
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. రంగస్థలం రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చరణ్, ఇటీవలే బోయపాటి టీంతో జాయిన్ అయ్యారు. చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. తాజాగా మరో విలక్షణ నటుడు ఈ సినిమాలో నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాండల్వుడ్ స్టార్ సుధీప్.. చరణ్, బోయపాటి సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. అయితే సుధీప్ విలన్గా నటిస్తున్నాడా లేక మరేదైన పాత్రలోనా అన్న విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment