
‘పైసా వసూల్’ సినిమాతో హీరోయిన్గా తెలుగు స్క్రీన్కు పరిచయం అయ్యారు ముస్కాన్ సేతి. రెండో సినిమాలో తన యాక్టింగ్తో పాటు మరో కొత్త టాలెంట్ను పరిచయం చేయబోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ సినిమాలో ముస్కాన్ ఓ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముస్కాన్ గాయనిగా మారారు.
ఇందులో ‘ఆకాశం..’ అంటూ సాగే మెలోడీ సాంగ్ను ముస్కాన్ ఆలపించారు. ఈ విషయం గురించి ముస్కాన్ మాట్లాడుతూ – ‘‘రాగల 24 గంటల్లో’ సినిమాలో నేను మోడల్గా కనిపిస్తాను. నా వాయిస్ బావుందని వాయిస్ టెస్ట్ చేశారు దర్శకుడు. బావుండటంతో నాతోనే పాడించారు. ఈ మెలోడీ పాట నా పాత్ర పరిచయ గీతం అవడం సంతోషంగా ఉంది. పాట పాడటాన్ని ఎంజాయ్ చేస్తాను కానీ రెండో సినిమాలోనే సింగర్గా మారతానని ఊహించలేదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment