కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో | Naga Shourya New Telugu Movie Launched Today | Sakshi
Sakshi News home page

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో

Oct 14 2019 3:11 PM | Updated on Oct 14 2019 3:11 PM

Naga Shourya New Telugu Movie Launched Today - Sakshi

'సుబ్రమణ్యపురం' ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్‌ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే​ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.  

నాగశౌర్య హీరోగా 'సుబ్రమణ్యపురం' ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నారయణదాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, దిల్‌ రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. 

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ.. ‘ఇదొక స్పోర్ట్‌ బేస్డ్‌ మూవీ. కథ అద్భుతంగా ఉంది  అలాగే సంతోష్‌ ప్రామిసింగ్‌ డైరెక్టర్‌. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అన్నారు. యంగ్‌ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘ఏషియన్‌ సునీల్‌ గారు. శరత్‌ మరార్‌ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్‌కు రెండో చిత్రం ఇది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్‌ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. ఇక చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement