
రెండో సారి...
‘మహా.. మహా’ పాటతో ‘మంత్ర’ సినిమాలో ఎంతగా కవ్వించారో...ఆ సినిమాతో అంత భయపెట్టారు చార్మి. ఆమె కథానాయికగా ‘మంత్ర-2’ అనే చిత్రం రాబోతోంది. పి. శౌరిరెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి. సతీశ్ దర్శకుడు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘‘మంత్ర’ చిత్రానికి ఇది సీక్వెల్ కాదు. హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. మంత్ర సినిమాలో ‘మహా..మహా’ పాట కన్నా మంచి విజయం సాధిస్తుంది. స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో చార్మి మాకీ అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మోహనకృష్ణ, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్.