఒకేలా ఉండమనే విషయాన్ని బలంగా నమ్ముతాను. రకరకాల అనుభవాలు మనల్ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతాయి. రెండు సంవత్సరాల క్రితం వరకు తెలుగులో నా డైలాగులను నేను చెప్పుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు అలాంటి కష్టం లేదు. త్వరలో తెలుగును ధారాళంగా మాట్లాడగలననే నమ్మకం ఉంది. ►నటన నా జీవితాన్నే మార్చేసింది. ఒకప్పుడు ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడేదాన్ని. ఇప్పుడు నా పనులు నేనే సొంతంగా చేసుకోగలుగుతున్నాను. ‘శైలజారెడ్డి అల్లుడు’లో పొగరున్న యువతిగా నటించాను. నిజజీవితంలో కూడా నాకు పొగరు ఉంది. అయితే దాన్ని నేను ‘హెల్తీ ఇగో’ అంటాను. నాకే కాదు ప్రతి ఒక్కరికీ ఇది ఉండాలి. ►వేరే కథానాయికతో కలిసి పనిచేయడం వల్ల నేనేమీ ‘అభద్రత’కు గురికాను. మన గురించి మనకు స్పష్టత లేనప్పుడే అభద్రతాభావన ముందుకొస్తుంది. నేను నటించే సినిమా ఏమిటో దానిలో నా పాత్ర ఏమిటో నాకు స్పష్టంగా తెలుసుకాబట్టి అభద్రత అనే సమస్యే ఎదురుకాదు. ►పాత్రలో ఎంత దమ్ము ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది విషయం కాదు. సినిమా ఆడకపోతే మన కష్టం, ప్రతిభ కనిపించకపోవచ్చు. అంతమాత్రాన యాంత్రికంగా నటించలేము కదా! ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నలోపం ఉండకూడదని నమ్ముతాను. నా పాత్ర అద్భుతంగా ఉండటం వల్ల సినిమా ఆడదు... సినిమా అనేది రకరకాల పాత్రల ప్యాకేజీ. ►నటి అన్నాక కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న నాన్ కమర్షియల్ సినిమాలు కూడా చేయాలి. అయితే కెరీర్ నిర్మాణదశలో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. కొన్ని అవకాశాలు అనుకోకుండా తలుపుతట్టి ఎక్కడికో తీసుకువెళతాయి. ‘మహానటి’లాంటి సినిమా చేయాలని ఉంది. ►జయాపజయాలు మన అధీనంలో ఉండవు. కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి అతిగా ఆలోచించను. కెరీర్ ప్రారంభంలో సహజంగానే కొన్ని తప్పులు చేస్తాం. నేను అలాగే చేశాను. అంతమాత్రాన ‘ఇక అంతా అయిపోయింది’ అని డీలాపడే మనిషిని కాదు. ఇండస్ట్రీలో పోటీ గురించి చెప్పాలంటే, మెడికల్ ఎంట్రన్స్లాంటి పోటీ కాకపోయినా పోటీ అనేది ఉండాలి. అలా ఉంటే మరింత మెరుగవుతాం. -
ధనుష్ దర్శకత్వంలో 'అనూ'
సినిమా: అ రోజుల్లోనే ఆ నలుగురు ప్రేమిస్తున్నామని తిరిగారు అంటోంది నటి అనూ ఇమ్మాన్యుయేల్ . అమెరికన్ ఇండియన్ అయిన ఈ బ్యూటీ మాలీవుడ్కు బాలతారగా పరిచయమైంది. ఆ తరువాత అక్కడే కథానాయకిగా అవతారమెత్తి ఆపై కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతోంది. అయితే తెలుగులో తొలి చిత్రం మజ్ను మంచి విజయాన్ని అందించడంతో అక్కడ క్రేజ్ను సంపాదించుకుంది. స్టైలిష్స్టార్ అల్లుఅర్జున్కు జంటగా నా పేరు సూర్య చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుని మరింత పాపులర్ అయ్యింది. ఇక ఇటీవల నాగచైతన్యకు జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. గత ఏడాదే విశాల్కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అయినా ఆ తరువాత మరో అవకాశం రావడానికి ఏడాది పట్టింది. అవును ఈ అమ్మడు ధనుష్ మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ నటించడానికి ఎంపికైంది. ఇందులో టాలీవుడ్ స్టార్ నాగార్జున ఒక హీరోగా నటించనున్నారు. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ ఏం సమాధానం ఇచ్చిందో చూడండి. ప్రేమ గురించి చెప్పాలంటే అది ఓ అద్భుతమైన భావన. రెండు మససుల అందమైన కలయిక. నిజం చెప్పాలంటే నేను చదువుకునే రోజుల్లోనే నలుగురు అబ్బాయిలు ప్రేమిస్తున్నామంటూ తిరిగారు. అయితే నేనెవరినీ ప్రేమించలేదనుకోండి. ఇప్పటికీ నా మనసులో ఎవరూ లేరు. అయితే భవిష్యత్లో ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాలపైనే. చాలా చిత్రాలు చేయాలి. కాగా తుప్పరివాలన్ చిత్రంలో అమ్మడికి నటించడానికి పెద్ద స్కోప్ లేదు. మరి నటుడు ధనుష్ చిత్రంతోనైనా కోలీవుడ్లో స్ట్రాంగ్గా పాగా వేస్తుందేమో చూడాలి. అన్నట్టు శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఇందులో ఈ అమ్మడు నాగార్జునకు జంటగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఏ హీరోతో అయినా నటిస్తాను..
విశాఖపట్నం, గాజువాక: ‘నాకు ఫలానా హీరో అంటే ఇష్టం లాంటి అభిప్రాయాలు లేవు. మంచి కథలు వస్తే ఏ హీరోతోనైనా చేస్తాను. కథే నా ప్రయారిటీ, హీరో’ అన్నారు ప్రముఖ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం గాజువాక విచ్చేసిన ఆమె విలేకరులతో చిట్చాట్ చేశారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... తెలుగు సినిమాలకే ప్రాధాన్యం నేను యూఎస్లో పుట్టాను. సినిమాల్లోకి వచ్చాక తెలుగుకే అధిక ప్రాధాన్యం ఇచ్చాను. తెలుగులో ఇప్ప టివరకు ఐదు సినిమాలు చేశాను. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కొత్త సినిమాలున్నాయి. ఆ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి నానీతో మజ్ను, పవన్ కల్యాణ్తో అజ్ఞాతవాసి, బన్నీ తో నాపేరు సూర్య, గోపీచంద్తో ఆక్సిజన్, నాగ చైతన్యతో శైలాజారెడ్డి అల్లుడు చేశాను. ఆ సినిమాలన్నీ మంచి గుర్తింపు తెచ్చాయి. మలయాళంలోనూ ఒక సినిమా చేశాను. నా సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విశాఖ పీస్ఫుల్ సిటీ విశాఖ పీస్ఫుల్ సిటీ. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. బీచ్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతిసిద్ధమైన అందా లున్నాయి. వైజాగ్ నాలుగుసార్లు వచ్చాను. విశాఖలో ఇప్పటివరకు సినిమా షూటింగ్లు చేయకపోయినా షోరూమ్ల ఓపెనింగ్లకు వచ్చాను. రెండుసార్లు విశాఖ సిటీలోను, రెండుసార్లు గాజు వాకలోను షోరూమ్లను ప్రా రంభించేందుకు వచ్చాను. ఈ సిటీ బాగా నచ్చుతుంది. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్గా, డిఫరెంట్గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
అలరిస్తున్న అల్లుడు
-
అనుకుంటున్నారట!
టాలీవుడ్లో వరుసగా టాప్ హీరోలతో జత కట్టిన అనూ ఇమ్మాన్యుయేల్ తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేశారని సమాచారం. అయితే ఇది టాలీవుడ్లో కాదు, కోలీవుడ్లో. ధనుష్ డైరెక్టర్గా ఇటీవల తన రెండో సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఓ ముఖ్య పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. అదితీ రావ్ హైదరీ ఓ కథానాయికగా నటిస్తున్నారు. మరో నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరును అనుకుంటున్నారట. శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తన భాగం షూటింగ్ కోసం వచ్చే నెల నుంచి సెట్స్లో జాయిన్ అవ్వనున్నారట ఈ మలయాళీ బ్యూటీ. ఆల్రెడీ ‘తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టీవ్)తో తమిళంలోకి అడుగుపెట్టారామె. ఇది తన సెకండ్ మూవీ అవుతుంది. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ అయిన ఈ చిత్రానికి సీయన్ రోల్డన్ సంగీత దర్శకుడు. -
నాగ్ సినిమాలో చైతూ హీరోయిన్..!
కింగ్ నాగార్జున డిఫరెంట్ రోల్స్కు, మల్టీస్టారర్ సినిమాలకు సై అంటున్నారు. తాజాగా నానితో కలిసి దేవదాస్ సినిమాలోనటిస్తున్న నాగ్, త్వరలో ఓ తమిళ మల్టీస్టారర్లో నటించేందుకు ఓకె చెప్పారు. పవర్పాండి సినిమాతో కోలీవుడ్లో దర్శకుడిగా సక్సెస్ సాధించిన ధనుష్ త్వరలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండళ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అదితిరావ్ హైదరీని ఫైనల్ చేయగా మరో హీరోయిన్ పాత్రకు అను ఇమ్మాన్యూల్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించిన అను, వెంటనే నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. శరత్ కుమార్, ఎస్జే సూర్యలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవర్ పాండి ఫేం సీన్ రోనాల్డ్ సంగీతమందిస్తున్నారు. -
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్డే టైమ్లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
‘అల్లుడు’ వసూళ్లు అదరగొడుతున్నాడు
నాగ చైతన్య మంచి జోష్లో ఉన్నాడని తెలుస్తోంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’తో ఈ వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్లడంతో సంతోషంగా ఉన్నట్టున్నాడు. మారుతి స్టైల్లో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా తొలిరోజే పన్నెండు కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. తన సినిమా కెరీర్లో హయ్యస్ట్ ఓపెనర్గా ఈ చిత్రం నిలిచింది. నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచేలా ఉంది ఈ చిత్రం. ఈ మూవీలో రమ్యకృష్ణ, అను ఇమాన్యుయేల్, మురళీ శర్మ, నరేష్ కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ యువ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ ‘సవ్యసాచి’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. #ShailajaReddyAlludu scores 12 Crores gross worldwide on its day 1, Highest ever in @chay_akkineni 's career, Thanks to all for the phenomenal response 🙏 Book Your Tickets Now: https://t.co/l2Jw77hHje https://t.co/ddkMF6fRty @directormaruthi @itsanuemmanuel @vamsi84 pic.twitter.com/LSddrkrpHU — Sithara Entertainments (@SitharaEnts) September 14, 2018 -
‘యువసామ్రాట్’ వద్దన్నా
‘‘సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో, డైరెక్టర్దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఫుల్గా ఈగో ఫీల్ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్కు మరింత చేరువ అవుతాను. ► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్ చేయడం కాస్త నెర్వస్గా అనిపించింది. ► ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో ఏది సక్సెస్ కావాలంటే.. రెండూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ► యువసామ్రాట్ ట్యాగ్ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్ను పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చదువుతాను. నెగటివ్ కామెంట్స్ను పాజిటివ్గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా. ► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్ రవీంద్రన్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్ మీడియా వైపు మా బ్యానర్ ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నాం. ► కొత్త డైరెక్టర్స్ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్’కు బాగా కనెక్ట్ అయ్యాను. ► పెళ్లి తర్వాత లైఫ్ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్ సూపర్గా సాగడం హ్యాపీగా ఉంది. ► కెరీర్ పరంగా యాక్టర్స్ అందరికీ థ్రెట్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
కేటీఆర్పై నాగ చైతన్య కామెంట్!
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు నాగచైతన్య. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మారుతి స్టైల్ టేకింగ్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్మీడియాలో ఆన్లైన్లోకి వచ్చాడు ఈ యువ హీరో. అభిమానుల ప్రశ్నల తాకిడికి కూల్గా సమాధానమిచ్చాడు. ఈ సినిమాలో తనకు నచ్చిన పాటలు, రాబోయో తన ప్రాజెక్ట్ల గురించి, అజిత్, రామ్చరణ్, ప్రభాస్ ఇలా హీరోలందరి గురించి తన అభిప్రాయాన్ని తెలపమని నాగచైతన్యను అడిగారు. ఇక దీంట్లో భాగంగా కేటీఆర్ గురించి అడగ్గా.. ఆయనొక నిజమైన లీడర్.. ప్రభావితం చేయగల నాయకుడంటూ బదులిచ్చారు. ప్రభాస్ గురించి అడగ్గా.. లార్జర్ దెన్ లైఫ్ అని, రామ్ చరణ్పై స్పందిస్తూ.. సినిమా సినిమాకు బెటర్ అవుతూ ఉంటున్నాడు..అతని స్టైల్ ఇష్టమని సమాధానమిచ్చాడు. వెంకటేష్, రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ బాబు, నాగార్జునలకు సంబంధించిన ప్రశ్నలు అభిమానులు అడిగారు. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13న విడుదల కానుంది. -
నా నడక భారతీయ స్త్రీల మాదిరి ఉండదు..
సినిమా: నా నడకే ఒక కిక్కు అంటోంది నటి అను ఇమ్మానుయేల్. ఏంటీ అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా? మీరేమైనా అనుకోండి నా స్టైలే వేరు అంటోంది ఈ అమ్మడు. అన్నట్టు ఈమె చికాగో బ్యూటీ అన్న విషయం ఎందరికి తెలుసు? అయితే మాలీవుడ్కు బాల నటిగా కాలు పెట్టి, అక్కడే కథానాయకిగా కూడా నటించేసింది. ఇంకేముంది మాలీవుడ్లో నటిస్తే టాలీవుడ్, కోలీవుడ్లకు ఈ బ్యూటీ ఎంట్రీ ఈజీనే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే జరిగింది. మాలీవుడ్ నుంచి సరాసరి టాలీవుడ్కు ఆపై కోలీవుడ్కు దిగుమతి అయిపోయింది. తెలుగులో మజ్ను చిత్రం మంచి విజయాన్ని అందించడంతో అక్కడ చకచకా పవన్కల్యాణ్, అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేసింది. అయితే అవేవి అమ్మడి కెరీక్కు ఉపయోగపడలేదు. తాజాగా నాగచైతన్యతో నటించిన శైలజారెడ్డి అల్లుడు ఇటీవల తెరపైకి రానుంది. ప్రస్తుతం మరో అవకాశం చేతిలో లేదు. ఇక కోలీవుడ్లోనూ మంచి ఎంట్రీనే లభించింది. విశాల్కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం హిట్ అయినా అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అమ్మడు వార్తల్లో ఉంటూ ఉచిత ప్రచారం పొందాలనుకుంటోంది. అందులో భాగంగానే నా నడకలోనూ కిక్కు ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఈ జాణ ఏమంటుందో చూస్తే ఓ పనైపోద్దిగా! నేను చీర కట్టినా నాలో అమెరికా యువతి చాయలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నేను చీర కట్టినా, సెర్చ్కు వెళ్లినా నా శారీరక భాష భారతీయ అమ్మాయిలకు భిన్నంగానే ఉంటుంది. నేను కూర్చున్నా, నడిచినా భారతీయ స్త్రీల మాదిరి ఉండదు. ఇంకా చెప్పాలంటే నా నడకలోనే ఓ కిక్కు ఉంటుంది. అందుకు లెక్క నేను అమెరికా అమ్మాయి కావడమే. ఇక్కడ చిత్రాల్లో నటిస్తుండడంతో ఇండియన్ స్త్రీల వస్త్రాధరణను గమనిస్తూ అలవాటు చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను చాలా శాంత స్వభావిని. గట్టిగా మాట్లాడను కూడా. ఇతరులు ఎంతగా మాట్లాడుతున్నా గమనిస్తూ ఉంటాను. అలాంటి ఇప్పుడు ఒక చిత్రంలో నా స్వభావానికి విరుద్ధమైన పాత్రలో నటిస్తున్నాను. ఈర్శా్యభావం కలిగిన అమ్మయిగా బిగ్గరగా అరచి నటించిన సన్నివేశాలు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అని అంటున్న అనుఇమ్మానుయేల్ తను అంతగా హంగామా చేసి నటిస్తున్న చిత్రం ఏదో చెప్పలేదు. బహుశా తెలుగు చిత్రం శైలజారెడ్డి అల్లుడు అనుకుంటా. -
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్లో సడెన్గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్
‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్ (హీరో క్యారెక్టర్కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం. ► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ పర్సన్. ► ఫస్ట్ యూత్ఫుల్ స్టోరీ (‘ఈ రోజుల్లో’), హారర్ కామెడీ (ప్రేమకథా చిత్రమ్), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ (‘భలే భలే మగాడివోయ్’) తీశాం. ఇప్పుడు ఫుల్లెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ టచ్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం. ► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు. రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను. ► అనూ ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, ప్రసాద్గార్లు రిచ్గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా రిచ్గా ఉంటుంది. ► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్ వర్క్ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్ చేయడం గ్రేట్. కొత్తవాళ్ల పోస్టర్స్తో ఆడియన్స్ను థియేటర్కి తీసుకురావడం గ్రేట్. -
గళం గాళ్స్
కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారు. అవునూ.. తెర మీద ఈ బంగారు బొమ్మలు కనపడుతుంటే కళ్లు మూసుకునే ఫూల్ ఎవరైనా ఉంటారా? చాన్స్ లేదు. కళ్లు మూసే చాన్సే లేదు. మరి.. కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారంటున్నారు. వాయిస్ అమ్మా వాయిస్. ఇక యాక్టింగ్, పెర్ఫార్మెన్సే కాదు.. డబ్బింగ్ కూడా వాళ్లే చెప్పుకుంటున్నారు. వీళ్లిక గ్లామర్ గాళ్సే కాదు.. గళం గాళ్స్ కూడా. చెప్పాం కదా.. ఇక ముందు కళ్లు మూసుకున్నా వీళ్లే కనిపిస్తారు... కాదు.. వినిపిస్తారు. పాత రోజుల్లో మన హీరోయిన్లు ఎంచక్కా వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుని పాటలు కూడా పాడుకునేవారు. ఆ తర్వాత బొంబాయి హీరోయిన్ల దిగుమతి ప్రారంభం కావడంతో వాళ్లు షూటింగ్ స్పాట్లో హిందీలో చిలుక పలుకులు పలికితే దానికి మన తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్లు వెనుక నుంచి గాత్రదానం చేయడం మొదలైంది. ఆ తర్వాత అడపాదడపా మన భాష రాని హీరోయిన్లు తెలుగు భాష నేర్చుకొని మరీ డబ్బింగ్లు చెబుతున్నారు. ఈ మధ్య ఈ జోరు పెరిగింది. ఇప్పుడు కథానాయికలు మాకింక మాట సాయం వద్దు అంటున్నారు. పాత్రకు పరిపూర్ణత తీసుకురావడం కోసం తమ సొంత గొంతుని వినిపించడానికి రెడీ అవుతున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన, రానున్న చిత్రాల్లో తమ సొంత గొంతునే వినిపించడానికి ప్రిపేర్ అయిన హీరోయిన్లు ఎవరో చూద్దాం. దేవదాస్లో సొంత గొంతు ‘ఛలో, గీత గోవిందం’ వంటి బ్లాక్బస్టర్ హిట్స్తో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ దిశగా అడుగులేస్తున్న నటి రష్మికా మండన్నా. తన నెక్ట్స్ రిలీజ్ నాగార్జున, నానీ మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ సినిమాలో తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నారు రష్మిక. సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమవుతున్నారు ఈ కన్నడ భామ. కన్నడం, తెలుగు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటంతో తెలుగు మాట్లాడటం తనకు పెద్ద కష్టం అనిపించకపోవచ్చు. సొంత గొంతు సమేతంగా..! ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో అరువు గొంతుకు స్ట్రిక్ట్గా నో అన్నారు పూజా హెగ్డే. త్రివిక్రమ్ సినిమాల్లో సంభాషణలకే ఫస్ట్ సీట్ దక్కుతుంది. అలాంటప్పుడు భాష మీద పట్టుంటే తప్ప అనుకున్నంత సులువు అవ్వదు తెలుగు డబ్బింగ్. అయినా రిస్క్ తీసుకోదలిచారు పూజా హెగ్డే. ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారామె. ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. దసరాకు రిలీజ్ కానున్న ఈ సినిమాలో పూజ ఫస్ట్ టైమ్ తెలుగు సంభాషణలు ఎలా పలుకుతారో వేచి చూడాలి. ఆల్రెడీ ఈ ఏడాది రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో హీరోయిన్స్ కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్తో తెలుగు డబ్బింగ్ చెప్పించిన త్రివిక్రమ్ ‘అరవింద సమేత..’కు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సూటిగా నత్తి లేకుండా నటిగా ఎనిమిదేళ్ల కెరీర్, తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్నారు సమంత. కానీ చాలా సంవత్సరాలు తన గొంతును మనకు వినిపించలేదు. ఆమె సక్సెస్లో చిన్న వాటా సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి దక్కక మానదు. సమంత తొలి తెలుగు సినిమా ‘ఏ మాయ చేసావె’లో జెస్సీ పాత్రకు ఆమె చెప్పిన డబ్బింగ్ స్పెషల్ అట్రాక్షన్. అప్పుడు మొదలైన ఈ మాట సాయం చాలా కాలం సాగింది. చిన్మయి వాయిస్ సమంతదేనా అనిపించేంత పాపులర్ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘మహానటి’ సినిమా ద్వారా అభిమానులకు తన సొంత గొంతును వినిపించారు సమంత. మధురవాణి అనే జర్నలిస్ట్ పాత్ర. పేరుకే మధురవాణి కానీ సూటిగా సుత్తి లేకుండా మధురంగా మాట్లాడలేదు. కంగారు వస్తే నత్తి వచ్చేస్తుంది. నిజానికి నత్తి నత్తిగా డబ్బింగ్ చెప్పడం కష్టం. పైగా ఫస్ట్ టైమ్ డబ్బింగ్. కానీ సమంత నత్తి డైలాగ్స్ పలికి చప్పట్లు కొట్టించుకున్నారు. రీలీజ్కు రెడీ అయిన ఆమె లేటెస్ట్ సినిమా ‘యు టర్న్’ సినిమాలో కూడా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ ద్విభాషా చిత్రంలోనూ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారామె. సమంత తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న రెండు సినిమాల్లో ఆమె జర్నలిస్ట్ పాత్ర పోషించడం విశేషం. ‘హలో.. నమష్కారం’ అంటూ ఆడియో వేడుకల్లో, ప్రెస్మీట్స్లో ముద్దు ముద్దుగా తెలుగు పలికే పరభాషల కథానాయికలు తెలుగు నేర్చుకుని మరీ సొంత గొంతు వినిపించాలనుకోవడం అభినందనీయం. సొంత గొంతు వినిపిస్తే ‘కంప్లీట్ ఆర్టిస్ట్’ అనిపించుకునే అవకాశం ఉందని డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. కొన్ని సార్లు పరిపూర్ణత కోసం అత్యుత్సాహం ప్రదర్శించి డబ్బింగ్ చెప్పుకున్నా పదాలు సరిగ్గా రాకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే భాషలోని మాధుర్యం బట్టీ పడితే వచ్చేది కాదు కదా. అందుకే వీలైనంత పర్ఫెక్ట్ తెలుగు సంభాషణలు పలకడానికి కథానాయికలు ట్రై చేస్తున్నారు. ఇలా ఆల్రెడీ డబ్బింగ్ చెప్పుకున్న వాళ్లందరూ ఇక మీదట కంటిన్యూ చేస్తామని అంటున్నారు. రాబోతున్న నటీమణులు కూడా త్వరలోనే సొంతంగా డబ్బింగ్ చెబుతాం అంటున్నారు. ఇలా హీరోయిన్స్ అందరూ తమ పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకోవడం మంచి పరిణామమే. ఈ లిస్ట్ ఇలానే పెరుగుతూ ఉంటుందని, ఉండాలని కోరుకుందాం. వంక పెట్టలేని కీర్తి ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఫస్ట్ టైమ్ తన గొంతును వినిపించారు కీర్తీ సురేశ్. అదో చాలెంజ్. ఆ తర్వాత మరో పెద్ద చాలెంజ్ను ఎంచుకున్నారామె. అదేంటంటే.. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను పోషించడమే కాకుండా ఆ పాత్రకు స్వయంగా సంభాషణలు చెప్పడం. కానీ ఎక్కడా కూడా వంక పెట్టలేనట్టుగా నటించడమే కాకుండా సంభాషణలు కూడా బాగా పలికారు కీర్తీ సురేశ్. సావిత్రి జీవితంలో అన్ని దశలను చూపించిన కథ ఇది. యవ్వనంలోని కొంటెతనం, సూపర్ సక్సెస్లో ఉన్నప్పుడు హుందాతనం, అన్నీ కోల్పోయిన తర్వాత నైరాశ్యం.. ఇలా అన్ని రకాల్లో సంభాషణలు పలకడం కష్టం. కానీ వీటన్నింటినీ అవలీలగా చేసి చూపించారు కీర్తి. తాగుడుకు బానిస అయిన పాత్రలో లావుగా కనిపిస్తారు. ఆ సీన్స్కు డబ్బింగ్ చెప్పడం కోసం నోట్లో దూదులు ఉంచుకొని మరీ డబ్బింగ్ చెప్పారామె. ఈ కష్టాన్నంతా బాక్సాఫీస్ సక్సెస్ ఇచ్చి తుడిచేసింది. కో–స్టార్స్కీ డబ్బింగ్! విశేషం ఏంటంటే తమ పాత్రలకే కాదు తమ కో–స్టార్స్కి కూడా కొన్ని సందర్భాల్లో డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచారు పరభాష నటీమణులు. ‘చందమామ’ సినిమాలో కాజల్ పాత్రకు చార్మీ డబ్బింగ్ చెప్పారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా గొంతు సాయం చేశారు నిత్యామీనన్. వీళ్లకన్నా ముందు ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నవాళ్ల గురించి తెలుసుకున్నాం. వీళ్లకంటే ముందే ఈ లిస్ట్లో ఉన్న కొందరు నటీమణుల లిస్ట్ గమనిస్తే ‘అలా మొదలైంది’లో నిత్యామీనన్, ‘రాఖీ’ సినిమాలో చార్మీ, ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో నయనతార, ‘మొగుడు’ సినిమా కోసం తాప్సీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్ ప్రీత్సింగ్, ఇంకా నివేథా థామస్, రాశీ ఖన్నా, అనుపమా పరమేశ్వరన్ సొంత గొంతు వినిపించారు. ‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పారు. కుర్ర తారలు ఎంత పట్టుదలగా ఉన్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం. తెలుగు రాని సూపర్ స్టార్ మణిరత్నం ‘చెలియా’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ను పలకరించారు బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీ. అయితే అది డబ్బింగ్ సినిమా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ‘సమ్మోహనం’లో తన గొంతునే వినిపించారు. ఈ సినిమాలో తెలుగు వచ్చీ రానీ, తెలుగుతో ఇబ్బంది పడే స్టార్ హీరోయిన్ సమీరా రాథోడ్లా నటించారు అదితీరావ్ హైదరీ. సో.. అక్కడక్కడా పదాల ఉచ్ఛారణ స్పష్టంగా లేకపోయినా పాత్ర స్వభావంలో కొట్టుకుపోయింది. పాత్ర నచ్చడంతో డబ్బింగ్ చెప్పుకున్నాను అని పేర్కొన్నారామె. తన నటనకే కాకుండా డబ్బింగ్కి కూడా మంచి మార్క్స్ పడ్డాయి. సినిమాతో పాటు అదితీ కూడా సూపర్ హిట్ అయ్యారు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్లో చాలా సినిమాలు చేసి, నార్త్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్బస్టర్ మూవీస్లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్బాబు ఏ ఆర్టిస్ట్ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్క్యూజ్మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య. మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ ట్రైలర్లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ మారుతి గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ అందించడానికి సిద్దమయ్యాడు. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్ డైలాగ్స్, ట్విస్ట్లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్లోనూ తన మార్క్ కనిపంచేలా చేశాడు. వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ పంచ్లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. -
పండగకి అల్లుడొస్తున్నాడు
‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చే టైమ్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 13న అల్లుడు థియేటర్లలోకి రానున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఎస్. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కావాల్సింది. అయితే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కేరళలో జరుగుతుండటం.. అక్కడ వరదల వల్ల ఆటంకం ఏర్పడటంతో విడుదలను వాయిదా వేశారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో చైతూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
రెండోసారి...
‘మజ్ను’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు మలయాళ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్. అందం, అభినయంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గత ఏడాది మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన ‘తుప్పరివాలన్’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారామె. ఆ సినిమా మంచి హిట్ అయింది. తాజాగా కోలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ అనూని వరించిందని సమాచారం. తమిళంలో వరుస హిట్స్తో దూసుకెళుతోన్న విజయ్ సేతుపతితో జత కట్టే అవకాశం ఆమె తలుపు తట్టిందట. తన పాత్ర నచ్చడం.. విజయ్ సేతుపతి సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉండటంతో వెంటనే ఓకే చెప్పేశారట అను. తెలుగులో అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
అను ఖాతాలో మరో క్రేజీ ఆఫర్
కెరీర్లో పెద్దగా హిట్స్ లేకపోయినా గ్లామర్ లుక్స్ తో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ అను ఇమ్మాన్యూల్. మలయాళ ఇండస్ట్రీలో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో పర్వాలేదనిపించినా తరువాత అను నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. తమిళ్లో చేసిన ఒక్క సినిమా తుప్పారివాలన్ మాత్రం ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ భామ కోలీవుడ్ క్రేజీ హీరో సరసన నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి సరసన నటించేందుకు అను ఇమ్మాన్యూల్ ఓకె చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ప్రియ రాగాలు
గోవా తీరంలో ప్రేయసితో కలిసి ప్రియరాగాలు పాడారు నాగచైతన్య. మరి.. ఎలాంటి బ్యూటీఫుల్ లొకేషన్స్లో ఈ సాంగ్ను చిత్రీకరించారనేది ఇప్పుడు సస్పెన్స్. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించారు. నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేశారని టాక్. ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క సాంగ్ను గోవాలో పూర్తి చేశారు చిత్రబృందం. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, అనూ బేబి సాంగ్ టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. రెండో సాంగ్ను రేపు విడుదల చేయనున్నారు. గిరిబాబు, నరేశ్, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్ను శుక్రవారం విడుదల చేశారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్ వీడియో టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్లో విడుదల చేశాం. కృష్ణకాంత్ రాశారు. అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు. -
గోవాలో అల్లుడి ఆటాపాటా!
టీజర్, సాంగ్స్తో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు చిత్ర యూనిట్. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. ‘రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమా తరువాత నాగ చైతన్య వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. ఈ అక్కినేని యువ హీరో సవ్యసాచి, శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తూ బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో రానున్న శైలజా రెడ్డి అల్లుడు మూవీ షూటింగ్కు కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోందని డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశాడు. అను ఇమ్మాన్యుయేల్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. #ShailajaReddyAlludu song shoot pic.twitter.com/5ghDmovy1n — Maruthi dasari (@DirectorMaruthi) August 10, 2018 -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మంచి ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ స్పీడులోనే చకచకా ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్లో మరో సినిమాను ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు టీజర్ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్తో ఇది వరకే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కథకు మారుతి తనదైన టేకింగ్ను జోడించి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’ అనే డైలాగ్తో సినిమా థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. గోపి సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. లుక్స్ పరంగా నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకున్నారు. కీలకపాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా టీజర్ను కట్ చేశారు. ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. -
ఆగస్టు 31న ‘శైలజా రెడ్డి అల్లుడు’
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకంటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. And yes #SailajaReddyAlludu will be releasing on august 31st .. An emotional journey of love packaged with @DirectorMaruthi entertainment in its peak ! pic.twitter.com/65k9tFrBxB — chaitanya akkineni (@chay_akkineni) 30 July 2018 -
చాన్స్లకు కొదవ లేదు!
తమిళసినిమా: అవకాశాలకేం కొదవ లేదు అంటోంది నటి అనుఇమ్మానువేల్. అమెరికాకు చెందిన ఈ 21 ఏళ్ల పరువాల భామ 2011లోనే కథానాయకిగా మాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. అక్కడ రెండు చిత్రాలు చేయగానే టాలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అక్కడ తొలి చిత్రం మజ్ను మంచి విజయాన్ని అందించడంతో అమ్మడు అక్కడే సెటిల్ అయిపోయింది.ఆ మధ్య విశాల్ తకు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో కోలీవుడ్కు తీసుకొచ్చినా, అనుఇమ్మానువేల్ను ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. మొత్తం మీద ఈ ఎనిమిదేళ్లలో తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కలిపి 8 చిత్రాలే చేసింది. అయితే గ్లామర్ విషయంలో ఎల్లలు లేవన్నట్టుగా నటించడానికి రెడీ అంటున్నా ఎందుకో అంత క్రేజ్ రాలేదు. ఇటీవల అల్లుఅర్జున్తో రొమాన్స్ చేసిన నా పేరు సూర్య చిత్రంపై అనుఇమ్మానువేల్ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఆది ఆశించిన విజయం సాధించకపోవడం ఈ బ్యూటీ కెరీర్కు పెద్ద దెబ్బే అని చెప్పకతప్పదు. ప్రస్తుతం తెలుగులో ఒక్క చిత్రం మాత్రమే చేతిలో ఉంది. ఇతర భాషల్లో అ ఒక్కటి కూడా లేదు. అవకాశాలు తగ్గి పోయాయే అన్న ప్రశ్నకు ఈ బ్యూటీ ఏ మంటుందో చూద్దాం. నాకు అవకాశాలు రావడం లేదు అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నిజానికి నాకు అవకాశాలకు కొదవ లేదు. అయితే వచ్చిన అవకాశాలన్నింటినీ ఒప్పుకోవడం లేదు. నటనకు అవకాశం ఉన్న మంచి అవకాశాలనే అంగీకరిస్తున్నాను. నటనలో ఎదగాలి.మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి అన్న ఆసక్తి నాలో ఉంది. అందుకే అవకాశాల కోసం ఆతృత పడడం లేదు. ఒకే సమయంలో నాలుగైదు చిత్రాలు చేసేయాలని కోరుకోవడం లేదు. ఒక్క చిత్రం చేసినా అది పేరు తెచ్చి పెట్టేదిగా ఉండాలని ఆశిస్తున్నాను. అలాంటి చిత్రాలే నన్నిక్కడ పది కాలాల పాటు నిలబెడతాయి. కొందరు చిత్రం తరువాత చిత్రం చేస్తుంటారు. నాదీ అదే పాలసీ. ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తరువాతే మరో చిత్రం ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యకు జంటగా ఒక చిత్రం చేయడానికి అంగీకరించాను. -
తారుమారు
సినిమా కథల్లోలాగే సినిమా మేకింగ్లో కూడా ట్విస్టులుంటాయి. మన ఒళ్లో పడ్డ బంగారాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం.. మనకి వర్కవుట్ కాదనుకున్నది ఇంకొకరికి బీభత్సంగా వర్కవుట్ అవ్వడం... మనకు ఫిట్ కాదనుకున్నది ఇంకొకరికి హిట్ అవ్వడం..ఇలాంటి ట్విస్టులు మారుమారు తారుమారు. ‘ప్రాప్తమున్న తీరానికి పడవ చేరుకుంటుంది’ అన్నాడొక కవి. ‘దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్’ అంటాడు ఉత్తర దేశపు యతి. ‘అంతా లలాట లిఖితం’ అనుకుంటాడు వేదాంతి. ఏమైనా అటుకులు చిటుకులు మారుతుంటాయి. త్రాసులోని పళ్లేలు ఉల్టాపల్టా అవుతుంటాయి. పూలు పండ్లవుతుంటాయి. పండ్లు పేస్ట్రీలవుతుంటాయి. రజనీకాంత్ అన్నట్టు ‘దక్కేది దక్కకుండా పోదు దక్కనిది ఎన్నటికీ దక్కదు’. మొన్న చూడండి... ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు తెలియదు... హీరో తెలియదు... హీరోయిన్ తెలియదు... కాని రెండు కోట్లతో తీసిన సినిమాకు 10 కోట్లు వచ్చాయని టాక్. ఈ సినిమా మొదట హీరో నిఖిల్ దగ్గరకు పోయిందట. సుధీర్ దగ్గరకు కూడా పోయిందట. కాని వాళ్లు రిజెక్ట్ చేశారు. ఆ సినిమా కోసం ఫోకస్ చేయాల్సిన కెమెరా ఎదుట నిలవాల్సింది ‘కార్తికేయ గుమ్మకొండ’ అని విధి నిర్ణయించినప్పుడు ఇలాంటి వైచిత్రే చోటు చేసుకుంటూ ఉంటుంది.సినిమాల్లో ఇవి మామూలే. అవకాశం రానంత వరకూ ఒక బాధ. అవకాశం వచ్చి వదులుకోవాల్సినప్పుడు ఇంకో బాధ. సరిగ్గా జడ్జ్ చేయకుండా వదిలేసి అది కాస్త హిట్ అయితే ఇంకో బాధ. ఇంద్రగంటి మోహనకృష్ణ రెండు హిట్స్ ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ కూడా మొదట వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. ‘జెంటిల్మెన్’ కోసం శర్వానంద్, వరుణ్తేజ్లను సంప్రదించాడు దర్శకుడు. కాని ఆ హిట్ నానీ అకౌంట్లో పడింది. ‘సమ్మోహనం’ కోసం కూడా నిఖిల్ని, నానిని అనుకుంటే ఆ సినిమాలోని కీలక సన్నివేశం టెర్రస్ సీన్ లాంటిది గతంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో సమంతతో తాను చేసి ఉన్నాడు కనుక నాని ఆలోచనలో పడ్డాడని ఫలితంగా ఆ మిఠాయి పొట్లం సుధీర్ జేబులో పడిందని సమాచారం. ‘బాహుబలి’ కోసం శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకుంటే ఆ బర్గండీ రంగు చీర ధరించే పాత్రకు రమ్యకృష్ణ హక్కుదారు కాలేదూ? సక్సెస్ అనే ఏనుగు మాల పట్టుకొని వీధిలోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అది మన మెడలో పడేలా చూసుకోవాలి. లేకుంటే అర్ధరాజ్యం, రాకుమారి ఎవరి పరమో అయిపోతుంది. ‘శతమానం భవతి’ మొదట సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. ఎందుకో వర్కవుట్ కాలేదు. రాజ్ తరుణ్కు కూడా ఈ సినిమా చిక్కాల్సింది. అయితే చిక్కించుకున్నవాడు శర్వానంద్. ఇక దర్శకుడు వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం మొదట అనుకున్నది ఎన్.టి.ఆర్ను అన్న సంగతి తెలిసిందే. జరిగిపోయిన సినిమాల కథ ఇలా ఉంటే జరుగుతున్న సినిమాల కథ కూడా కుతూహలం రేపుతోంది. శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’గా రవితేజను చూపించాలని సినిమా మొదలుపెట్టారు. హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్ను తీసుకున్నారు. కాని అనూకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వివాదం ఎటుపోయి ఎటు వస్తుందని అనుకున్నారో ఏమో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ స్టేట్మెంట్ ఇస్తూ నాగచైతన్యతో ‘ శైలజారెడ్డి అల్లుడు’ చేస్తున్నాను. ఆ డేట్స్ రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డేట్స్తో క్లాష్ అవుతున్నాయి. అందుకే రవితేజ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అన్నారు. వాస్తవం ఏదైనా ఈ అవకాశం ఇలియానాకు ప్రాప్తమైంది. బాలీవుడ్కు వెళ్లి తెలుగుకు ఆరేళ్లుగా దూరంగా ఉన్న ఇలియానా ఈ సినిమాతో మళ్లీ కనిపించనుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం, బుక్ మై షోలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా పాత్రలు మారే తీరు తమిళంలో ఇంకా ఊపు మీద ఉంది. దర్శకుడు సి.సుందర్ అక్కడ 250 కోట్ల భారీ బడ్జెట్తో ‘సంఘమిత్ర’ అనే సినిమా పనులు మొదలెట్టారు. లీడ్ రోల్ శ్రుతిహాసన్కు వెళ్లింది. జయం రవి, ఆర్య కీలక పాత్రలు. అంతా హ్యాపీనే అనుకుంటూ ఉన్నప్పుడు ట్విస్ట్ వచ్చింది. ‘సంఘమిత్ర’ టీమ్తో తనకు సెట్ కావడం లేదని, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదని, క్యాలెండర్ డిటేల్స్ కూడా చెప్పలేదని శ్రుతి ఆరోపించారు. సినిమా నిర్మాతలు ఇంకో వెర్షన్ చెప్పారు. శ్రుతితో ఎఫెక్టివ్గా పని చేయలేమని మేమే నిర్ణయించుకున్నాం అన్నారు. మరి సంఘమిత్ర పాత్రను ఎవరు చేయబోతున్నారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నయనతార, అనుష్క, హన్సిక ఇలా సౌత్లో చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఫైనల్గా ‘ఎం.ఎస్.ధోని’లో నటించిన దిశా పాట్నీకి ఆ చాన్స్ వెళ్లింది. త్రిష కూడా ఇటీవల ఇలాగే తప్పుకున్నారు. విక్రమ్ హీరోగా ఆమె హీరోయిన్గా హరి దర్శకత్వంలో ‘సామీ స్క్వేర్’ అనే సినిమా మొదలైంది. ఇది గతంలో పెద్ద హిట్టయిన ‘సామీ’కి సీక్వెల్. మొదటి భాగంలో నటించినందున తనను రిపీట్ చేశారని త్రిష అనుకున్నట్టున్నారు. అయితే నిర్మాతలు కీర్తి సురేష్ను హీరోయిగా తీసుకుని త్రిష చేస్తున్నది సెకండ్ హీరోయిన్ పాత్ర అనే హింట్ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే ఇది పూలమ్మిన చోట కట్టెలమ్మడం అవుతుంది. దాంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో త్రిష తప్పుకుంటే ఆ నూకలు ‘ఐశ్వర్య రాజేష్’కు దక్కాయి. ఇలా తమిళ సాంబారుకు తెలుగు పోపు పడిన మరో ఘటన కూడా జరిగింది. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా మొదలైతే అందులో అల్లు శిరీష్ ఒక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ లండన్లో షూటింగ్కు మరో తమిళ నటుడు ఆర్య శిరిష్ స్థానంలో హాజరైనట్టు తెలిసింది. ఏం జరిగిందో తెలియదు కానీ డేట్స్ ప్రాబ్లమ్తో నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను అని అల్లు శిరీష్ స్టేట్మెంట్ ఇచ్చారు. దర్శకుల విషయంలో కూడా మార్పుచేర్పులు జరగడం ఇటీవల జరుగుతోంది. ‘సర్దార్ గబ్బర్సింగ్’కు మొదట దర్శకుడిగా సంపత్ నందిను అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాబీకి దక్కింది. ‘కాటమరాయుడు’ కోసం ఎస్.జె.సూర్య సైన్ చేశారు. కానీ షూటింగ్ కూడా మొదలయ్యే దశలో ఆ అవకాశం కిశోర్ పార్థసాని (డాలీ)కు దక్కింది. హిందీలో హిట్ అయిన ‘క్వీన్’ దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగులో అవకాశం నీలకంఠకు వెళ్లింది. హీరోయిన్గా తమన్నాను తీసుకున్నారు. అయితే దర్శకునికీ హీరోయిన్కు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు పొక్కాయి. దర్శకుడు మారాడు. నీలకంఠ స్థానంలో ‘ఆ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మెగాఫోన్ను ధరించాడు. సినిమా పేరు ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ దర్శకత్వంలో హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. కాని కొన్ని రోజులకు ఈ సినిమా నుంచి తేజ తప్పుకోనున్నారట అనే లీకులు వినిపించాయి. చివరికి ఈ లీకులే నిజమైయ్యాయి. ఆ స్థానంలో దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత అయినా దర్శకుడు అయినా హీరో అయినా ఒక సినిమా గురించి ఆలోచించినప్పుడు మొదట కోరుకునేది సక్సెస్నే. కొన్ని పాత్రలు కొందరు చేస్తే బాగుంటుందని అనుకోవచ్చు. కాని అన్నిసార్లు అది కుదరక పోవచ్చు. వాటిని దక్కించుకున్నవారు అనుకున్నవారి కంటే బాగా చేసి మెప్పించవచ్చు. తెర వెనుక జరిగే ఈ విషయాలు సినీ అభిమానులకు ఆసక్తి కలిగించేవే. కాని థియేటర్లో వారు ప్రేక్షకులుగా కూచున్నప్పుడు తెర మీద ఏం కనిపిస్తున్నది తమను ఎలా మెప్పిస్తున్నదే ముఖ్యం. మార్పుచేర్పులతో కూడా సినిమాకు మంచే జరగాలని కోరుకుందాం. భానుమతి బదులు సావిత్రి పాత రోజులలో కూడా చాలా రీప్లే్లస్మెంట్స్ ఆర్టిస్టులకు లాభించాయి. ‘మిస్సమ్మ’లో మొదట భానుమతిని అనుకుని కొంచెం షూటింగ్ తర్వాత ఆమెను తొలగించి సావిత్రిని తీసుకున్నారు. ఆ సినిమాతో ఆమె స్టార్ అయ్యింది. అలాగే జానపదాలకు పేరు గడించిన అక్కినేనిని మొదట ‘పాతాళభైరవి’కి అనుకున్నారు. కానీ ఎన్.టి.ఆర్. తోటరాముడుగా స్టార్ అయ్యారు. సాంఘికాలతో గుర్తింపు పొందుతున్న ఎన్.టి.ఆర్ను ‘దేవదాసు’కు అనుకున్నారు. ఎ.ఎన్.ఆర్ ఆ పాత్ర వేసి కీర్తి పొందారు. ‘రక్తసంబంధం’ సినిమా మొదట ఎ.ఎన్.ఆర్కు వెళ్లింది. కానీ చెల్లెలి పాత్రలో సావిత్రి ఉంటే తమ జంటను యాక్సెప్ట్ చేయరేమో అన్న సందేహం ఆయన వ్యక్తం చేశారు. ఆ పాత్ర ఎన్.టి.ఆర్కు చాలా పేరు తెచ్చి పెట్టింది. ‘సాగర సంగమం’లో హీరోయిన్ వేషం మొదట జయసుధకు వెళ్లింది. కానీ జయప్రదకు ఆ పాత్ర రాసి పెట్టి ఉంది. ‘పడమటి సంధ్యారాగం’లో హీరోయిన్గా చేయాల్సింది సుహాసిని. కానీ ఎంతో చక్కగా ఆ పాత్ర పోషించి విజయశాంతి పేరు తెచ్చుకున్నారు. ‘ఖైదీ’ సూపర్స్టార్ కృష్ణ చేయాల్సింది. కానీ చిరంజీవికి దక్కి పెద్ద స్టార్ అయ్యారు. ‘సమరసింహారెడ్డి’ కథ మొదట వెంకటేశ్ దగ్గరకు వెళ్లింది. కానీ బాలకృష్ణ ఆ పాత్రతో కొత్త ట్రెండ్ను సృష్టించారు. ఇక రవితేజతో చేయాల్సిన ‘పోకిరి’ మహేశ్బాబుకు దక్కి ఆయన కెరీర్ను ఎంత మలుపు తిప్పిందో తెలిసిందే. – సినిమా డెస్క్, ఇన్పుట్స్: శివాంజనేయులు -
అల్లుడి సందడి
ఒక్క సాంగ్ మినహాయించి పని మొత్తాన్ని పూర్తి చేశారు శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రీసెంట్గా గుడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అనుకున్న టైమ్కి షూటింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఇంతకీ అల్లుడు థియేటర్లో సందడి చేసేది ఎప్పుడు అంటే.. వచ్చే ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
అల్లుడి జాగారం
అల్లుడు అండ్ టీమ్ నైట్ అంతా నిద్రపోలేదట. ఎవరీ అల్లుడు అంటే.. కేరాఫ్ శైలజారెడ్డి అన్నమాట. మరి... నిద్రపోకుండా ఏం చేశారు? అది మాత్రం సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నైట్ టైమ్ జరుగుతోంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
అత్త.. అల్లుడొచ్చారు
కుర్చీలో ఠీవీగా కూర్చుని ఓర కంటితో కాసింత కోపంగా అల్లుడు, కూతుర్ని (నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్) చూస్తున్నారు శైలజారెడ్డి (రమ్యకృష్ణ). అల్లుడేమో అత్తని ఆటపట్టిస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తుంటే.. కూతురేమో భర్తవైపు ఆప్యాయంగా చూస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని సోమవారం రిలీజ్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్పై నాగచైతన్య స్పందిస్తూ – ‘‘డైరెక్టర్ మారుతిగారు ఆఫ్ స్క్రీన్ నన్ను ఎంటర్టైన్ చేస్తున్నట్లే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయబోతున్నారు. సితార బ్యానర్లో పనిచేయడం నాకు ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. రమ్యకృష్ణగారి పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది’’ అన్నారు. -
ఫస్ట్ లుక్: అల్లుడు-కూతురితో శైలజారెడ్డి
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో నాగచైతన్య డిఫరెంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి యత్నిస్తున్నాడు. మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. The first look of #ShailajaReddyAlludu as promised by @DirectorMaruthi who entertains me off screen as much as he is going to entertain you all onscreen .. always a pleasure working with @SitharaEnts , Anu Emmanuel .. Ramya Garu’s role is going to be something to watch out for! pic.twitter.com/r36FttKx9Z — chaitanya akkineni (@chay_akkineni) 9 July 2018 -
అల్లుడు వస్తున్నాడు
అల్లుడు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. మరి.. అల్లుడికి అత్తయ శైలజారెడ్డి ఎలాంటి సౌకర్యాలు, ఏ స్థాయి స్వాగత మర్వాదలు చేశారనేది సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా నాగచైతన్య, అను, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 9న ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘శైలజా రెడ్డి అల్లుడు వస్తున్నాడు’’ అని పేర్కొన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
అల్లుడికి ఆతిథ్యం
కొత్త అల్లుడు ఇంటికొస్తే అత్తారింటివాళ్లు నానా హైరానా పడిపోతారు. పిండి వంటలతో అల్లుడు తబ్బిబ్బయ్యేలా చేస్తారు. శైలజా రెడ్డిగారు కూడా తన అల్లుణ్ని అలానే చూసుకుంటున్నారట. మరి ఈ కొత్త అల్లుడు అత్తగారింట్లో ఎన్ని రోజులుంటాడట? అంటే.. ఇంకో ఇరవై రోజులు పైనే. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. నాగ చైతన్య అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ వచ్చే నెల 22వరకు జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, రమ్యకృష్ణల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో చేస్తోన్న ‘సవ్యసాచి’ సినిమాలో ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ సాంగ్ షూటింగ్లో తమన్నాతో కలసి పాల్గొంటారు నాగచైతన్య. -
సూపర్ ఎనర్జీ
డ్యాన్స్ ఇరగదీస్తున్నారు అల్లుడు. వరుసగా రెండు సాంగ్స్లో అదిరిపోయే స్టెప్పులు వేశారట ఆయన. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. అల్లుడుగా నటిస్తున్న నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమాలోని రెండు సాంగ్స్ను వెంట వెంటనే కంప్లీట్ చేశారట. ‘‘రెండు పాటలను కంప్లీట్ చేశాం. డ్యాన్స్లో నాగచైతన్య ఎనర్జీ లెవల్స్ సూపర్. ఈ సాంగ్స్కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహించారు’’ అని పేర్కొన్నారు డైరెక్టర్ మారుతి. అంతేకాకుండా హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్లతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
కునుకు కరువాయె...
నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్స్క్రీన్పై ఎగ్జామ్స్ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్లో వర్క్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్ ఎక్కడో తెలుసా? కేరాఫ్ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్ రామ్కి కూడా నిద్ర నహీ. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్గా నైట్షూట్స్లో పాల్గొన్నారు. కానీ తెలుగు సినిమా కోసం కాదు. కోలీవుడ్ సినిమా కోసం. కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్లో కార్తీ, బాలీవుడ్లో అజయ్దేవగన్ సినిమాల షెడ్యూల్స్లో పాల్గొని అలసిపోయారు. కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్ షూట్స్లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ చివరి రోజు తల్లి సెట్స్కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్ కంప్లీటైన వెంటనే అజయ్ దేవగన్æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్కు యస్ చెప్పారు హృతిక్ రోషన్. ‘సూపర్ 30’లో ఆయన బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నైట్ షూట్లో పాల్గొంటూ హృతిక్ డే టైమ్లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమా కోసం లండన్లో టైమ్కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్ షా దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ నైట్ టైమ్లో జరుగుతోంది. ఫోర్ డేస్ బ్యాక్ సాంగ్ను కూడా షూట్ చేశారు. నిద్ర లేకుండా వర్క్ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్ ఈజ్ వర్షిప్’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్ గురూ.సినిమా అంటే నైన్ టు సిక్స్ జాబ్ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా? ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి తల్లితో రకుల్, అనూ ఇమ్మాన్యుయేల్, హృతిక్ -
అతిథిగా అనూ
టాలీవుడ్లో వరుస అవకాశాలతో జోరుమీదున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ఆమె నటించిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నారు ఈ మలయాళ బ్యూటీ. రవితేజ–శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కూడా అనూనే కథానాయిక. అయితే.. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారామె. హీరోయిన్గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ తొలిసారి ఓ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారట. విజయ్ దేవరకొండ, ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్నా జంటగా దర్శకుడు పరశురామ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘గీతాగోవిందం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర చేస్తున్నారని టాక్. కథలో ముఖ్యమైన రోల్కి అనూ అయితే కరెక్ట్గా సరిపోతారన్నది చిత్రబృందం ఆలోచనట. సినిమాలో పది నిమిషాలు ఉండే ఈ పాత్ర కోసం చిత్రవర్గాలు ఆమెను సంప్రదించడంతో గ్రీన్సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
అతిథి పాత్రలో అను
ఇటీవల హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చినా వదులుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తరువాత పరుశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూల్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుంది. -
బాల్కనీ ప్రేక్షకులూ విజిల్స్ వేస్తారు
‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడానికి, ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణాలు లేవు. అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుస చిత్రాలు చేస్తున్నాను. శ్రీనువైట్లతో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రీమేకే అయినా, కథలో దాదాపు 70% మార్పులు చేశాం. ఈ చిత్రంలో మా అబ్బాయి మహాధన్ నటించాల్సి ఉంది. కానీ, పరీక్షలు ఉండటంతో చేయలేకపోయాడు. ‘‘నేల టిక్కెట్టు’ చిత్రంలో నాది అనాథ పాత్ర. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తా. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ. ఈ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని రవితేజ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవితేజ పంచుకున్న విశేషాలు. – ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కంటే ముందే కల్యాణ్ కృష్ణ ‘నేల టిక్కెట్టు’ కథ నాకు చెప్పాడు. అయితే.. అప్పటికి నాకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో కుదరలేదు. ఈలోపు కల్యాణ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమాలు చేశాడు. మా కాంబినేషన్లో సినిమా ఇప్పటికి కుదిరింది. – ఈ చిత్రం ట్రైలర్లో సీనియర్ సిటిజన్కి సంబంధించి ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ అనే డైలాగ్ చాలామందికి తెగ నచ్చేసింది. కథలో ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది. దీంతో పాటు మంచి ఫన్, హీరోయిన్తో లవ్ ట్రాక్.. వంటి అంశాలు చాలా ఉంటాయి. పేరెంట్స్ని పట్టించుకోని వాళ్లు ఎందుకు బతుకుతారో కూడా నాకు అర్థం కాదు. – ‘నేల టిక్కెట్టు’ టైటిల్ మాస్ అప్పీల్ కోసం పెట్టినది కాదు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యే టైటిల్ అది. సొంత మనుషులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నవాళ్లని తన వాళ్లలా ఫీలవడం, వారికోసం తపించడం అనేది సినిమాలో చాలా పెద్ద ఎమోషన్. ఈ పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలోని కంటెంట్ నేల టిక్కెట్టు ఆడియన్సే కాదు.. బాల్కనీ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేలా ఉంటుంది. – ఈ చిత్రంలో కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంటుంది. కల్యాణ్ సినిమాల్లో క్లాస్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. కంప్లీట్గా కల్యాణ్ మార్క్ ఎలివేట్ అవుతుంది. కథ మరీ కొత్తది కాకపోయినా ప్రతి క్యారెక్టర్ని డిఫెరెంట్గా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో జగపతిబాబుగారి పాత్ర చాలా బాగుంటుంది. – రామ్ తాళ్లూరిగారు నిజాయితీగా, పాజిటివ్గా ఉంటారు. పైకి ఒకలా బయట ఇంకోలా అస్సలు ఉండరు. అక్కడే మా ఇద్దరికీ సింక్ అయింది. ఆయన డబ్బు సంపాదిద్దామని ఈ సినిమా తీయలేదు. ఆల్రెడీ ఆయన వద్ద డబ్బుంది. సినిమా అంటే ప్యాషన్తోనే ఈ చిత్రం తీశారు. ఆయనతో ఒక సినిమా కాదు చాలా సినిమాలు చేయాలని ఉంది. ఆయన ప్రొడక్షన్లో ఇంకో సినిమా చేస్తున్నా. – శక్తికాంత్ మ్యూజిక్ నాకు చాలా నచ్చేసింది. తను కంపోజ్ చేసిన ‘ఫిదా’ సినిమా సాంగ్స్ కూడా నాకు ఇష్టం. ఈ సినిమాకూ మంచి పాటలిచ్చాడు. – అనూ ఇమ్మాన్యుయేల్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో పాటు నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని మా చిత్రం నుంచి తప్పుకున్నారు. -
రవితేజ సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్
ఈ శుక్రవారం నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాను ప్రారంభించారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరో హీరోయిన్గా శృతిహాసన్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇతర చిత్రాలతో పాటు కుటుంబ సమస్యల కారణంగా అను ఇమ్మాన్యూల్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కూడా ధృవికరించారు. దాదాపు 50 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో డేట్లు సర్ధుబాటు చేయలేకే అను తప్పుకుంటున్నట్టుగా చిత్రయూనిట్ తెలిపారు. దీంతో అను స్థానంలో గోవాబ్యూటీ ఇలియానాను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. Due to non availability of dates for our long USA schedule of 50 days, Anu Emmanuel will not be working in our film #AmarAkbarAnthony. — Mythri Movie Makers (@MythriOfficial) 19 May 2018 Unfortunately I won’t be a part of #AmarAkbarAnthony due to date clash between #SailajaReddyAlludu I wish the team of #AmarAkbarAnthony all the best 🙏🏼😊 https://t.co/knQr32bZaw — Anu Emmanuel (@ItsAnuEmmanuel) 19 May 2018 -
అందుకే తప్పుకున్నా
ఒక సినిమా నుంచి హీరో లేదా హీరోయిన్ తప్పుకుంటే కారణం ఏదైనా ఔత్సాహికరాయుళ్లు ‘ఇదీ కారణం’ అంటూ ఏదో స్టోరీ అల్లుతారు. అలానే అనూ ఇమ్మాన్యుయేల్ చుట్టూ స్టోరీలు అల్లడానికి కొంతమంది రెడీ అయిపోయారు. ఆ స్టోరీలకు ఫుల్స్టాప్ పడేలా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అసలు కారణం బయటపెట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మెత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇప్పుడీ చిత్రంలో అనూ లేరు. ‘‘యూఎస్లో చేయబోయే 50 డేస్ షెడ్యూల్ కోసం అనూ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. అందుకని మా సినిమాలో నటించరు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ క్లారిఫికేషన్ ఇచ్చాం’’ అని ట్వీటర్ ఖాతాలో నిర్మాతలు పేర్కొన్నారు. ఈ విషయంపై అనూ స్పందిస్తూ – ‘‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్ క్లాష్ కారణంగా అనుకోకుండా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘అఅఆ’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. -
రావాలని ఉంది కానీ..: అను ఇమ్మాన్యుయేల్
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’కు ప్రమోషన్లు చేస్తూ బిజీగా ఉన్నారు చిత్ర నిర్మాతలు. దీనిలో భాగంగానే గురువారం (మే 10) సాయంత్రం సక్సెస్మీట్ను ఏర్పాటు చేశారు. పవర్స్టార్ పవన్ కల్యాణ్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ రాలేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి హీరోయిన్ అను ఎక్కడా కూడా ప్రమోషన్స్లో పాల్గొనలేదు. ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అసలే విపరీతమైన పోటీలో నా పేరు సూర్య రిలీజైంది. టాక్ కూడా పాజిటివ్గా రాకపోవడంతో కలెక్షన్స్పై ప్రభావం చూపుతోంది. ‘మహానటి’కి పాజిటివ్ టాక్ రావడం కూడా ఈ మూవీపై ప్రభావం పడుతుంది. సక్సెస్మీట్కు అను ఇమ్మాన్యూయేల్ హాజరుకాకపోగా... చిన్న వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ‘కుటుంబ విషయాల వల్ల హాజరుకాలేకపోతున్నాను. నాకు సక్సెస్మీట్కు రావాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాలేకపోతున్నాను. ఇది నాకు ప్రత్యేకమైన మూవీ, ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/Be7g0YOWGz — Anu Emmanuel (@ItsAnuEmmanuel) May 10, 2018 -
స్క్రీన్ టెస్ట్
1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా దర్శకుడెవరో గుర్తుందా? ఎ) వి.ఆర్. ప్రతాప్ బి) ఎస్.ఎస్. రాజమౌళి సి) వీవీ వినాయక్ డి) బి. గోపాల్ 2. ‘షాక్’ సినిమాలో హీరో రవితేజ పక్కన హీరోయిన్గా నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) శ్రియ బి) జ్యోతిక సి) స్నేహ డి) తనూ రాయ్ 3. 200 కోట్ల క్లబ్లో చేరిన సినిమా ‘రంగస్థలం’. తెలుగు, హిందీ భాషలో చేసిన ‘జంజీర్’ తో కలిపి హీరోగా చరణ్ కు ఇది ఎన్నో సినిమా? ఎ) 8 బి) 9 సి) 12 డి) 11 4. ‘మహానటి’ చిత్రంలో చిన్నప్పటి సావిత్రి పాత్రను పోషించిన ఈ బాలనటి పేరు సాయి తేజస్విని. ఈ పాప ఒక ప్రముఖ నటుని మనవరాలు. ఎవరా నటుడు? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) జగపతి బాబు డి) రాజేంద్రప్రసాద్ 5.‘ఒకరాజు ఒకరాణి’ చిత్రానికి దర్శకత్వం వహించింది ‘యోగి’. ఆ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విభాగానికి పనిచేశారు. ఆయన ఏ విభాగానికి పనిచేశారో తెలుసా? ఎ) కథా రచయిత బి) మాటల రచయిత సి) పాటల రచయిత డి) కథ–మాటలు 6. ‘భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మహేశ్బాబు స్పీకర్ పాత్రలో ఉన్న జయలలితను ఏమని సంభోదించారో తెలుసా? ఎ) స్పీకర్ గారు బి) డియర్ స్పీకర్ గారు సి) మేడమ్ స్పీకర్ డి) సభాపతి గారు 7. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? ఎ) సుమారు 150 కోట్లు బి) దాదాపు 100 కోట్లు సి) 85 కోట్లు డి) సుమారు 300 కోట్లు 8. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. ఆమె ఏ హీరోతో నటిస్తున్నారో తెలుసా? ఎ) విజయ్ బి) సూర్య సి) విజయ్ సేతుపతి డి) అజిత్ 9. చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంగీత దర్శకునిగా ఇప్పుడు యం.యం.కీరవాణి చేస్తున్నారు. ఈ సినిమాకి మొదట అనుకొన్న సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఏ.ఆర్. రహమాన్ సి) మణిశర్మ డి) అనూప్ రూబెన్స్ 10. పలు బ్లాక్బాస్టర్ సినిమాలకు రచయిత అయిన ఈయన ‘నేను తను ఆమె’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు (సినిమా రిలీజవ్వలేదనుకోండి). ఆ రచయిత ఎవరబ్బా? ఎ) జనార్థన మహర్షి బి) వక్కంతం వంశీ సి) పరుచూరి బ్రదర్స్ డి) కోన వెంకట్ 11. నేను అమితాబ్ » చ్చన్కు వీరాభిమానిని అని ఈ టాలీవుడ్ హీరో ఎప్పుడూ చెప్తారు. ఆ హీరో ఎవరో? ఎ) బాలకృష్ణ బి) రవితేజ సి) వెంకటేశ్ డి) చిరంజీవి 12. 2001లో రిలీజైన ‘ఖుషీ’లో భూమిక చావ్లా హీరోయిన్. 2010లో ‘ఖుషీ’ సినిమాను కన్నడ భాషలోకి రీమేక్ చేశారు. అందులో హీరోయిన్ ఎవరో కనుక్కోండి? (ఆమె తెలుగు సినిమాల్లో ఫేమస్ హీరోయిన్) ఎ) తమన్నా భాటియా బి) శ్రియా సరన్ సి) ఆర్తీ అగర్వాల్ డి) ప్రియమణి 13. ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్తో ‘బ్లాక్బస్టర్ బ్లాక్బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫే బ్లాకు బస్టరే...’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) అంజలి బి) సమంత ∙సి) క్యాథరిన్ థెరిస్సా డి) రకుల్ ప్రీత్ సింగ్ 14. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి, మోయక తప్పదు’ అనే డైలాగ్ను హీరో వరుణ్ తేజ్ ఓ సినిమాలో చెప్పారు. ఆ డైలాగ్ను రాసిందెవరో తెలుసా? ఆయన దర్శకుడు కూడా? ఎ) శ్రీను వైట్ల బి) శ్రీకాంత్ అడ్డాల సి) క్రిష్ జాగర్లమూడి డి) వెంకీ అట్లూరి 15. ‘ప్రేమంటే ఇదేరా’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? (ఈ బ్యూటీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఓనర్) ఎ) శిల్పా శెట్టి బి) మనీషా కొయిరాల సి) ప్రీతీ జింతా డి) దీప్తి భట్నాగర్ 16. తాప్సీ తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరో సరసననటించారో గుర్తుందా? ఎ) మంచు మనోజ్ బి) మంచు విష్ణు సి) గోపీచంద్ డి) రవితేజ 17. మనం ఏ సినిమాకెళ్లినా ‘ఈ నగరానికేమైంది’ అని ఒక గవర్నమెంట్ యాడ్ దర్శనమిస్తుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు ఓ దర్శకుడు. గతంలో ఇతను ఒకే ఒక్క మూవీ తీశాడు. అది సూపర్హిట్. ఇది తన రెండో సినిమా. ఎవరా దర్శకుడు? ఎ) సంకల్ప్ రెడ్డి బి) వెంకీ కుడుముల సి) వెంకీ అట్లూరి డి) తరుణ్ భాస్కర్ 18. రామ్చరణ్తో దర్శకుడు సుకుమార్ ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సుకుమార్ తర్వాతి సినిమా ఏ హీరోతో ఉంటుందో కనుక్కోండి? ఎ) అల్లు అర్జున్ బి) మహేశ్ బాబు సి) రామ్ చరణ్ డి) యన్టీఆర్ 19. పై ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఎ) నివేదా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) కేథరిన్ 20. ప్రఖ్యాత నటి భానుమతి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) ధర్మపత్ని బి) వరవిక్రయం సి) స్వర్గసీమ డి) మల్లీశ్వరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) డి 8) బి 9) బి 10) డి 11) బి 12) డి 13) ఎ 14) డి 15) సి 16) ఎ 17) డి 18) బి 19) బి 20) డి -నిర్వహణ: శివ మల్లాల -
‘నా పేరు సూర్య..’ చేసినందుకు గర్వపడుతున్నా
‘‘అందరికీ నమస్కారం. నా పేరు అల్లు అర్జున్. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థ్యాంక్యూ ఇండియా. ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్యూ చెప్పాల్సింది మా గెస్ట్ పవన్ కల్యాణ్గారికి. ఈ సినిమా గురించి ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది. కానీ, నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ‘థ్యాంక్యూ ఇండియా మీట్’ (సక్సెస్ మీట్) నిర్వహించారు. హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నాకు వచ్చిన ఓ బెస్ట్ కాంప్లిమెంట్ గురించి చెబుతాను. చాలామంది మహిళలు ఫోన్ చేసి.. ఈ సినిమా మాకు చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూశాక మిలటరీ యూనిఫాం కుట్టించుకోవాలనుకుంటున్నారు’’ అన్నారు. ఈ మూవీలో నా నటన చాలామందికి నచ్చింది. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు.నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఓ మంచి చిత్రం. ఇలాంటి మంచి సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పటానికి కల్యాణ్గారు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చిన బన్నీకి థ్యాంక్స్. నేనెప్పుడూ కథని నమ్ముతాను. ఆ కథకి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేశారు బన్నీగారు. దానికి సహకరించారు వక్కంతం వంశీగారు. ఈ సినిమాని తర్వాతి జెనరేషన్ కోసం తీశాం. ఈ చిత్రం చూసిన స్టూడెంట్స్లో ఓ మార్పు వస్తుందని కచ్చితంగా నమ్ముతా. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఈ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. వండర్ఫుల్ జ్ఞాపకాలతో ఇంటికెళతారని గ్యారంటీగా చెప్పగలను. మా సినిమాని ఆదరించిన తెలుగు, తమిళం, మలయాళ ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా నా తొలి సినిమాకే ఇంత పెద్ద అవకాశం రావడం హ్యాపీ. మంచి కథను కూడా కమర్షియల్ సినిమాగా తీయొచ్చనే నా నమ్మకాన్ని నమ్మి నాతో ప్రయాణం చేసిన అర్జున్గారికి, ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమా ఇంత రిచ్గా రావడానికి కృషి చేసిన శ్రీధర్గారు, నాగబాబుగారు, ‘బన్నీ’వాసులకు థ్యాంక్స్. మంచి కంటెంట్తో ఉన్న ఈ సినిమాని గుండెల్లోకి తీసుకున్న తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శిరీషా శ్రీధర్, నాగబాబు, సహ నిర్మాత ‘బన్నీ’ వాసు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, దర్శకుడు మెహర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లుడు వెయిటింగ్
అల్లుడు ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నాడు. ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత కూడా అల్లుడిని అత్తయ్య పలకరించదట. వచ్చే నెలలోనే అత్తా–అల్లుడి మీట్ అవుతారు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు. ప్రస్తతం ‘సవ్యసాచి’ షెడ్యూల్æకోసం న్యూ యార్క్లో ఉన్నారు నాగచైతన్య. ఈ షూట్ను కంప్లీట్ చేసుకుని ఈ నెల 18 నుంచి హైదరాబాద్లో జరగనున్న ‘శైలజా రెడ్డి’ షూట్లో జాయిన్ అవుతారు. మరి... అత్త శైలజా రెడ్డి ఎంట్రీ ఎప్పుడు? అంటే.. జూన్ 15న అని తెలిసింది. -
నా పేరు సూర్య : తొలి రోజే 40 కోట్లు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా బన్నీ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తొలి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. బన్నీ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా నా పేరు సూర్య రికార్డ్ సృష్టించింది. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, అర్జున్, బొమన్ ఇరానీ, రావూ రమేష్, నదియాలు ఇతర కీలకపాత్రలో నటించారు. చాలా కాలం తరువాత మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా లగడపాటి శిరీషా, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించారు. -
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రివ్యూ
టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరానీ, రావూ రమేష్ సంగీతం : విశాల్ - శేఖర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ నిర్మాత : లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ మేకోవర్లో.. డిఫరెంట్ మేనరిజమ్స్తో సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా.? వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్నీ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? ఎన్నో విజయవంతమైన కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా..? కథ; సూర్య (అల్లు అర్జున్) కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్) తన మీద తనకు కంట్రోల్ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణం రాజు (అర్జున్) నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలని కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన క్యారెక్టర్ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించాడు. యాంగ్రీ యంగ్మెన్గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్లో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. బన్నీ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్లోనూ బన్నీ పడిన కష్టం తెర మీద కనిపించింది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్గా కనిపించిన అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయారు. శరత్ కుమార్ తనకు అలవాటైన ఎగ్రెసివ్ రోల్ లో మరోసారి మెప్పించాడు. మరో విలన్ అనూప్ థాకూర్ సింగ్ యాక్షన్ సీన్స్లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నదియా, బొమన్ ఇరాని, వెన్నెల కిశోర్, రావూ రమేష్, పోసాని కృష్ణమురళీ, ప్రదీప్ రావత్లు తమ పరిధి మేర మెప్పించారు. విశ్లేషణ ; సూపర్ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్లో చూపించాడు. లుక్ పరంగానే కాదు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్ చేసినా రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. (సాక్షి రివ్యూస్)అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. క్లైమాక్స్ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడి, ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు. వంశీ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆర్మీ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ప్లస్ పాయింట్స్ ; అల్లు అర్జున్ నటన యాక్షన్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు స్క్రీన్ప్లే క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
స్క్రీన్ టెస్ట్
1. 1999లో విడుదలైన ‘నీ కోసం’ సినిమాకి ఆ చిత్రసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్తో కలసి పనిచేసిన ఇప్పటి ప్రఖ్యాత సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) అనూప్ రూబెన్స్ బి) యస్యస్ తమన్ సి) దేవిశ్రీ ప్రసాద్ డి) మణిశర్మ 2. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బిజినెస్మేన్’లో ‘సారొత్తారు... రొత్తా్తరు..’ పాటలో కనిపించే హీరోయిన్ ఎవరు? ఎ) తమన్నా భాటియా బి) కాజల్ అగర్వాల్ సి) దిశా పాట్నీ డి) చార్మీ కౌర్ 3. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్. చాలా తక్కువ సమయం ఉండటంతో అందులోని ఏడు పాటలను ఏడు రోజుల్లో రాయాలని ఒక రచయితకు చెప్పారు గౌతమ్. ఎవరా రచయిత? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) ‘ సిరివెన్నెల’ సీతారామశాస్త్రి డి) వనమాలి 4. మహేశ్ బాబు, ప్రభాస్లను హీరోలుగా పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) కె. రాఘవేంద్రరావు బి) బి. గోపాల్ సి) జయంత్.సి. పరాన్జీ డి) శ్రీను వైట్ల 5. గుంటూరు జిల్లా చిర్రావురులో పుట్టిన గొప్ప నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) జమున సి) శారద డి) వాణిశ్రీ 6. ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, దిల్’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఆయనెవరు? ఎ) ఎస్.ఎస్. రాజమౌళి బి) సుకుమార్ సి) బోయపాటి శ్రీను డి) కొరటాల శివ 7. 1985వ సంవత్సరంలో ‘నవ్ జవాన్’ అనే చిత్రంలో దేవానంద్ కూతురిగా నటించిందామె. అప్పుడామెకు 14 ఏళ్లు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో చాలా బిజీగా నటించింది. 2011లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చింది. ఎవరా హీరోయిన్? ఎ) రేఖ బి) హేమమాలిని సి) టబు డి) మాధురీ దీక్షిత్ 8. భారత సినీ ప్రపంచంలో యల్.వి. ప్రసాద్ పేరు తెలియనివారుండరు. ఆయన ఇంటిపేరే తెలుగు చిత్రసీమలో నాటి తరం నుంచి నేటి తరం నటీనటులు ఉన్న మరో పేరున్న కుటుంబానికి ఉంది. ఆయన ఇంటి పేరేంటి? ఎ) దగ్గుబాటి బి) నందమూరి సి) కొణిదెల డి) అక్కినేని 9. దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) సందీప్ కిషన్ బి) వరుణ్ సందేశ్ సి) సిద్ధార్థ్ డి) నాని 10. కంటిన్యూస్గా మూడు నాలుగు సంక్రాంతి పండగలకు సూపర్ హిట్ మూవీస్ ఇచ్చిన ఓ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అనేవారు. ఆ నిర్మాత ఎవరో తెలుసా? ఎ) కె.యల్.యన్ రాజు బి) యం.యస్ రాజు సి) ‘దిల్’ రాజు డి) జీవీజీ రాజు 11. బెంగుళూరులోని కళాక్షేత్ర అనే నాటక సమాజం నుంచి వచ్చిన ఈయన ప్రముఖ నటుడు. నెలకు 300 రూపాయల జీతంతో స్టేజి నాటకాలాడేవారు. తర్వాత దాదాపు 2000 వీధి నాటకాల్లో నటించారు. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) ప్రకాశ్ రాజ్ బి) జయప్రకాశ్ రెడ్డి సి) గిరీశ్ కర్నాడ్ డి) బొమన్ ఇరానీ 12. 2000వ సంవత్సరంలో బాలీవుడ్ సింగర్ ఫాల్గుని పాతక్ రూపొందించిన వీడియో ఆల్బమ్లో ‘మేరి చూనర్ ఉద్ ఉద్ జాయో..’ అనే పాటలో నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) సిమ్రాన్ బి) త్రిష కృష్ణన్ సి) శ్రియా సరన్ డి) సదా 13. బ్యాడ్మింటన్లో మన దేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చిన పుల్లెల గోపీచంద్కు పార్టనర్గా ఆట ఆడిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఎ) తరుణ్ బి) ప్రిన్స్ సి) సుధీర్ బాబు డి) సుమంత్ 14. హీరో నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ఏ హీరోతో పాటు నాని నటిస్తున్నారో తెలుసా? ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) బాలకృష్ణ డి) చిరంజీవి 15. మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు సాధించడంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్న దర్శకుడెవరో తెలుసా? ఎ) నీలకంఠ బి) శేఖర్ కమ్ముల సి) దేవా కట్టా డి) ఇంద్రగంటి మోహనకృష్ణ 16. మహేశ్బాబు నటì ంచనున్న తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎ) పూజా హెగ్డే బి) కీర్తీ సురేశ్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) రాశీ ఖన్నా 17. నటుడు ఆది పినిశెట్టి ‘యూ టర్న్’ సినిమాలో ఓ పెద్ద హీరోయిన్ సరసన నటిస్తున్నారు. ఆ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) సమంత సి) అనుపమా పరమేశ్వరన్ డి) కృతీ సనన్ 18. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్లోనటిస్తున్న హీరో ఎవరు? ఎ) షాహిద్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) రణ్వీర్ సింగ్ డి) రణ్బీర్ కపూర్ 19. పై ఫొటోలో నిచిన్నారిని గుర్తుపట్టండి? ఎ) శ్రుతీహాసన్ బి) చార్మి సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 20. నాగార్జున, అమల నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) అంతం బి) శివ సి) వారసుడు డి) కిల్లర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2 బి 3) ఎ 4) ఎ5) ఎ 6) బి 7) సి 8) డి 9) ఎ 10) బి 11) ఎ12) బి 13) సి 14) బి 15) డి 16) ఎ 17) బి 18) ఎ 19) బి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఇండియా టీమ్
-
‘ఇండియా కావాలి.. ఇచ్చెయ్’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో బన్నీ క్యారెక్టరైజేన్ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్లో సినిమాలోని ఇతర కీలక పాత్రధారులని పరిచయం చేశారు. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్కుమార్, బొమన్ ఇరానీ, నదియాలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో మరోసారి ఘనవిజయం సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. -
మిలటరీవారంటే అందుకే గౌరవం
‘‘వంశీగారు చెప్పిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథలో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోకి ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న గోల్ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజానికి అంకితమయ్యే జీవితాన్ని బతుకుదామనుకోవడం గొప్ప విషయం. అందుకే నాకు మిలటరీవారంటే ప్రత్యేక గౌరవం’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మాతగా, ‘బన్ని’ వాసు సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం మే 4న విడుదలకానుంది. విశాల్–శేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మిలట్రీ మాధవరం గ్రామంలో ఆదివారం విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేయడం వల్ల నేను తెలుసుకునన విషయం ఏంటంటే.. మా ఆంధ్రప్రదేశ్లో.. మా వెస్ట్గోదావరి జిల్లాలో.. మా ఊరి దగ్గర్లో మాధవరం అనే ఊరు ఉందనీ, జనాలు ‘మిలట్రీ మాధవరం’ అని పిలుస్తారని నాకు తెలియదు. తెలుసుకున్నాక ఎంత కష్టమైనా ఈ ఫంక్షన్ ఇక్కడే చేద్దామనుకున్నాం.. చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నన్ను నమ్మి అడిగిందల్లా ఇచ్చిన శ్రీధర్గారికి ధన్యవాదాలు. ఎప్పుటి నుంచో నాగబాబుగారికి సినిమా చేయాలనుకుంటున్నా. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేనెంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు. నా టార్చర్ భరించి నాతో సినిమా తీసినందుకు ‘బన్ని’ వాసుకి థ్యాంక్స్. మేం ఎంత మంది హీరోలున్నా అందరం మెగా కుటుంబమే. ‘రంగస్థలం’ హిట్ అయినందుకు రామ్చరణ్కి, యూనిట్కి కంగ్రాట్స్’’ అన్నారు. చిత్ర సమర్పకులు నాగబాబు మాట్లాడుతూ– ‘‘ఒక మనిషి తెలివైనవాడా? గొప్పవాడా? అన్నది ముఖ్యం కాదు. ఎంత మంచివాడు.. ఎంత మంచి మనసు ఉన్నవాడు అన్నదే ముఖ్యం. అలాంటి వ్యక్తి ఎప్పటికైనా టాప్ రేంజ్కి వెళ్తాడు. బన్నీ అలాంటివాడే. మెగా హీరోలకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవిగారు. థ్యాంక్స్ అన్నయ్యా.. మంచి జీవితం ఇచ్చావ్’’ అన్నారు. ‘‘మిలట్రీ మాధవరం సైనికులు దేశభక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ చిత్రంలో ‘ఇరగ ఇరగ’ పాట ఉంది. ఈ సినిమా చూశాక ఆల్మోస్ట్ జాతీయగీతంలా మీరు పాడుకుంటారని అనుకుంటున్నా. వంశీ రాబోయే కాలంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అవుతాడు’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘మిలట్రీ మాధవరం లాంటి ఊరు ఉన్న తెలుగు గడ్డపై ఓ తెలుగు వాడిగా నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. చాలా సినిమాలకు రైటర్గా పనిచేసినా దర్శకునిగా మొదటి సినిమా. నా మూడున్నరేళ్ల కలని తీర్చిన మగాడు అల్లు అర్జున్. నాలో రచయితని మాత్రమే కాదు.. డైరెక్టర్ ఉన్నాడని నమ్మాడు. నాకు తెలిసి ఏ కొత్త డైరెక్టర్కి ఇంత అదృష్టం పట్టి ఉండదు. ఓ పది సినిమాల సూపర్హిట్ డైరెక్టర్తో పనిచేస్తే ఎలా ఉంటాడో ఫస్ట్టైమ్ డైరెక్టర్తో కూడా అలాగే ఉన్నాడాయన. సూర్య పాత్ర కనీసం ఓ పదేళ్లు మీ గుండెల్లో నిలిచిపోతుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. గొప్ప సినిమా చూశామని తలెత్తుకుని థియేటర్ల నుంచి బయటికెళతారని చెప్పగలను’’ అన్నారు. అనంతరం మిలట్రీ మాధవరంలోని వీర జవానుల భార్యలకు సత్కారం చేశారు. సహ నిర్మాత ‘బన్ని’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్ పాల్గొన్నారు. -
హీరోయిన్తో అల్లు అర్జున్ సెల్ఫీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు. సైనికుడిగా కనిపించేందుకు బన్నీ తన లుక్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. మే 4న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా బన్నీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అభిమానులకు షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని వెల్లడించిన స్టైలిష్ స్టార్ ‘నా హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ అడిగిన తొలి, చివరి కోరిక ఓ సెల్పీ.. షూటింగ్ పూర్తయిన తరువాత అను ఇమ్మాన్యూల్ తో నా తొలి పర్సనల్ ఫొటో’ అంటూ అనుతో దిగిన సెల్ఫీని ట్వీట్ చేశాడు బన్నీ. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్నారు. Wrapped up the Last Day of Shoot for NSNI . Lovely Unit , lovely people . Thank you . I Thank each and every one on the Set . Such a smooth sail . Feeling soo touched . Gratitude ∞ — Allu Arjun (@alluarjun) 18 April 2018 The first and the last thing my actress Anu Emmanuel ever asked for was a SELFIE . Soo Sweet. My First Personal Picture with my Actress Anu Emmanuel after the Last Shot of the shoot . @ItsAnuEmmanuel pic.twitter.com/H541riaKYA — Allu Arjun (@alluarjun) 18 April 2018 -
అల్లుడు లెట్స్ డు కుమ్ముడు
మర్యాదల్లో ఏదైనా తేడా వచ్చిందో లేక ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారో.. కరెక్ట్ రీజన్ తెలీదు కానీ, విలన్స్ను కుమ్మేస్తున్నాడు అల్లుడు. ఈ అల్లుడు ఎవరి తాలుకానో తెలుసు కదా! పవర్ఫుల్ శైలజారెడ్డి తాలుకా అండీ బాబు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో నాగచైతన్యపై ఫైట్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. అంటే అల్లుడు లెట్స్ డు కుమ్ముడు అన్నమాట. ఆఫ్టర్ ఫైట్ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నాం. -
ఇరగ.. ఇరగ.. ఇంప్రెస్
మాములుగానే బన్నీ డ్యాన్స్ అదుర్స్. థియేటర్లో ఆడియన్స్ విజిల్స్. వన్స్ మోర్ కేకల్స్. అలాంటిది డ్యాన్స్లో తనకు ఇన్స్పిరేషన్గా ఉండే చిరంజీవి ఎదురుగా ఉంటే...బన్నీ ఆగుతాడా? ఇంకాస్త రెచ్చిపోడు. అలాగే రెచ్చిపోయి ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ‘ఇరగ.. ఇరగ...’ సాంగ్లో డ్యాన్స్ ఇరగదీసి చిరంజీవిని ఇంప్రెస్ చేశాడట. అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. అనూ ఇమ్మాన్యూయేల్ కథానాయిక. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ‘‘సెట్స్కి చిరంజీవిగారు, అల్లు అరవింద్గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. బన్నీ డ్యాన్స్ చేస్తున్నంత సేపు చిరంజీవిగారు ఎంజాయ్ చేశారు. సాంగ్ బాగుందని మెచ్చుకున్నారు. సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22న ఆడియో వేడుకను, 29న హైదరాబాద్లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ను జరపనున్నాం. సినిమాను మే 4న రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బన్నీ యాక్షన్ పార్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది
‘‘మా చిత్రంలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అనే పాట నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. సీతారామ శాస్త్రిగారు మంచి సాహిత్యం అందించారు’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ సినిమాలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్ యాక్షన్ పార్ట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. టైటిల్కి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రీన్ప్లేతో వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇంకా వారం రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 22న గ్రాండ్గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం. 29న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నాం. ‘రంగస్థలం’ అద్భుతమైన హిట్ సాధించింది. మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలి. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘బాహుబలి, ఘాజీ’ టీమ్కి కంగ్రాట్స్’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్తో సినిమా చేయడం చాలా హ్యాపీ. ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్ వింటే వాల్ట్ డిస్నీ సాంగ్ విన్నట్టుగా ఉంది. మే 4న మీ ముందుకు వస్తున్నాం. మా చిత్రం అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్. అర్జున్, శరత్కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
‘అన్ని ఇండియాలు లేవురా మనకి’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. బన్నీ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ డిఫరెంట్ మేకోవర్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకుంటున్న ఈ సినిమాతో మరోసారి రికార్డ్లు తిరగరాయటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఈ రోజు(ఆదివారం) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేశారు. విలన్ ‘సౌత్ ఇండియాకా సాలా’ అంటే ‘సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. -
అల్లు అర్జున్ డైలాగ్ ఇరగదీసాడు
-
అందమైన కానుక
హీరో అల్లు అర్జున్ బర్త్డే ఇవాళ. ‘గంగోత్రి’ టు ‘డీజే’.. బన్నీ ప్రయాణం పదిహేనేళ్లు. ఈ 15 ఏళ్లల్లో హీరోగా ఇప్పటివరకు 18 సినిమాలు చేశారు. ఇక బన్నీ బర్త్డే విషయాని కొస్తే.. విశాఖపట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడి ఆర్కే బీచ్లో 5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానస్ శేషు ఆధర్వంలో ఈ సైకత శిల్పం రూపొందింది. ‘‘అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు తయారు చేసిన అందమైన కానుక ఇది’’ అన్నారు మానస్. ఈ సంగతి ఇలా ఉంచితే.. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా డైలాగ్ ఇంపాక్ట్ను ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. -
కొత్త లుక్ కోసం తారక్...
జై లవ కుశ సినిమాతో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించేందుకు చాలా రోజులుగా జిమ్లో కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కసరత్తులకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన ఫొటో సామాజిక్ మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కొత్త సినిమాలో విభిన్నంగా కనిపించేందుకు ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడు ఈ ఫొటోలో తెలుస్తుంది. హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్న ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లుక్ కోసం ఎంతో నొప్పిను బరిస్తూ ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఈ ఫొటో చూసిన జూనియర్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే, అను ఇమ్మాన్యూల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. -
జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో...
సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లొకేషన్స్ అదిరిపోవద్దూ... పదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అయితే. అలాగే అదరగొడుతున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ‘నీకోసం, వెంకీ, దుబాయ్ శీను’ తర్వాత రవితేజ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా కోసం హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇంటిని ఒక లొకేషన్గా సెలక్ట్ చేశారాయన. అమెరికాలో ఉన్న లోపెజ్ మ్యాన్షన్ పరిసర ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తోందట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 1న స్టారై్టంది. ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్ జరుపనున్నారు. ‘‘జెన్నిఫర్ లోపెజ్ మ్యాన్షన్లో సినిమా షూటింగ్ జరుపుతుండటం చాలా ఎగై్జటింగ్గా ఉంది. ఆమెకు వీరాభిమానిని. ఈ ప్లేస్లో షూటింగ్ చేయడానికి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ మ్యాన్షన్లో జెన్నిఫర్ లోపెజ్ ఉండటం లేదు. ఆ సంగతలా ఉంచితే... మంచు కురిసే వేళలో రీల్పై నాయకా నాయికలు రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్పై ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రవితేజ తనయుడు మహాధన్, అలనాటి హీరోయిన్ లయ, ఆమె తనయ శ్లోక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈసారి డైలాగ్ గురూ
దుమ్ము రేపాడు. ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్లో సూపర్బ్ పర్ఫార్మెన్స్తో అల్లు అర్జున్ దుమ్ము రేపాడని ప్రేక్షకులు అన్నారు. ఇప్పుడు సినిమాలోని డైలాగ్స్కు ఉన్న దమ్మును చూపించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శీరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా మే 4న రిలీజ్ కానుంది. -
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
-
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
కొంతకాలంగా సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోని అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ అమెరికాలోని పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్కు చెందిన నివాసంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘ఆమెకు వీరాభిమానిని. లక్షల మంది అభిమాన పాప్ గాయని. పాప్ రాణి. ప్రస్తుతం ఆమె నివాసంలో షూటింగ్ చేస్తున్నాం. కల నిజమైంది’ అంటూ ట్వీట్ చేశారు శ్రీనువైట్ల. గతంలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమర్ అక్బర్ ఆంటోనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం జెన్నీపర్ లోపేజ్ విల్లాలో జరిగే చిత్రీకరణ కోసం భారీ మొత్తాన్ని కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తోంది. Been her craziest fan throughout my life..the heartthrob of millions ..the evergreen queen of pop ..and here I am Shooting right in her palatial mansion in Long Island .Dreams do come true ! My biggest fan moment @jlo #AAA pic.twitter.com/PyGrnyVwR4 — Sreenu Vaitla (@SreenuVaitla) 2 April 2018