నా సామి రంగ | Naa Saami Ranga is an upcoming Telugu Movie | Sakshi
Sakshi News home page

నా సామి రంగ

Aug 19 2013 1:47 AM | Updated on Sep 28 2018 4:15 PM

నా సామి రంగ - Sakshi

నా సామి రంగ

దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నా సామి రంగ’. సుబ్రమణ్యం పచ్చా దర్శకుడు. సీహెచ్ కిరణ్‌కుమార్ రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపి రెడ్డి నిర్మాతలు.

దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నా సామి రంగ’. సుబ్రమణ్యం పచ్చా దర్శకుడు. సీహెచ్ కిరణ్‌కుమార్ రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపి రెడ్డి నిర్మాతలు.
 
 ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సుబ్రమణ్యంతో 60 మందికి కథ చెప్పించాను. ఒక్కరు కూడా కథ బాగాలేదని చెప్పలేదు. అందుకే ధైర్యంగా ఈ కథను తెరకెక్కించాం.
 
 చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. వచ్చేవారం పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఆద్యంతం నవ్వుల్లో ముంచే హాస్యచిత్రమిదని దర్శకుడు చె ప్పారు.ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: పి.బాల్‌రెడ్డి, ఎడిటింగ్: ఉపేంద్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement