naga shourya
-
నాగశౌర్యకు ఆస్తమా! వాడి కూతుర్ని వీడియో కాల్లో చూస్తున్నా: హీరో తల్లి భావోద్వేగం
రోజూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే బదులు వారానికి ఒకసారి కలుసుకుని హ్యాపీగా ఉందాం.. సంసారం ఒక చదరంగం సినిమాలో ఈ మాట నా మనసుకు కనెక్ట్ అయిందంటోంది హీరో నాగశౌర్య తల్లి ఉషా ముల్పురి. నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు. పెళ్లవగానే కొడుకు, కోడలు వేరుగా ఉండటం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది ఉషా.చిన్నప్పుడే అన్నాడుతాజాగా ఉషా (Usha Mulpuri) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగశౌర్య (Naga Shourya) చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు. ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం కాబట్టి పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్లోనే మనవరాలి ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేశాం. తనను చాలా మిస్ అవుతున్నాను. వీడియో కాల్లో చూస్తుంటాను. బాధగా ఉంటుందిఅదొక్కటే బాధేస్తుంది. ఇటీవల తను నాతో పాటు నెలన్నర రోజులుంది. రెస్టారెంట్ పనుల వల్ల బిజీగా ఉండటంతో తన దగ్గరకు తరచూ వెళ్లలేకపోతున్నాను. చాలామంది పిల్లలే ప్రపంచంగా బతుకుతారు. వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయాక జీవితం శూన్యంగా మారుతుంది. పిల్లల పెళ్లయ్యాక మనమెలా ఉండాలనేది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరికీ ఏ సలహా ఇవ్వకూడదు, వాళ్లేం చెప్పినా మనం ఓకే చెప్పాలి.. ఇవన్నీ తెలుసుకుని అలవాటు చేసుకున్నాను.చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజుశౌర్య కంటే పెద్దోడే నచ్చుతాడుఅలాగే మనం వద్దని చెప్పినంత మాత్రాన పిల్లలు వాళ్లు చేసే పనిని ఆపేయరు. కాబట్టి మనం.. సరేనని తలూపితే మన గౌరవం నిలబడుతుంది. నేను అదే పాటిస్తున్నాను. శౌర్య.. ఎప్పుడు కూడా తన మనసులో మాట చెప్పడు. చిన్నప్పటి నుంచి వాడు అలాగే ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఏదీ చెప్పకపోయినా పర్లేదు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పాలి. అప్పుడే కదా మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. నా పెద్దబ్బాయి చిన్న విషయమైనా నాతో పంచుకుంటాడు. అందుకనే నాకు శౌర్య కంటే పెద్ద కుమారుడే నచ్చుతాడు.ఇలాంటి రోజు వస్తుందని తెలుసుచిన్నప్పుడు ఇద్దరికీ ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు. దాన్నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది అని ఉషా చెప్పుకొచ్చింది.చదవండి: గేమ్ ఛేంజర్ సినిమాకు షాక్.. ఇకపై అది లేనట్లే! -
నాగశౌర్యతో కమెడియన్ సత్య స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఆరోజు రోడ్డు మీద జరిగింది ఇదే: నాగశౌర్య
-
సాఫ్ట్గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
Rangabali Teaser: 'రంగబలి' టీజర్ వచ్చేసింది
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య ఒకడు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న నాగశౌర్యకు గత కొంత కాలంగా సరైన హిట్ సినిమా పడలేదు. తాజాగా నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగబలి' టీజర్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తున్నంత సేపు ఎంతో ఫన్ను పంచుతుంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. నైజాం రైట్స్ నుంచి తప్పుకున్న దిల్ రాజు) సగటు కుర్రాడు. బాధ్యత లేకుండా తిరగడం, తండ్రి తిట్లు, తల్లి బాధ, ఫ్రెండ్స్తో సరదాలు, గొడవలు ఇలా అన్నీ టీజర్లో కనిపించాయి. ‘మన ఊరిలో మనర్నెవడురా ఆపేది’ అనే లోకల్ పాయింట్ అందరినీ మెప్పిస్తుంది. టీజర్ను కలర్ ఫుల్ గానే కట్ చేశారు మేకర్స్. పల్లెటూరును లీడ్గా తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి యూత్ను ఆకట్టుకోవచ్చు. ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. (ఇదీ చదవండి: ట్రోలర్స్కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) -
మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?: రష్మీ
నడిరోడ్డుపై ప్రేయసి చెంప చెల్లుమనిపించిన యువకుడితో హీరో నాగశౌర్య వాదనకు దిగిన విషయం తెలిసిందే! అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పని, ఇందుకుగానూ సారీ చెప్పి తీరాల్సిందేనని వాదించగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరేమో రియల్ హీరో అని మెచ్చుకుంటుంటే మరికొందరేమో ప్రేమికుల మధ్యలో దూరడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. 'లవర్స్ మధ్య వంద సమస్యలు ఉంటాయి. నువ్వు మధ్యలో కల్పించుకోవడం అవసరమా? వాడి గర్ల్ఫ్రెండ్ వాడిష్టం. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు ఈ అతిగాడికి ఏం సమస్యో..', 'ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందో ఎవడికి తెలుసు? అయినా వాడి లవర్ను వాడు కొట్టుకుంటుంటే నీకేంటి?' అంటూ కామెంట్లు చేశారు. వీటి స్క్రీన్షాట్లను యాంకర్ రష్మీ ట్విటర్లో షేర్ చేస్తూ సదరు నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'వాడి లవర్ వాడి ఇష్టం.. అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్లు చేయడం ఎంత సిగ్గుచేటు. తను ఎంత ఒత్తిడికి లోనవుతుందో ఎవరికి తెలుసు? మరో ఆత్మహత్య జరగాలని ఎదురుచూస్తున్నారా?' అని ఫైర్ అయింది. కాగా ఇటీవల జరిగిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసును గుర్తు చేస్తూ రష్మీ ఈ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. Vadi lover vadi istam anta Ammai ne support anta The comments below are so damn shameful What kind of pressure tat girl is in who knows Do u really hav to wait for another suicide to happen https://t.co/xHGmwkIP5d pic.twitter.com/5tc7AwjalK — rashmi gautam (@rashmigautam27) February 28, 2023 చదవండి: ఆస్కార్ లైవ్లో నాటు నాటు పాట.. మోత మోగించనున్న రాహుల్, కాలభైరవ -
అమ్మాయిని కొడతావా? నడిరోడ్డుపై యువకుడిపై నాగశౌర్య ఆగ్రహం
యంగ్ హీరో నాగశౌర్య రియల్ హీరో అనిపించుకున్నారు. నడిరోడ్డుపై ఓ యువతిపై యువకుడు చేయి చేసుకోగా, ఎందుకు కొట్టావంటూ నాగశౌర్య నిలదీశాడు. అంతేకాకుండా అమ్మాయిని కొట్టడం తప్పు అని ఆమెకు క్షమాపణలు(సారీ)చెప్పాల్సిందే అని శౌర్య సదరు యువకుడితో గొడవకు దిగాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోడ్డు మీద ఇద్దరు ప్రేమికులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అబ్బాయి అమ్మాయిని లాగిపెట్టి చెంప మీద కొట్టాడు. అదే సమయంలో అట్నుంచి కారులో వెళుతున్న నాగశౌర్య ఇది గమనించి 'ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ అంటూ నిలదీశాడు. దీనికి అతను ఆమె నా లవర్, నా ఇష్టం అంటూ ఓవర్యాక్షిన్ చేయగా అబ్బాయిని గట్టిగా పట్టుకొని మర్యాదగా ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ శౌర్య వాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శౌర్య చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. -
సిక్స్ ప్యాక్ మానియాలో హీరోలు..ఆరోగ్యంపై ఎఫెక్ట్
సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై దశాబ్ధంపైగానే అయినా అంతకంతకూ తన క్రేజ్ను పెంచుకుంటోంది. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలు అందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో దేశ ముదురు సినిమా కోసం అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, సుధీర్బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్లో తళుక్ మంటున్నారు. నాణేనికి మరోవైపు... ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని కూడా కొన్ని విశ్లేషణలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిక్స్ప్యాక్ కారణం? టాలీవుడ్లో హీరోలకు క్రేజీగా మారిన సిక్స్ప్యాక్ దక్కించుకుని, దాని కొనసాగింపుల కోసం నాగశౌర్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని, అదే విధంగా కఠినమైన డైట్ రొటీన్ను పాటిస్తున్నారని సమాచారం. యువకుడు, ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే నాగశౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చునని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని థృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీ కి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉంది. అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా... నిపుణులేమంటున్నారు? ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్ప్యాక్ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు. సిక్స్–ప్యాక్ మానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాతని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారేం చెప్తున్నారంటే... ► అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్ను బాగా ప్రభావితం చేస్తుంది. ► తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరమైన విషయం. ఆహారం నుంచి ఉప్పును తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ► అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్కు గురి చేసే అవకాశం ఉంది. ► అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, ఆ ఆరు పలకల కండరాలు ప్రస్ఫుటంగా కనిపించడం కోసం తరచు తరచి చూసుకోవడం, అవి కనపడని రోజున తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగవచ్చుని అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని కూడా సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ► బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎవరు ఎక్కువ శ్రమపడినా అది ప్రమాదకరమే కావచ్చునంటున్నారు. ► ఇక ఫాస్ట్గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకునేవారు కూడా ఆరోగ్యపరమైన తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు. -
నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా?
-
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్ ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్లో ఘనంగా రిసెప్షన్ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం. @IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE — devipriya (@sairaaj44) November 20, 2022 Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022 -
ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్గా నాగశౌర్య వివాహం
-
ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనూషశెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం!.. ఇంతకీ ఆమె ఎవరంటే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన వివాహం ఖరారైంది. ఈనెల 20న 11:25 గంటలకు వీరి వివాహం బెంగళూరులోని ఓ హోటల్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లిసందడి మొదలైంది.శుభలేఖలు కూడా పంచుతున్నారు. పెళ్ళికి భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందిగా నాగశౌర్య ఫ్యామిలీ ఆహ్వానితులను కోరుతున్నారు. ఇదిలా ఉండగా నాగశౌర్య పెళ్లి చేసుకునే అనూష శెట్టి ఎవరు? ఆమె ఏం చేస్తుంటుంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కర్ణాటకకు చెందిన అనూష శెట్టిది మంగళూరు దగ్గరలోని కుందాపూర్. ఇంటీరియర్ డిజైనింగ్లో ఎంతో టాలెంట్ ఉన్న అనూష ఉమెన్ అచీవర్స్లో ఒకరుగా గుర్తింపు సంపాదించుకున్నారు. 2019-2020లో ది బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనూష అందుకున్నారు. ఆర్కిటెక్ట్ గా కర్ణాటక స్టేట్ విన్నర్ అయిన అనూషతో నాగశౌర్యకు కొన్నాళ్లుగా పరిచయం ఉందట. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. నాగశౌర్య పెళ్లి కబురు తెలియడంతో అభిమానులు సహా సెలబ్రిటీలు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి, ఆ రోజు నుంచి స్ట్రీమింగ్, ఎక్కడంటే
యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కృష్ణ వ్రింద విహారి’. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే దసరాకు ముందు దసరాకి ముందు థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. చదవండి: సరోగసీ వివాదం.. ఇన్డైరెక్ట్గా స్పందించిన నయన్ దంపతులు! ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాలం నెట్ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 23న నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈమూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. కాగా దీనిపై త్వరలోనే నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి.. కృష్ణ వ్రింద అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానుందంటూ నెట్ఫ్లిక్సలో ఆప్షన్ కనిపిస్తోంది. దీంతో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి థియేటర్ల నవ్వులు పూయించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. #PremiereAlert 🔔@IamNagashaurya's #KrishnaVrindaVihari will be available for streaming on @NetflixIndia from 23 October. pic.twitter.com/AtSoOIX31f — Unfiltered Filmy 🍿 (@UnfilteredFilmy) October 12, 2022 -
‘కృష్ణ వ్రింద విహారి’ సక్సెస్ మీట్.. నాగశౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘కృష్ణ వ్రింద విహారి’ చాలా మంచి సినిమా. థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్లు, వసూళ్లు పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా ఉన్నాం. మా సినిమాకి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లీ సేటియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా ఇచ్చిన అనీష్ కృష్ణకు థ్యాంక్స్. ‘ఛలో’ తర్వాత నేను గర్వపడే హిట్ ఇచ్చినందు నిర్మాత, మా అమ్మకి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ఉషా ముల్పూరి మాట్లాడుత.. ‘‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో కలసి థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. దసరా సెలవులు వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. రాధికగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనీష్ ఆర్.కృష్ణ. ఈ కార్యక్రమంలో నటీనటులు హిమజ, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు కలెక్షన్లతో అదరగొట్టిన 'కృష్ణ వ్రింద విహారి'
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. న్యూజిలాండ్ గాయని, నటి షిర్లే సెటియా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్పై ఉష ముల్పూరి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి కలెక్షన్లను రాబట్టిందీ చిత్రం. అయితే తాజాగా తొలిరోజు కంటే రెండోరోజు ఎక్కువ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ లక్షడాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కాగా నాగశౌర్య ఇందులో సంప్రదాయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించాడు.బ్రహ్మాజీ, సత్య మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లొ నటించారు. Thanks to all the Overseas Audience for the Immense LOVE for our #KrishnaVrindaVihari 😊✨ $100k+ US Gross in 2 Days! ❤️🔥 Watch our #HilariousBlockbuster In Cinemas now! 🎟️ https://t.co/ZN7BGCyB6k#KVV @ShirleySetia #AnishKrishna @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/tHMigqo57b — Naga Shaurya (@IamNagashaurya) September 25, 2022 -
అప్పుడు పాన్ వరల్డ్ సినిమా అవుతుంది: నాగశౌర్య
‘‘పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి.. అంతేకానీ మనం పాన్ ఇండియాకి ప్లాన్ చేయకూడదు. మంచి కంటెంట్తో సినిమా తీస్తే పాన్ వరల్డ్ చూస్తారు. అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్గా ఉన్న సమయంలో మేము ఉండటం లక్గా భావిస్తున్నా’’ అన్నారు నాగశౌర్య. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. ⇔ ‘కృష్ణ వ్రింద విహారి’ కథ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించడంతో అనీష్కి ఓకే చెప్పాను. మంచి ఫన్, ఫ్యామిలీ, మాస్.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. సినిమా చూసినవారు తమ ఫ్యామిలీతో రిలేట్ చేసుకుంటారు. కుటుంబం ఉన్నంతవరకూ మా ‘కృష్ణ వ్రింద విహారి’లాంటి కథలకు తిరుగులేదు. ఈ సినిమాలో రాధికగారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ హిలేరియస్గా ఉంటాయి. ⇔ ‘అదుర్స్, డీజే, అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్నప్పటికీ దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. కమల్హాసన్, ఎనీ్టఆర్, అల్లు అర్జున్గార్లు.. వంటి వారు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు స్వతహాగా బ్రాహ్మణుడైన అవసరాల శ్రీనివాస్ వద్ద కొన్ని విషయాలు నేర్చుకున్నాను. రొమాంటిక్ సీన్స్లో నేను చాలా వీక్ (నవ్వుతూ).. మా దర్శకుడు కష్టపడి చేయించారు. ⇔ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా చేసిన పాద యాత్రలో ప్రేక్షకుల అభిమానం ఒక వరం అనిపించింది. ఇక నేను నటించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్ పూర్తయింది.. త్వరలో విడుదల చేస్తాం. -
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, రాధికా శరత్కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
లండన్లో ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ టీం సందడి
నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ లండన్లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ హీరోహీరోయన్లపై కీలక సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ పాల్గొంది. గతంలో నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన కళ్యాణ వైభోగమే ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అలాగే శ్రీనివాస్ అవసరాల, నాగశౌర్య కాంబినేషన్లో రూపొందిన ఊహలు గుసగుసలాడే, జో అచ్చుతానంత చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇలాంటి విజయవంతమైన చిత్రాల నాయకనాయికలు, దర్శకుడుతో పాటు ప్రతిభ కలిగిన సాంకేతిక వర్గంతో మా ఈ చిత్రం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వచ్చేది అప్పుడే
Krishna Vrinda Vihari Movie New Release Date Announced: యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ సింగర్ షిర్లీ సేథియా హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ను ప్రకిటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఏదో ఆలోచిస్తూ సూపర్ కూల్గా ఉన్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా అలరించనున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: ఎన్టీఆర్ నాగశౌర్యకు ఏమవుతాడు? క్లారిటీ ఇచ్చిన శౌర్య తల్లి Coming to you as Krishna with lots of love & laugh. May 20th - Get Set for Summer treat people🥳#KrishnaVrindaVihari on May 20th🎋 #KVV @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth #KrishnaVrindaVihariOnMay20 pic.twitter.com/z7CGOV7P0G — Naga Shaurya (@IamNagashaurya) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1151264010.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సామ్ చేతుల మీదుగా ‘వెన్నెల్లో వర్షంలా..’ రొమాంటిక్ సాంగ్
యంగ్ హీరో నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన రొమాంటికి అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’అంటూ ట్వీట్ చేస్తూ సామ్ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. -
‘కృష్ణ వ్రిందా విహారి’ హీరోయిన్ షిర్లే సెటియా (ఫొటోలు)
-
నాగశౌర్య ‘కృష్ణ వ్రిందా విహారి’ టీజర్ చూశారా?
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా రాధిక కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’.అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటించారు. అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' వచ్చేది అప్పుడే..
Naga Shaurya Krishna Vrinda Vihari Movie Release Date Out: యంగ్ హీరో నాగశౌర్య వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య, అశ్వథ్థామ వంటి విభిన్న చిత్రాలలో హీరోగా మెప్పించాడు. తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ షిర్లే సెటియా హీరోయిన్గా చేస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. 'కృష్ణ వ్రింద విహారి ఏప్రిల్ 22న వస్తున్నాడు' అంటూ ట్విటర్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమా కుటుంబంతో చూడదగిన పూర్తి వినోదాత్మక చిత్రమని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త రోల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఒక సాంగ్ తప్ప మిగతా షూటింగ్ సుమారు పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతలు స్వీకరించారు. KRISHNA and VRINDA are ready with Loads of Entertainment !!! 🤩#KrishnaVrindaVihari ❤️ is Arriving to Theatres on APRIL 22nd, 2022🎋@IamNagashaurya @ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @ira_creations @mahathi_sagar @saregamasouth#KrishnaVrindaVihariOnApr22 pic.twitter.com/uYwxi6idQF — Ira Creations (@ira_creations) March 7, 2022 -
మూడేళ్ల తర్వాత నాగశౌర్యకు రిప్లై ఇచ్చిన సాయి పల్లవి
నెచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. గ్లామర్ పాత్రలకు దూరం, చేసింది అరడజను సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందడం ఒక్క సాయి పల్లవికే చెందింది. స్టార్గా గుర్తింపు పొందేముందు ఓ నటి ఎన్నో విమర్శలు, ట్రోల్స్ను ఎదుర్కొంటుంది. కానీ సాయి పల్లవి మాత్రం అలాంటి వాటికి అవకాశమే ఇవ్వదు. అంతగా తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది ఆమె. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్వార్, వరస ట్వీట్స్తో మాటల యుద్ధం.. అలాంటి సాయి పల్లవిపై ముడేళ్ల క్రితం యంగ్ హీరో నాగశౌర్య విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాగశౌర్య, సాయి పల్లవిలు కలిసి కణం చిత్రంలో నటించారు. ఈ మూవీ షూటింగ్లో సమయంలో సాయి పల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ గతంలో నాగశౌర్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం తనపై నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు సాయి పల్లవి తాజాగా సమాధానం ఇచ్చింది. ఇటీవల సాయి పల్లవి బాడీ షేమింగ్కు గరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిసెంట్గా ఓ ఇంటర్య్వూలో తనపై వచ్చిన ట్రోల్స్పై స్పందిస్తూ నాగశౌర్య వ్యాఖ్యలపై కూడా స్పందించింది. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నా వల్ల ఎవరైన ఇబ్బంది పడ్డారంటూ నాకు బాధగా ఉంటుంది. గతంలో హీరో నాగశౌర్య నాపై ఇలాంటి కామెంట్స్ చేశాడు. అది తెలిసి నాకు చాలా బాధేసింది. కణం మూవీ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ని ఫోన్ చేసి నా వల్ల ఇబ్బంది పడ్డారా? అని అడిగాను. వాళ్లు అలాంటిదేమి లేదన్నారు. నటుడిగా నాకు నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. కానీ నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. నిజంగా సెట్లో నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. ఇక ఈ నా సమాధానంతో అయిన ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. -
ఆ సమయంలో తొమ్మిది రోజులు నీళ్లు కూడా ముట్టుకోలేదు: నాగశౌర్య
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించిన చిత్రం లక్ష్య. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడుతూ.. వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశానని తెలిపారు. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్గా వెళ్లాలంటే చాలా కష్టమని. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కథ డిమాండ్ చేస్తే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదని’’ అన్నారు. ‘‘ 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదని ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: సిరిది సిగ్గులేని జన్మ, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో -
ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: Rajamouli Emotional Post: ‘ఆర్ఆర్ఆర్’లో ఆయనతో ఓ షాట్ ప్లాన్ చేశా, కానీ.. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా’ అంటూ హీరోయిన్ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటించింది. అలాగే జగపతిబాబు, సచిన్ కేడ్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 10వ థియేటర్లలో విడుదల కానుంది. -
హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
-
ఫాంహౌజ్ పేకాట కేసు: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
Hero Naga Shourya Father Shivalinga Prasad Arrested: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: టేబుల్కు 5 లక్షలు క్యాసినో కింగ్పిన్ గుత్తా సుమన్తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: టేబుల్కు 5 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు. రకారకాల ఆఫర్లు చెప్పి, పండుగల స్పెషల్ అంటూ మూడు ముక్కలాటకు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్లో పట్టుబడిన సుమన్ గ్యాంగ్ కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. ఆరు కోట్లు అన్నట్టుగా భారీస్థాయిలో జూదం నడిపిస్తోంది. సుమన్.. స్పెషల్ పేరిట... జి.సుమన్కుమార్ (జీఎస్కే) నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్సాప్ల ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు. పార్టీ లొకేషన్ షేర్ చేస్తాడు. ఫాంహౌజ్, గెస్ట్హౌజ్లు కిరాయికి తీసుకొని మందు, విందు భారీస్థాయిలో ఏర్పాటు చేస్తాడు. కనీసం 5 నుంచి 10 టేబుళ్లు పెట్టి ప్రముఖులకు మినీ క్యాసినో ఏర్పాటు చేస్తాడు. అయితే స్పెషల్ అట్రాక్షన్ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్ క్యాసినో గరŠల్స్ను రంగంలోకి దించుతున్నట్లు సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమన్ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురుచూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్లోనే కాకుండా వీవీఐపీలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్ కొంతమంది వ్యాపారులు, వీఐపీలతో కలిసి రష్యా వెళ్లాడు. అక్కడ క్యాసినోలో రూ.4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్టు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది. ఇటీవల రష్యా వెళ్లినప్పుడు అక్కడ క్యాసినో ఆడుతున్న సుమన్ చౌదరి తదితరులు ఇది పెద్ద తిమింగళం... పేకాట దందాలో సుమన్కు మించిన ఓ తిమింగళం హైదరాబాద్ కేంద్రంగానే కోట్ల దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అండదండలు ఉండటంతోపాటు ఆయన కూడా జూదంలో చేయి తిరిగినవ్యక్తి కావడంతో పేకాట తిమింగళానికి అడ్డూఅదుపు లేదని నిఘా వర్గాలు చెప్పాయి. త్రీకార్డ్స్ (తీన్ పత్తా), రమ్మీ పాయింట్స్, పోకర్ ఈ మూడు రకాల పేకాటను ప్రముఖ వ్యక్తి అనుచరుడు జోరుగా సాగిస్తున్నాడు. వీవీఐపీలకు మాత్రమే తన అడ్డాలోకి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి 2 గంటల వరకు ఆయన దందా సాగిస్తున్నట్టు తెలిసింది. గతంలో టాస్క్ఫోర్స్ ట్యాంక్బండ్ పరిసరాల్లోని ఓ ప్రముఖ హోటల్లో అతడిని అరెస్ట్ చేసినా సదరు నిర్వాహకుడి వ్యవహారం మారలేదని పోలీసులే చెప్తున్నారు. దందా ఎక్కడెక్కడ? బేగంపేటలోని ఓ క్లబ్బును ఏళ్లపాటు నిర్వహించిన పేకాట తిమింగళం తెలంగాణ ఏర్పడిన తర్వాత అనధికారిక కేంద్రాలను తెరిచింది. నగరానికి చెందిన ప్రముఖుడి అండ చూసుకొని కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్, దేవరయాంజాల్లోని 70 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్, జూబ్లీహిల్స్లో ప్రముఖ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ఓ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ మొత్తం, బంజారాహిల్స్ రోడ్నంబర్ 12లోని ప్రముఖుల నివాస ప్రాంతం, సెంట్రల్ జోన్ పరిధిలోని ఆదర్శ్నగర్, రంగారెడ్డి జిల్లా అమన్గల్లోని సొంత ఫాంహౌజ్లో పేకాటను జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గేమ్కు ఐదు శాతం కమీషన్.. ప్రధానంగా త్రీకార్డ్స్, రమ్మీని ఆడించే ఈ నిర్వాహకుడు ప్రతీ టేబుల్కు కనీసం రూ.5 లక్షలు ఉంటేనే అనుమతిస్తాడు. మూడు ముక్కలాటలో బ్లైండ్గేమ్ పేరిట జరిగే దందానే అతడికి కాసులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ గేమ్కి (కిట్) పాడిన మొత్తంలో 5 శాతం కమీ షన్గా తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి ఒక్కో గేమ్కి రూ.లక్ష చొప్పున ఆడినా రూ.5 లక్షలు అవుతాయి. అందులో ఒక గేమ్కి 5 శాతం కమీషన్ అంటే రూ.25 వేల చొప్పున వసూలు చేస్తాడు. ఇలా రోజుకు 20–25 గేమ్లు నడిపిస్తాడు. దీంతోపాటు రమ్మీ పాయింట్స్ 101కు ఐదుగురు రూ.5 లక్షల చొప్పున ఒక్కో గేమ్ ఆడితే రూ.25 లక్షలు అవుతుంది. ఇందులో 5 శాతం కమీషన్గా 1.25 లక్షలు తీసుకుంటాడు. ఇలాంటి రమ్మీ పాయింట్లు కనీసం నాలుగు గేములు ఆడుతున్నారంటే రూ.5 లక్షలు తన ఖాతాలోకి వెళ్లాల్సిందే. దీనికి అన్లిమిటెడ్ ఆఫర్గా ఆల్కహాల్, ఆహారం అందిస్తాడు. గోవా నుంచి వచ్చిన అమ్మాయిలను రంగంలోకి దించడం ఈ నిర్వాహకుడి ప్రత్యేకత. సుమన్తోపాటు అతనికి సహకరిస్తూ పేకాట సెంటర్లు నిర్వహిస్తున్న ప్రముఖ నిర్వాహకుడిపై పోలీసులు నజర్ పెట్టినట్లు తెలిసింది. -
సినీ హీరో నాగశౌర్య ఫామ్హౌస్లో పేకాటరాయుళ్ల పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఫామ్హౌజ్లో భారీ పేకాట వ్యవహారాన్ని ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. రెండు, మూడు రోజులు అడ్డావేసి పేకాట ఆడుదామని సిద్ధమైన వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ ఫామ్హౌజ్ సినీహీరో నాగÔౌర్యకు చెందినదిగా ప్రచారం జరగడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. గోవాలోని కాసినోల తరహాలో.. హైదరాబాద్ శివార్లలో నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మంచిరేవుల వద్ద గ్రీన్లాండ్స్ వెంచర్ ఉంది. అందులో రమణ అనే వ్యక్తి చెందిన ఫాంహౌస్ను సినీహీరో నాగశౌర్య ఐదేళ్ల లీజుకు తీసుకున్నారు. అందులో టీవీ సీరియళ్లు, సినిమాల షూటింగ్లు, పార్టీలు జరుగుతుంటాయి. అయితే దీపావళి పండుగ వస్తుండటంతో భారీగా పేకాట నిర్వహించేందుకు కొందరు ప్లాన్ చేశారు. నాలుగు రోజుల పాటు ఈ ఫాంహౌజ్ను వాడుకుంటామని సుమంత్ చౌదరి అనే పేరిట బుక్ చేసుకున్నారు. తరచూ గోవాలోని కాసినోలకు వెళ్లేవారిని సంప్రదించి ఇక్కడికి ఆహ్వానించారు. కాసినోల తరహాలో టేబుళ్లు, కాసినో కాయిన్లు, వందల పేకాట బాక్సులు, క్యాష్ కౌంటింగ్ మిషిన్లు, మద్యం, భోజన సదుపాయాలు వంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందడంతో.. ఆదివారం రాత్రి దాడి చేశారు. 30 మంది అరెస్టు ఫామ్హౌజ్లోని పేకాట స్థావరంలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన 30మందిని అదుపులోకి తీసుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలిపారు. 6.70 లక్షల నగదు, మూడు కార్లు, 33 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అరెస్టైన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట స్థావరంలో అదుపులోకి తీసుకున్నవారి పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. వారిని రిమాండ్కు పంపే సమయంలో వివరాలు వెల్లడిస్తామని నార్సింగి సీఐ శివకుమార్ తెలిపారు. -
‘వరుడు కావలెను' ముందు నాగచైతన్యకు చెప్పా: డైరెక్టర్
‘‘సినిమాలు, అందులోని క్యారెక్టరైజేషన్స్ చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. కాబట్టి ప్రేక్షకులను తప్పుదోవ పట్టించకూడదు. పదిమందిని బాగుచేయకపోయినా పర్లేదు కానీ ఒక్కర్ని కూడా చెడగొట్టకూడదు. దర్శకత్వాన్ని నేనో బాధ్యతగా స్వీకరించాను. నేను ఏ సినిమా చేసినా చూసినవారు హ్యాపీగా ఉండేలా, ఒక మంచి విషయం నేర్చుకునేలా తీయాలనుకుంటాను’’ అన్నారు దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య చెప్పిన విశేషాలు. కర్నూలు జిల్లాలో పుట్టాను. గుంటూరులో పెరిగాను. సినిమాలంటే ఇష్టం. అందుకే ఈ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. దర్శకులు తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ప్రకాశ్ కొవెలమూడి, మంజుల... 15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను. ∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్ను నిర్మాత చినబాబుకు చెప్పాను. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేశాను.. ఓకే అన్నారు. కానీ అనుకోకుండా మా నాన్నగారు దూరం కావడం, కరోనా, లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ముందు ఈ కథను నాగచైతన్యకు చెప్పాను. కానీ ప్రాజెక్ట్ కుదర్లేదు. ఆ తర్వాత నాగశౌర్య ఓకే అయ్యారు. ∙ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి తనకు కాబోయే వరుడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆశపడుతుందో అదే ‘వరుడు కావలెను’ సినిమా. ఇందులో ఆర్కిటెక్చర్ ఆకాశ్ పాత్రలో నాగశౌర్య, ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ ఉమెన్ భూమి పాత్రలో రీతూ వర్మ కనిపిస్తారు. ఇద్దరూ బాగా చేశారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతం అందించారు. మాస్ సాంగ్స్ కోసం తమన్ని తీసుకున్నాం. నిర్మాత చినబాబుగారు ఈ సినిమాకు హీరో. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. ఓ పెద్ద నిర్మాణసంస్థ ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే రిలీజ్ టెన్షన్ ఉంది. కానీ సినిమా చూసిన ప్రతి అబ్బాయి, అమ్మాయి మా ‘వరుడు కావలెను’ సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి రంగంలోనూ అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇప్పుడు సమానమైన అవకాశాలు ఉంటున్నాయి. ఎవరైనా రన్నింగ్ రేస్లో పరిగెత్తాల్సిందే. పరిగెత్తగలిగితేనే రావాలి. నేను అమ్మాయిని కాబట్టి రిజర్వేషన్ ఇవ్వండి అంటే కుదరదు. ప్రతిభ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రోత్సాహం లభిస్తుంది. నా దగ్గర కథలు ఉన్నాయి. ఐడెంటిటీ క్రైసిస్పై (గుర్తింపు కోసం తపన) ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. -
‘వరుడు కావలెను’.. ఈ టైటిల్ తనకు కరెక్ట్: రానా
‘‘వరుడు కావలెను’ టైటిల్ చూశాక హీరో ఎవరో నాకు చెప్పకపోయినా నాగశౌర్య అని ఊహించేవాణ్ణి. రాముడు మంచి బాలుడు అంటారు కదా.. తనను చూస్తే అలా అనిపిస్తుంటుంది. ఈ టైటిల్ తనకు కరెక్ట్గా సరిపోయింది’’ అని హీరో రానా అన్నారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ని రానా విడుదల చేశాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..‘‘లక్ష్మీ సౌజన్యగారి గురించి శేఖర్ కమ్ములగారి శిష్యులు చెబుతుంటే విన్నాను. ఈ చిత్రంతో ఆమె మంచి హిట్ అందుకోవాలి. మంచి టీమ్ పనిచేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. నాగశర్య మాట్లాడుతూ..‘‘వరుడు కావలెను’ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. హీరోని బట్టి కాదు.. కథను బట్టి బడ్జెట్ పెట్టేవాళ్లను మూవీ మేకర్స్ అంటారు. తెలుగు ఇండస్ట్రీలోని మేకర్స్లో నాగవంశీ, చినబాబుగార్లు కూడా ఒకరు. ఈ చిత్రంలో నేను ఇంత అందంగా ఉండటానికి కారణం కెమెరామ్యాన్ వంశీ పచ్చిపులుసుగారే. ఈ సినిమాలో నన్ను నేను చూసుకుని లవ్లో పడిపోయా. 2018 ఫిబ్రవరి 2న ‘ఛలో’ సినిమా విడుదలైంది. ఆ రోజు సాయంత్రం సక్సెస్మీట్లో లక్ష్మీ సౌజన్య అక్కను కలిశా. తను ఆరోజు చెప్పిన లైన్ నాకు బాగా నచ్చి ఈ సినిమా చేశాను. రీతూ వర్మకీ, నాకు ఏదో గొడవ అయిందనే వార్తల్లో నిజం లేదు. తను షూటింగ్లో ఉండి రాలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా చూసి మమ్మల్ని బతికించండి.. మీరు ఆనందంగా ఉండండి’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన వంశీ, చినబాబులకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ సౌజన్య. -
Varudu Kavalenu:పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చని అమ్మాయిని ప్రేమిస్తే..?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’.లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అనిహీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు. కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలంటే.. అక్టోబర్ 29న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న మరో ఫోక్సాంగ్
ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్కి మంచి ఆధరణ లభిస్తుంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల్లో కశ్చితంగా ఒక ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇటీవలె విడుదలైన సారంగదరియా, బుల్లెట్ బండి వంటి పాటలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ‘వరుడు కావలెను’సినిమా నుంచి రిలీజైన “దిగు దిగు నాగ” అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ పాటకు 20 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శ్రేయా గోషల్ ఆలపించింది. థమన్ సంగీతం అందించారు. నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కానుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రమోషన్స్ను మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 20M+ Views for Folk Sensation #DiguDiguDiguNaaga💥🥁 ▶️https://t.co/U7F59YlUAV 🎵 @MusicThaman 🎤 @shreyaghoshal ✍️ #AnanthaSriram#VaruduKaavalenu @IamNagashaurya @riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @SitharaEnts @adityamusic pic.twitter.com/MByedtS4Nc — Aditya Music (@adityamusic) October 11, 2021 -
నాగశౌర్యకు ముద్దిచ్చిన హీరోయిన్..
ప్రాచీన విలువిద్య నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని నాగశౌర్య, కేతికల పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. -
వరుడు.. నరుడు...ఆన్ సెట్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో తిరిగి సినిమాల షూటింగ్లు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘వరుడు కావలెను’, ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల షూటింగ్లు కూడా గురువారం పునఃప్రారంభమయ్యాయి. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా చివరి షెడ్యూల్ను ప్రారంభించారు. హీరో, హీరోయిన్లపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరుడి బ్రతుకు నటన’ షూటింగ్ కూడా ప్రారంభమైంది. -
సోషల్ హల్చల్: షాకింగ్ లుక్లో శ్రద్దా, మతిపోగొడుతున్న నభా
► ఎర్ర చీరలో మెరిసిపోయిన ఈషా రెబ్బా.. అభిమానులకు కరోనా సందేశం ► ఈ కఠిన పరిస్థితుల్లో మనకు సహాయపడేవి ఆ రెండే అంటున్న సమంత ► సన్యాసిని గేటప్లో శ్రద్దాదాస్, అసలు విషయం చెప్పెసిన ముద్దుగుమ్మ ► అభిమానులకు అమిషా సందేశం, అతనేవరో తెలియదంటున్న భామ ► ఫొటో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ► ఎల్లప్పుడు మీరు నాకు ప్రత్యేకమంటు మొదటి సారి పరిచయం చేసిన నాగశౌర్య ► తెలివైన నిర్ణయం తీసుకొమ్మంటున్న బిగ్బాస్ భామ మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) -
నిర్మాణం చివరి దశలో యంగ్ హీరో నాగశౌర్య మూవీ
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని ఎయిట్ప్యాక్ లుక్తో సర్పైజ్ చేశారు నాగశౌర్య. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కి, నాగశౌర్య బర్త్డే సందర్భంగా రిలీజైన టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట, పోరాటాల కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో దాని ఉనికిని మరచిపోలేము. గొప్ప యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని ధరించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్రం త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. 1900లో సమ్మర్ ఒలింపిక్స్లో ఆర్చరీని క్రీడగా చేర్చారు అప్పటి నుంచి ఇది క్రీడా సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ ఆటకు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ, అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం. చాలా మంది ప్రతిభావంతులైన ఆర్చర్లను తయారు చేయడం ద్వారా ఈ క్రీడలో మంచి గుర్తింపు సాధిస్తోంది భారతదేశం. హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:రామ్రెడ్డి, సంగీతం:కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి. -
నాగశౌర్య షాకింగ్ లుక్ : టైటిల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: యంగ్హీరో నాగశైర్య మరోసారి షాకింగ్ లుక్లో ఫ్యాన్స్ను విస్మయపర్చాడు. ఈ చిత్రానికి `లక్ష్య` అనే టైటిల్ను అధికారికంగా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్గా నాగశౌర్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్లో వినూత్న ప్రయోగాలతో ప్రేక్షకులముందుకు వస్తున్న నాగశౌర్య తాజా లుక్పై అభిమానులు ఫిదా అవుతున్నారు. (నాగశౌర్య సరసన హాట్ బ్యూటీ ఎంట్రీ) ఊహలు గుసాగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో నాగశౌర్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అటు ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఎయిట్ ప్యాక్ బాడీతో చేతిలో బాణంతో స్టన్నింగ్ ఫస్ట్లుక్ ఇప్పటికే అందరినీ థ్రిల్ చేసిన సంగతి తెలిసిందే. “ LAKSHYA “ - A journey to conquer himself@nseplofficial @SVCLLP @sharrath_marar @Santhosshjagar1 #Ketikasharma@RaamDop @kaalabhairava7 @EditorJunaid #NS20#IndiasFirstFilmonArchery#Archery pic.twitter.com/84BbFS8NGN — Naga Shaurya (@IamNagashaurya) November 30, 2020 -
నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
-
పలాస మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘పలాస 1978 గొప్ప సినిమా అవుతుంది’
కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి6న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్లకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిని ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు యంగ్ హీరోలు నాగశౌర్య, శ్రీవిష్ణు, దర్శకుడు మారుతి, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, చిత్రయూనిట్కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘పలాస 1978 నేను చూసాను. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని నాగశౌర్య అన్నారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘పలాస ఫస్ట్ కాపీ చూసిన రోజు దర్శకుడు కుమార్ ఒక అద్భుతం చేసాడని పించింది. మనం ఊహించిన దానికంటే చాలా బాగా తీసాడు. ప్రతి మేకర్కి ఇలాంటి సినిమా చేయాలనిపించేలా చేసాడు. అందులో రఘుకుంచె గారి నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. తమిళ సినిమాలు చూసి మనం ఫీల్ అవుతుంటాం.. వెట్రిమారన్ లాంటి వారిని చూసి ప్రేరణ పొందుతుంటాం. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారు అని కరుణ కుమార్ గుర్తు చేసాడ’న్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్, నిర్మాత రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది. చదవండి: బంజారా సినిమాను నిషేధించాలి రాధిక నాకు తల్లి కాదు! -
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
కొత్త ప్రయాణం ప్రారంభం
‘అశ్వథ్థామ’ విజయంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు నాగశౌర్య. తాజాగా ఓ కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమా తెరకెక్కించనున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు కెమెరా: వంశీ పచ్చి పులుసుల, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’
గ్యాప్ తర్వాత ‘అశ్వథ్థామ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో వేగం పెంచాడు. నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశి పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇక ఛలో తర్వాత అంతటి హిట్ అందుకోని నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్పెప్ట్తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీతు వర్మ కూడా పెళ్లి చూపులు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్ స్పెషల్గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ -
మా శౌర్య చిన్నప్పట్నుంచి మాస్
‘నర్తనశాల’ (2018) సినిమా తీసి తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య ఫీలయ్యాడు. మా బ్యానర్ నుంచి అలాంటి సినిమా వచ్చినందుకు నిర్మాతగా నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్లో అది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ బాధను తీసేసేలా ‘అశ్వథ్థామ’ మంచి సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత ఉషా మూల్పూరి (నాగశౌర్య తల్లి). రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య ఈ సినిమాకు కథ అందించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలా బాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోషాన్నిచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మనకు ఒక నిర్భయ, దిశ కేసులు తెలుసు. కానీ ‘అశ్వథ్థామ’లో చూపించిన విధంగా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కథ పరంగా శౌర్యకు మంచి స్పందన వస్తోంది. శౌర్య ఇలాంటి కథ రాసినందుకు ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు శౌర్య సామాజిక బాధ్యతతో ఆలోచిస్తున్నాడని మేం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. ‘అశ్వథ్థామ’ చిత్రంతో శౌర్యలోని మాస్ యాంగిల్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ హీరోతో సినిమా చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆలోచన. నిజానికి చిన్నప్పటి నుంచి కూడా శౌర్య ఫుల్ మాస్. సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ లవర్బాయ్ అనే పేరు వచ్చింది. శౌర్య అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. ఇప్పుడు రైటర్ అయ్యాడు. భవిష్యత్లో దర్శకుడు అవుతాడేమో ఇప్పుడే తెలియదు. ఇండస్ట్రీకి మేం చాలా ప్యాషనేట్గా వచ్చాం. మా బ్యానర్లో తర్వాతి చిత్రం వేరే హీరోతో ఉండొచ్చు. మా బ్యానర్లో అందరి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి ఒక్కరే హీరో కాదు కదా! రాఘ వేంద్రరావుగారితో శౌర్య సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
’అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
-
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్వథ్థామ జానర్: యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు కథ: నాగశౌర్య దర్శకత్వం: రమణతేజ సంగీతం: శ్రీచరణ్ పాకాల నిర్మాత: ఉషా మూల్పూరి ‘ఛలో’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న యువ హీరో నాగశౌర్య ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేపోయాడు. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బలమైన స్క్రిప్ట్తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్ బాయ్ ఇమేజ్ను పక్కకు పెట్టి ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్ అండ్ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడా? డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ. గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. ఇప్పటివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ను తొలగించుకునేందుకు ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంలో నటించిన నాగశౌర్య ఫుల్ ఎనర్జీతో సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్లలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్ ఆడియన్స్ను సొంతం చేసుకోవడం పక్కా. సినిమా తొలి అర్థభాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్ లుక్లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్లో కనిపిస్తాడు. సైకో విలన్గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్ అండ్ రిచ్ విలన్గా చక్కగా ఒదిగిపోయాడు. రబ్బరు బొమ్మగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి సందర్భానుసారంగా స్క్రీన్ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద ప్లస్ కాదు. విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న సెకండాఫ్ దర్శకుడు ఎలా తీస్తాడా? అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం. అయితే సెకండాఫ్లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ అంతగా పండలేదు. దీనిపై కాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ అందాలు, యాక్షన్ సీన్లలో మనోజ్ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్లలో సైలెంట్ మ్యూజిక్.. మరికొన్ని చోట్ల హార్ట్ బీట్ను పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా హీరో ఈల వేసేటప్పుడు థియేటర్ మొత్తం నిశ్శబ్బ వాతావరణం అలుముకుటుంది. ఇక శ్రీచరణ్ పాకాల పాటలు పర్వాలేదనిపించాయి. కానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్ను ఇచ్చే అంశం. ఆకట్టుకునే డైలాగ్లు: ‘ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయింది రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’, ‘లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఏదో మ్యాజిక్ ఉంది’, ‘ప్రస్తుత కాలంలో ఆడపిల్లను కని, పెంచి ఏ గొడవ లేకుండా పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు’ అంటూ సినిమాలో వచ్చే డైలాగ్లు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉంటాయి. ప్లస్ పాయింట్స్: కథ, కథనం నాగశౌర్య నటన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: కొన్ని సాగదీత సీన్స్ పాటలు క్లైమాక్స్ సాదాసీదాగా ఉండటం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
కొత్త శౌర్యను చూస్తారు
‘‘నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గెడ్డం తీస్తే క్లాస్గా కనిపిస్తాడు. గెడ్డం ఉంటే ఫైటర్గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్ పెడితే కౌబాయ్లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సక్సెస్ల సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది’’ అన్నారు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుటుంబ కథా చిత్రంలా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు. మా సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు’’ అన్నారు నాగశౌర్య. ‘‘ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. ఓ మంచి కారణంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమణతేజ. ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు నేను ఏదో ఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు’’ అన్నారు ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్. ‘‘అవకాశాల కోసం ప్రయత్నించి ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఛలో’ వంటి సూపర్ సక్సెస్ కొట్టిన నాగశౌర్య సినిమాకు నేను డైలాగ్స్ రాయడం ఏంటీ? అనుకున్నాను. శౌర్య ఓ సీన్ ఇచ్చి రాయమన్నారు. రాశాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ‘నువ్వు ఈ సినిమాకు రాస్తున్నావ్’ అన్నారు. చాలా సంతోషపడ్డాను’’ అన్నారు డైలాగ్ రైటర్ పరశురామ్. -
దేనికైనా ఎమోషనే ముఖ్యం
‘‘మన దగ్గర థ్రిల్లర్ జానర్కి ఆడియన్స్ తక్కువ. మన ప్రేక్షకులకు ఎలివేషన్ కన్నా ఎమోషన్ ముఖ్యం. ఒక ఎమోషనల్ కథకు థ్రిల్లర్ అంశాలు జోడిస్తే అదే ‘అశ్వథ్థామ’ చిత్రం’’ అన్నారు దర్శకుడు రమణ తేజ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మాది చిత్తూరులో మదనపల్లి. చిన్నప్పుడు చదువుకుంది మదనపల్లిలోనే. మా ఫ్యామిలీలో అందరం ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లం. నాన్నగారికి చిరంజీవిగారంటే విపరీతమైన అభిమానం. నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాణ్ణి. తమిళనాడులో ఇంజనీరింగ్ చేశాను. కాలేజ్లో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరిక కలిగింది. కాలేజీ రోజుల్లో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్కి స్క్రీన్ప్లే వీక్ అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఫిల్మ్ కోర్స్ చేశాను. అక్కడ స్క్రీన్ రైటింగ్లో డిగ్రీ చేశాను. స్క్రీన్ ప్లే మీద అవగాహన సంపాదించాను. ‘టెడ్ 2’ అనే హాలీవుడ్ సినిమాకు అప్రెంటిస్గా వర్క్ చేశాను కూడా. తిరిగొచ్చాక ఓ సినీ ప్రమోషన్ కంపెనీలో వర్క్ చేస్తుండగా ‘ఛలో’ ప్రమోషన్స్లో నాగశౌర్య అన్న పరిచయమయ్యారు. అలా మా ప్రయాణం మొదలైంది. అప్పుడే శౌర్య అన్న ‘అశ్వథ్థామ’ కథ రాస్తున్నారు. అది పూర్తయ్యాక నువ్వే దర్శకుడిని అన్నారు. దర్శకుడిగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. శౌర్య అన్నయ్యతో ఈ ప్రయాణాన్ని మర్చిపోలేను’’ అన్నారు. -
క్లాస్.. మాస్ అశ్వథ్థామ
‘‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మా అబ్బాయి నాగశౌర్య మంచి కథ రాశాడు.. దాన్ని డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. నాగశౌర్య, మెహరీన్ జంటగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ– ‘‘అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని కాస్త ఎక్కువగానే తీశాం. ‘కేజీఎఫ్’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు–అరివు మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యను చూస్తారు’’ అన్నారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. నన్ను నమ్మి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగశౌర్యకి కృతజ్ఞతలు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు రమణ తేజ. ‘‘అనుకున్న టైమ్లో సినిమాను పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే ఔట్పుట్ బాగా వచ్చింది. ఇందుకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని సహ నిర్మాత బుజ్జి అన్నారు. -
కొత్త నాగశౌర్యను చూస్తారు
నాగశౌర్య హీరోగా ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సోమవారం కొబ్బరికాయ కొట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణదాస్ నారంగ్, శరత్మరార్, రామ్మోహన్రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన మొదటి సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్రావుగార్లతో కలిసి నాగశౌర్యతో సినిమా నిర్మిస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘సునీల్గారు, శరత్ మరార్గారి కాంబినేషన్లో నా సినిమా ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్ రెండో చిత్రమిది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘క్రీడా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఒక ఊహాజనిత బయోపిక్లా ఉంటుంది. నాకు మంచి మైలేజ్ ఇచ్చే మూవీ అవుతుంది. ఇందులో సరికొత్త నాగశౌర్యని చూస్తారు’’ అన్నారు సంతోష్ జాగర్లపూడి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి. -
కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్ హీరో
‘ఛలో’ సినిమాతో మంచి హిట్టు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. మళ్లీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. నర్తనశాల, అమ్మమ్మగారి ఇల్లు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోర్లాపడ్డాయి. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. నాగశౌర్య హీరోగా 'సుబ్రమణ్యపురం' ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నారయణదాస్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్రావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘ఇదొక స్పోర్ట్ బేస్డ్ మూవీ. కథ అద్భుతంగా ఉంది అలాగే సంతోష్ ప్రామిసింగ్ డైరెక్టర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం'' అన్నారు. యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘ఏషియన్ సునీల్ గారు. శరత్ మరార్ గారి కాంబినేషన్లో ఈ చిత్రం ప్రారంభమవడం సంతోషంగా ఉంది. సంతోష్కు రెండో చిత్రం ఇది. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మంచి స్క్రిప్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు. ఇక చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. -
కొత్త సినిమాను ప్రారంభించనున్న యంగ్హీరో
ఛలో సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగశౌర్య.. మళ్లీ ఆ రేంజ్ హిట్టు కొట్టలేకపోతున్నాడు. నర్తనశాల, అమ్మమ్మగారిల్లు లాంటి సినిమాలు చేసినా.. ఈ యువహీరోకు అదృష్టం కలిసి రాలేదు. అయితే సమంత హీరోయిన్గా నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. అయితే తాజాగా నాగశౌర్య తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించే ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాన్నుట్లు తెలిపారు. ఈ మూవీ షూటింగ్ను అక్టోబర్లో ప్రారంభించి.. వచ్చే సమ్మర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ హీరో ప్రస్తుతం అశ్వత్థామ సినిమాతో బిజీగా ఉన్నాడు. -
టాలీవుడ్ యంగ్ హీరోకు ఫైన్
సాక్షి, హైదరాబాద్ : యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి రూ. 500ల ఫైన్ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో చోటుచేసుకుంది. కాగా, భారత్లో కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడటంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల నాగశౌర్య ఓ బేబీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. వైజాగ్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డ సంగతి విదితమే. -
అందుకు ‘ఓ బేబీ’కి ఓకే చెప్పేశా : నాగశౌర్య
‘‘ఓ బేబీ’ చిత్రంలో నాది అతిథి పాత్ర అని చెప్పినా నందినీ రెడ్డిగారికి ఓకే చెప్పేశా. ఎందుకంటే ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన లక్ష్మీగారు ఉన్నారు. ‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచి ఆమెతో పని చేయాలనుకుంటున్నా. ఇంతకు ముందు ఒకసారి అనుకున్నా కుదరలేదు. ‘ఓ బేబీ’ తో కుదిరింది’’ అని హీరో నాగశౌర్య అన్నారు. సమంత, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ముఖ్య పాత్రల్లో బి.వి. నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. ♦ హీరోగా చేస్తూ అతిథి పాత్రలు చేయడం ఇబ్బందిగా లేదు. నాకు నచ్చిన వారితో సినిమా చేయడం చాలా ఇష్టం. నందినీరెడ్డిగారు నాకు అక్కలాంటివారు. ఈ సినిమా గురించి ఆమె నాకు చెప్పడానికి సందేహిస్తుంటే మా అమ్మ ఒత్తిడి చేసి నాకు చెప్పించింది. కథ వినగానే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అనిపించి, ఇందులో నేనూ భాగం కావాలనుకున్నా. ♦ తొలుత నాది అతిథి పాత్రే అనుకున్నా. సెట్లోకి వెళ్లాక ఫుల్ లెంగ్త్ అయింది. లక్ష్మీగారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం నేను, సమంతగారు అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారి ఆమెను పలకరించాను. ఆ తర్వాత దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే నాకు సిగ్గెక్కువ. అందరూ దాన్ని పొగరు అనుకుంటారు. నా సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్కి దూరంగా ఉంటున్నా. కానీ, తప్పదంటే మాత్రం చేస్తా. ♦ ఈ సినిమాలో నా లుక్ బాగుందని అంటున్నారు. అంటే ఇన్నాళ్లు నేను బాగా లేనా? అనిపించింది (నవ్వుతూ). సమంత గారితో పని చేస్తున్నప్పుడు నేను పెద్ద హీరోయిన్తో పని చేస్తున్నానని ఏ రోజూ అనిపించలేదు. ఈ సినిమాలో ఆమె ముఖం మీద ఉమ్మివేసే సీన్ ఉంటుంది. నేను ఆ పని చేస్తే బయట అందరూ నా మీద ఉమ్మేస్తారనుకున్నా. కానీ ఆమె డెడికేటెడ్ వ్యక్తి. సినిమా కోసమే కదా అని సహకరించడంతో ఆ సీన్ చేశా. ♦ ప్రస్తుతం మా ఐరా క్రియేషన్స్లో ‘అశ్వత్థామ’ సినిమా చేస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’ చేస్తున్నా. అదే విధంగా ‘పార్థు’ అని మరో సినిమా జరుగుతోంది. రిస్క్ చేయడం వల్ల ఇటీవల గాయపడ్డానని అంటున్నారు. అంత రిస్క్ అవసరమే. అది 14 నిమిషాల సీను. డూప్ని పెడితే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. హీరో పడే టెన్షన్ వాళ్లూ పడాలంటే నేనే కష్టపడాలని అర్థమైంది.. అందుకే రిస్క్ చేసి నేనే చేస్తున్నా. -
ఈ యువ హీరోలకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్ : నగరానికి ఏమైంది అన్నట్లు.. ఇది వింటే ఈ యువ హీరోలకు ఏమైంది అంటారు. నిజమే వరుసగా గాయాలపాలవుతున్న యువహీరోలను చూస్తే అసలేమైంది. ఎందుకు ఇలా అవుతుంది అనే సందేహం రాక మానదు. టాలీవుడ్ తలరాత బాలేదా లేక మన హీరోల జాతకం బాలేదా లేక ఏమైనా దోషం పట్టుకుందా అన్న అనుమానం వస్తుంది. మొన్నేమో వరుణ్తేజ్.. నిన్నేమో నాగశౌర్య.. సందీప్ కిషన్.. తాజాగా ఇవాళేమో శర్వానంద్... ఇలా ఒక్కొరు ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. ఇంతకు మన టాలివుడ్కు ఏమైందంటారు. నాగబాబు తనయుడు వరుణ్తేజ్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఓ సినిమా షూటింగ్లో పాల్గొని తిరిగి వస్తుండగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాణిపేట దగ్గర ఎదురుగా వస్తున్న ఇండికా కారును వరుణ్తేజ్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో వరుణ్కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. వరుణ్తేజ్ యధావిధిగా షూటింగ్లో పాల్గొంటాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక సినిమా షూటింగ్లో భాగంగా యువ హీరో నాగశౌర్య గాయపడ్డారు. కొత్త దర్శకుడు రమణతేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్లో భాగంగా వైజాగ్లో ఓ భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎలాంటి డూప్ లేకుండా రోప్ లేకుండా నాగశౌర్య రియల్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో గోడపై నుంచి దూకిన నాగశౌర్య కాలికి గాయమైంది. దీంతో కంగారుపడ్డ చిత్ర బృందం వెంటనే నాగశౌర్యను ఆస్పత్రికి తరలించారు. నాగశౌర్యను పరిశీలించిన వైద్యులు 25 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఇదే తరహాలో గాయపడ్డారు. సందీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెనాలి రామకృష్ణుడు సినిమా చిత్రీకరణ కర్నూలు పరిసరాల్లో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సులో నుంచి దూకే సన్నివేశంలో సందీప్ గాయపడ్డాడు. దీంతో చిత్ర బృందం వెంటనే కర్నూలు పట్టణంలోని మైక్యూరమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సందీప్కు ప్రమాదమేమి లేదని ఆయనకు తగిలింది స్వల్ప గాయాలేనని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ఇవాళ హైదరాబాద్కు చేరుకుంటారని చిత్ర దర్శకుడు నాగేశ్వరరెడ్డి తెలిపారు. తాజాగా ఈ గాయాల కూటమిలో శర్వానంద్ కూడా చేరిపోయాడు. థాయ్లాండ్లో జరుగుతున్న 96 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా స్కై డైవ్ చేస్తుండగా శర్వానంద్ జారీ కిందపడ్డాడు. భుజంతోపాటు కాలుకు తీవ్ర గాయాలు కావడంతో చిత్ర బృందం శర్వానంద్ను వెంటనే హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు చేరుకున్న శర్వానంద్ నేరుగా సన్షైన్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు శర్వానంద్ భుజంతోపాటు కాలుకు బలమైన గాయమైందని.. సర్జరీ చేయాలని సూచించారు. దీంతో శర్వానంద్కు సోమవారం సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఈ యువ హీరోలకు ఏమైంది!
-
తెలుగు హీరోలకు బ్యాడ్టైమ్!
సాక్షి, కర్నూల్: యువ హీరో సందీప్ కిషన్ షూటింగ్లో గాయపడ్డాడు. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమా షూటింగ్లో భాగంగా కర్నూల్లో పోరాట సన్నివేశం చిత్రీకరిస్తుండగా అతడికి గాయాలయ్యాయి. పైట్ మాస్టర్ తప్పిదం వల్ల జరిగిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంలో అతడు గాయపడినట్టు సమాచారం. సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్పటల్కి తరలిస్తారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్గా నటిస్తోంది. నిన్న వైజాగ్ షూటింగ్లో మరో యువ హీరో నాగశౌర్య కూడా గాయపడ్డాడు. నూతన దర్శకుడు రమణ తేజ తెకెక్కిస్తున్న సినిమాలో ఫైటింగ్ సీన్ తీస్తుండగా అతడి కాలికి గాయమైంది. నాగశౌర్యకు 25 రోజుల విశ్రాంతి అవసరం అని తేల్చడంతో షూటింగ్ను వాయిదా వేశారు. మెగా యువ హీరో వరుణ్ తేజ్ రెండు రోజుల క్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయిణిపేట వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అంతకుముందు రాంచరణ్ కూడా గాయపడటంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నువ్వు తోపురా సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ కోమాకుల కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద జరిగిన కారు ప్రమాదంలో గాయాలతో అతడు బయటపడ్డాడు. హీరోలు వరుస ప్రమాదాలకు గురవుతుండడం పట్ల సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఛలోను మించిన హిట్ అవుతుంది
‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్లో మూడో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి ఆయనే కథ అందించడం విశేషం. నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణ తేజను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందనుంది. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్ను దర్శకుడికి అందించగా, దర్శకుడు పరుశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ నందినీరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆశ్వీర్వదించడానికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి, పరుశురామ్, నందినీరెడ్డికి థ్యాంక్స్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 70 శాతం షూటింగ్ వైజాగ్లో ప్లాన్ చేస్తున్నాం. మంచి కథను దర్శకుడు బాగా తీస్తారని ఆశిస్తున్నాం. ‘ఛలో’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శౌర్య అన్నయ్యకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్కు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు రమణ తేజ. ‘‘నర్తనశాల’ విషయంలో తప్పు చేశాం. ఈ సారి సొంత కథను రాసుకున్నాం. తప్పకుండా హిట్ వస్తుందని కోరుకుంటున్నాం’’ అన్నారు బుజ్జీ. ‘‘మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు మెహరీన్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: మనోజ్ రెడ్డి. -
కాంబినేషన్ షురూ
కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు నాగశౌర్య. కాశీ విశాల్ అనే నూతన దర్శకుడి చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. ప్రముఖ దర్శకులు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు కాశీ విశాల్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో మరిన్ని విషయాలను తెలియజేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో నాగశౌర్య కెరీర్లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఆయన కొత్త సినిమా అనౌన్స్మెంట్ రావడం విశేషం. -
హ్యాట్రిక్ హిట్కు రెడీ అవుతున్న హీరో, డైరెక్టర్!
ఊహలు గుసగుసలాడే, జోఅచ్యుతానంద సినిమాలతో హిట్ కొట్టారు దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య. దర్శకుడిగా అవసరాల టైమింగ్, టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో లాంటి హిట్ మూవీ తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరోతో కలిసి మళ్లీ మరో సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అవసరాల శ్రీనివాస్ నానితో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపినా.. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటంతో.. నాగశౌర్యతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడని సమాచారం. మరి ఈ మూవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. -
సమంత సినిమాలో నాగశౌర్య
ఛలో సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత మరోసారి తడబడ్డాడు. వరుసగా అమ్మగారిళ్లు, కణం, నర్తనశాల సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడట. నందినీ రెడ్డి చివరి సినిమా కళ్యాణ వైభోగమేలోనూ నాగశౌర్యే హీరోగా నటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత నందిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో ప్రేమకథను నిర్మించనున్న సుకుమార్!
పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్. గతంలో కుమారి 21ఎఫ్, దర్శకుడు సినిమాలను నిర్మించిన లెక్కల మాష్టారు.. ఈసారి కూడా ఓ ప్రేమ కథా చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని సమాచారం. సుకమార్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్ సాధిస్తున్నారు. అయితే సుక్కు ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్లో ఓ లవ్ అండ్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తలపై సుకుమార్ స్పందించేవరకు చూడాల్సిందే. -
మెగా బ్యానర్లో నాగశౌర్య..!
ఛలో సినిమాతో మంచి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత తడబడ్డాడు. వరుసగా కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల సినిమాలు బోల్తా పడటంతో ఈ యంగ్ హీరో కెరీర్ మరోసారి గాడి తప్పింది. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న ఈ యువ కథానాయకుడు మెగా బ్యానర్లో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
యంగ్ హీరో ఇన్నాళ్లకు..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్ఫోన్ నిత్యావసరాల్లో ఒకటైపోయింది. అలాంటిది ఈ జనరేషన్లో కూడా ఇంతవరకు సెల్ఫోన్ వాడకుండా ఉన్న హీరో ఉన్నాడటే నమ్మలేం. కానీ అలాంటి హీరో కూడా ఒకడు ఉన్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య తరువాత కెరీర్ లో కాస్త ఇబ్బంది ఎదురైనా ఛలో తిరిగి నిలదొక్కకున్నాడు. తాజాగా ఈ హీరో మరో బిగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇన్నేళ్లు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉన్న నాగశౌర్య మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘ఇన్నేళ్ల తరువాత నా చేతిలో మొబైల్ ఫోన్. నేను కూడా విషపూరిత ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానా..?’ అంటూ ట్వీట్ చేశారు. A smartphone in my hand after all these years.. Did I enter a vicious world?🙃 pic.twitter.com/uQvSqfSTRg — Naga Shaurya (@IamNagashaurya) 25 September 2018 -
‘@నర్తనశాల’ మూవీ రివ్యూ
టైటిల్ : @నర్తనశాల జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : నాగశౌర్య, కశ్మీరా, యామినీ భాస్కర్, శివాజీ రాజా, అజయ్, జయప్రకాష్ రెడ్డి సంగీతం : మహతి స్వర సాగర్ దర్శకత్వం : శ్రీనివాస చక్రవర్తి నిర్మాత : ఉషా ముల్పూరి ఛలో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. అందుకే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘@నర్తనశాల’ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. నాగశౌర్య డిఫరెంట్ రోల్లో కనిపించిన @నర్తనశాల ఈ యంగ్ హీరో ఖాతాలో మరో సూపర్ హిట్గా నిలిచిందా..? కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి గే కామెడీతో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ ; కళామందిర్ కల్యాణ్ (శివాజీ రాజా).. ఓ కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. కల్యాణ్ తండ్రి చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందన్న నమ్మకంతో ఉంటాడు. కానీ కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని అబ్బాయినే అమ్మాయిగా తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తుంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆ బుడబుక్కల వాడు అబ్బాయిని అమ్మాయిగా చూపించి మోసం చేస్తున్నావు.. నిజంగానే ఈ అబ్బాయికి తోడుగా అబ్బాయే వస్తాడు అని చెప్పి వెళ్లిపోతాడు. పెరిగి పెద్దవాడైన కల్యాణ్.. కొడుకు (నాగశౌర్య) అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్ను నిర్వహిస్తుంటాడు. ఆడపిల్లకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కరిస్తుంటాడు. అలా ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ కల్యాణ్ చేసిన ఓ తింగరి పని వల్ల నాగశౌర్య.. దందాలు చేసే జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడు.? నాగశౌర్య కు గే లా నటించాల్సి అవసరం ఎందుకు వచ్చింది..? బుడబుక్కల వాడు చెప్పిందే నిజమైందా.? చివరకు నాగశౌర్య, మానసలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఛలో సినిమాతో సూపర్ హిట్ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగానే కాక నిర్మాతగానూ బాధ్యతగా వ్యవహరించాడు. హీరోయిజంతో పాటు గే కామెడీ కూడా బాగానే పండించాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు. చాలా రోజుల తరువాత అజయ్కి ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. రఫ్ లుక్లో కనిపిస్తూనే కామెడీతోనూ ఆకట్టుకున్నాడు అజయ్. హీరోయిన్లుగా నటించిన కశ్మీర, యామినీ భాస్కర్లు నటన పరంగా పెద్దగా మెప్పించలేకపోయినా.. గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా కనిపించిన సీనియర్ నటుడు శివాజీ రాజాను దర్శకుడు సరిగా వినియోగించుకోలేదు. జయప్రకాష్ రెడ్డి, సుధా, ప్రియా రొటీన్ పాత్రల్లో కనిపించారు. మరిన్ని రివ్యూల కోసం క్లిక్ చేయండి విశ్లేషణ ; ఛలో సినిమాతో సూపర్ ఫాంలో ఉన్న నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం చేసినా ఆ ప్రయత్నం వృథా అయ్యింది. అవుట్ అండ్ కామెడీ ఆశించి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి నిరాశపరిచాడు. కథా పరంగా మంచి కామెడీ పండించే అవకాశం ఉన్నా.. దర్శకుడు కథనాన్ని సాధాసీదాగా నడిపించాడు. ఫస్ట్హాఫ్లో హీరో హీరోయిన్ల లవ్ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. ఛలో సినిమాకు భారీ హైప్ రావటంలో హెల్ప్ అయిన సంగీత దర్శకుడు మహతి ఈ సినిమాతో ఆ మ్యాజిక్ను రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి రెండు పాటలు విజువల్గా ఆకట్టుకున్నా గుర్తుండిపోయే రేంజ్లో మాత్రం లేవు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; నిర్మాణ విలువలు రెండు పాటలు మైనస్ పాయింట్స్ ; కథా కథనాలు కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవటం స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నేను కాస్త రఫ్!
‘‘నాకు బయటి ప్రొడక్షనే కంఫర్ట్గా ఉంటుంది (నవ్వుతూ). సొంత ప్రొడక్షన్ అయితే కాస్త టెన్షన్గా ఉంది. సినిమా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మా అమ్మానాన్నలు నన్ను నమ్మి సినిమా తీశారు.వేరే ప్రొడక్షన్ హౌస్లో చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటానో సొంత సినిమాకీ అలానే ఉంటాను. మా అమ్మ ఫస్ట్ క్రిటిక్. ఆవిడకు నచ్చితే చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుందని నా ఫీలింగ్’’ అన్నారు నాగశౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా ‘ఃనర్తనశాల’. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.... ►ఈ సినిమా కథ విన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ట్రాన్స్జెండర్స్ను సినిమాలో తప్పుగా చూపించలేదు. ‘నర్తనశాల’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఆ టైటిల్తో స్టార్ట్ చేసిన సినిమాలు ఆగిపోయాయాని డాడీకి ఎవరో చెప్పారు. అందుకే ‘ః’ సింబల్ వాడాం. జస్ట్ సెంటిమెంట్ కోసమే కాదు సినిమాకి కూడా యాప్ట్ అవుతుంది. పాత ‘నర్తనశాల’ సినిమా చూసినవాళ్లు మా సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఠి ఈ చిత్రంలో మహిళా సాధికారతను సపోర్ట్ చేసే క్యారెక్టర్ హీరోది. అమ్మాయిలను ధైర్యవంతులుగా తయారు చేస్తుంటాడు. ఈ టైమ్లోనే అతన్ని ఇద్దరు హీరోయిన్లు లవ్ చేస్తుంటారు. అయితే నెక్ట్స్ ఏంటీ? అతను నిజంగా గేనా? లేక ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? అనేది థియేటర్లో చూడాలి. ►క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. మహిళలు తిరగబడినప్పుడే ఇలాంటివి ఆగుతాయి. అమ్మాయిల పట్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ నుంచి శిక్ష మొదలైతే తప్పు చేయాలనుకునేవాళ్లు భయపడతారు. ఠి నా ప్రతి సినిమాలో నా నటన మా అమ్మకు నచ్చుతుంది. కానీ సినిమాలు నచ్చలేదని చెప్పేది. ఎందుకంటే నేను సినిమాల్లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. రఫ్. ‘ఛలో’లో చేసిన పాత్రలా రియల్ లైఫ్లో ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నా పెళ్లి టాపిక్ వస్తోంది. త్వరగా చేసుకోవాలి. ఠి రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్లో ఓ సినిమా ఉంటుంది. వెబ్సిరీస్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో నటించాలని ఉంది. చూడాలి. ► స్టార్ట్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్లను దేవుళ్లలా పూజించేవారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడు చిరంజీవిగారు, బాలకృష్ణగారు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటే అది. తమిళనాడులో, మన దగ్గర, కేరళలో కానీ పెద్ద హీరోలందరినీ సెకండరీ దేవుళ్లులా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినవాళ్లు ‘మా సినిమాలు చూడండి.. మా సినిమాలు చూడండి’ అని అడుగుతున్నారు అంటే దేవుడే వచ్చి మా గుడికి రండీ అంటే ఏ భక్తుడు నమ్ముతాడు. అందరూ స్టార్ట్ అవ్వాలనే ట్రై చేస్తారు. అది తప్పు కాదు. కానీ అది రావడానికి 30 ఏళ్లు పడుతుంది. అది తెలుసుకోవాలని చెబుతున్నాను. సడన్గా ఎవరో వచ్చి స్టార్ అంటే..? నేనెవరి గురించీ నెగటివ్గా కామెంట్స్ చేయడం లేదు. ఆ మధ్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నా కామెంట్స్ విజయ్ దేవరకొండకు సంబంధించినవి అనడం తప్పు. అతన్ని చూసి నాకు ఎలాంటి అసూయ లేదు. నేను చేసే సినిమాలు వేరు. అతను చేసే సినిమాలు వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా. అతని సినిమా హిట్ సాధించడం వల్ల మిగతావారికి సినిమాలు పోవు కదా?. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎవరో పెట్టారంతే. -
వారాహి బ్యానర్లో నిఖిల్, అవసరాల..?
హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తరువాత దర్శకుడిగానూ సత్తా చాటారు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్చుతానంద సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా తన మూడో చిత్రాన్ని కూడా వారాహి బ్యానర్లోనే చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్లో నిఖిల్ హీరోగా నటించనున్నారట. ముందుగా ఈ ప్రాజెక్ట్ను నాగశౌర్య హీరోగా తెరకెక్కించాలని భావించినా నాగశౌర్య సొంత సినిమాలతో బిజీ కావటంతో నిఖిల్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ ప్రస్తుతం తమిళ సూపర్హిట్ కనితన్కు రీమేక్గా తెరకెక్కుతున్న ముద్ర సినిమాలో నటిస్తున్నాడు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్నారు. -
‘నర్తన శాల’ ప్రి రిలీజ్ వేడుక
-
సొంత బ్యానర్లో మరో సినిమా
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఛలో తరువాత అమ్మమ్మగారిల్లు లాంటి ఫ్లాప్ వచ్చినా అది నాగశౌర్య కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న నర్తనశాల సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా తరువాత భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నారి నారి నడుమ మురారి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పాడట ఈ యంగ్ హీరో. అంతేకాదు ఈ సినిమాను నాగశౌర్య మరోసారి తన సొంతం నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించనున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తేజ ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈసినిమాకు గణ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
ఫస్ట్లుక్ 13th August 2018
-
‘నా కొడుకు గే నా’
‘ఛలో’ లాంటి హిట్ తరువాత నాగశౌర్య తన సొంత బ్యానర్లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన ‘నర్తనశాల’ చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. ఇటీవలె షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం వినోద భరితంగా ఉంది. నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ ఎండింగ్లో ‘నా కొడుకు గే నా’ అంటూ శివాజీ రాజా చెప్పే డైలాగ్ బాగుంది. ఈ మూవీకి మహతి స్వర సాగర్ అందించగా.. కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్పై శంకర్ మూల్పూరి, ఉషా మూల్పూరి నిర్మించగా.. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. -
బాలయ్యని మళ్లీ వాడేస్తున్నాడు!
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అమ్మమ్మగారిల్లు సినిమాతో మరో డిసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తున్నాడు. నాగశౌర్య ఇటీవల భవ్య క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమాను ప్రారంభించాడు. సొంత బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను ప్రారంభించి సౌందర్య మరణంతో మధ్యలో ఆపేశారు. ఇప్పుడు భవ్య క్రియేషన్స్ సినిమాకు కూడా బాలయ్య టైటిల్నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. నాగశౌర్య లవర్బాయ్గా కనిపించనున్న ఈ సినిమాకు నారి నారి నడుమ మురారి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. బాలయ్య సూపర్ హిట్ సినిమాల్లో నారి నారి నడుమ మురారి ఒకటి. నాగశౌర్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. -
భవ్య క్రియేషన్స్లో నాగశౌర్య..!
పైసా వసూల్ తరువాత సినిమా కాస్త గ్యాప్ తీసుకున్న భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కొత్త సినిమా ప్రారంభించారు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నాగశౌర్యతో రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా తెరకెక్కిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజు (శనివారం) ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్, కూకట్పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
ప్యూర్ లవ్స్టోరీ మొదలు
ఆది కథానాయకుడిగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. డీఆర్పీ వర్మ సమర్పణలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి క్లాప్ ఇచ్చారు. హీరో ఆది మాట్లాడుతూ–‘‘కథ గురించి డైరెక్టర్ నాకు మూడు గంటల నరేషన్ ఇచ్చారు. ప్యూర్ లవ్స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రెండు షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మాకు సహకరిస్తోన్న సాయికుమార్గారికి, హీరో ఆదిగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘సీమశాస్త్రి’ సినిమా తర్వాత మేము చేస్తోన్న చిత్రమిది. దర్శకుడు మంచి కథ చెప్పారు. సినిమా హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చావలి రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నాగశౌర్య, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు. -
నాగశౌర్యతో అవసరాల మరో సినిమా?
నాగశౌర్యను హీరోగా విజయాన్ని అందించిన తొలి దర్శకుడు అవసరాల శ్రీనివాసే. ఊహలు గుసగుసలాడే సినిమా విజయం సాధించడంతో హీరో నాగశౌర్యకు, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్కు మంచి గుర్తింపు లభించింది. తరువాత నాగశౌర్య హీరోగా దిక్కులు చూడకు రామయ్య, ఛలో వంటి హిట్లు అందుకున్నారు. రెండో ప్రయత్నంగా జో అచ్యుతానంద సినిమాను డైరెక్ట్ చేసిన అవసరాల నాగశౌర్యకు మరో హిట్ను అంధించారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. ఫారిన్ బ్యాక్డ్రాప్లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుక అవసరాల శ్రీనివాస్ రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదలకాలేదు. -
ఇష్టంతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమ్మమ్మగారిల్లు
‘‘చిన్నప్పటి నుంచి నాకు ఫ్యామిలీతో అనుబంధం ఎక్కువ. ఉమ్మడి కుటుంబం విలువలు తెలిసినవాడిని. అనుబంధాలు, ఆప్యాయతలు బాగా ఇష్టం. ఆ ప్రభావం నాపై ఎక్కువ ఉంటుంది. నా జీవితంలోని తీపి జ్ఙాపకాలు, నిజ జీవితంలో చూసిన కొన్ని పాత్రలను సినిమాలో భాగం చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఎంతో ఇష్టపడి చేశా’’ అన్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగ శౌర్య, షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్పై రాజేష్ నిర్మించారు. కె.ఆర్ సహనిర్మాత. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటీవ్ టాక్తో ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సూర్య మీడియాతో మాట్లాడుతూ –‘‘నాది కాకినాడ. 12 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. రెండేళ్ల క్రితం కె.ఆర్,రాజేష్లు పరిచయమయ్యారు. ఇందులో నాగ శౌర్య బావుంటాడని నిర్మాతలే సలహా ఇచ్చారు. ► బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడ లేదు. అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేశారు. ► షాలిని పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెను హీరోయిన్గా తీసుకున్నాను. శౌర్య, షామిలి ఇద్దరూ బాగా నటించారు. రావురమేష్, ‘షకలక’ శంకర్, మిగతా నటీనటులంతా బాగా చేశారు. కళ్యాణ రమణ, రసూల్, సాయి కార్తీక్ మంచి సహకారం అందిచారు. ► లవ్స్టోరీ, ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో స్టోరీ లైన్స్ ఉన్నాయి. నెక్ట్స్ సినిమా గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు.