Rangasthalam
-
సెట్స్ పైకి రంగస్థలం సీక్వెల్
-
సమంతను మేనేజ్ చేయడం కష్టం.. ఆ సినిమాలో వద్దనుకున్నా కానీ.. : సుకుమార్
సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్ సామ్ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్ని ఊహించుకోలేం. సామ్లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్ చరణ్ పాత్రతో పాటు సామ్ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సామ్ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్ అయితే నేను సెట్లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. కానీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్ సమంతను పొగడ్తలో ముంచేశాడు. -
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్
‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని భోగట్టా. చరణ్ సినిమాలో సంజయ్ దత్? రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక హిందీలో రామ్చరణ్ చేసిన తొలి చిత్రం ‘తుఫాన్’లో సంజయ్ దత్ ఓ రోల్ చేశారు. మరి.. రామ్చరణ్, సంజయ్ దత్ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్
జబర్దస్త్ కమెడియన్ మహేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం సినిమాతో ఓ రేంజ్లో గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫుల్ ఎమోషనల్ సీన్స్లో మహేశ్ అద్భుతమైన నటనతో మెప్పించారు. అతనికి యాస, లుక్ మహేశ్కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మహేశ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్పై మహేశ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పుష్ప రాజ్' తగ్గేదేలే.. భారీ ధరకు ఆడియో రైట్స్!) మహేశ్ మాట్లాడుతూ.. 'చైతన్యతో నేను ఓసారి ట్రావెల్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నాకు డ్యాన్స్ నేర్పించారు. చైతన్య మంచి టాలెంటెడ్. ఆయన అలా చేసుకున్నాడంటే ఎంత స్ట్రగుల్ అయ్యాడో. ఆరోజు చాలా బాధపడ్డా. అంత క్రేజ్ ఉన్న ఆయనే అలా చేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి?' అని అన్నారు. రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడుతూ..'కానీ నాకు అయితే రెమ్యూనరేషన్స్ బాగానే వస్తున్నాయి. నాకు ప్రారంభంలో తక్కువగానే ఉండేది. ఎందుకంటే మనకు అవకాశం రావాలి కదా. క్రేజ్ను బట్టి అమౌంట్ డిసైడ్ చేస్తారు. ఫస్ట్ తక్కువ డబ్బులు వచ్చినా మనం కష్టపడాలి. ఆ తర్వాతే నాకు బాగా డబ్బులొచ్చాయి. కామెడీలో నాకు రవితేజ టైమింగ్ అంటే చాలా ఇష్టం. సీన్ వందశాతం నిలబెట్టడంలో ఆయన బెస్ట్. ఎలాంటి సీన్ అయినా పండించగలరు. నా ఫేవరేట్ హీరోయిన్ అంటే అనుష్క. నా చిన్నప్పుడు అయితే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. అయితే ఆమెను ఎప్పుడు కలవలేదు.' అని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) -
రంగస్థలం
లక్నో సాంస్కృతిక వైభవ మణిపూసలలో రంగస్థలం ఒకటి. ఆ వెలుగు మరింత ప్రజ్వరిల్లేలా ఔత్సాహికులు నాటకరంగంలో భాగం అవుతున్నారు. అయితే రంగస్థలం అంటే యువతరం మాత్రమేనా? ‘కానే కాదు’ అంటోంది ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ. రచనల నుంచి నటన వరకు పెద్దలలోని సృజనాత్మక శక్తులను రంగస్థలంపైకి సాదరంగా తీసుకురావడానికి ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ పేరుతో నాటకరంగ వర్క్షాప్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది... థియేటర్ గ్రూప్ ‘మంచ్కీర్తి సమితి’ లక్నో (ఉత్తరప్రదేశ్)లో నిర్వహించిన ‘30 డేస్ 30 ప్లేస్’ కు అనూహ్యమైన స్పందన లభించింది. విశేషం ఏమిటంటే ఆ జామ్ ప్యాక్డ్ థియేటర్లలో ఎక్కువమంది వృద్ధులు కనిపించారు. నాటకాలు చూస్తున్నప్పుడు వారిలో వయసు భారం మాయమైపోయింది. ప్రదర్శన పూర్తయిన తరువాత టీ తాగుతూ వారు ఆ నాటకాన్ని లోతుగా విశ్లేషించుకునే దృశ్యాలు ఎన్నో కనిపించాయి... దీన్ని దృష్టిలో పెట్టుకొని లక్నోకు చెందిన ‘పీపుల్స్ ఇన్షియేటివ్’ అనే స్వచ్ఛందసంస్థ ‘థియేటర్ ఫర్ ఎల్డర్లీస్’ అనే వినూత్న కాన్సెప్ట్తో సీనియర్ సిటీజన్లతో నలభైరోజుల పాటు థియేటర్ వర్క్షాప్లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘వారి కోసం వారి చేత’ ట్యాగ్లైన్తో నిర్వహించే ఈ వర్క్షాప్లలో రచన, నటన, దర్శకత్వం, సంగీతం... మొదలైన అంశాలలో శిక్షణ ఉంటుంది. దీంతో పాటు తమ ఏరియాలో తమ వయసు ఉన్న వ్యక్తులను సమీకరించి ‘స్టోరీ టెల్లింగ్’లాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో చెబుతారు. ‘సీనియర్ సిటిజన్స్ కోసం థియేటర్ అనేది మంచి కాన్సెప్ట్. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. కొత్త శక్తిని ఇస్తుంది’ అంటున్నాడు థియేటర్ డైరెక్టర్ సలీమ్ ఆరీఫ్. ‘నాటకరంగం అనేది అత్యంత ప్రభావశీలమైనది. ఈ బలమైన మాధ్యమం పెద్దల నీడలో మరింత బలం పుంజుకుంటుంది. వయసు ఎన్నో అనుభవాలను ఇస్తుంది. ఆ అనుభవ జ్ఞానం నాటకాల్లో ప్రతిఫలిస్తుంది. వృద్ధులు అనగానే ప్రేక్షకుల్లో కూర్చుని నాటకం వీక్షించడానికే పరిమితం కానవసరం లేదు. ఇప్పుడు వారిని రంగస్థలం ప్రేమగా, అభిమానంగా ఆహ్వానిస్తోంది’’ అంటున్నాడు రంగస్థల ప్రముఖుడు సంగమ్ బహుగుణ. పెద్దల చేత రూపుదిద్దుకుంటున్న నాటకాలు, పెద్దలు నటించే నాటకాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం.. ఒంటరి ఏకాంతాలు, వయసు సమస్యలు, కుటుంబ సమస్యలు... ఇలా ఏవోవో సమస్యలు ఉండబోతున్నాయా? ‘కానే కాదు’ అంటుంది పీపుల్స్ ఇన్షియేటివ్. వారు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. తాము నడిచొచ్చిన బాటను గుర్తు చేస్తూ ఈ తరానికి సానుకూలశక్తిని పంచుతారు. ఇంతకంటే కావాల్సినదేముంది! నాటకాల పాఠశాల వయసు పైబడినంత మాత్రాన అది నటనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిరూపిస్తున్న ప్రతిభావంతులలో సోహైలా కపూర్ ఒకరు. ఘనమైన ఖాన్దాన్ నుంచి వచ్చిన కపూర్ నటి, రచయిత్రి, మోడ్రన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. ఈ తరం నటులతో కలిసి రంగస్థలం, జీ థియేటర్లలో నటిస్తోంది కపూర్. ఆమెతో నటించడం అంటే ఔత్సాహిక నటులకు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్నంత అదృష్టం. దిల్లీలో పుట్టిన కపూర్ హైస్కూల్ రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ‘వయసు పైబడగానే విషాదం మూర్తీభవించే పాత్రలకు మాత్రమే మహిళా నటులు పరిమితం అవుతున్నారు. ఇది సరికాదు. వృద్ధాప్యం అంటే విషాదం మాత్రమే కాదు. ఎన్నో బలమైన పాత్రలు మన కోసం ఎదురుచూస్తున్నాయి. వోటీటీ పుణ్యమా అని సీనియర్ నటీమణులకు మూస పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రలలో నటించే అవకాశం దొరుకుతుంది’ అంటోంది కపూర్. -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్తో ఆడియన్స్ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్లైన్తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్గా చూపించేసి ఆడియన్స్ని షాక్కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్తో ఆడియన్స్ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్కి ఫోకస్ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్ప్లే నే భలే ట్విస్ట్గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్గ్రౌండ్లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్తో…ఆడియన్స్ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్స్టంట్గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ ..
-
రంగస్థలం - 2 షూటింగ్ ఎప్పుడంటే ..!
-
వైరల్: చదరంగ స్థలం
చదరంగం చదరపు బల్ల రంగస్థలం అయితే... రాజు, రాణి, సిపాయిలకు ప్రాణం వస్తే... ‘అహో!’ అనిపించే దృశ్యం కనువిందు చేస్తే... ‘అద్భుతం’ అనిపిస్తుంది. ‘చతురంగం’ వీడియో ద్వారా ఆ అద్భుతాన్ని ప్రపంచానికి చేరువ చేశారు కలెక్టర్ కవితారాము... ప్రపంచంలోని చదరంగ ప్రేమికుల దృష్టి ఇప్పుడు చెన్నైపై ఉంది. అక్కడ జరుగుతున్న ఆటల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సాంస్కృతిక కళారూపాలు మరో ఎత్తు. ‘చెస్ ఒలింపియాడ్–2022’ ప్రమోషన్లో భాగంగా వచ్చిన ‘చతురంగం’ అనే వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ‘దృష్టి మరల్చనివ్వని అద్భుతదృశ్యాలు’ అని వేనోళ్లా పొగుడుతున్నారు నెటిజనులు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వీడియో గురించి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. పుదుకొటై్ట కలెక్టర్ కవితారాము ఈ ‘చతురంగం’ నృత్యరూప కాన్సెప్ట్ను డిజైన్ చేయడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. కవితారాము స్వయంగా శాస్త్రీయ నృత్యకారిణి. ఎన్నో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ‘నృత్యంతో పాతికసంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. చెస్ ఒలింపియాడ్ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియో రూపొందించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి, దృశ్యపరంగా అద్భుతం అనిపించాలి అనుకున్నాను. అందులో భాగంగానే ఆటకు, నృత్యాన్ని జత చేసి చతురంగంకు రూపకల్పన చేశాము’ అంటుంది కలెక్టర్ కవితారాము. ఈ వీడియోలో క్లాసిక్, ఫోక్, మార్షల్ ఆర్ట్స్ ఫామ్స్ను ఉపయోగించారు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సందర్భాన్ని బట్టి పసుపు, నీలిరంగు లైటింగ్ను వాడుకోవడం బాగుంది. పుదుకొటై్ట సంగీత కళాశాలకు చెందిన ప్రియదర్శిని నలుపువర్ణ రాణి, చెన్నై అడయార్ మ్యూజిక్ కాలేజికి చెందిన సహన శ్వేతవర్ణ రాణి వేషాలలో వెలిగిపోయారు. ‘మహిళాదినోత్సవం సందర్భంగా ప్రియదర్శిని నృత్యాన్ని చూశాను. చతురంగం వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె గుర్తుకువచ్చింది. ఇక సహన నృత్యం గురించి నాకు తెలుసు. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉంది. ఇద్దరూ తమదైన నృత్యప్రతిభతో చతురంగంకు వన్నె తెచ్చారు’ అంటోంది కవితారాము. చదరంగంపై పావుల సహజ కదలికలను దృష్టిలో పెట్టుకొని మొదట్లో నృత్యాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే దీని గురించి చర్చ జరిగింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకుంటూనే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఎక్కువమంది కళాకారులు. దీంతో నృత్యరీతులకు సృజనాత్మకతను జోడించారు. నలుపువర్ణ రాణి, శ్వేతవర్ణ రాజును ఓడించడంతో వీడియో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛిక దృశ్యమా? ప్రతీకాత్మక దృశ్యమా? అనే సందేహానికి కలెక్టర్ కవితారాము జవాబు... ‘కావాలనే అలా డిజైన్ చేశాం. అంతర్లీనంగా ఈ దృశ్యంలో ఒక సందేశం వినిపిస్తుంది. తెలుపు మాత్రమే ఆకర్షణీయం, అందం అనే భావనను ఖండించడానికి ఉపకరించే ప్రతీకాత్మక దృశ్యం ఇది. దీనిలో జెండర్ కోణం కూడా దాగి ఉంది.’ -
హీరోకు జబ్బు.. నిర్మాతకు డబ్బు
-
ఆ డైరెక్టర్ నేను మంచి స్నేహితులం: అనసూయ
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెర యాంకర్గా రాణిస్తునే ఇటూ వెండితెరపై అందాలు ఆరబోస్తూ ఉంటుంది. తనదైన యాంకరింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ రంగస్థలం మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పెంచెసుకుంది. అందులో రంగమ్మత్తగా అనసూయకు ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన అనసూయను మోకాళ్లపైకి చీరకట్టుతో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయిన ఆమెను చూసి అందరూ షాకయ్యారు. అయితే రంగస్థలం షూటింగ్ సమయంలో తనని అందరూ రంగమ్మత్త అని పిలిచేవారని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో మరోసారి ఈ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా గురించి ఓ అసక్తికర విషయం చెప్పింది. అయితే బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగస్థలం సెట్లో డైరెక్టర్ సుకుమార్తో సహా అందరూ తనని రంగమమ్మత్తానే పిలిచేవారని, బుచ్చిబాబు కూడా అత్త అనే పిలిచేవాడని చెప్పింది. మూవీ సెట్లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవారమని, రంగస్థలం సమయంలో బుచ్చితో మంచి స్నేహం ఏర్పడిందని చెప్పింది. ‘రంగస్థలం షూటింగ్ నుంచి బుచ్చి, నేను మంచి స్నేహితులమయ్యాం, నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటాను. చెప్పాలంటే ఇండస్ట్రీలో నాకంత క్లోజ్ అయిన వ్యక్తి కూడా ఆయనే. ఈ క్రమంలో ఉప్పెన షూటింగ్ ఓ సారి మా ఇంటి సమీపంలోనే జరిగింది. అప్పుడు అత్త నేను మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నా షూటింగ్ జరుగుతోంది. విజయ్ సేతుపతి కూడా ఉన్నారు ఆయనను కలవోచ్చని రమ్మని పిలిచాడు. వెంటనే నేను షూటింగ్ స్పాట్కు వెళ్లాను. అక్కడే విజయ్ సేతుపతిని కలిశాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక విజయ్ సేతుపతి అంటే పిజ్జా సినిమా నుంచే ఇష్టమని, ఆ తర్వాత 96 చూశాకా.. రామ్ పాత్రలో ఆయన ఇంకా నచ్చేశాడని చెప్పింది. అలా జరిగిన పరిచయంతోనే చెన్నైకి వెళ్లినప్పుడు కూడా ఆయనను కలిశానని అనసూయ పేర్కొంది. చదవండి: రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. -
రామ్చరణ్తో ఆ సీన్ చెప్పడానికి భయపడ్డా: సుకుమార్
క్రియేటీవ్ దర్శకుడు సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. రామ్చరణ్ కెరియర్లోనే ఈ చిత్రం ఓ మైలురాలుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్టిబాబు పాత్రలో రామ్చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగస్థలం సినిమాలో రామ్చరణ్ పాత్రకు సంబంధించి సుకుమార్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. రంగస్థలం స్ర్కిప్ట్ రామ్చరణ్కు ఎంతగానో నచ్చిందని, కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపాడు. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి వివరించడానికి చాలా భయపడ్డానని చెప్పారు. అదేంటంటే..'ప్రకాశ్ రాజ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అన్ని సపర్యలు చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మారచడం ఆఖరికి టాయిలెట్ బ్యాగ్ కూడా తీయాల్సి ఉంటుంది. ఈ లైన్ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ రామ్చరణ్ మాత్రం చేసేద్దాం అంటూ కూల్గా ఆన్సర్ ఇచ్చారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. టెన్షన్ పడుతూనే ఈ సీన్ను వివరించా. కానీ చరణ్ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణం అది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్చరణ్ వందకు వంద శాతం తన పాత్రకు జస్టిస్ చేశారు' అని సుకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ ఆచార్య మూవీతో పాటు, ఆర్ఆర్ఆర్లో నటిస్తుండగా, సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. చదవండి : యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? రామ్ చరణ్ను ఢీ కొట్టే విలన్గా కన్నడ స్టార్! -
నా కోసం రామ్చరణ్ అలా చేయడం సంతోషాన్నిచ్చింది :అనసూయ
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇంతవరకు తెరపై చూడని కొత్త చెర్రీని ప్రేక్షకులకు పరిచయం చేశాడు సుక్కు. చిట్టిబాబుగా చెర్రీ లుక్స్, నటన అందరిని ఆకట్టుకుందే. ఒక్క హీరోదే కాదు, ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రత్యేకమే. ముఖ్యంగా రంగమ్మత్త పాత్ర అయితే సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఆ పాత్రలో యాంకర్ అనసూయ పరకాయ ప్రవేశం చేసింది. తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అందరూ అనసూయను ‘రంగమ్మత్త’అని పిలవడం మొదలు పెట్టారు. అంతలా ఆ పాత్రలో జీవించేసింది హాట్ బ్యూటీ అనసూయ. ఈ సినిమా తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ అటు షోలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను పంచుకుంది. రంగస్థలం షూటింగ్ సమయంలో తన కోసం రామ్చరణ్ ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి వంట చేయించేవాడని చెప్పుకొచ్చింది. ‘సెట్లో భోజన సమయంలో చేపల కూర ఉండేది. కానీ నాకు చేపలు తినే అలవాటు లేదు. ఈ విషయం గ్రహించి రామ్చరణ్ నా కోసం ప్రత్యేకంగా చెఫ్ని పిలిపించి పన్నీర్ను పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండించేవాడు. అది అచ్చం ఫిష్ కర్రీలా చాలా టేస్టీగా ఉండేది. స్టార్ హీరో స్థాయిలో ఉన్న రామ్ చరణ్ నాకోసం అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా కోసం అలా చెఫ్తో ప్రత్యేక వంటలు చేయించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’అని షూటింగ్ జ్ఞాపకాలను మరోసారి గుర్తిచేసుకొని మురిసిపోయింది హాట్ బ్యూటీ అనసూయ. కాగా, ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్’సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రీక్ మూవీ ‘పుష్ప’లోనూ నటిస్తుంది. -
‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా
క్రియేటీవ్ దర్శకుడు సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్.. చిట్టిబాబు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు తమిళ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతుంది. ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్ని విడుదల చేసింది చిత్రబృందం. చెర్రీ పవర్ఫుల్ డైలాగ్స్, దేవీశ్రీ ప్రసాద్ అద్భుత నేపథ్య సంగీతంతో ట్రైలర్ అదిరిపోయింది. తమిళనాడులో 300లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోలీవుడ్లోనూ ‘రంగస్థలం’ పేరుతోనే ఈ సినిమా విడుదల కానుంది. -
చెర్రీ బర్త్డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీఇండస్ట్రీ నుంచి విషెస్ వెల్లువెత్తుతుండడంతో పాటు తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామరాజ్ పోస్టర్ .. ‘ఆచార్య’ నుంచి సిద్ధ పోస్టర్ లాంటి సాలిడ్ అప్డేట్స్ వచ్చాయి. ఇదిలాఉండగా.. చరణ్ చేసిన సినిమాల్లో నటనపరంగా మరో మెట్టు ఎక్కించిన సినిమా ‘రంగస్థలం’ అని తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిందీ చిత్రం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన రంగస్థలం చరణ్కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుత నటనా పటిమ కనబరిచాడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచి నాన్ బాహుబలి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ తమిళ డబ్ వెర్షన్ విడుదల ఎప్పుడన్నది కూడా తెలిసిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీనిస్తూ ట్విటర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాను తమిళ వెర్షన్లో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో వచ్చే మే నెలలో ముహూర్త ఖరారు చేసినట్టు నిర్మాతలు కన్ఫార్మ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి చెర్రీ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ఈ వింటేజ్ వండర్ తమిళంలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. ( చదవండి: సైరాకుఏడాది పూర్తి, రామ్చరణ్ ట్వీట్ ) Wishing our Mega Power Star a great day! #HappyBirthdayRamcharan Due to Popular demand by all #RamCharan Tamil Fans.. We are releasing Blockbuster Rangasthalam (Tamil) in Theatres this MAY 2021.. Release thru @7GfilmsSiva@AlwaysRamCharan @Samanthaprabhu2 @ThisIsDSP @aryasukku pic.twitter.com/TIaYiZtgH5 — Mythri Movie Makers (@MythriOfficial) March 27, 2021 -
రంగస్థలం ఫేమ్ 'పూజిత పొన్నాడ' ఫోటోలు
-
ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...
మనకు మహానటి సావిత్రి తెలుసు. ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి. చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది. పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి. అరవై... అయితేనేం? ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది. పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్డౌన్ పోయి, అన్లాక్ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు. -
అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి
సాక్షి, హైదరాబాద్: బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఆ తర్వాత హీరోయిన్గా రాణించారు. తెలుగుదనం ఉట్టిపడేలా ముద్ద మొహంతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాశి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో ‘వెంకి’ లాంటి సినిమాలో ఐటెం సాంగ్స్ చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాశికి మళ్లీ సినిమా ఆఫర్లు వస్తుండటంతో నటిగా తన సెకండ్ ఇన్నింగ్ను ప్రారంబించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్రకోసం మొదట తననే సంప్రదించినట్లు వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పాత్రను పోషించిన అనసూయ భరద్వాజ్కు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. అయితే రంగమ్మత్త కోసం మొదట ‘రంగస్థలం’ యూనిట్ రాశిని సంప్రదించారంట. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో తిరస్కరించానని రాశి చెప్పారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్తో?) దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘రంగస్థలం సూపర్ హిట్ సాధించింది. ఇందులోని రంగమ్మత్త క్యారెక్టర్కు మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు నాకు ఈ పాత్ర గురించి వివరించినప్పుడు నాకు కూడా రంగమ్మత్త నచ్చింది. కానీ ఇందులో ఆమె మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాలి. ఆ లుక్ నాకు నప్పదని భావించి రంగమ్మత్త పాత్రను తిరస్కరించాను’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే మహేశ్ బాబు ‘నిజం’ సినిమాలో రాశి నెగిటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ... ఇందులో నెగిటివ్ రోల్ చేసి తప్పు చేశానన్నారు. ఇందులో గోపీచంద్కు తను లవర్గా నటించాలని దర్శకుడు తేజ కథ వివరించారని చెప్పారు. అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని, దీంతో సినిమా నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్గా సినిమా మధ్యలో ఇలా చేస్తే ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం అవుతుందని ఆయన చెప్పారు. అందుకే ‘నిజం’లో నటించానని రాశి చెప్పుకొచ్చారు. (చదవండి: లుక్ బాగుందంటే ఆనందంగా ఉంది) -
సవాల్కి రెడీ
సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది అంటున్నారు సమంత. ఇటీవల ఓ సందర్భంలో ‘‘నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను’’ అన్నారామె. ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు సమంత. తాజాగా మరో చాలెంజింగ్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘మయూరి, గేమ్ ఓవర్’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటించనున్నారట సమంత. సైకలాజికల్, హారర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయిగా నటించారు సమంత. ఆ పాత్రను అద్భుతంగా చేశారు. ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి తగిన కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
సౌండ్ ఇంజనీర్ కాబోతున్నారు
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్లో రామ్చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. -
రంగస్థలం రీమేక్లో లారెన్స్?
రంగస్థలం చిత్రాన్ని రీమేక్ చేయడానికి నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సన్నాహాలు చేస్తున్నారా?.. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. తెలుగులో రామ్చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా నటి సమంతకు మంచి పేరు వచ్చింది. కాగా ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను రాఘవ లారెన్స్ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన నటించిన కాంచన–3 మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ చేస్తానని రాఘవ లారెన్స్ ప్రకటించారు. ప్రస్తుతం కాంచన చిత్రాన్ని అక్షయ్కుమార్ హీరోగా హిందీలో చేసే పనిలో బిజీగా ఉన్నారు. నటి కియారాఅద్వాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీబాంబ్ అనే పేరును నిర్ణయించారు. మరో విషయం ఏమిటంటే ఇంతకు ముందు తెలుగులో హిట్ అయిన పటాస్ చిత్ర తమిళ రీమేక్లో లారెన్స్ నటించారన్నది గమనార్హం. మొట్టశివ కెట్టశివ పేరుతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. తాజాగా రంగస్థలం చిత్ర రీమేక్లో నటించడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన ఏదీ లేదన్నది గమనార్హం. ప్రస్తుతం హిందీ చిత్రం లక్ష్మీబాంబ్ను పూర్తిచేసే పనిలో లారెన్స్ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే రంగస్థలం రీమేక్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. -
రంగస్థలం సెట్ దగ్ధం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని ఉన్న బూత్బంగ్లాలో రెండేళ్ల క్రితం వేసిన రంగస్థలం సినిమా సెట్ అనుమానాస్పద స్థితిలో దగ్ధమైంది. బుధవారం ఉదయం సెట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ గ్రామీణ వాతావరణం కోసం వేసిన గుడిసెలన్నీ కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే 25 గుడిసెలు అంటుకున్నాయి. -
సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!
దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో) ఉత్తమ విలన్ : శరత్ కుమార్ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం) ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే - రంగస్థలం) ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా - ఆర్ఎక్స్ 100) ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ - రంగస్థలం) ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్ (విజేత) ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్ రాజ్పుత్ (ఆర్ఎక్స్ 100) ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రత్నవేలు (రంగస్థలం) ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రంగస్థలం) సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ : విజయ్ దేవరకొండ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రామ్ చరణ్ యాక్టింగ్పై మంచు విష్ణు ట్వీట్
66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా 7 విభాగాల్లో అవార్డులు సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఈ లిస్ట్లో మరో అవార్డు కూడా రావాల్సింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. రంగస్థలం సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని అంతా భావించారు. తాజాగా హీరో మంచు విష్ణు జాతీయ అవార్డులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘అవార్డులు సాధించిన వారి విషయంలో ఎలాంటి కంప్లయింట్ లేకపోయినా.. రంగస్థలంలో సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునే అర్హత ఉంది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ నటన. ఏది ఏమైన అభిమానుల ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్’ అంటూ ట్వీట్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలంలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్చరణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. No offense to the other winners, but in my honest opinion my bruh Ram Charan deserved to win the National award for best actor in Rangasthalam. By far it was one of the best performances by any actor in the recent times. Anyways the audience love is the biggest award. — Vishnu Manchu (@iVishnuManchu) August 10, 2019 -
సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవం
-
‘రంగస్థలం’ చిత్రానికి అవార్డుల పంట
సాక్షి, హైదరాబాద్ : వివిద రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గత నాలుగేళ్లుగా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’లతో ఘనంగా సత్కరిస్తోంది ‘సాక్షి’. 2018కి సంబంధించిన ఈ అవార్డులను ప్రకటించారు. సమాజాభివృద్దిలో భాగంగా.. మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థకు సాక్షి ఎక్స్లెన్స్అవార్డును ప్రకటించారు. యంగ్ అఛీవర్ ఆఫ్ ద ఇయర్గా డాక్టర్ ఐవీ నివాస్ రెడ్డి, ఎక్సలెన్స్ ఇన్ ఫామింగ్లో చెరుకురి రామారావు, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్లో పి. గాయత్రి, భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్కు జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రకటించారు. ఇక సినీ రంగం విషయానికొస్తే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్గా మహానటి, మోస్ట్ పాపులర్ యాక్టర్గా రామ్ చరణ్ ఎంపికయ్యారు. అవార్డుల వివరాలు.. లైఫ్టైం అఛీవ్మెంట్ అవార్డు : రెబల్స్టార్ కృష్ణంరాజు మోస్ట్ పాపులర్ డైరెక్టర్ : సుకుమార్ మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ : దేవీ శ్రీ ప్రసాద్ మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫర్ : రత్నవేలు మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : నరేష్ మోస్ట్ పాపులర్ యాక్టర్ (నెగెటివ్ రోల్) : పాయల్ రాజ్పుత్ మోస్ట్ పాపులర్ యాక్టర్ : పూజా హెగ్డే మోస్ట్ పాపులర్ డెబ్యూ హీరోయిన్ : నిధి అగర్వాల్ మోస్ట్ పాపులర్ కమెడియన్ : సునీల్ మోస్ట్ పాపులర్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ : గూఢాచారి మోస్ట్ సక్సెస్ఫుల్ బాక్సాఫీస్ హిట్ : ఆర్ఎక్స్ 100 డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ : రాహుల్ రవీంద్రన్ మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (మేల్) : అనురాగ్ కులకర్ణి మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్) : చిన్మయి శ్రీపాద మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్ : అనంత శ్రీరామ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ : డాక్టర్ రమేష్ కంచర్ల తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ : మిథాలీ రాజ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్కేర్ : డాక్టర్ బిందుమీనన్ ఫౌండేషన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : మహ్మద్ హుస్సాముద్దీన్ జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : గరికపాటి అనన్య జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : డాక్టర్ యాదయ్య యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : షేక్ మహ్మద్ ఆరీఫుద్దీన్ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : సబీనా జేవియర్ -
‘మహానటి’.. కీర్తి సురేష్
66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం కేంద్రం ప్రకటించింది. తెలుగు సినిమాను భారీ పురస్కారాలు వరించాయి. సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో ప్రధానపాత్ర పోషించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు సినిమాగా ‘మహానటి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు అవార్డునుఆయుష్మాన్ ఖురానా(అంధాధూన్), విక్కీ కౌశల్(ఉడి)కు ప్రకటించారు. ఉత్తమ దర్శకుడిగా ఆధిర్ ధర్ (ఉడి) ఎంపికయ్యారు. ఇక బెస్ట్ మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఒరిజినల్ స్క్రీన్ప్లే , ఉత్తమ ఆడియోగ్రఫీతో పాటు కాస్ట్యూమ్స్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ‘తెలుగు వెలిగింది’. తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఈ దారిలో మరింత విస్తృతంగా నడవడానికి కావాల్సింది అవార్డులు, రివార్డులు. తెలుగులో వస్తున్న కొత్తతరం సినిమాలకు ప్రేక్షకులు అభినందనలతో ప్రేమను అందిస్తుంటే, జాతీయ అవార్డులు ప్రోత్సాహం అందిస్తున్నాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి జాతీయ అవార్డుల్లో మన తెలుగు వెలిగింది. చిన్నూ.. అవార్డ్ వచ్చిందని అరిచాను – రాహుల్ రవీంద్రన్ (‘చిలసౌ’ దర్శకుడు) పదేళ్ల క్రితం మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన సంఘటనల ఆధారంగా ‘చిలసౌ’ కథ తయారు చేసుకున్నాను. కెరీర్లో ఇలాంటి అవార్డ్ వస్తుందని ఊహించలేదు. ఇవాళ చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం, రెండో సినిమా రిలీజ్ కావడం, డెబ్యూ డైరెక్టర్గా ‘సాక్షి’ నాకు అవార్డ్ ప్రకటించడం అన్నీ ఒకే రోజు జరిగాయి. తెలుగు ప్రేక్షకులు ఒక్కసారి మనల్ని మెచ్చుకున్నా, మన పని నచ్చినా సరే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ల ఆశీర్వాదం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. ‘మీకు నేషనల్ అవార్డ్ వచ్చింది’ అని చాలా ఫోన్లు వచ్చాయి. నాకు అర్థం కాలేదు. వెంటనే చిన్ను (రాహుల్ భార్య చిన్మయి)కి ఫోన్ చేసి గట్టిగా ‘చిన్నూ...నాకు నేషనల్ అవార్డ్ వచ్చింది..’ అని అరిచాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవార్డ్ కోసం ‘చిలసౌ’ ఎప్పుడో పంపించి మర్చిపోయాం. ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. కథను నమ్మిన హీరో, నిర్మాతలకు, నాగార్జున సార్కి అందరికీ థ్యాంక్స్. క్రెడిట్ ముగ్గురికి దక్కుతుంది – ప్రశాంత్ వర్మ, (’అ!’ దర్శకుడు) చాéలా హ్యాపీగా ఉంది. మరీ ముఖ్యంగా మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ రెండు కేటగిరీల్లో అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. దర్శకుడిగా ఫస్ట్ సినిమాకే అవార్డ్స్ రావడం ప్రోత్సాహంలా ఉంటుంది. విభిన్నమైన సినిమాలు తీయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కమర్షియల్ సినిమాలా? డిఫరెంట్ సినిమాలా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ అవార్డ్స్ ఇంట్రెస్ట్ పెంచుతాయి. నేషనల్ అవార్డ్స్కు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. మరో విశేషం ఏంటంటే ‘అ!’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఈరోజు ఎందుకో ఇంట్లో హోమ్ థియేటర్ సెట్ చేసుకొని చూస్తూ ఉన్నా. అర్ధగంట అవగానే నేషనల్ అవార్డ్ వచ్చిందంటూ కాల్ చేశారు. ఈ ప్రాజెక్ట్కు సపోర్ట్గా నిలబడినందుకు నానీగారికి స్పెషల్ థ్యాంక్స్. మేకప్ చీఫ్ రంజిత్తో పాటు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ శాంతి, అదితీ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ల ముగ్గురికీ ఈ క్రెడిట్ వెళ్లాలనుకుంటున్నాను. అస్సలు ఊహించలేదు – రాజాకృష్ణన్ (‘రంగస్థలం’ ఆడియోగ్రాఫర్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో తొలిసారి జాతీయ అవార్డు సాధించినందుకు సంతోషంగా ఉంది. అది కూడా నేను చేసిన తెలుగు సినిమాకు రావడం హ్యాపీ. జాతీయ అవార్డు వస్తుందని ఊహించలేదు. ‘రంగస్థలం’ చిత్రంలో హీరో రామ్చరణ్ సగం చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్రలో బాగా నటించారు. హీరోకు వినికిడి సమస్య ఉండటంతో సౌండింగ్ ఎలిమెంట్స్ను ఎలివేట్ చేయడానికి మంచి అవకాశం దొరికినట్లయింది. సౌండింగ్కు మంచి స్కోప్ దొరికింది. చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా చేశాను. సుకుమార్గారు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయనకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. డైరెక్టర్, హీరో, నిర్మాతలకు థ్యాంక్స్. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మా బాధ్యత పెరిగింది – నాని మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో ఉత్తమ చిత్రంగా ‘అ’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. నాని, ప్రశాంతి తిపిరనేని నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు రావడం పట్ల హీరో, నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘మా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ‘అ’ మంచి విజయాన్ని సాధించి, ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డులు రావడం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.. నిర్మాతగా మా బాధ్యతను మరింత పెంచింది. మా యూనిట్ తరపున జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన తెలుగు చలన చిత్రాల నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అవార్డులకు ఎంపికైన అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ‘మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. అవార్డులు గెలుచుకున్నవారికి నటుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇతర భాషల్లో అవార్డులు గెలుచుకున్నవారికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు వస్తాయని ఈ సినిమాల రిలీజ్కు ముందే చిరంజీవి ఊహించి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మహానటి’ సినిమా విడుదల తరవాత కూడా ఓ సందర్భంలో యూనిట్ సభ్యులను చిరంజీవి అభినందించిన సంగతి విదితమే. మరాఠీలో మెరిసిన తెలుగు తేజం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’కు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సుధాకర్ రెడ్డి యక్కంటి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. మరాఠీ చిత్రం ‘నాల్’ (బొడ్డుతాడు) చిత్రానికి సుధాకర్ రెడ్డి ‘ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు’కు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన సుధాకర్ రెడ్డి జేఎన్టీయూలో డిగ్రీ పూర్తి చేసి, పుణేలోని ప్రఖ్యాత ఎఫ్టీఐఐలో పీజీ పట్టా పుచ్చుకున్నారు. ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘దళం’ వంటి టాలీవుడ్ చిత్రాలకు పనిచేశాక ముంబైలో స్థిరపడ్డారు. హిందీ, మరాఠీ చిత్రాల్లో బిజీగా ఉంటూనే ‘నాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల్యంతో పెనవేసుకున్న అనుభవాలను, తల్లితో కొడుకుకు ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో సుధాకర్ ఉద్వేగభరితంగా చూపారు. అదే విధంగా ‘నాల్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన బాలనటుడు శ్రీనివాస్ పోకలేకు మరాఠీ విభాగంలో ఉత్తమ బాలనటుడు అవార్డును ప్రకటించడం విశేషం. కేజీఎఫ్కు డబుల్ ధమాకా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలై ఘన విజయం అందుకున్న ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫైట్స్ విభాగాల్లో అవార్డులు దక్కడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు యష్, ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేజీఎఫ్ చాప్టర్2’ను త్వరలోనే విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పాటకు తొలి అవార్డు ‘పద్మావత్’ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగాల్లో మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఆయనే సంగీత దర్శకుడు కూడా. భన్సాలీ మాట్లాడుతూ– ‘‘క్రియేటివ్ ఫిల్డ్లో ఆర్టిస్టులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. కానీ ‘పద్మావత్’ సినిమా విషయంలో అవసరమైన దానికంటే ఎక్కువగానే సమస్యలను ఫేస్ చేశాను. నేను చేసిన సినిమాల్లో కల్లా ‘పద్మావత్’ చాలా కష్టతరమైనది. చిత్రీకరణ సమయంలో మాపై దాడులు జరిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ధర్నాలు, మార్చ్లు చేశారు. బ్యాన్ చేయమన్నారు. ఇలా ఈ సినిమాకి ప్రతి విషయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఈ కారణాల చేత నేను ఫీలైన ప్రతిసారీ ఓ పాట తీసేవాడిని. కొంచెం రిలీఫ్గా అనిపించేది. అన్ని సమస్యల మధ్య కూడా నేను ఈ సినిమా గురించి పాజిటివ్గానే ఆలోచించా. ఈ సినిమా విజయం సాధించడానికి అదొక కారణం అనిపించింది. ఇప్పుడు మా సినిమాకు అవార్డులు రావడం హ్యాపీగా ఉంది. ఇదొక ఎమోషనల్ మూమెంట్ మాకు. నా ప్రతి సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుంది. సంగీతమే నా ప్రపంచం’’ అని అన్నారు. అయితే.. ఉత్తమ సంగీత దర్శకుడిగా సంజయ్కు అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. బుల్బుల్ పాడగలదు! అస్సామీ సినిమాకు ‘జాతీయ ఉత్తమ చిత్రం’ అవార్డు అందని ద్రాక్ష. అది 2018 వరకే. రీమా దాస్ తన మొదటి సినిమా ‘విలేజ్ రాక్స్టార్స్’తో ఆ డ్రీమ్ను డెబ్యూ (తొలి) సినిమాతోనే తీర్చేశారు. అస్సామీ రాక్స్టార్గా నిలిచారు. తొలి సినిమాయే అవార్డు అందుకునే స్థాయిలో ఉన్నప్పుడు తదుపరి సినిమా మీద అంచనాలు మామూలే. ఆ అంచనాలను రెండో సినిమాతోనూ సునాయాసంగా అందుకొని అందర్నీ మరొక్కసారి రీమా దాస్ ఆశ్చర్యపరిచారు. రీమా రెండో చిత్రం ‘బుల్బుల్ కెన్ సింగ్’ ఉత్తమ అస్సామీ చిత్రం అవార్డు గెలుచుకుంది. బుల్బుల్, బోణీ, సుము అనే ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తమ సమాజం కోరుకున్నట్టు ఉండలేక, తాను అనుకున్నట్టు ఉండాలనే పోరాటం చేస్తూ తన గొంతుని వినిపించాలనుకుంటుంది బుల్బుల్. తన గొంతుని వినిపిస్తుంది. ఇది విన్న జ్యూరీ కూడా అవార్డు ఇవ్వకుండా ఉండగలదా? ‘బుల్ బుల్..’ లో ఓ దృశ్యం 66వ జాతీయఅవార్డుల ఎంపికలో ‘ఉరి: ది సర్జికల్స్ట్రైక్స్’ చిత్రానికి నాలుగు విభాగాల్లో (ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్) అవార్డులు వచ్చాయి. కానీ 2019, జనవరి 11న విడుదలైన ఈ చిత్రం 2018 జాతీయ అవార్డులకు ఎలా అర్హత సాధించిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇక్కడే ఓ లాజిక్ ఉంది. ఒక ఏడాదిలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వరకు సెంట్రల్బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబీఎఫ్సీ ) చేయించుకున్న సినిమాలను జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా 31, 2018న ‘ఉరి’ సిబీఎఫ్సీ వద్ద సర్టిఫికేట్ పొందింది. ఆ విధంగా ‘ఉరి’ చిత్రం జాతీయ అవార్డుల రేస్లో నిలిచి అవార్డులను సొంతం చేసుకుంది. – ముసిమి శివాంజనేయులు, డేరంగుల జగన్ -
అవార్డు విన్నర్లకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి : 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు పలు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో పురస్కారాలకు ఎంపికైన తెలుగు సినిమా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం ఆకాక్షించారు. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) -
మెగాస్టార్ చెప్పినట్టే జరిగింది!
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. (చదవండి : తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట) ఇక నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే నుంచి చిలసౌ కు, ఉత్తమ మేకప్, విభాగంలో, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ..!` చిత్రానికి అవార్డులు దక్కాయి. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అవార్డులు పొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. `మహానటి`, `రంగస్థలం` చిత్రాలకు జాతీయ అవార్డలు వస్తాయని ఆయన రిలీజ్ కు ముందుగానే చెప్పిన సంగతి తెలిసిందే. మహానటి రిలీజ్ అనంతరం చిరంజీవి యూనిట్ సభ్యులను ఇంటికి పిలిపించి ఘనంగా సన్మానించిన సంగతి విదితమే. ఆయన చెప్పినట్టు ఆయా చిత్రాలకు అవార్డులు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన `రంగస్థలం`కు జాతీయ అవార్డు రావడం. అలాగే ఇతర భాషల నుంచి అవార్డులకు ఎంపికైన వారందరికీ మెగాస్టార్ అభినందనలు తెలిపారు. -
సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా!
రంగస్థలం లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత కూడా సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు చాలా టైం తీసుకుంటున్నాడు. రంగస్థలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. కానీ కథా కథనాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో మహేష్ ఆ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేశాడు. వెంటనే సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో సెట్స్మీదకు వచ్చేలా కనిపించటం లేదు. ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా అంటుందన్న టాక్ వినిపించింది. కానీ తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాను ఎనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్తో రెడీగా ఉంది. దీంతో సుకుమార్ సినిమా కన్నా ఐకాన్ నే ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. దీంతో సుకుమార్కు మరికొంత కాలం వెయిటింగ్ తప్పేలా లేదు. మరి ఈ గ్యాప్లో సుక్కు వేరే హీరోతో సినిమా చేస్తాడా..?లేక బన్నీ డేట్స్కోసమే వెయిట్ చేస్తాడా చూడాలి. -
సుకుమార్ మరో సినిమా కూడా ఆగిపోయిందా!
రంగస్థలం లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్ ఫుల్ బిజీ అవుతాడని అంతా ఊహించారు. సుకుమార్ కూడా అదే జోరులో సూపర్స్టార్ మహేష్తో సినిమా ఓకె చేయించుకొని ఫుల్ ఫాంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. సుకుమార్తో సినిమా లేదని మహేష్ స్వయంగా ప్రకటించాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న ఎనౌన్స్మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దర్శకుడిగా ఇలా ఉంటే నిర్మాతగానూ సుకుమార్ కెరీర్ అంతా ఆశాజనకంగా కనిపించటం లేదు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, దర్శకుడు లాంటి సినిమాలను నిర్మించిన సుక్కు తరువాత కూడా వరుససినిమాలకు ప్లాన్ చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ను పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. నాగశౌర్య హీరోగా కాశీ విశాల్ను దర్శకుడి పరిచయం చేస్తూ మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బ్యాడ్ ఫేజ్ నుంచి సుకుమార్ ఎప్పుడు బయటికి వస్తాడో చూడాలి. -
చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్..
శ్రీనగర్కాలనీ: ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. పట్నంలో చదువుకునేటప్పుడు దొరబాబును ప్రేమించింది. దొరబాబు అంటే తమ్ముడు చిట్టిబాబుకు అమితమైన ప్రేమ. అనుకోకుండా దొరబాబు వాళ్ల ఊరి ప్రెసిడెంట్ను ఎదిరించాడు. ఎన్నికల్లో కూడా అతనికి పోటీగా నిలబడ్డాడు. ఇంత బిజీగా ఉన్నాసరే ఆదివారం వచ్చిందంటే మాత్రం దొరబాబు ఆమెను చూడ్డానికి పట్నం వెళుతుంటాడు. ఈ కథ ఎక్కడో విన్నట్టో.. చూసినట్టో ఉంది కదూ..! అదేనండి ‘రంగస్థలం’ చిత్రంలోని సన్నివేశం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కథలో కీలకమైనదే. ఇందులో దొరబాబు(ఆది పినిశెట్టి) ప్రేమించిన ఎమ్మెల్యే కూతురు పేరు గుర్తుందా.. ‘పద్మ’. ఆమె అసలు పేరు ‘పూజిత పొన్నాడ’. అంతకుముందే యూట్యూబ్లో ఎంతోమందికి పరిచమైన పూజిత.. పద్మగా మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మరో కీలక పాత్ర చేసి మెప్పించింది. ఈ సందర్భంగా పూజిత తన వెండి తెర ఎంట్రీని ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మాది వైజాగ్. నాన్న బిజినెస్మెన్, అమ్మ గృహిణి. పుట్టింది వైజాగ్లోనే కానీ ఢిల్లీలో చదువుకున్నా. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్లో చేరాను. స్కూలింగ్, కాలేజీ రోజుల్లో చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. నా హాబీస్ బుక్స్ చదవడం, ఆర్ట్స్ వేయడం. జాబ్ చేస్తున్న సమయంలో ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ ద్వారా ‘ఉప్మా తినేసింది’ షార్ట్ఫిలిం యూనిట్ అప్రోచ్ అయ్యారు. అలా షార్ట్ఫిలింస్లో అనుకోకుండా నటించాను. ఫస్ట్టైం కెమెరా ముందు ధైర్యం తెచ్చుకొని నటించాను. సింగిల్ టేక్లో షాట్స్ ఓకే అవుతుంటే నాపై నమ్మకం పెరిగింది. అలా ‘పరిచయం, బూచి, అను నేను తను’ లాంటి 10 షార్ట్ ఫిలింస్లో నటించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసా.. నేను నటించడం ఇంట్లో వారికి అసలు ఇష్టం లేదు. జాబ్ పైనే దృష్టిపెట్టమన్నారు. అయితే, నా షార్ట్ఫిలింస్ చూసిన అమ్మ ఫ్రెండ్స్ అభినందిస్తూ మెజేస్లు చేయడంతో అమ్మ కూడా ఆనందించింది. జాబ్తో పాటు అప్పుడప్పుడు షార్ట్ ఫిలింస్ చేస్తుండటంతో ఇంట్లో వాళ్లు కూడా ప్రోత్సహించారు. ఓ షార్ట్ఫిలింలో నన్ను చూసిన దర్శకుడు సుకుమార్ ‘దర్శకుడు’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో డేట్స్ కుదరక యాక్టింగ్పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకొని జాబ్ మానేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసి పేరెంట్స్ చాలా కోప్పడ్డారు. తర్వాత నా డెడికేషన్ నచ్చి సినీ రంగంలోకి వెళ్లమని, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా ఆశీర్వదించారు. ‘రంగస్థలం’తో గుర్తింపు రంగస్థలం చిత్రంలో ప్రకాష్రాజ్ కుమార్తె పద్మగా ఆది పినిశెట్టికి జోడిగా నటించాను. సినిమా ఘన విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్తో పాటు చిత్రంలోని అందరూ చాలా ప్రోత్సహించారు. తర్వాత దర్శకుడు మారుతి నిర్మాణంలోని ‘బ్యాండ్ బాబు’, దర్శకురాలు సంజనారెడ్డి చిత్రం ‘రాజుగాడు’లో నటించాను. రీసెంట్గా ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’లో మంచి ప్రాతలో నటించాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా రాజశేఖర్ ‘కల్కి, సెవెన్’తో పాటు మరో పెద్ద ప్రాజెక్ట్లో నటిస్తున్నాను. దర్శకులు సుకుమార్, మారుతి నన్ను ప్రోత్సహించారు. రిజర్వ్డ్ పర్సన్ని.. స్కూలింగ్ నుండి కాలేజీ డేస్తో పాటు జాబ్లో కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేదాన్ని. ఎవరితోనూ అంత క్లోజ్ అయ్యేదాన్ని కాదు. చదువే ఫస్ట్ అన్నట్లుగా నా ప్రయాణం సాగింది. తొమ్మిదో తరగతిలో లంచ్ టైమ్లో ఓ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఒక్క నిమిషం చేయి వాష్ చేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుండి నేను జంప్. టెన్త్లో నా ఫ్రెండ్ స్కూల్ ఫంక్షన్లో నా ఫస్ట్ లవ్ పూజితకి ఈ పాట అంకితం అని స్టేజీ మీద అందరి మందు చెప్పేసాడు. నేను వెంటనే ఫంక్షన్ నుండి వెళ్లిపోయాను. ఆ వయసులో భయంతో పాటు సిగ్గు, బిడియం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా కంఫర్ట్గా ధైర్యంతో ఉన్నాను. తెలుగమ్మాయిలు‘ది బెస్ట్’ అనిపించుకోవాలి అందరూ బాగా నటిస్తారు. కానీ తెలుగమ్మాయిలు ‘ద బెస్ట్’ అనిపించుకొనేలా చేయాలని ఉంది. నా వరకూ నేను కష్టపడతాను. హావభావాలను పలికిస్తూ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి కృషి చేస్తాను. ‘సమ్మోహనం’ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. కథాబలమున్న పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. పెద్ద బ్యానర్లో పనిచేయాలని ఉంది. నటిగా నన్ను నేను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ చిత్రంలో అన్ని షేడ్స్ ఉన్న రోల్లో నటించాను. గ్లామెరెస్ రోల్స్తో పాటు అన్ని పాత్రలు చేయగలను. రూమర్స్ని నేను పట్టించుకోను. నా వ్యక్తిత్వంతో ముందుకు సాగుతాను’ అంటూ ముగించింది పద్మ. -
‘రంగస్థలం’ రికార్డు.. దశాబ్దాల తరువాత అక్కడ!
తెలుగునాట నాన్ బాహుబలి రికార్డులన్నింటిని చెరిపేసిన భారీ చిత్రం రంగస్థలం. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ డ్రామా సంచలన విజయం సాధించటం మాత్రమే కాదు 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రామ్ చరణ్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. తమిళ, మళయాల భాషలతో పాటు కన్నడ నాట కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానుంది. కొన్ని దశాబ్దాలుగా కన్నడ ఇండస్ట్రీ డబ్బింగ్ సినిమాలను కర్ణాటకలో రిలీజ్ చేసేందుకు అనుమతించటం లేదు. కానీ కేజీయఫ్ రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల కావటంతో ఇతర భాషా చిత్రాలనుకూడా కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. దీంతో దశాబ్దాల తరువాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమా రంగస్థలం రికార్డ్ సృష్టించనుంది. తెలుగు నాట సంచలనాలు నమోదు చేసిన రంగస్థలం తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తుందా.. అన్ని భాషల్లో రామ్ చరణ్కు మార్కెట్ ఓపెనవుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మహేష్ కోసం.. మరో డిఫరెంట్ బ్యాక్డ్రాప్
రంగస్థలం సినిమాతో రికార్డ్లను తిరగరాసిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్.. నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. రంగస్థలం సినిమాను పిరియాడిక్ జానర్లో తెరకెక్కించిన సుక్కు.. మహేష్ కోసం మరో డిఫరెంట్ బ్యాక్డ్రాప్ను రెడీ చేస్తున్నాడట. సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ను డిఫరెంట్ లుక్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ను, రంగస్థలంలో రామ్ చరణ్ను గడ్డంతో చూపించిన సుక్కు మహేష్తో కూడా అదే లుక్ ట్రై చేయిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. -
వీరి గాత్రం.. వేసింది మంత్రం..
రంగమ్మ మంగమ్మ అంటూ మానసి.. శ్రోతలను ఫిదా చేశారు. దారి చూడు అంటూ పెంచల్ దాస్ దుమ్ము లేపారు. చూసి చూడంగానే నచ్చేశావే అని అనురాగ్ కులకర్ణి అంటే... వినీ వినంగానే ఎక్కేసిందే అంటూ శ్రోతలు వంతపాడారు. ఇంకేం ఇంకేం కావాలే అని సిద్శ్రీరామ్ అంటే.. ఇకపై ఈ పాటనే వింటామే అంటూ సంగీత ప్రియులు బదులిచ్చారు. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని మోహన భోగరాజు చెప్పగా.. అంతే శ్రద్దగా చెవులురిక్కించి విన్నారు ఆడియెన్స్. ఈ ఏడాది గాయనీగాయకులు తమ గాత్రాలతో చేసిన మ్యాజిక్ను ఓసారి చూద్దాం. రంగమ్మ మంగమ్మ.. అంటూ మానసి రంగస్థలం సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. లెక్కల మాష్టారే పరీక్ష రాస్తే నూటికి నూరు మార్కులు వచ్చినట్టు.. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా.. మాస్ సూత్రాలను సరిగ్గా పాటిస్తూ.. సుకుమార్ తీసిన రంగస్థలం అంతా ఒక ఎత్తైతే.. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఈ చిత్రంలోని ప్రతీపాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవల్సింది రంగమ్మ మంగమ్మ పాట గురించే. ఈ పాటకు సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. ఈ పాటలో సమంత అభినయం, డ్యాన్సులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఈ పాటపై సోషల్ మీడియాలో లెక్కలేని వీడియోలను రీక్రియేట్ చేసేశారు అభిమానులు. ఈ పాట జనాల్లోకి వెళ్లడానికి దేవీ అందించిన ట్యూన్ ఒక కారణమైతే.. మానసి గాత్రం మరో కారణం. ఈ పాటతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ను సంపాదించేశారు గాయని మానసి. ఈ వీడియోసాంగ్ను ఇప్పటివరకు 129మిలియన్ల మంది వీక్షించారు. దారి చూపి దుమ్ము లేపిన దాస్.. ఈ ఏడాదిలో వచ్చిన పాటలన్నింటిలో మాస్ను ఊపేసిన పాట ఇది. నాని ద్విపాత్రాభినయం చేసిన కృష్ణార్జున యుద్దం సినిమా మిశ్రమ ఫలితాన్నిచ్చినా.. ఈ చిత్రంలోని ఈ పాట మాత్రం పాపులర్అయింది. ఎక్కడ ఎలాంటి ప్రొగ్రామ్స్ అయినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. చిందులు వేయాల్సిందే. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా.. రాయలసీమ రచయిత పెంచల్ దాస్ అందించిన గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ అయింది. ఆ గాత్రంలో ఉన్న మ్యాజిక్కే.. ఈ పాటను ఇంతలా వైరల్ చేసింది. ఇప్పటికే ఈ వీడియో సాంగ్ను యూట్యూబ్లో 38మిలియన్ల మంది వీక్షించారు. వినీ వినంగానే నచ్చేసిందే... ఈ ఏడాది యూత్ను ఊపేసిన పాటల లిస్ట్లో మొదటి వరుసలో ఉండేది ఛలో సాంగ్. చూసి చూడంగానే అంటూ నాగశౌర్య రష్మిక మాయలో పడిపోతే.. ఈ పాటను వినీ వినంగానే నచ్చేసిందే అనేలా చేసేశారు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి. ఎక్కడ చూసిన ఈ పాటే కాలర్ట్యూన్.. రింగ్టోన్గా మారిపోయింది. ఈ పాటను 94మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఏడాదిలో అనురాగ్ అందరికీ గుర్తుండియో పాటలు పాడి శ్రోతలకు మరింత దగ్గరయ్యారు. మహానటి టైటిల్ సాంగ్.. ఆర్ఎక్స్ 100 పిల్లా రా వంటి సాంగ్లను పాడి అనురాగ్ కులకర్ణి ఫుల్ ఫేమస్ అయ్యారు. వీటిలో పిల్లా రా సాంగ్ను యూత్ను కట్టిపడేసింది. యూట్యూబ్లో ఈ సాంగ్ను 140మిలియన్ల మంది చూశారు. ఇంకేం ఇంకేం కావాలే.. ఇంకేం ఇంకేం కావాలే.. అని సిద్ శ్రీరామ్ అంటే ఈ ఏడాదికి ఇదే చాలే అని ప్రేక్షకుల బదులిచ్చారు. గీతగోవిందంలోని ఈ పాటే సినిమాపై హైప్ను క్రియేట్ చేసింది. ఒక్కపాట సినిమాపై అంత ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఈ పాటే ఓ ఉదహరణ. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటకు బలాన్నిచ్చింది. గోపి సుందర్ అందించిన బాణీకి, సిద్శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోయగా.. సంగీత ప్రియులను ఈ పాట ఉక్కిరిబిక్కిరి చేసేసింది. భాషలతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులకు అందరికీ ఈ పాట ఎక్కేసింది. రికార్డు వ్యూస్లతో యూట్యూబ్లో ఈ పాట దూసుకెళ్తోంది. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని గంభీరంగా చెప్పిన మోహన.. అరవింద సమేత.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో సంగీతం ప్రధాన ప్రాత పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని రెడ్డమ్మ సాంగ్కు విపరీతమైన స్పందన వచ్చింది. సినిమా ముగింపులో వచ్చే ఈ పాట.. రెడ్డమ్మ తల్లి గొప్పదనాన్ని వివరించగా.. ఆ గాత్రంలోని తెలియని ఆకర్షణకు అందరూ ముగ్దులయ్యారు. మోహన భోగరాజు ఈ పాటతో అందరికీ సుపరిచితురాలయ్యారు. పెంచల్ దాస్ తన రాయలసీమ యాసలో అందించిన సాహిత్యం ఈ పాటపై మరింత ప్రభావాన్ని చూపింది. ఇలా ఈ ఏడాది తమ గాత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువతరంగాలు.. వచ్చే ఏడాది కూడా తమ హవాను కొనసాగించాలని మరిన్ని మంచి పాటలను ఆలపించాలని ఆశిద్దాం. -
‘రంగస్థలం’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘సర్కార్’
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతూ వస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ను సాధించి రికార్డ్ సృష్టించిన సర్కార్ ప్రస్తుతం ఈ ఏడాది సౌత్లోనే హైయ్యస్ట్ గ్రాసర్గా రికార్డ్ను సొంతం చేసుకుంది. రెండు వారాల్లో సర్కార్ 225 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2018లో సౌత్లో అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా టాప్ ప్లేస్లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ టాలీవుడ్ బ్లాక్బస్టర్ రంగస్థలం పేరిట ఉంది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం 218 కోట్లతో సర్కార్ రిలీజ్ కు ముందు వరకు టాప్ ప్లేస్లో ఉంది. విజయ్ సర్కార్ ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్ మరిన్ని రికార్డ్లు సాధించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
చిరంజీవి నాకు ఇన్స్పిరేషన్ : యంగ్ విలన్
శ్రీనగర్కాలనీ: సినిమాలో విలన్ అంటే ఎలా ఉండాలి! భయంకరమైన రూపం.. ఎరుపెక్కిన కళ్లు.. మొహంపై గాట్లు.. చూడగానే ఎవరికైనా భయం పుట్టాల్సిందే.. అలా ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సినిమా విలన్లు స్మార్ట్గా మారిపోయారు. సిక్స్ప్యాక్ బాడీతో అందంలో హీరోనే తలదన్నుతున్నారు. మాస్ లుక్స్తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు. కేవలం వారు చేసే పనుల్లోనే విలనిజం కనిపిస్తుంది తప్ప.. బాడీ లాంగ్వేజ్లో ఏ కోశానా ఆ ఛాయలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో ఈ ట్రెండ్ రాజ్యమేలుతోంది. అసలు ‘విలన్’ అంటే ఎవరు..? హీరోకు శత్రువు. అందుకేనేమో ‘‘శత్రు’’ అని పేరు పెట్టుకున్న అతడు తెలుగు తెరపై ఇప్పుడు ట్రెండ్ సెట్టింగ్ విలన్గా ఎదుగుతున్నాడు. చూడ్డానికి 6 అడుగుల 3 అంగుళాల పొడవుతో ‘300’ హాలీవుడ్ మూవీ హీరో ‘జెరార్డ్ బట్లర్’ను తలపించేట్టు ఉండే ఈ విలన్కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ‘‘రంగస్థలం, శైలజారెడ్డి అల్లుడు, అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో మంచి పాత్రలుపోషించిన శత్రు తన సినీ ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు మన విలన్ మాటల్లోనే.. ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్లో రామ్చరణ్తో శత్రు మాది ఒరిస్సా.. కానీ తెలుగబ్బాయినే. మా పూర్వికులది రాజమండ్రి. అయితే ఒరిస్సాలో సెటిలయ్యారు. నాన్న వ్యవసాయం చేస్తారు. నాకు ఇద్దరు అన్నలు. ఇంటర్ వరకూ కటక్లో చదువుకున్నాను. పస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఇంట్లో వారు బైపీసీ చేసి డాక్టర్ అవ్వమన్నారు. కానీ చిన్నతనం నుంచి నటన మీద చాలా ఇంట్రస్ట్ ఉండేది. స్కూల్ కల్చరల్ పోటీల్లో చురుగ్గా ఉండేవాడిని ఉండేది ఒరిస్సా అయినా ఇంట్లో అంతా తెలుగు వాతావరణమే. చిరంజీవిగారు నాకు ఇన్స్పిరేషన్. ఇంటర్ అయ్యాక మనసంతా యాక్టింగ్ వైపే లాగింది. ఇక డాక్టర్ మనకు సెట్ కాదనిపించింది. ఎలాగైనా ఇండస్ట్రీకి వచ్చేయాలని.. డిగ్రీ హైదరాబాద్లో చేస్తానని మా నాన్నతో చెబితే.. ‘ఇక్కడే చదువుకోవచ్చుగా’ అన్నారు. కానీ నేను హైదరాబాద్లో చదువుకుంటా అని గట్టిగా చెప్పేసరికి ఒప్పుకున్నారు. వెంటనే సిటీకి వచ్చేశా. డిగ్రీ మైక్రోబయాలజీ అవంతి కాలేజీలో చేరాను. అక్కడ పరిమళ మేడం నాకు సపోర్ట్ చేసింది. నా ఆసక్తిని గమనించి ప్రోత్సహించింది. అనుకోకుండా టీవీలో ఛాన్స్.. జెమిని టీవీలో వీజేగా అవకాశాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లి నా ఫొటోలు ఇచ్చి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి నువ్వు టీవీలో వస్తున్నావు అంటే కంగారుపడ్డాను. నేను అసలు ఎక్కడా నటించనే లేదు. ఎక్కడ వస్తున్నానబ్బా.. అని అడిగాను.. వాడు చెప్పిన సమాధానం ఏంటంటే...ఒక క్రైమ్ సీరియల్లో పోలీస్స్టేషన్లో మోస్ట్ వాంటెడ్ ఫొటోల్లో నీ ఫొటో ఉంది అన్నాడు. ఆ మాట విని నవ్వుతో పాటు కొద్దిగా కాన్ఫిడెంట్ కూడా వచ్చింది. కనీసం ఇలాగైనా ఎవరైనా చూసి అవకాశాలు ఇస్తారని (నవ్వుతూ) అనుకున్నా. లీడర్తో అవకాశం అవకాశాల కోసం తిరుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్స్తో పరిచయాలు పెంచుకొన్నాను. అలా నా మొదటి సినిమా అవకాశం రానా హీరోగా తీసిన ‘లీడర్’తో వచ్చింది. అందులో చిన్న పాత్రే వేశాను. ఈ తర్వాత ‘అలియాస్ జానకి’ చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను. కానీ సినిమా సరిగా ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. కానీ నిర్మాత రామ్ ఆచంట నా ఫొటోలు చూసి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’లోను, ‘ఆగడు’ చిత్రంలో సోనూసూద్ బ్రదర్గా అవకాశం ఇచ్చారు. వాటిలో ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. అంతకు మించి నాకు చిత్ర పరిశ్రమలో ఓ గాడ్ఫాదర్లా ఆయన నాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చారు. తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో హీరోయిన్ అన్నగా ఫుల్ రోల్ చేశాను. ఈ చిత్రం ప్రేక్షకుల్లో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఇజం, అత్తారింటికి దారేది, మిస్టర్, గరుడవేగ చిత్రాల్లో నటించారు. రెండేళ్ల క్రితం ‘మిస్టర్’ చిత్రం షూటింగ్లో ఊటీలో ఉన్నా. జీవితంలో మరువలేని ఘటన అప్పుడు జరిగింది.. మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. 2018లో అదృష్టం పండింది ఈ ఏడాది నాకు పండగను తెచ్చింది. ముగ్గురు సూపర్స్టార్స్ చిత్రాల్లో నటించారు. ఆ మూడూ ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్స్గా నిలిచాయి. ‘‘రామ్చరణ్ రంగస్థలం, మహేష్బాబు భరత్ అనే నేను, ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ’’ చిత్రాల్లో నేను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నా. అరవింద సమేత వీరరాఘవలో ‘ఒంటిచెయ్యి సుబ్బడు’ పాత్ర చిన్నదే అయినా చివరగా సినిమా కంక్లూజన్ ఇచ్చే పాత్ర నాది. అంతేకాకుండా రంగస్థలంలో కాశీ పాత్ర కూడా మంచి పేరు తెచ్చింది. తమిళంతో కార్తి హీరోగా నటించిన ‘చినబాబు’లో విలన్గా ఫుల్రోల్ చేశాను. ప్రేమ..పెళ్లి.. వినూత్న.. నా జీవితంలో దొరికిన అదృష్టం వినూత్న. ‘అలియాస్ జానకి’ చిత్రం సమయంలో ఫ్యాషన్ డిజైనర్గా వినూత్న పరిచయమైంది. రెండేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకున్నాం. తనిప్పుడు ఫాస్ట్లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్గా పనిచేస్తోంది. నేను మంచి భోజనప్రియుణ్ని. నా కోసం చాలా వంటకాలు చేసి పెడుతుంది. ఖాళీగా ఉంటే ఇంట్లో సినిమాలు చూస్తాను. ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తాను. కావాలనే డిగ్రీ పూర్తి చేయలేదు నా లక్ష్యం ఒక్కటే.. నటుడిని కావాలి. కానీ డిగ్రీ పూర్తి చేస్తే నా కెరీర్ మరోదారిలో వెళుతుందని భయమేసింది. అందుకే ఓ సబ్జెక్ట్ను పాస్ అవకుండా అలాగే ఉంచాను. సినిమాల్లో అవకాశాలు రాకపోతే డిగ్రీతో జాబ్ చేసే ఆలోచన వస్తుందని డిగ్రీని పూర్తి చేయలేదు. సినిమానే ప్రపంచంగా ఉండాలని అలా చేశాను. ఇప్పటికీ డిగ్రీ సబ్జెక్ట్ అలాగే ఉండిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయాలి. చిరకాలం గుర్తుండిపోవాలి హైదరాబాద్ నాకు సినిమా లైఫ్ ఇచ్చింది. హను రాఘవపూడి, జీవన్రెడ్డితో పాటు నా తోటి విలన్ స్నేహితులు, ఆర్టిస్ట్స్ చాలా మంది ఉన్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. జగపతిబాబుగారి విలనిజం బాగా ఇష్టం. ఇప్పటికి 20 చిత్రాలు చేశాను. ప్రస్తుతం ‘పడిపడి లేచె మనసు, కల్కి, జార్జిరెడ్డి, కన్నడ శివరాజ్కుమార్ రుస్తుం’ చిత్రాల్లో నటిస్తున్నాను. సినీ ప్రేక్షకులకు ఆర్టిస్ట్గా గుర్తుడిపోయే పాత్రలు చేయాలి. అందుకు ఎంతటి శ్రమకైనా సిద్ధంగా ఉన్నాను.. అంటూ ముగించారు ఈ అందమైన విలన్ శత్రు. -
చరణ్ సినిమా నుంచి తప్పుకున్న సినిమాటోగ్రాఫర్
రంగస్థలం సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంకేతిక విభాగంలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ తప్పుకోవటంతో కొత్త కెమెరామేన్ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా రిషీ పంజాబీ తప్పుకోవటంతో ఆ స్థానంలో ఆర్థర్ విల్సన్ను సినిమాటోగ్రాఫర్గా తీసుకున్నారట. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్తో పాటు పాటలకు విల్సన్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. -
పిరియాడిక్ డ్రామాలో సూపర్ స్టార్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్. రంగస్థలం సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన సుక్కు, మహేష్ కోసం మరో వెరైటీ కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుకుమార్ మహేష్ తో చేయబోయే సినిమా కూడా పిరియాడిక్ సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. రంగస్థలంతో 1980ల కాలాన్ని పరిచయం చేస్తే మహేష్ సినిమా కోసం మరింత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లనున్నారట. మహేష్, సుకుమార్ల సినిమా స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లో జరిగే కథగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. -
ఆ ఇల్లే ..రంగస్థలం
దేవీ...! కష్టములెట్లున్నను పుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితిమి చూడు..,రాజే కింకరుడగున్–కింకరుడే రాజగున్ కాలానుకూలంబుగా.., ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే..,మహాకవి గుఱజాషువా,బలిజేపల్లి లక్ష్మీకాంతం కవుల కలాల నుంచి జాలువారిన మహాకావ్యంసత్య హరిశ్చంద్ర నాటకంలోని జనాదరణ పొందిన పద్యాలివి. ప్రకాశం : సత్యహరిశ్చంద్ర వేషంలో ఆయన స్టేజి ఎక్కి పద్యం అందుకుంటే చాలు ప్రేక్షకులు ఒళ్లంతా చెవులు చేసుకుని వినేవారు. వన్స్మోర్ అంటూ మళ్లీ మళ్లీ పాడించుకునే వారు. సత్యహరిశ్చంద్ర పాత్రలో అంతగా ఒదిగిపోయినఆ రంగస్థల దిగ్గజమే వేటపాలేనికి చెందిన దుబ్బు వెంకట సుబ్బారావు. ఈయనను ప్రేక్షకులు ముద్దుగా డీవీ అని పిలుస్తుంటారు. తన గాత్రం, అభినయంతో ఎందరో కళాభిమానుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. జీవితాంతం హరిశ్చంద్ర వేషం వేస్తూ హరిశ్చంద్ర అంటే డీవీ అన్న పేరు పొందారు. ఆయన తదనంతరం కుమారుడు, ఆ తర్వాత మనవడు కూడా ఇదే పాత్రను పోషిస్తూ కళా రంగంలో రాణిస్తున్నారు. జూనియర్ డీవీగా (డీవీ మనుమడు) పేరొందిన దుబ్బు వెంకట సుబ్బారావు తన రెండు దశాబ్దాల నట ప్రస్థానంలోదేశ వ్యాప్తంగా దాదాపు ఐదు వేల ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను అలరించారు. వేటపాలెం మండలం ఆణుమల్లిపేటకు చెందిన డీవీ సుబ్బారావు(సీనియర్) పాడిన హరిశ్చంద్ర పద్యాలు, పాటలు అప్పట్లోనే గ్రామ్ఫోన్ రికార్డులుగా వచ్చాయి. 1970 దశకంలో అభిమానులు ఆయన చేతికి స్వర్ణ కంకణం తొడిగారు. ఆంధ్రా తాన్సేన్, కలియుగ హరిశ్చంద్ర, మధురగాన విశారద బిరుదులు, సన్మానాలు పొందారు సీనియర్ డీవీ. ఆయన మరణానంతరం అదే బాటలో కుమారుడు సుబ్బయ్య సత్యహరిశ్చంద్ర పాత్రను పోషించి మెప్పించారు. సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(జూనియర్) తన పదకొండో ఏటనే తాతను స్ఫూర్తిగా తీసుకుని రంగస్థలంపై వేషం వేశారు. వేలాది ప్రదర్శనలతో కళాభిమానులను అలరిస్తూ.. కళాకారులు, పెద్దలతో ప్రశంసలు అందుకుంటున్నారు. డీవీ సుబ్బారావు(జూనియర్) దాదాపుగా పదిహేడేళ్లుగా సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా నటిస్తున్నారు. ఇంత వరకు 5 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అర్జునుడు, కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రలతోపాటు చింతామణిలో భవానిగా నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతోపాటు బరంపురం, విజయవాడ, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లోనూ నాటకాలు వేశారు. పలువురి ప్రశంసలు ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాదు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, దివంగత మంగళంపల్లి బాలమురళీకష్ణ ఇంకా ఎందరో రాజకీయ నాయకులు, పెద్దల నుంచి జూనియర్ డీవీ ప్రశంసలు అందుకున్నారు. సినీ గాయకులు మనో జూనియర్ డీవీ, తండ్రి సుబ్బయ్యలతో కలిసి పలుమార్లు పద్యాలు పాడటం విశేషం. జూనియర్ డీవీ తన విశేష నటనా ప్రతిభకు గుర్తింపుగా బాల గంధర్వ నాటక కళానిధి, యువ నాటక గాన సుధానిధి బిరుదులు పొందారు. ఫిరంగిపురం, జంగారెడ్డిగూడెం, ఏటుకూరు ప్రాంతాల్లో హరిశ్చంద్ర నాటకంలో ఆయన నటనకు ముగ్ధులైన కళాభిమానులు సువర్ణ కంకణాలు బహూకరించారు. తాతపై తనకున్న అపార ప్రేమకు చిహ్నంగా వేటపాలెం మండలం రామన్నపేటలోని తన నివాసంలో ఇటీవల సీనియర్ డీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటించాలని తనకున్నా చూసేవారు కరువవుతున్నారని జూనియర్ డీవీ ఆవేదన వెలిబుచ్చారు. వెండితెర, బుల్లితెర ప్రభావంతో నాటకాల ప్రాభవం తగ్గిందని, ప్రభుత్వం నాటకరంగాన్ని, కళామతల్లిని నమ్మకున్న రంగస్థల నటులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. వేటపాలెం: తొలిజాము నుంచి సంధ్యవేళ వరకు పంట చేలో పనిచేసి అలసిన అన్నదాతలకు.. కుల వృత్తులు, కుటీర పరిశ్రమల్లో చెమటోడ్చిన దేహాలకు.. సాంత్వన చేకూర్చేందుకు, కాలక్షేపానికి దివ్యౌషధం నాటకం. పదిహేనేళ్ల క్రితం వరకు రంగస్థలం, రంగస్థల కళాకారుల క్రేజ్ మాటల్లో వర్ణించలేం! అలాంటి కళాకారుల్లో డీవీ సుబ్బారావు(సీనియర్) ముందు వరుసలో ఉంటారు. ఆయన తనయుడు డీవీ సుబ్బయ్య, సుబ్బయ్య కుమారుడు డీవీ సుబ్బారావు(డీవీ సుబ్బారావు) తమ గాత్రంతో పద్యాలాపన చేసి ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. డీవీ కుటుంబంలో మూడు తరాలు రంగ స్థలంపై చెరగని ముద్ర వేశారు. -
రికార్డుల రంగమ్మ.. మంగమ్మ..
‘రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు.. పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు...’ పాట వినగానే మనకు టక్కున ‘రంగస్థలం’ సినిమా గుర్తుకు రాక మానదు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలోని ‘రంగమ్మ మంగమ్మ’ పాట బాగా పాపులర్ అయింది. ఇప్పుడీ పాట యూ ట్యూబ్లో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను 100 మిలియన్లు (10 కోట్లు) మందికి పైగా వీక్షించారు. ఈ ఏడాది తక్కువ టైమ్లో 10 కోట్ల మార్క్ను దాటిన తొలి దక్షిణాది పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ పాట రికార్డు సృష్టించడం విశేషం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మానసి పాడగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
అన్న కాదు విలన్..!
రంగస్థలం సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వివేక్తో పాటు మరో విలన్ కూడా కనిపించనున్నాడట. హాయ్ సినిమాతో టాలీవుడ్కు హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్, చెర్రీ సినిమాలో స్టైలిష్ విలన్గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగపతి బాబు, ఆది పినిశెట్టి లాంటి వాళ్లను విలన్లుగా చూపించి మెప్పించిన బోయపాటి, రామ్చరణ్ సినిమాతో ఆర్యన్ రాజేష్ను ప్రతినాయక పాత్రలో పరిచయం చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాలో ఆర్యన్, చెర్రీకి అన్నగా కనిపించనున్నారన్న ప్రచారం జరిగింది. కానీ తాజా సమచారం ప్రకారం ఈ సీనియర్ హీరో నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆర్యన్ రాజేష్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రాజేష్ కూడా జగపతి బాబు, ఆదిల్లా స్టార్ ఇమేజ్ అందుకుంటాడేమో చూడాలి. -
‘రంగస్థలం’లో నకిలీలు
రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డుల జారీలో నకిలీ బాగోతం బయట పడింది. నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్న 34 మందికి అధికారులు గుడ్డిగా కార్డులు జారీ చేసేశారు. నిడమర్రు తహసీల్దారు సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ తతంగాన్ని నడిపించారని తేలింది. పశ్చిమ గోదావరి, నిడమర్రు : నాటక రంగాన్ని వృత్తిగా మార్చుకున్న పేద కళాకారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలు అందించేందుకు తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డుల జారీలో సంబంధిత శాఖ జిల్లాస్థాయి ఉద్యోగులు కొంతమంది ముఠాగా ఏర్పడి అనర్హులకు వందల కొద్దీ నకిలీ గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు తెలుస్తోంది. నాటక రంగానికి ఏమాత్రం పరిచయం లేని అనేకమందికి తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి రంగస్థల వృత్తి కళాకారులుగా గుర్తింపు కార్డులు జారీ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుల వ్యవహారంపై తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు తెలిసింది. నకిలీ కార్డులు వెలుగులోకి ఇలా.. ఈనెల 22న నిడమర్రు మండల వృత్తి కళాకారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక పెదనిండ్రకొలను గ్రామంలో జరిగింది. సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసే విషయంలో కళాకారుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఒక కార్యవర్గం జాబితా, ఉంగుటూరు నియోజకవర్గం కన్వీనర్ చల్లా సూర్యారావు ఒక కార్యవర్గ జాబితాఎవరికి వారే ప్రకటించుకుని ప్రమాణ స్వీకారం చేసి ముగించారు. అయితే ఈఎన్నికకు కళాకారులుగా గుర్తింపు కార్డులతో హాజరైన సభ్యులపై బొడ్డేపల్లి అప్పారావు వర్గానికి అనుమానం కలిగి జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా నిడమర్రు తహసీల్దారు డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 34 వరకూ తెలుగుభాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. అప్పటి వరకూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్వీకరించినట్లు జిల్లా అధికారులు సైతం గమనించకపోవడం గమనార్హం. డిజిటల్ సైన్తో నకిలీ ధ్రువీకరణలు ఈ– ఆఫీస్ ద్వారా జారీ చేసే డిజిటల్ సైన్ ముద్ర, ఫైల్ నంబర్తో ఈ నకిలీ దందా బహిర్గతమైంది. నిడమర్రు మండలంలోని పలువురు తమని వృత్తి కళాకారులుగా గుర్తించాలని నిడమర్రు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా గ్రామాల పెద్దలను రెవెన్యూ సిబ్బందితో విచారించి అడవికొలను, చానమిల్లి, నిడమర్రు గ్రామాలకు చెందిన 9 మందిని వృత్తి కళాకారులుగా గుర్తించి ఈనెల 9న ఈ– ఆఫీస్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసారు. అయితే ఈ ధ్రువీకరణ పత్రాలపై ఉన్న డిజిటల్ సంతకం ముద్రను స్కానింగ్ చేసి ఫొటోషాప్ ద్వారా మరి కొంతమందికి నిడమర్రు తహసీల్దారు జారీ చేసినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు రూపొందించారు. అయితే తయారు చేసిన నకిలీ ధ్రువీకరణ పత్రాలపై ఒకే ఫైల్ నంబర్ 397 ఉంది. అలాగే స్కానింగ్ చేసిన ముద్ర కావడంతో తేదీ, సమయం మారలేదు. దీంతో ఒక సెకనులో 34 వరకూ ధ్రువీకరణ పత్రాలు ప్రింట్ చేసినట్లు అయ్యింది. ఆగమేఘాల మీద కార్డుల జారీ దరఖాస్తు చేసుకున్న రోజే గుర్తింపు కార్డులను అ«ధికారులు జారీ చేశారు. అలాగే ప్రతి విషయం డిజిటలైజేషన్ జరుగుతన్న తరుణంలో ఇంకా అధికారులు చేతిరాతతో రాసిన గుర్తింపుకార్డులు జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ నకిలీ దరఖాస్తులపై ఈనెల 19న దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా పౌరసంబంధాలశాఖ కార్యాలయం ముద్ర ఉంది. అదే రోజు వారందరికి చేతిరాతతో గుర్తింపు కార్డులను సహాయ సంచాలకులు తరఫున కిందిస్థాయి ఉద్యోగి ఇ.రామలింగేశ్వరరావు జారీ చేసినట్లు కార్డుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇ. రామలింగేశ్వరరావును వివరణ కోరగా ఉన్నత అధికారులు బిజీగా ఉంటే, వారి తరఫున కళాకారుల గుర్తింపు కార్డులు తను జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే ఒక మండలం నుంచి ఒకేసారి కొత్త దరఖాస్తులు 34 వచ్చినప్పుడు సదరు జిల్లా అధికారులకు అనుమానం రాకపోవడాన్ని కళాకారులు తప్పపడుతున్నారు. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలిస్తే ఈ పొరపాటు జరగదని వారు చెబుతున్నారు. ఒక్కో కార్డుకు రూ.10 వేల వరకూ వసూలుచేసినట్టు తెలుస్తోంది. ఈ నకిలీ ముఠాలోకొంతమంది కళాకారులు, జిల్లా ఉద్యోగులతోపాటు, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు హస్తం ఉన్నట్లు కళా కారుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం సహాయ సంచాలకురాలు సుభాషిణికి పిర్యాదు చేసినట్లు సమాచారం. సంతంకం ఫోర్జరీ జరిగితే చర్యలు మండలంలో కళాకారులుగా గుర్తించాలని అందిన దరఖాస్తులపై పూర్తి విచారణ చేసి ఈనెల 9న తొమ్మిది మంది కళాకారులకు గుర్తింపు కార్డుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఈ–ఆఫీస్ ద్వారా జారీ చేశాము. అయితే మరి కొంత మంది నా డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసి కొత్తగా కార్డులు పొందినట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు సంబంధిత శాఖ సహాయక సంచాలకులకు విచారణ చేయాలని రాతపూర్వకంగా తెలియజేశా. అలాగే మీ–సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా పెట్టాలని గణపవరం సీఐ, నిడమర్రు ఎస్సైలను కోరాను. సంతకం «ఫోర్జరీ జరినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎం.సుందర్రాజు, తహసీల్దారు, నిడమర్రు పేద కళాకారులకు అన్యాయం అనర్హులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం వల్ల నిజమైన వృత్తి కళాకారులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కళాకారులకు ప్రభుత్వం నుంచి లబ్ధి అరకొరగానే అందుతోంది. ఈ నకిలీలను అరికట్టకపోతే భవిష్యత్లో కళాకారులపై ప్రజల్లో చులకన భావం పెరుగుతుంది.– బొడ్డేపల్లి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు, రంగస్థల వృత్తి కళాకారుల సంఘం -
‘మహానటి’కి మరో గౌరవం..!
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్మ్యాన్, హిచ్కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది. -
అరుదైన ఘనత
వంద రోజుల క్లబ్లో చేరి ‘రంగస్థలం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఘనతను సాధించింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2018’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) స్క్రీనింగ్కి ఎంపిౖకై, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేడుకలు ఆగస్టు 10 నుంచి 22వరకు జరగనున్నాయి. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించారు. ‘రంగస్థలం’ స్క్రీనింగ్ సమయానికి రామ్చరణ్ మెల్బోర్న్ వెళ్లనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ సినిమా కూడా ఐఎఫ్ఎఫ్ఎమ్ స్క్రీనింగ్కు సెలక్ట్ అయిందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్బాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ఈ ఏడాది వేసవిలో రిలీజైన ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు అరుదైన ఘనతను సాధించాయి. -
‘రంగస్థలం’ 100 రోజుల వేడుక
-
‘రంగస్థలం’ జరగడానికి మూలకారకుడివి నువ్వే
‘‘ఈ సినిమా సక్సెస్ ఒక వ్యక్తి ఆలోచన. సుకుమార్ ఆలోచన నుంచే మొదలైంది. మంచి కథను తయారు చేసి మాతో యాక్ట్ చేయించింది. ఇది సుకుమార్గారి డ్రీమ్. ఆయన ఆలోచన స్థాయి వంద రోజుల వరకు తీసుకువచ్చింది. సుకుమార్గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్యూ సుకుమార్గారు’’ అని రామ్చరణ్ అన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 100 రోజుల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్స్కు, వంద రోజులు కంప్లీట్ చేసుకున్న థియేటర్స్ ఓనర్స్ అందరికీ 100 డేస్ షీల్డ్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ – ‘‘సినిమా 100 రోజులు ఆడిందంటే దాని వెనక ఎంతో మంది కృషి, శ్రమ, ప్రయత్నం ఉన్నాయి. నేను వర్క్ చేసిన నిర్మాతల్లో మైత్రీ వాళ్లు మోస్ట్ లవబుల్. రత్నవేలు గారితో నా అనుబంధం ‘ఖైదీ నంబర్ 150’ నుంచి స్టార్ట్ అయింది. ‘సైరా’ కూడా ఆయనే చేస్తున్నారు. దేవి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. రాక్స్టార్. నీ (దేవిని ఉద్దేశించి) పాటలతో మా కొరియోగ్రాఫర్స్ని నేను కష్టపెడుతూనే ఉంటాను. నేను చేయను అని చిన్నపిల్లాడిలా వెళ్ళిపోతాను. రంగమ్మ అత్తలా చేసిన అనసూయకు కూడా థ్యాంక్స్. ఆది, సమంత, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ అందరికీ థ్యాంక్స్. మనం నేర్చుకునే పెద్ద విషయం అయినా చిన్న విషయం అయినా గురువుల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. వాళ్లని గుర్తు చేసుకోకుండా ఉండలేం. నాన్నగారిని గుర్తు చేసుకోవాలని అనుకోలేదు కానీ నాన్నగారిని అబ్జర్వ్ చేస్తుండగా ఒక మనిషికి ఎందుకు ఇంత ఆదరణ, ప్రేమ లభిస్తాయి అని గమనించాను. కేవలం మంచి సినిమాల వల్ల, గొప్ప పాత్రల వల్లే కాదు. ఆయన ఒకటే చెప్పారు. ‘మనం ఎదిగేటప్పుడు మనతో పాటు ఓ పది మందిని పైకి తీసుకురావాలని. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ పది మందే మనల్ని కాపాడతారు’. మా ఇండస్ట్రీని, మమల్ని కాపాడేవాళ్లు మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. వాళ్లు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం. మా సినిమానే కాదు రేపు వచ్చే అన్ని సినిమాలు ఇలానే మంచి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సుక్కూకి థ్యాంక్స్’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘రంగస్థలం’ చిట్టిబాబు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ ఉండదు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను అని కాదు కానీ.. ‘నువ్వు (రామ్ చరణ్ని ఉద్దేశించి) ఓకే అనకపోతే ఈ కథ ఉండేది కాదు. నేను ఇంకో కథతో రెడీగా ఉన్నా. ఆ కథ చేసేవాడిని. సో ‘రంగస్థలం’ జరగడానికి మూలకారకుడివి నువ్వే. థ్యాంక్స్ డార్లింగ్’. నవీన్గారు, రవిగారు, మోహన్గారు చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా సక్సెస్ గురించి నాకు చెబుతూనే ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెర్రీగారు చాలా కష్టపడ్డారు. యుగంధర్, సతీష్గారికి థ్యాంక్స్. రత్నవేలు మంచి విజువల్స్ తీశారు. మై సోల్ దేవికి థ్యాంక్స్. రామ్చరణ్గారితో మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంది. లేకపోతే మళ్లీ నీకు, నాకు చాలా దూరం వస్తుందేమో.(ఎప్పుడెప్పుడూ ఏంటీ... తొందరగా చెప్పు.. మైక్ అందుకున్న చరణ్ సరదాగా నవ్వులు)’’ అన్నారు. నవీన్ యర్నేని మాట్లాడుతూ– ‘‘వంద అనేది ఈ రోజుల్లో ఉందా? అలాంటి వంద రోజుల చిత్రాన్ని మాకు ఇచ్చిన చరణ్గారికి, సుకుమార్గారికి, మా సినిమాకు పని చేసిన సభ్యులందరికీ థ్యాంక్స్. మా లైఫ్లో గుర్తుండిపోయే మూమెంట్ ఇది. ‘రంగస్థలం’ ఈజ్ మిరాకిల్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్, అనసూయ, బ్రహ్మాజీ, కొరియోగ్రాఫర్స్ జానీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వంద రోజుల ‘రంగస్థలం’
ప్రస్తుతం వంద రోజుల మూవీ అనే ఫీట్ను ఇప్పటి సినిమాలు సాధించడం కష్టం అవుతోంది. కానీ సరైన కథనం, తమ నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే నటీనటులు, చక్కని సంగీతం, మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కిస్తే.. ఇప్పటి సినిమాలు సైతం మంచి కలెక్షన్లతో వంద రోజులు ఆడతాయని నిరూపించిన మరో మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ టేకింగ్.. ఈ సినిమాకు హైలెట్. ఈ లెక్కల మాష్టారు బ్రెయిన్కి టాలీవుడ్ లెక్కలన్నీ మారాయి. ఏ సినిమాలోనైనా హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగా చేసింది, విలన్ బాగా చేశాడనో మాట్లాడుకుంటాం. కానీ, రంగస్థలం గురించి మాత్రం అలా చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరు వారి పాత్రల్లో జీవించేలా చేశారు సుకుమార్. చిట్టిబాబు పాత్రలో చెర్రీ, కుమార్బాబు పాత్రలో ఆది, రామలక్ష్మి పాత్రలో సమంత, రంగమ్మత్తగా అనసూయ, తండ్రి పాత్రలో నరేష్, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, అజయ్ ఘోష్, జబర్దస్త్ కమెడియన్ మహేష్, శత్రు ఇలా ఏ ఒక్కరి పాత్రను తక్కువ చేయలేం. అందరూ తమ నటనతో అంతలా మెప్పించారు. 1980 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెట్టిన రత్నవేలు పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. నాటి పల్లెలు ఎలా ఉండేవో పరిశోధించి అచ్చం గ్రామాల్ని గుర్తుచేసేలా వేసిన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణను కూడా అభినందించాల్సిందే. దాదాపు మూడు దశాబ్దాల కిందటి తరహాలో ఉన్న పాటలను ఉర్రూతలూగించేలా అందించి సినిమాకు పూర్తి న్యాయం చేశారు దేవీశ్రీ ప్రసాద్. బాణీలే కాకుండా సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేలా రాసిన పాటల రచయిత చంద్రబోస్.. మరోసారి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటలను అందించారు. నేటి డిజిటల్ యుగంలో పైరసీలు, అమెజాన్ ప్రైమ్లో క్వాలిటీ సినిమాలు వస్తున్నా... ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోన్న సినిమాల్లో రంగస్థలం ఒకటి. నేటికి రంగస్థలం సినిమా కొన్ని థియేటర్లలో వంద రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆర్టీసి క్రాస్ రోడ్లోని ఓ థియేటర్లో ఈ సినిమా దాదాపు కోటి 70లక్షలు వసూళ్లు చేసినట్టు సమాచారం. మరికొన్ని థియేటర్లలో కోటి రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డు నెలకొల్పింది. 100DAYS OF IH RANGASTHALAM ⚡ pic.twitter.com/K5FSZX3qwu — Mythri Movie Makers (@MythriOfficial) July 6, 2018 -
షాకింగ్ : పైరసీలో భాగమతి, రంగస్థలం టాప్
సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బయటికొచ్చేస్తుంది. కొన్ని సినిమాలైతే విడుదలకు ముందే పైరసీ భారినపడుతున్నాయి. దీనిపై పరిశ్రమ వర్గాలు ఎన్నిరకాలు చర్యలు చేపట్టిన పైరసీకి అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని కొన్ని ముఠాలు చిత్ర పరిశ్రమను హడలెత్తిస్తున్నాయి. జర్మన్ కేంద్రంగా పనిచేస్తున్న టెక్సిపియో సంస్థ గత ఆరేళ్ల నుంచి పైరసీ వెబ్సైట్లపై అధ్యయనం చేస్తోంది. ఆ డేటా ఆధారంగా 2018లో ప్రథమార్ధంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధికంగా పైరసీకి గరయిన టాప్-10 సినిమాల జాబితాను ఓ ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. పైరసీ జాబితాలో అనుష్క నటించిన భాగమతి 19లక్షల డౌన్లోడ్లతో అగ్రభాగాన నిలువగా, రామ్ చరణ్ , సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం 16 లక్షలతో రెండో స్థానంలోనిలిచింది.టెక్సిపియో ప్రతినిధి మాట్లాడుతూ.. తెలుగు సినిమాలకు సంబంధించిన పైరసీ షేరింగ్ భారత్లోనే కాకుండా యూఎస్, శ్రీలంక, సౌదీ అరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా ఉన్నట్టు తమ పరిశీలనలో బయటపడిందన్నారు. అదే విధంగా భారత్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ముంబై నగరాల్లో పైరసీ ఎక్కువగా చూస్తున్నారని తెలిపారు. పైరసీ టాప్-10లో నిలిచిన ఇతర సినిమాలు 3. భరత్ అనే నేను 4. మహానటి 5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 6. తొలిప్రేమ 7. ఛలో 8. అజ్ఞాతవాసి 9. జై సింహా 10. టచ్ చేసి చూడు -
ఫస్టాఫ్ హిట్టే
మొదటి ఆరు నెలలు బాగా ఆడాయి.సినిమాల్లాగే బ్యాంక్ బ్యాలెన్సులు బాగానే నిండాయి.సినిమాలు ఇలాగే ఆడుతూ పాడుతూ భాగమతులను చేస్తూ, రంగస్థలంలో కదం తొక్కుతూ, భరత్ అనే నేనులా ప్రతిజ్ఞ చేస్తూ, తొలి ప్రేమలో మళ్లీ మళ్లీ పడుతూ, మహానటీనటులను ఆవిష్కరిస్తూ మనందర్నీ సమ్మోహనం చేస్తుండాలి. 6 నెలలు...సుమారు 60కి పైగా సినిమాలు..విజయాలెన్ని? వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని.కొన్ని సినిమాలు కనకవర్షం కురిపించాయి. కొన్ని వచ్చినంత వేగంగా వెళ్లిపోయాయి. అయితే ఈ ఏడాది హిట్గా నిలిచిన సినిమాలను లెక్కలోకి తీసుకుంటే.. 6 నెలల్లో ముఖ్యంగా 6 జానర్లు హిట్. ‘థ్రిల్, లవ్, రివెంజ్ డ్రామా, పొలిటికల్ డ్రామా, కామెడీ, బయోపిక్’ జానర్స్లో వచ్చిన మూవీస్లో పెద్ద హిట్టయిన సినిమాలున్నాయి. సిక్స్ మంథ్స్, సిక్స్ జానర్స్.. ఆ విశేషాలు తెలుసుకుందాం. లెక్క తేల్చింది ‘ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి’. గడచిన ఆరు నెలల్లో ఫేమస్ అయిన డైలాగ్స్లో ఇదొకటి. నిజంగానే బాక్సాఫీస్ వద్ద ‘భాగమతి’ లెక్కలు భేష్. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మంచి వసూళ్లు రాబడతాయనడానికి అప్పటి అనుష్క ‘అరుంధతి’, ఇప్పుడు అదే అనుష్క సినిమా ‘భాగమతి’ మరోసారి నిరూపించాయి. ఈ ఏడాది తొలి నెలలో రిలీజైన తొలి థ్రిల్లర్ ఇది. థ్రిల్లర్ మూవీస్కి ట్రెండ్తో పని లేదు. స్టోరీ–స్క్రీన్ప్లే–లీడ్ క్యారెక్టర్ కుదిరి, డైరెక్టర్ బాగా తీయగలిగితే బొమ్మ హిట్. అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ లెక్కలు తేల్చింది. థ్రిల్లర్ జానర్లో చిన్న బడ్జెట్తో రూపొందిన మరో మూవీ ‘అ!’ ఫిబ్రవరి 16న రిలీజై, మంచి ప్రయోగం అనిపించుకుంది. డిఫరెంట్ స్క్రీన్ప్లేతో సాగిన ఈ థ్రిల్లర్ ద్వారా హీరో నాని నిర్మాతగా మారారు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి మార్కులు పడ్డాయి. అన్నట్లు జనవరిలో సంక్రాంతికి రిలీజైన పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అంచనాలను అందుకోలేదు. బాలకృష్ణ ‘జై సింహా’ వసూళ్లు రాబట్టిన సినిమా అనిపించుకుంది. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ బాక్సాఫీస్ చక్రాన్ని తిప్పలేకపోయింది. నెల మొదట్లో విడుదలైన అల్లాణి శ్రీధర్ ‘చిలుకూరి బాలాజీ’ మంచి డివోషనల్ మూవీ అనిపించుకుంది. ఇంకా ఈ నెలలో చోటా మోటా సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. థ్రిల్లర్ వెంటనే కామెడీ ఓ థ్రిల్లర్ మూవీ చూసిన వారానికి ఓ కామెడీ సినిమా చూసే అవకాశం వస్తే పండగే పండగ. ఒకవైపు ‘భాగమతి’ (జనవరి 26) థ్రిల్కి గురి చేస్తూ దూసుకెళుతోంది. అది విడుదలైన వారానికి ‘ఛలో’ (ఫిబ్రవరి 2) వచ్చింది. కామెడీ బ్యాక్డ్రాప్లో నడిచే లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సినిమా అంటే ఇదే. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల తీసిన ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఒక్కసారిగా నాగశౌర్య కెరీర్ గ్రాఫ్ని పెంచింది. ఐరా క్రియేషన్స్లో నాగశౌర్య తల్లిదండ్రులు శంకర్ప్రసాద్ మూల్పూరి, ఉషా మూల్పూరి తొలి ప్రయత్నంలోనే తమ బేనర్కి గుర్తింపు తెచ్చే సినిమా నిర్మించారు. ‘ఛలో’లా ఈ 6 నెలల్లో ‘కిర్రాక్ పార్టీ’ (ఫిబ్రవరి 16), ‘ఛల్ మోహన్ రంగ’ (ఏప్రిల్ 5) వంటి లవ్ బేస్డ్ కామెడీ మూవీస్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సో.. కామెడీ జానర్లో ప్రస్తుతానికి ‘ఛలో’నే బాగా కితకితలు పెట్టిందనొచ్చు. తొలి ప్రేమదే తొలి స్థానం కామెడీ బాగుంది ఛలో అంటూ నవ్వుకోవడానికి థియేటర్స్కి వెళ్లిన ప్రేక్షకులను ఆ తర్వాతి వారం లవ్ జర్నీ చేయించింది. ఫస్ట్ లవ్ ఓ మధురాను భూతి. ‘తొలి ప్రేమ’ (ఫిబ్రవరి 10) సినిమా కూడా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. ‘ఫిధా’ వంటి లవ్స్టోరీతో హిట్ ట్రాక్లో ఉన్న వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుణ్, రాశీ ఖన్నా కెమిస్ట్రీ, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి టేకింగ్.. మొత్తంగా ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ఫస్టాఫ్లో తెరకొచ్చిన లవ్స్టోరీస్లో ‘తొలి ప్రేమ’దే తొలి స్థానం. ఆ తర్వాత ప్రేక్షకులను సమ్మోహనపరిచిన మరో లవ్స్టోరీ ‘సమ్మోహనం’. ఫస్టాఫ్ ఎండింగ్లో ఈ చిత్రం మంచి ఫీల్ని కలగజేసింది. జూన్ 15న విడుదలైన ఈ లవ్స్టోరీ యాక్టింగ్వైజ్గా సుధీర్బాబు, అదితీ రావులకు మంచి పేరు తెచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ల కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత మరో హిట్ నమోదైంది. ఈ ఏడాది లవ్ జానర్లో వచ్చిన మరో మూవీ ‘మెహబూబా’. వార్ బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ స్క్రీన్ప్లేతో తనయుడు ఆకాశ్ హీరోగా పూరి జగన్నాథ్ తీశారు. మే 11న విడుదలైన ఈ లవ్స్టోరీ భారీ అంచనాల నడుమ విడుదలై, పూరి నుంచి వచ్చిన ఓ ప్రయోగం అనిపించుకుంది. ఇక ఫిబ్రవరిలో విడుదలైన వేరే సినిమాలు రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ వంటి వాటి నుంచి ప్రేక్షకులు ఇంకా ఏదో ఆశించారు. విన్నారా.. 200 కోట్లకు పైనే! మార్చి, ఏప్రిల్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరీక్షే. పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలు థియేటర్లకు రారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడంతో బిజీ అవుతారు. సినిమా ఎంతో బాగుంటే తప్ప రారు. ‘రంగస్థలం’ అలాంటి మూవీ. ఇప్పుడు వెళుతోన్న ట్రెండ్కి ఫుల్ డిఫరెంట్. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే రివెంజ్ డ్రామా. గళ్ల లుంగీ, పూల చొక్కా, గడ్డం, కేర్లెస్ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెవిటివాడిగా రామ్చరణ్ కనిపించడం మరో ఎత్తు. అర్బన్ మూవీస్ చేస్తున్న రామ్చరణ్తో రూరల్ బ్యాక్డ్రాప్ ఓ సాహసం. వినిపించని క్యారెక్టర్లో అంటే ఇంకా సాహసం. దర్శకుడు సుకుమార్ ఈ సాహసంలో సక్సెస్ అయ్యారు. నటుడిగా రామ్చరణ్ మంచి అంటే సరిపోదు.. అంతకు మించి అనాలి. అంత బాగా చేశారు. మార్చి 30న రిలీజైన ‘రంగస్థలం’ ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 200 కోట్లకు పైగా వసూలు చేసి, ‘వింటున్నారా.. మా సినిమా కలెక్షన్స్’ అని వినపడనట్లు వ్యవహరించిన వాళ్లకూ గట్టిగా సౌండ్ చేసి మరీ చెప్పింది. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’.. ఇలా వరుస హిట్లతో ఉన్న మైత్రీ మైవీ మేకర్స్ నిర్మాతలు మోహన్ చెరుకూరి, నవీన్ యర్నేని, వై. రవిశంకర్ హ్యాట్రిక్ సాధించారు. మార్చిలో వచ్చిన ఇతర చిత్రాలు ‘దండుపాళ్యం 3’, కల్యాణ్ రామ్ ‘ఎంఎల్ఎ’ ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాయి. ఇదే నెలలో వచ్చిన శ్రీవిష్ణు ‘నీదీ నాదీ ఒకే కథ’ బాగుందనిపించుకుంది. ఈ చిత్రంతో దర్శకుడు వేణు ఊడుగుల సీరియస్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. సక్సెస్కు హామీ మార్చిలో ‘రంగస్థలం’ రూపంలో ఓ బంపర్ హిట్ తగిలితే ఏప్రిల్ మరో బంపర్ హిట్ ఇచ్చింది. ‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నాను.. అని సినిమాలో మహేశ్బాబు అంటారు. ట్రైలర్లో ఈ డైలాగ్ విని, సూపర్ డూపర్ హిట్ ఇస్తామని చిత్రనిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు కొరటాల శివ హామీ ఇచ్చినట్లుగా ఫ్యాన్స్ అనుకున్నారు. అదే జరిగింది. ఈ స్టైలిష్ పొలిటికల్ డ్రామాలో మేడమ్ స్పీకర్ అంటూ స్టైలిష్ ఇంగ్లిష్తో, సీఎంగా గంభీరమైన బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నారు మహేశ్బాబు. ఈ పొలిటికల్ జానర్ని కొరటాల శివ ఎంతో ఇంటెలిజెంట్గా తీసినట్లుగా అనిపిస్తుంది. వసూళ్లు 200 కోట్లు దాటాయి. ఈ సినిమా తర్వాత ఏప్రిల్లో మిగతా సినిమాలు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ వంటివి వచ్చాయి. మంచు విష్ణు–జి. నాగేశ్వరరెడ్డిలది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే ఇంకా ఇంకా ఏదో కావాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న నాని విషయంలోనూ ఇదే జరిగింది. మహాద్భుతం మే ఆశాజనకంగా మొదలైంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ (మే 4) అంటూ దేశభక్తి సినిమాతో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్పైకి వచ్చారు. ఇప్పటివరకూ బన్నీ చేయని బ్యాక్డ్రాప్. రియల్ సోల్జర్ ఎలా ఉంటారో అలా ఫిజిక్ని మార్చుకున్నారు. లుక్ పర్ఫెక్ట్. యాక్టింగ్ సూపర్. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత. నాగబాబు సమర్పకులు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో ‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండుగా నిదర పోదురా..’ అనే పాట మనసుకి హత్తుకుంటుంది. సినిమాలో ఆ డెప్త్ లోపించిందన్నది కొందరి వాదన. ఏదైతేనేం దేశభక్తి బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. ఇదే నెలలో (మే 9) వచ్చిన ‘మహానటి’ ఓ అద్భుతం. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం సినిమాలు చూడటం మానేసిన ప్రేక్షకులను కూడా థియేటర్కి రప్పించింది. సావిత్రి మీద ఉన్న అభిమానం అలాంటిది. అఫ్కోర్స్ సినిమా బాగా లేకపోతే కష్టమే. సావిత్రిగా కీర్తీ సురేష్ అభినయం భేష్. రిలీజయ్యాక జెమినీ గణేశన్ పాత్ర, కొన్ని విషయాలపరంగా విమర్శలు వచ్చినా అవేవీ సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. బయోపిక్ జానర్లో ఈ ఏడాది వచ్చిన ఈ తొలి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్లు తండ్రి అశ్వనీదత్లా మంచి నిర్మాతలు అనిపించుకున్నారు. మేలో వచ్చిన రవితేజ ‘నేల టిక్కెట్టు’ అనుకున్నంతగా టిక్కెట్లు తెంచలేకపోయింది. నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ అతని ‘ఛలో’ స్పీడ్ని అందుకోలేకపోయింది. సమ్మోహనపరిచింది జూన్ 1 నిరాశగా మొదలైంది. ‘శివ’తో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న నాగార్జున–రామ్గోపాల్వర్మల నుంచి ‘ఆఫీసర్’ వస్తోందంటే ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇద్దరి ఫ్యాన్స్. నెల మొదటి రోజున రిలీజైన నాగార్జున ‘ఆఫీసర్’, ఆ తర్వాత కల్యాణ్ రామ్ ‘నా నువ్వే’, రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ వంటి పెద్దా చిన్నా సినిమాలు రిలీజయ్యాయి. వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోయాయి. ‘సమ్మోహనం’ ఓ రిలీఫ్. కామెడీ జానర్ ‘జంబలకిడి పంబ’ నాటి ‘జంబ లకిడి పంబ’ అంతగా నవ్వించలేకపోయింది. కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ గత శుక్రవారం రిలీజైంది. అదే రోజున ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఆల్మోస్ట్ కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ‘పెళ్ళి చూపులు’తో మంచి దర్శకుడని నిరూపించుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రంతో ఆ ఇమేజ్ని ఇంకా పెంచుకోగలిగారు. ఫస్టాఫ్ క్లోజింగ్ ఈ హిట్తో ముగిసిందనాలి. ఇక వచ్చే ఆరు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం. గతించిన కాలం కంటే రాబోవు కాలము మేలు అనే సామెతను గుర్తు చేసుకుందాం. – డి.జి. భవాని -
నంబర్ఒన్ స్థానానికి..
తమిళసినిమా: ఏ రంగంలోనైనా ఎవరైనా కోరుకునేది నంబర్ఒన్ స్థానాన్నే. ఇందులో మార్చు ఉండదు. సినిమా రంగం దీనికి అతీతం కాదు. అయితే ఈ రంగంలోని వారి గోల్ అదే అయినా పైకి మాత్రం నంబర్ఒన్ ఆశ లేదని, అది నిరంతరం కాదని, ప్రతి శుక్రవారం ఆ స్థానం మారుతుంతుందని అంటుంటారు. ముఖ్యంగా ఈ మాటలను కథానాయికల నుంచి వింటుంటాం. అయితే దేనికైనా విజయాలే కొలమానం కాబట్టి, దాన్ని బట్టే ఇక్కడ స్థానాలు నిర్ణయించబడతాయన్నది నిజం. కాగా ప్రస్తుతం కోలీవుడ్లో నంబర్వన్ కథానాయకి స్థానంలో నయనతార, టాలీవుడ్లో అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరు నటించిన చిత్రాలు సక్సెస్ అవుతున్నా, నటిస్తున్న చిత్రాల విడుదల్లో జాప్యం జరుగుతోంది. చేతిలో పలుచిత్రాలు ఉన్నా, అరమ్ చిత్రం తరువాత నయనతార నటించిన మరో చిత్రం తెరపైకి రాలేదు. అదే విధంగా నటి అనుష్క భాగమతి చిత్రం మరో చిత్రాన్ని అంగీకరించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందు చెప్పినట్లు విజయాలే కొలమానం కాబట్టి 2018లో నంబర్వన్ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం మహానటి, తమిళ చిత్రం ఇరుంబుతిరై చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. ఇలా ఒకే ఏడాది వరుసగా విజయాలను అందుకున్న నటి సమంతనే అని చెప్పాలి. అంతే కాదు ఇరుంబుతిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదంమై వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంలోనూ సమంత భాగం పంచుకున్నారు. తాజాగా సమంత తమిళంలో మరో 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో విజయ్సేతుపతితో సూపర్ డీలక్స్, శివకార్తికేయన్కు జంటగా సీమరాజా, ద్విభాషా చిత్రం యూ టర్న్. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఇవి కూడా ఈ ఏడాదే తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటి రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తే కచ్చితంగా నంబర్వన్ స్థానం సమంతదే అవుతుంది. ఇరుంబుతిరై చిత్ర సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సూపర్ డీలక్స్ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. -
ఆ బుడ్డోడిని కిడ్నాప్ చేస్తా : సమంత
రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్ కూతురు కూడా మెగా హీరో రామ్చరణ్ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. గతంలో ఓ తాత, రంగమ్మ మంగమ్మ పాటను పాడాడు. అది సమంతకు నచ్చడంతో.. ఆమె ‘మేడ్ మై డే’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఓ బుడతడు రంగమ్మ పాటకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను సమంత అభిమాని ఒకరు ఆమెకు ట్యాగ్ చేయగా.. సమంత సరదాగా స్పందించారు. ‘ఆ చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. Okay I am kidnapping this cutie ❤️❤️❤️ https://t.co/Z3GH0jsA3A — Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018 -
బుడతడి డ్యాన్స్కు సమంత ఫిదా..
-
‘రంగస్థలం’ క్లైమాక్స్ వివాదం..సుకుమార్ క్లారిటీ
రంగస్థలం సినిమాను ఇటు మెగా అభిమానులే కాదు...అటు తెలుగు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. సుకుమార్ సృజనాత్మకతకు రంగస్థలం నిదర్శనం. కథను చెప్పిన విధానం, ప్రేక్షకులు మెచ్చేలా తీసిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చరణ్ అద్భుత నటన, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్ ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. రంగస్థలం కాన్సెప్ట్ తనదేనంటూ,తన కథను కాపీ కొట్టారంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సుకుమార్ను వివరణ ఇవ్వాల్సిందిగా రచయితలగా సంఘం కోరగా... తాను గానీ , తన బృందంలోని సభ్యులు గానీ గాంధీ అనే వ్యక్తిని అసలు కలుసుకోలేదనీ చెప్పాడు. ఉరిశిక్ష పడ్డ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉరి తీస్తారనీ, ఆ లైన్తోనే తాను క్లైమాక్స్ను రాసుకున్నానని తెలిపారు. తాను చిన్నప్పుడు ధర్మ యుద్దం సినిమా చూసినప్పటి నుంచీ తనలో ఆ పాయింట్ గుర్తుండిపోయిందనీ, అంతేకాకుండా సిడ్నీ షెల్డన్ రాసిన ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్, బాలీవుడ్ మూవీ అంజామ్లో కూడా ఇదే లైన్ ఉంటుందనీ వివరించారు. అయితే తాను ఎంచుకున్న ఈ లైన్కు తనదైన పద్దతిలో కథ, కథనాన్ని రచించానంటూ వివరణ ఇచ్చాడు. ఓ సినిమా వివాదాలు లేకుండా ఈ మధ్య కాలంలో గట్టెక్కితే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఓ పదం ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందనడంతో ఆ పదాన్నితొలిగించేశారు. భరత్ అనే నేను సినిమా కథను కొరటాల శివ ఓ రచయిత దగ్గరి నుంచి కొన్నాడని, అది వేరే ఓ హీరో కోసం రెడీ చేసిన కథ అంటూ వివాదాలు వచ్చాయి. తర్వాత కొరటాల వీటిపై క్లారిటీ ఇచ్చేశాడు. మహానటిపై ఎలాంటి వివాదాలు లేవు అనుకునే సమయానికి.. జెమినీ గణేశన్ పాత్రను తక్కువ చేసి చూపారనీ, నెగిటివ్గా చూపారనీ విమర్శలు వచ్చాయి. -
సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్
-
సమంతను ఇంప్రెస్ చేసిన తాతయ్య
స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా.. అభిమానులకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. తన సినిమాల అప్డేట్స్ తో పాటు సరదా సంగతలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తుంటారు. తాజాగా సామ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ట్విటర్లో ఓ వ్యక్తి తన తాతయ్య రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట పాడిన వీడియోను సమంతను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ‘సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ మీ పాట పాడుకుంటున్నారు. తాతయ్య రాకింగ్. అద్భుతమైన పాట ఇచ్చినందకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై వెంటనే స్పందించిన సమంత ‘మేడ్ మై డే’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం యూటర్న్ షూటింగ్లో బిజీగా ఉన్న సామ్, త్వరలో నాగచైతన్యతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. 😂😂😂made my day https://t.co/QMhN4UHhWj — Samantha Akkineni (@Samanthaprabhu2) 26 May 2018 -
ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...
అరసవల్లి : ‘ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...’ అంటూ చరణ్ పలికిన డైలాగులు ఇంకా ఎవరి చెవినీ దాటిపోలేదు. ఇలాంటి డైలాగుల వెనుక ఉన్న జట్టులో రొంగలి శ్రీనివాస్ కూడా ఒకరు. యాభై రోజుల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. సహాయ స్క్రీన్ప్లేను కూడా అందించారు. ఆయన శుక్రవారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇలా ముచ్చటించారు. సాక్షి: రంగస్థలం రచయితగా అవకాశం ఎలా వచ్చింది..? రొంగళి: సినిమాల్లో రచయితగా అరంగ్రేటం చేసి సుమారు పదేళ్లు అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద చాలా కాలంగా పనిచేస్తూ ఉండడంతో రంగస్థలంకూ పనిచేశాను. ఈ సినిమాకు సహాయ స్క్రీన్ప్లే కూడా అందించాను. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు రచయితగా పనిచేశాను. దాదాపుగా అన్నీ సూపర్ హిట్లే కావడంతో అవకాశాలు వస్తూ ఉన్నాయి. సాక్షి: రంగస్థలంలో డైలాగ్స్కు మంచి స్పందన వచ్చింది. దాని గురించి.. రొంగళి: థాంక్యూ.. నిజంగా డైలాగులు నాకు కూడా పేరుతెచ్చాయి. ఈ డైలాగ్స్ను 80ల్లో వా డుక భాషకు తగ్గట్టుగా రాసి ప్రేక్షకులకు మెప్పించడంలో సఫలమయ్యాననే ఆనందంగా ఉంది. అత్త అనసూయతో హాస్యం, ప్రేయసి సమంతతో ప్రే మ, అన్న ఆది పినిశెట్టితో ఆప్యాయత, ప్రకాష్ రాజ్పై కసి ఇలా అన్ని రంగాల్లో డైలాగ్స్ అద్భుతంగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో వినిపించని వ్యక్తిగా చరణ్ నటనకు తగ్గట్టుగా డైలాగ్స్ రాశాను. సాక్షి: మీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిసింది. నిజమేనా? రొంగళి: అవును. విశాఖ జిల్లా చోడవరం నా సొంత ఊరు. కృష్ణా జిల్లాలో డైట్ చేసి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ఎంపికై చోడవరంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అయితే చిన్నప్పటి నుం చి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వది లిపెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టాను. ప్రేక్షకుల ఆదరణతో ఈరోజు ఈ స్థాయికి చేరాను. సాక్షి: ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి? రొంగళి: నాకు ఈ రంగంలో లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వ టీమ్లో నేను కూ డా కీలక సభ్యుడినే. నేను రచయితగా కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, వన్ తదితర చిత్రాల్లో పనిచేశాను. ఇప్పుడు రంగస్థలం వీటిలో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో సినిమాలో నాన్నపై సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మంచి పేరు తెచ్చాయి. సాక్షి: శ్రీకాకుళం జిల్లాకు రావడం వెనుకఏమైనా ప్రత్యేకత ఉందా? రొంగళి: ఉంది. రంగస్థలం సినిమా హిట్ అవ్వాలని, మా అక్క సుధ ఈ జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయానికి వచ్చి అక్కడ పవిత్ర గోలెంలో కోరిక చెప్పిందట. అందుకే ఇలా వచ్చి మొక్కు తీర్చుకున్నాను. అలాగే ఎప్పటి నుంచో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకోవాలనే కోరిక తీరింది. అరసవల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కోడూరు సురేష్కుమార్ సహాయంతో ఆదిత్యున్ని దర్శించుకున్నాను. అలాగే శుక్రవారంతో రంగస్థలం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే నా స్నేహితుడు సురేష్ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను. సాక్షి: భవిష్యత్ ప్రణాళికలేమైనా..! రొంగళి: రచయితగా సక్సెస్ అయిన వారంతా దర్శకులుగా మారినట్లే.. నేను కూడా వచ్చే ఏడాది దర్శకత్వం చేసేందుకు సిద్ధమయ్యాను. కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం మహేష్బాబుతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సహాయ దర్శకత్వం, రచయితగా పనిచేస్తున్నాను. ఇది పూర్తయితే పూర్తి స్థాయిలో మెగా ఫోన్ పడతాను. -
మహేశ్బాబు.. నేను మంచి స్నేహితులం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతోపాటు నటుడిగా కూడా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సుమారు ఇరవై రోజుల తర్వాత మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్లతో రామ్చరణ్, మహేష్ బాబులు ఇద్దరు ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ చరణ్, మహేశ్ అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కోల్డ్వార్ నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన రామ్ చరణ్.. తాను, మహేష్ బాబు మంచి స్నేహితులమని తెలిపాడు. తమ మధ్య ఎలాంటి పోటీలేదని, ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసుకోమని ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. మహేష్ సినిమాలు విడుదలైన సమయంలోనే.. ఆయనకు పోటీగా తన సినిమాలు విడుదల చేస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చెర్రీ మండిపడ్డాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఘనవిజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్న మెగా పవర్స్టార్.. వ్యక్తిగత విజయాల కన్నా తెలుగు చిత్ర పరిశ్రమ శ్రేయస్సే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా రామ్చరణ్ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. -
రంగస్థలం
ఆ ఊరి పేరు ‘రణస్థలం’. కానీ, కాదు. ‘‘ఇది పెన్ను అనుకుంటున్నావా? కాదు గన్ను’’ అని అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు... అది రణస్థలం అనుకుంటున్నారా? కానే కాదు రంగస్థలం. మరి ‘రంగస్థలం’ కాస్తా ‘రణస్థలం’ ఎలా అయిందంటే...తమ ఊరి పేరులోనే కళ ఉంది. ఆ కళను కళకళలాడించడానికి ‘రంగస్థలం’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించుకున్నారు ఊరి ప్రజలు. తమ ‘రంగస్థలం’ పృ«థ్వీరాజ్కపూర్ ‘పృ««థ్వీ «థియేటర్స్’లా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు.నటుల ఎంపిక పూర్తయింది.కొద్ది రోజుల తరువాత ‘రంగస్థలం’ వారి తొలి ప్రదర్శన మొదలైంది. ఇప్పుడు మనం ప్రేక్షకుల్లో కూర్చొని ‘రంగస్థలం’ కళాకారుల నట, గాన విన్యాసాలను ఆసక్తిగా చూద్దాం...అదిగో రావణ పాత్రధారి రంగస్థలం మీదికి వస్తున్నట్లుగా ఉంది. వచ్చేలోపు అతడి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అతని పేరు రాజేషం. ఈ రాజేషానికి మతిమరుపు ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి రాజేషానికి రావణుడి వేషం ఎలా దక్కింది? ‘రంగస్థలం’ స్పెషాలిటేమిటంటే నటుల ఎంపిక టాలెంట్ మీద ఆధారపడి ఉండదు. వేలంపాట మీద ఆధారపడి ఉంటుంది. అంటే... ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇష్టమైన వేషం దక్కుతుంది. మతిమరుపు ఉన్నా సరే... రాజేషానికి రావణుడి వేషం దక్కడానికి కారణం వేలంలో ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చి ఆ వేషాన్ని సొంతం చేసుకోవడమే. అలాగని తన పాత్రను లైట్గా తీసుకోలేదు రాజేషం.చాలా వెయిట్ పెరిగాడు. తన డైలాగులను రాత్రి పగలు అనే తేడా లేకుండా బట్టీ పట్టాడు.‘రంగస్థలం’ వేదిక దగ్గరకు బయలు దేరేముందు...తన భార్య ముందు నిల్చొని...‘‘ఇవ్వాళ మన పొగ్రాం ఉంది. అదరగొడతాను... నా డైలాగు విను’’ అన్నాడో లేదో ఆమెకు కోపం వచ్చింది.‘‘ కొత్తగా వినేదేమిటి నా బొంద? మీరు ఇల్లంతా అదిరిపోయేలా ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ ఇనలేక ఛస్తున్నాను. అవి నా నోటికి కూడా వచ్చాయి’’ అంటూ ఆమె నోరు పెంచి డైలాగ్ అందుకుంది...‘హా హా హాహా హా హాటెక్కుల మారి టక్కులాడితంటాలతో తైతక్కలతోమా తాతలను మైమరిపించిఅమృతకలశం హరించారుకదూకామధేనువును,కల్పతరువును ఆకట్టుకొనిమాకు సున్నా చుట్టారు కదూహా హా హా’‘శబ్బాష్’ అని భార్యని మెచ్చుకుంటూ అక్కడి నుంచి ‘రంగస్థలం’ వేదిక దగ్గరకు వెళ్లాడు రాజేషం.‘‘వుప్పుడు మేకతోకల రాజేషం ప్రదర్శించు రావణుడి ఏకపాత్రాభినయం’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించింది. రావణ పాత్రధారి రాజేషం స్టేజీ మీదకు వచ్చాడు. రావణుడి వేషంలో ఉన్న రాజేషాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేస్తున్నారు. దీంతో రాజేషానికి మరింత హుషారు వచ్చింది.మీసం తిప్పాడు.గద పైకెత్తి ఠీవిగా భుజాల మీద పెట్టుకున్నాడు.గొంతు సవరించాడు.గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయింది. డైలాగ్ గుర్తుకు రావడం లేదు. డైలాగు గుర్తు లేదుగానీ... డైలాగుకు ముందు వచ్చే పెద్ద నవ్వు మాత్రం గుర్తుంది.డైలాగ్ గుర్తు వచ్చేవరకు నవ్వుతో మానేజ్ చేద్దామనుకొని ‘హా హా హా’ అని పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అలా పదినిమిషాల పాటు నాన్స్టాప్గా నవ్వుతూనే ఉన్నాడు.‘‘నవ్వింది చాలుగాని.... డైలాగ్ కొట్టు బే’’ అని ప్రేక్షకుల నుంచి ఒక గొంతు వినిపించింది. ఈలోపే పాత చెప్పొక్కటి వచ్చి రాజేషం మూతిని తాకింది. తాకితే తాకిందిగానీ... అది రాజేషం పెట్టుడు మీసాన్ని తాకింది. దాంతో అది ఊడి కిందపడిపోయింది.ఈసారి నవ్వడం ప్రేక్షకుల వంతయింది! దీంతో రెండు వర్గాల మధ్య(రాజేషం మిత్రవర్గం, శత్రువర్గం) ఘర్షణ మొదలైంది.‘‘వుప్పుడు పీకల వెంకటేషం ఇంద్రధనస్సు సినిమాలోని పాటను తన మధురకంఠంతో వినిపించి మిమ్మల్ని మైమరపింపజేస్తాడు’’ అని ఎనౌన్స్మెంట్ వినిపించడంతో గొడవ సద్దుమణిగి అందరూ సైలెంటైపోయారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... రాజేషంలా వెంకటేషం మతిమరుపు మైండ్ కాదు. మాంచి గాయకుడు. కానీ అప్పుడప్పుడూ మందుకొడుతుంటాడు. అతను స్టేజీ ఎక్కే ముందు ఎవడో అభిమాని క్వార్టర్ సీసా చేతిలో పెట్టాడు. మనవాడికి ఆత్రం ఎక్కువ. అదేదో పాట పూర్తయినాక తాగవచ్చుకదా... స్టేజీ ఎక్కే ముందు చాటుకు వెళ్లి సగం లాగించాడు. ఆ తరువాత...మైక్ ముందుకు వెళ్లి గొంతెత్తాడు.‘నేనొక ప్రేమ పిశాచిని.నువ్వుక ఆస్థమవాసివి.నా దాహం తీరనిది’ అని పాడుతూ జేబులో మిగిలి ఉన్న క్వార్టర్ సీసాను స్టేజీ మీదనే ఖాళీ చేశాడు వెంకటేషం. జనంలో హాహాకారాలు. కారాలు మిరియాలు. లొల్లి లొల్లి.... ఎవరు ఎవర్ని తిడుతున్నారో తెలియడం లేదు. ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. ఒకడు ఇంకొకడి కాలరు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. ఒకడు ఇంకొకడి జుట్టు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. రంగస్థలం కాస్త రణస్థలం అయింది. పట్నం నుంచి పోలిసు వ్యాన్ దిగింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదారు పోలీసులు. ఇక అప్పటి నుంచి కళ అనే మాట వినబడితే కలరా సోకినట్లుగా గజగజా వణికిపోతారు రణస్థలం గ్రామస్తులు! – యాకుబ్ పాషా -
చరణ్ సినిమాకు భారీ ఆఫర్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న బోయపాటి రామ్ చరణ్ హీరోగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉత్తరాది నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్ను ఆన్లైన్లో 16 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో బోయపాటి సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. చరణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు కావటంతో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఓ ఉత్తరాది సంస్థ ఈ సినిమా అనువాద హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
మహేష్ సినిమా పనులు మొదలెట్టిన సుకుమార్
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతో సుకుమార్కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. రంగస్థలం తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సుకుమార్.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా పనులు ప్రారంభించాడు. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ఇతర సాంకేతిక నిపుణులను నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. -
కథల ఎంపికలో వారినే ఫాలో అవుతా: రామ్ చరణ్
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురుపించిన సంగతి తెలిసిందే. వినికిడి లోపం గల పల్లెటూరి యువకుడి పాత్రలో రామ్ చరణ్ ప్రేక్షకులను మెప్పించాడు. రంగస్థలంలో అలాంటి పాత్ర చేయడానికి సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ఆదర్శం అంటున్నారు రామ్ చరణ్. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘వాణిజ్య విలువలతో పాటు.. కథాబలం ఉన్న చిత్రాల్లో నటించాలనుకునే వారికి బాలీవుడ్ స్టార్స్ ఆమిర్, సల్మాన్లు ఆదర్శంగా నిలుస్తారు. నేను కథల ఎంపికలో వారినే ఫాలో అవుతాను. దంగల్, బజరంగీ భాయ్జాన్ చిత్రాలు ఎంతోమంది నటులకు, దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తిదాయకం. ఈ తరం నటులకు ఆమిర్, సల్మాన్ ఐకాన్గా నిలుస్తారు’ అని చెప్పారు. తన రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమా బిజినెస్ మీద అసలు దృష్టి సారించలేదు. 1980ల నాటి ఆ పాత్రకు ఎలా న్యాయం చేయగలనని మాత్రమే ఆలోచించాను. మేము చేస్తున్న ఓ పీరియాడిక్ డ్రామాని, ముఖ్యంగా అందులోని క్యారెక్టర్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారనే ఒత్తిడి అయితే ఉండేది. కానీ ఈ చిత్ర విజయం మాలో ఉత్తేజాన్ని నింపింది. ఒక నటుడిగా నేను ఎంతో సంతృప్తి చెందిన చిత్రమిది. ఈ చిత్రంలో నిర్మించిన విలేజ్ సెట్ అభిమానులను ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది’ అని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చరణ్ స్పందిస్తూ.. చాలా రోజుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ఒక చాలెజింగ్ రోల్ అని అనుకుంటున్నాను.. ఇంకా రాజమౌళి స్కిప్ట్ వర్క్లో ఉన్నారని ఆయన తెలిపారు. -
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమే !
సినీరంగంలో వంచకులు ఉన్నమాట నిజమేనని.. అయితే అలాంటి వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారని హీరోయిన్ సమంత పేర్కొన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత మాట్లాడుతూ.. ఈ సంస్కృతి ఒక సినిమా రంగంలోనే కాక అన్ని రంగాల్లోనూ ఉందని సమంత అన్నారు. దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నాను. ఇక్కడ మంచి వాళ్లు ఉన్నారు.. అయితే కొందరు నయవంచకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు.. ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు. సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్ తిలగం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది. ఈ సందర్భంగా సమంత శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త డైరెక్టర్ల చిత్రాల్లో పనిచేయడానికి కాస్త సంకోచిస్తానన్నారు. ‘కానీ దర్శకుడు మిత్రన్తో ఇరుంబుతిరై చిత్రం చేస్తున్నప్పుడు ఆ విధమైన భావన కలగలేదు. కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఇన్ని సమస్యలు ఇంటర్నెట్ మీడియా ద్వారా జరుగుతున్నాయా అని కంగు తిన్నాను. కథ విన్న తర్వాత సెల్ఫోన్ టచ్ చేయడానికే భయమేసింది. ఈ చిత్రంలోని సంఘటనలు నీ జీవితంలో జరగకపోయినా, నా స్నేహితురాళ్లకు ఎదురయ్యాయి. ఇరుంబుతిరై చిత్రానికి డబ్బంగ్ చేప్పడానికి నిరాకరించినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు. చిత్ర పరిశ్రమ సమ్మె ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.. ఆ సమయంలో నడిగైయార్ తిలగం చిత్ర షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పలేకపోయాను’ అని సమంత తెలిపారు. ఇటీవల విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం సమంతకు మంచి పేరు తెచ్చిన పెట్టిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సమంత తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. కానీ, ఆ చిత్రంలో ముద్దు సన్నివేశంలో నటించడం చర్చనీయాంశంగా మారిందని ఆమె అన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అండగా నిలిచారని ఈ బ్యూటీ పేర్కొన్నారు. నటులు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.. వారిలో మీరు ఎవరికి ఓటు వేస్తారు? అని అడుగుతున్నారు. అయితే తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని సమంత చెప్పారు. -
‘రంగమ్మ మంగమ్మ’ పేరడీ సాంగ్
-
‘ఇంతలోనే ఎంత ఎదిగే రామ్ చరణూ’
రంగస్థలం సినిమా రిలీజై ఐదు వారాలు గడుస్తున్నా సినిమా హవా మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియోలో పదుల సంఖ్యలో యూట్యూబ్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ పాటకు పేరడీగా రూపొందించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. రంగమ్మ మంగమ్మ పాటను రామ్ చరణ్ నటనకు తగ్గట్టుగా‘ఓరయ్యో ఓలమ్మో ఏం పిల్లడూ.. ఇన్ని నాళ్లు యాడదాగే ఇంత నటుడు’ అంటూ పేరడీ చేశారు. ఈ పాటను ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ చిన్న కూతురు పాట ఉత్తేజ్ స్వయంగా ఆలపించి, నటించారు. -
వైరల్ : కుమార్ బాబు డబ్బింగ్ వీడియో
విడుదలై నెల రోజులైనా.. రంగస్థలం మేనియా ఇంకా తగ్గడం లేదు. రంగస్థలం కథ కొత్తది కాకపోయినా... నటీనటులు తమ నటనతో, సుకుమార్ తన టేకింగ్తో సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టారు. ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్కు రప్పించేలా చేశారు ఈ లెక్కల మాష్టారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లకే కాక... ప్రతీ ఆర్టిస్ట్కు మంచి పేరు వచ్చింది. అనసూయ, జగపతి బాబు, ప్రకాశ్రాజ్, ఆది పినిశెట్టి... ఇలా ఎవరి పాత్రకు వారు ప్రాణం పోశారు. ఇదంతా ఓకే. కెమెరా ముందు నటించడం మనకు తెలిసిన విషయమే. కెమెరా ముందు ఎంత బాగా నటించినా... డబ్బింగ్ సరిగా లేకపోతే...అది తేలిపోతుంది. అందుకే సినిమాకు డబ్బింగ్ ప్రాణం. డబ్బింగ్ చెప్పేటప్పుడు... మళ్లీ ఆ పాత్రలోకి, సన్నివేశంలోకి పరకాయ ప్రవేశం చేసి అదే ఫీలింగ్ను క్యారీ చేస్తూ... సీన్ను రక్తికట్టించాల్సి ఉంటుంది. రంగస్థలంలో ఆది చనిపోయే సీన్లో తన నటన ఆమోఘం. ఆ సన్నివేశానికి ఆది డబ్బింగ్ చెబుతున్న వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తను డబ్బింగ్ చెబుతున్న తీరు అందర్ని విస్మయపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన రంగస్థలం ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. -
విస్మయపరుస్తున్న ఆది ’రంగస్థలం’ డబ్బింగ్ వీడియో
-
స్క్రీన్ ప్లే 1st May 2018
-
మరో మైల్స్టోన్ దాటిన ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన రంగస్థలం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్లో సరికొత్త రికార్డ్ను సృష్టించింది. ఇప్పటికే అమెరికాలో చాలా ప్రాంతాల్లో ప్రదర్శితమవుతున్న రంగస్థలం 3.5 మిలియన్ డాలర్ల (23 కోట్ల)కు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్లను చెరిపేస్తూ దూసుకుపోతున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 3.5 Million Dollars and Counting 😎#Rangasthalam https://t.co/UkSNRBb52G — Mythri Movie Makers (@MythriOfficial) 2 May 2018 -
అఫీషియల్: 200 కోట్ల క్లబ్లో రంగస్థలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరిపోయింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్-బాహుబలి) నిలిచింది. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ విలేజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటిదాకా ఇది హయ్యెస్ట్ గ్రాసర్ కావటం విశేషం. #200CrGrossRangasthalam pic.twitter.com/1KuT5yazto — Mythri Movie Makers (@MythriOfficial) 30 April 2018 -
చరణ్ సినిమాలో ‘ఈగ’ విలన్
రంగస్థలం సినిమాతో ఘనవిజయం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. రంగస్థలం రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చరణ్, ఇటీవలే బోయపాటి టీంతో జాయిన్ అయ్యారు. చరణ్ సరసన భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. తాజాగా మరో విలక్షణ నటుడు ఈ సినిమాలో నటించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సాండల్వుడ్ స్టార్ సుధీప్.. చరణ్, బోయపాటి సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. అయితే సుధీప్ విలన్గా నటిస్తున్నాడా లేక మరేదైన పాత్రలోనా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
సెక్యూరిటీ లేదని భయపడ్డా : సమంత
తమిళసినిమా: సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో ఇక్కడ రక్షణ లేదని భయపడ్డానన్నారు నటి సమంత. తొలుత కోలీవుడ్లో నటనకు శ్రీకారం చుట్టి ఆపై టాలీవుడ్లో జయకేతనం ఎగరేసిన నటి ఈ చెన్నై చిన్నది. అనంతరం తమిళం, తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడడంతో సమంత కెరీర్ కుంటుపడుతుందని కొందరు భావించారు. సమంత పెళ్లికి సిద్ధం అవుతుండడంతో అక్కినేని అంత పెద్ద కుటుంబంలో చేరబోతున్నారు. ఇక నటనకు గుడ్బై చెప్పడం ఖాయం అని అనుకున్నారు. సమంత మాత్రం తాను వివాహానంతరం నటిస్తానని వెల్లడించారు. దీంతో కొందరు కథానాయకిగా అవకాశాలు రావు అని అనుకున్నారు. అయితే ఇలాంటి ఊహాగానాలేవీ సమంత విషయంలో జరగలేదు. తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు. కథానాయకిగానే అవకాశాలు వరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సమంతకు పెళ్లి తరువాతే నటనకు అవకాశం ఉన్న పాత్రలు తలుపుతడుతున్నాయి. ఈ మధ్య విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలంలో సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు చేతినిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్లో నటిస్తున్నారు. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుంది. ఇటీవల నటి సమంత ఒక భేటీలో పేర్కొంటూ వివాహానంతరం తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. మొదట్లో ఈ రంగంలో రక్షణ లేదనే భావన కలిగిందన్నారు. అదృష్టవశాత్తు తాను నటించిన చిత్రాలన్నీ విజయాలు సాధించి తనలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు నూతన పయనానికి దోహదపడ్డాయన్నారు. తానిప్పుడు వృత్తిపరంగానూ, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నానని చెప్పారు. వివాహానంతరం తన భర్త కుటుంబం స్వేచ్ఛగా జీవించడానికి అనుమతించారని అన్నారు. వారి ఆదరణతో తాను సినిమాల్లో మరింత సాధించగలనని సమంత ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
రంగస్థలం ఎంత సక్కగున్నవే... వీడియో సాంగ్
-
ఎంత సక్కగున్నవే.. వీడియో సాంగ్
సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘రంగస్థలం’ సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మూవీలోని పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఆ పాటలన్నింటిలో ఎంత సక్కగున్నవే పాటకు అగ్రస్థానం ఇవ్వాల్సిందే. ఆ పాటకు అందించిన బాణీ, సాహిత్యం, చిత్రీకరించిన విధానం ఇలా ప్రతి ఒక్కటి కలిసి ఆ పాటను హిట్ చేశాయి. అయితే రంగస్థలం వీడియో సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా... అని ఎదురుచూసే అభిమానులకు తీపి కబురు. ఎంత సక్కగున్నవే... వీడియో సాంగ్ను గురువారం (ఏప్రిల్ 26) యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఆ విజువల్ వండర్ను, గోదావరి అందాలను మీరు ఓసారి వీక్షించండి. -
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
-
రంగస్థలంలో పల్లెటూరి మహిళగా...
-
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా నటులుగా రామ్చరణ్, సమంతలకు ఎంత పేరు తీసుకువచ్చిందో.. సహాయ పాత్రలో నటించిన అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లితెర మీద ట్రెండీగా కనిపించే అనసూయ రంగస్థలంలో పల్లెటూరి మహిళగా కనిపించటంతో అభిమానులు ఫిదా అయ్యారు. అయితే తనదైన నటనతో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది అనసూయ. అందుకే రంగస్థలం సినిమా చూసిన ప్రముఖులు రామ్ చరణ్, సమంతలతో పాటు అనసూయ పాత్రను కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. తాజాగా అనసూయను ఈ సినిమా కోసం ఆడిషన్ చేసిన సందర్భంలోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఇప్పటికే 180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. -
సుకుమార్తో సూపర్ స్టార్
భరత్ అనే నేను సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. Superstar Mahesh Babu + Mythri Movie Makers + Sukumar#Mahesh26 - 2019 Worldwide pic.twitter.com/RveUzTVpIM — Mythri Movie Makers (@MythriOfficial) 22 April 2018 -
రంగస్థలం రికార్డ్ బ్రేక్ చేసిన భరత్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా భరత్ అనే నేను. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. పూర్తి లెక్కలు రాకపోయినా ఫస్ట్డే కలెక్షన్స్ 60 కోట్ల వరకు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా ఓ అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. తొలిరోజు రూ. 78 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క చెన్నై సిటీలోనే రూ. 27 లక్షలకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఇటీవల విడుదలైన రంగస్థలం రూ. 25 లక్షల రికార్డ్ను భరత్ అనే నేను 20 రోజులు తిరగకుండానే చెరిపేయటం విశేషం. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, బ్రహ్మాజీ, రావు రమేష్లు ఇతర కీలక పాత్రలో నటించారు. #BharatAneNenu Chennai City 1st day gross - 27 Lakhs New day 1 record for a Telugu film — BARaju (@baraju_SuperHit) 21 April 2018 భరత్ అనే నేను మూవీ రివ్యూ -
పైన సన్ కింద స్టార్స్
ఎండాకాలం భగ్గుమంటోంది.సన్ ఆక్సిలేటర్ తొక్కాడు.ఫార్టీ దాటింది!ఏమో ఫిఫ్టీ దాకా పోవచ్చు!ఎటు చూసినా బర్నింగే.దాంట్లోనే ఉంటుందండీ ఎర్నింగూ!సమ్మర్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి.పైన సన్ కింద స్టార్. ఎంజాయ్ ద సీజన్. సూపర్ రీసౌండ్ చిట్టిబాబుకు ‘రంగస్థలం’ సినిమాలో సౌండ్ ప్రాబ్లమ్. కానీ మూవీ సక్సెస్ సౌండ్ మాత్రం గట్టిగా సాలిడ్గా వినిపించింది. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన సినిమా ‘రంగస్థలం’. సినిమా సమ్మర్ హీట్ ‘రంగస్థలం’ హిట్తోనే స్టారై్టందని చెప్పవచ్చు. చిత్రంలో చిట్టిబాబు పాత్రలో రామ్చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి, రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించారు. ఈ బొమ్మ థియేటర్లో ఇంకా ఆడుతోంది. మరి థియేటర్లో చిట్టిబాబును పలకరించిరండి. గుర్తుపెట్టుకోండి విజిల్స్, అరుపుల్స్తో గట్టిగా సౌండ్ చేయండి. ఎందుకంటే చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్ అని తెలుసు కదా. అదేనండి కాస్త వినికిడి లోపం అని మరోసారి గుర్తుండేలా చెబుతున్నాం. భరత్ విజన్ అదుర్స్ ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలంటున్నారు సీయం భరత్ రామ్. తప్పు చేస్తే కాస్త కఠినంగానే ఉంటాడు కానీ పరిస్థితుల నుంచి తప్పించుకోడు. చేసిన ప్రామిస్ను ఇచ్చిన హామీని మర్చిపోడు. అసెంబ్లీ స్టెప్సే కాదు. గరీబోడి గడప కూడా తొక్కుతాడు. మరి..సీయంగా చేసిన ప్రామిస్ను నిలబెట్టుకోవడంలో భరత్ రామ్ ఎలా గెలిచాడు అన్నది మహేశ్బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో చూడాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్బాబు నటించారు. కియారా అద్వాని కథానాయిక. మరి..భరత్ రామ్ పరిపాలన అండ్ విజన్ అదిరిపోయాయి అంటున్నారు ప్రేక్షకులు. ఓ సారి భరత్ రామ్ను చూసిరండి. థియేటర్స్లో మాస్ క్లాస్ కలిపి కుమ్మేశాడు. ఉన్నది ఒకటే ఇండియా మా కులం భారతీయం. మా మతం మానవత్వం. మా వ్యక్తిత్వం సమానత్వం అని ఫీలయ్యేవారు బోర్డర్లో ఉండే సైనికులు. వారిలో ఒకడే సూర్య. అందుకే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఇన్ని ఇండియాలు లేవు. ఉన్నది ఒకటే ఇండియా అంటున్నాడు సోల్జర్ సూర్య. కానీ సూర్యకి కొంచెం కోపం ఎక్కువ? ఈ కోపం వల్లే బోర్డర్లో కొన్ని పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. అవేంటో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలో చూడండి అంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాలో సోల్జర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. సూర్య కోపాన్ని మే 4న చూడండి. అదేనండి.. ఆ రోజే సినిమా రిలీజŒ అన్నమాట. అనగనగా ఓ మహానటి మధురవాణి...అంటే అర్థం తెలుసుగా మధురమైన మాటలు పలికే అమ్మాయి అని. పైగా బీఏ గోల్డ్ మెడలిస్ట్. ఆపై జర్నలిస్ట్. మరి..విజయ్ ఆంటోనీతో కలిసి మధురవాణి అనగనగా ఓ మహానటి అంటూ అలనాటి అందాల అభినేత్రి సావిత్రి కథను చెప్పడానికి రెడీ అయ్యారు. మరి..సావిత్రి గురించి ఏఏ కొత్త విషయాలు ఎలా చెప్పారనేది మే 9న రిలీజ్ కానున్న ‘మహానటి’ సినిమాలో చూడండి. సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రం ‘మహానటి’. సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేశ్ నటించారు. జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. మోహన్బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంకా దత్ నిర్మించారు. రాజుగాడి జబ్బు వేరయ్యా! క్లెప్టోమేనియాను తెచ్చుకున్నాడు రాజు...ఇదేదో డిగ్రీ అనుకునేరు.. కాదండి బాబు. దిస్ ఈజ్ డిసీజ్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా.. వాళ్లకు తెలియకుండానే వాళ్లు దొంగతనాలు చేస్తుంటారు. ఎంతలా అంటే సొంత వస్తువులే దొంగలించుకుని దాచుకునేంతలా. అర్థం అయ్యిందిగా.. జబ్బులందు రాజుగాడి జబ్బు వేరయ్యా అని. రాజ్తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. రాజు పాత్రలో నటిస్తున్నారు రాజ్తరుణ్. మరి..రాజుగాడి జబ్బు చిత్రాలు ఎంటో మే 11న తెలుసుకోండి. జన్మజన్మల బంధం సైనికుడిని ప్రేమించింది ఓ అమ్మాయి. ఈ సైనికుడి మనసులో దేశం మీద ఉన్న ప్రేమలో కాస్తో కూస్తో తనపై ఉన్నా చాలని తపన పడుతుంది. అంటే ఆ అమ్మాయి ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అబ్బాయి కూడా దేశం తర్వాత ఆ అమ్మాయికే మనసులో స్థానం ఇచ్చాడు. కానీ వారి ప్రేమ సక్సెస్ కావడానికి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు అడ్డుగోడలుగా నిలిచాయి. మరి..ఆ గోడలనుప్రేమికులు ఎలా పగలగొట్టారో తెలుసుకోవాలంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కూడా మే11న రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించాడు. నేçహాశెట్టి కథానాయికగా నటించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ని బట్టి ఈ సినిమా గత జన్మకు కనక్టయ్యేలా ఉంటుందని ఊహించవచ్చు. అంటే వీళ్లది జన్మజన్మల బంధమేమో?. స్పీడ్ పెంచాడు ఫస్ట్ గేర్.. నెక్ట్స్ సెకండ్ గేర్ వేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంటారు ఆర్టిస్టులు. కానీ ‘పెళ్లిచూపులు, అర్జున్రెడ్డి’ సినిమాలతో డైరెక్ట్గా థర్డ్గేర్ వేసి కెరీర్లో రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇదే స్పీడ్లో నోటా చిత్రంతో చెన్నై రోడ్డు కూడా ఎక్కాడు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ వేసవిలో స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త ఆగి థియేటర్స్లోకి రానున్నారు. విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్ కథానాయికలు. రాహుల్ సంకృత్యాన్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేమ్ ఎనర్జీ కొత్త ఊపొస్తుంది. ఉత్సాహం పొంగుకొస్తుంది హీరో రవితేజ ఎనర్జీని సిల్వర్ స్క్రీన్పై చూస్తే. ఆయన నటన అలా ఉంటుంది. ఈ వేసవి వినోదాన్ని ప్రేక్షకులకు పంచేందుకు ఆయన కూడా కర్చీఫ్ వేశారు. ఫస్ట్లుక్తో ఉగాదికి గుర్తు చేశారు. ఫస్ట్లుక్లో రవితేజ గెటప్ చూస్తుంటే ఆయనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గినట్లు లేదు. బాక్సాఫీసు వద్ద టికెట్లు తెచ్చి, థియేటర్లో చించి ఆడియన్స్ మూవీని ఏ లెవల్లో ఎంజాయ్ చేస్తారో చూడాలంటే మాత్రం రవితేజ తాజా చిత్రం ‘నెలటిక్కెటు’్ట బొమ్మ థియేటర్స్లో పడేంత వరకు ఆగాల్సిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. షూటింగ్ పూర్తి కావచ్చింది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. మే 24న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవర్ఫుల్ డ్యూటీ మొదలుపెడితే పూర్తి చేసేంతవరకు ఆగే రకం కాదు ఈ పోలీస్ ఆఫీసర్. ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాడు. మరి.. కేసు ఏంటి? ఆఫీసర్ డ్యూటీని ఎంత పవర్ఫుల్గా చేశాడు అన్నది తెలుసుకోవాలంటే ‘ఆఫీసర్’ సినిమా చూడాల్సిందే. ఆల్మోస్ట్ 25ఏళ్ల తర్వాత నాగార్జున హీరోగా సుధీర్చంద్రతో కలిసి రామ్గోపాల్వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘ఆఫీసర్’. మైరా సరీన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేశారు. నాగార్జున, రామ్గోపాల్వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘శివ’ ట్రెండ్సెట్టర్గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘ఆఫీసర్’ మే 25న థియేటర్స్లోకి వస్తాడు. మేరా.. మీరా చూశారుగా ‘నా నువ్వే’ సినిమాలో కల్యాణ్రామ్ సూపర్ లుక్. ఇంత సూపర్గా ఉన్నోడు ఎందుకు ఖాళీగా ఉంటాడు. అందుకే మీరా మేరా అంటున్నాడు. అర్థం కాలేదా మీరా అనే రేడియో జాకీని లవ్ చేస్తున్నాడు. మరి..మ్యాజిక్ లవ్లో నెక్ట్స్ ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్. థియేటర్లో చూడాల్సిందే. కల్యాణ్రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా నువ్వే’. ఈ సినిమాను మే 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు వేసవిలో వినోదాన్ని ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాయి. ఫైనల్గా ఆచారి ఫిక్స్ చేసుకున్నాడు ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయడానికి ముందు అల్లు అర్జున్ సూర్యగా బుక్ చేసుకున్నాడు. తర్వాత సీయం భరత్ రామ్గా థియేటర్స్కు వస్తున్నానని మహేశ్బాబు ప్రామిస్ చేశాడు. ఇంతలో.. రోబో రెడీ అయ్యాడన్న వార్తలు వచ్చాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. రోబో సినిమాకు సీక్వెల్ చిత్రమిది. అంతలోనే తూచ్ అన్నారు. ‘కాలా’ ఖాయం అన్నారు. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాలా’. కానీ ‘కాలా’తో క్లాష్ వద్దనుకుని స్నేహపూర్వకంగా భరత్, సూర్య మాట్లాడుకుని వేరే డేట్స్కి షిఫై్ట పోయారు.స్ట్రైక్తో ‘కాలా’ రానన్నాడు. దీంతో లక్కొచ్చి ఆచారి డోర్ కొట్టింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆచారి రంగంలోకి దిగాడు. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా జి. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. సో..ఫైనల్గా సోల్జర్, సీయం, రోబో, గ్యాంగ్స్టర్ రావాలనుకున్నా.. గ్రహచారం అడ్డొచ్చి, ఆచారికి అన్నీ కలిసొచ్చి రిలీజ్కు రెడీ అయ్యాడు. అంతేకాదండోయ్.. వేసవికి గోపీచంద్ ‘పతం’ పట్టి థియేటర్స్లోకి వద్దాం అనుకున్నాడు కానీ వర్క్ కాస్త బ్యాలెన్స్ ఉండటంతో పంతం కొంచెం సడలించి జూలైకి రెడీ అవుతున్నాడు. అన్నట్లు తమిళనాడులో స్ట్రైక్ క్లోజ్ అయ్యిందిగా ఇక ‘కాలా’ లైన్లోకి వచ్చాడు. జూన్ 7న థియేటర్స్లోకి వస్తున్నాడు. – ముసిమి శివాంజనేయులు -
చెఫ్గా మారిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు చరణ్. అందుకోసం బాలీవుడ్ ఫిజికల్ ట్రయినర్ పర్యవేక్షణలో భారీగా కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చరణ్ భార్య ఉపాసన. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్తో అభిమానులను ఖుషీ చేశారు ఉపాసన. ‘మాస్టర్ చెఫ్, ‘మిస్టర్ సి’ వర్క్ అవుట్స్ తరువాత మా ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ను సిద్ధం చేస్తున్నారు’ అనే కామెంట్ తో పాటు చరణ్ వంట చేస్తున్నఫొటోలను ట్వీట్ చేశారు. రంగస్థలం సినిమాలో మాస్ లుక్ లో కనిపించిన చరణ్.. బోయపాటి సినిమాతో స్టైలిష్ గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్గా నటిస్తుండగా భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తున్నారు. Master Chef 🍳👨🍳 #MrC cooking healthy breakfast for us post his workout. 🏋🏻♂️#adorablehusband ❤️😘 #ramcharan pic.twitter.com/YCp8bZ6Vt2 — Upasana Kamineni (@upasanakonidela) 18 April 2018 -
చెమటోడుస్తున్న చరణ్
రంగస్థలం సినిమాతో రికార్డ్ లను తిరగరాస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన చెర్రీ ఈ నెలాఖరున షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే పనిలో ఉన్నాడు. రంగస్థలం సినిమాలో పల్లెటూరి యువకుడిగా మోటుగా కనిపించిన చరణ్, బోయపాటి సినిమాలో స్టైలిష్ లుక్ లో అలరించనున్నాడట. అందుకు తగ్గట్టుగా ఫిట్గా కనిపించేందుకు జిమ్లో చెమటోడుస్తున్నాడు. ఈ విషయాన్ని చరణ్ భార్య ఉపాసన ట్వీటర్ ద్వారా వెల్లడించారు. చాలా సేపు కసరత్తులు చేసి అలిసి పోయిన చెర్రీ ఫొటోతో పాటు ‘ఆర్సీ 12’ కోసం చరణ్ సిద్ధమవుతున్నాడంటూ ట్వీట్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో దానయ్య నిర్మిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. భరత్ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. Empty stomach intense cardio done. Now heading to @Apollo_LStudio for session 2. #ramcharan getting in shape for #RC12 💪🏻👍🏻 pic.twitter.com/PTyYBWEfMv — Upasana Kamineni (@upasanakonidela) 17 April 2018 -
‘రంగస్థలం’ ఖాతాలో మరో రికార్డ్
రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం రికార్డ్ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఒక్కో అడుగు ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న రిలీజ్ అయిన రంగస్థలం ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటుతోంది. రంగస్థలం తరువాత స్టార్ హీరోల చిత్రాలేవి రిలీజ్ కాకపోవటం ఛల్ మోహన్ రంగ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు రిలీజ్ అయినా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవటంతో రంగస్థలం జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ దాటేసిన ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా 200 కోట్ల మార్క్ను సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
సూపర్ స్టార్తో సుక్కూ..?
రంగస్థలం సక్సెస్తో దర్శకుడు సుకుమార్ రేంజ్ మారిపోయింది. ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్గా పేరున్నా.. సుకుమార్కు భారీ కమర్షియల్ సక్సెస్లు మాత్రం దక్కలేదు. రంగస్థలంతో ఆ లోటు కూడా తీరిపోయింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన రంగస్థలం 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇంతటి ఘనవిజయం సాధించిన సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్పై చర్చ మొదలైంది. సినిమా సినిమాకు మధ్య సుకుమార్ చాలా గ్యాప్ తీసుకుంటాడు. అంటే మరో సినిమాపై క్లారిటీ రావటానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే తాజా సమచారం ప్రకారం సుకుమార్ తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం భరత్ అనే నేను రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మహేష్, తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సూపర్ స్టార్ ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
‘రంగస్థలం’ విజయోత్సవం
-
రంగస్థలం టూ అంతరిక్షం
ఒక చిత్రంలో అన్ని అంశాలు సమపాలల్లో ఉండి ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలూ దాని ఫలితం బ్లాక్ బస్టరే. రంగస్థలం చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. సుకుమార్ టేకింగ్.. చెర్రీ అండ్ మిగతా తారాగణం నటన.. టెక్నీషియన్ల సమిష్టి కృషి.. వెరసి రంగస్థలాన్ని వంద కోట్ల క్లబ్లోకి చేర్చేసింది. ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లకు మంచి అవకాశాలను అందిస్తోంది. రామకృష్ణ-మౌనిక.. రంగస్థలం కోసం పని చేసిన ఆర్ట్ డైరెక్టర్లు. ముఖ్యంగా వీళ్లు రూపొందించిన విలేజ్ సెటప్కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో వీళ్ల టాలెంట్కు మరో అవకాశం దక్కింది. ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే స్పేస్ థ్రిల్లర్ చిత్రానికి రామకృష్ణ-మౌనికలను ఎంపిక చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఇప్పుడు శాటిలైట్లు.. అంతరిక్షం సెట్ల డిజైన్ల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అంతేకాదు త్వరలో నాసాను సందర్శించి. అక్కడి విషయాలను కూడా వీళ్లు పరిశీలిస్తారంట. తెలుగులో ఫస్ట్ టైమ్ స్పేస్ జోనర్లో వస్తున్న చిత్రం కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
చిట్టిబాబును తెగ పొగిడేశాడు
విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద రంగస్థలం కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూ వస్తోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ నేడు హైద్రాబాద్లో జరగనుండగా.. పవన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఇక ఈ చిత్రంలో చిట్టిబాబుగా చెర్రీ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కెరీర్లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్కు చెర్రీ నటనకు ఫిదా అయ్యాడు. వివేక్ తన ట్విటర్లో స్పందిస్తూ...‘ చిట్టిబాబు సౌండ్ ఇంజనీర్!!! రంగస్థలం చాలా పెద్ద సక్సెస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాటే బ్రిలియంట్ ట్రాన్స్ఫర్మేషన్! నువ్వు సూపర్స్టార్, సూపర్ ఫెర్ఫార్మర్ల మెగా కాంబోవి! నిన్ను చూస్తే గర్వంగా ఉంది. గాడ్ బ్లెస్ యు. సూపర్ టాలెంటెడ్ టీమ్కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే బోయపాటి, రామ్చరణ్ సినిమాలో ప్రతినాయకుడిగా వివేక్ ఒబేరాయ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. Chitti Babu sound engineer!!! So happy for my bro #RamCharan & the Massive Blockbuster success of #Rangasthalam!What a brilliant transformation! You are a ‘Mega’ combo of superstar & superperformer! God bless, proud of u man! Big congrats to the super talented team! Take a bow! pic.twitter.com/pVB5W4w05B — Vivek Anand Oberoi (@vivekoberoi) April 13, 2018 -
నాలుగు భాషల్లో ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. ఇప్పటికే వందకోట్ల షేర్ మార్కును దాటి దూసుకుపోతున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. తాజాగా రంగస్థలం సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్కు ముందే.., రామ్ చరణ్ తమిళ్లోకి అనువాదం చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం రంగస్థలం సినిమాను తమిళ్తో పాటు మరో మూడు భాషల్లోకి అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. తమిళ్తో పాటు మలయాళం, హిందీ, భోజ్పురి భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలోనే డబ్బింగ్ వర్షన్ల రిలీజ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
రంగస్థలం విజయం.. ఉపాసన కాలినడక
సాక్షి, హైదరాబాద్ : రంగస్థలం సినిమా విజయం సాధించడంతో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ భార్య ఉపాసన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభిస్తున్న ఫొటోలను ఆమె ట్విటర్లో పంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమా భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. చిత్రంలో చెవిటి వ్యక్తి పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. #RamCharan #Rangasthalam 🙏🏼 pic.twitter.com/TRK1hmtchp — Upasana Kamineni (@upasanakonidela) 12 April 2018 -
మామకు థ్యాంక్స్ చెప్పిన సమంత
చిట్టిబాబుగా రామ్చరణ్, లచ్చిమిగా సమంత నటించిన రంగస్థలం సినిమా ఘనవిజయంతో అటు అభిమానులు, ఇటు తారాగణం సంబరపడిపోతున్నారు. ఈ సినిమాపై ప్రముఖులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున ‘రంగస్థలం’పై ట్విటర్ వేదికగా స్పందించారు. చిత్ర యూనిట్తో పాటు కోడలు సమంత నటనను ప్రశంసించారు. ‘నీ నటనతో పాత్రకు ప్రాణం పోశావ్..సినిమా ఆసాంతం చిట్టిబాబులా జీవించావ్’ అంటూ రామ్ చరణ్ ను మెచ్చుకున్నారు. ఇక నా ముద్దుల కోడలు సమంత.. పల్లె పడచులా, పక్కింటి అమ్మాయిలా ఎంత సక్కగున్నదో లచ్చిమి.. అంటూ అభినందించారు. అచ్చమైన పల్లె వాతావరణం తెరపై ఆవిష్కరించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడంటూ ప్రశంసించారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్కి శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున ఈ మేరకు సమంతకు ట్వీట్ చేశారు. మావయ్య అభినందనల్ని స్వీకరించిన సమంత.. థాంక్యూ మామా అంటూ రీ ట్వీట్ చేశారు. Take a bow #RamCharan💐you were incredible in #Rangasthalam,you just lived the role and ofcourse dear @Samanthaprabhu2 so very proud of you💐💐💐@aryasukku what a beautiful film you made🙏took us back to our roots @MythriOfficial a big congratulations 👍👍👍👍👍 — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 12, 2018 Thankyou maama 🤗🤗 https://t.co/PynNXZhouu — Samantha Akkineni (@Samanthaprabhu2) 12 April 2018 -
అప్పుడు సేతు.. ఇప్పుడు రంగస్థలం
‘‘నేను ఏ సినిమాకైనా ముందు పూర్తి కథ వింటాను. ‘రంగస్థలం’కి కూడా సుకుమార్, నేను పలుమార్లు కథ గురించి చర్చించుకున్నాం. ఆయన రాసింది విలేజ్ డ్రామా. ప్రేక్షకుల్ని 1980 కాలంలోకి తీసుకెళ్లాలి. అందంగానూ, తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉండాలి. అలా చూపించడానికి నా వంతు కృషి చేశాను’’ అని ఛాయాగ్రాహకుడు రత్నవేలు అన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ సినిమా గత నెల 30న విడుదలైంది. ఈ సినిమాకి కెమెరామేన్గా పనిచేసిన రత్నవేలు మీడియాతో మాట్లాడుతూ– ‘‘దర్శకుడికి, కెమెరామేన్కు మధ్య మంచి రిలేషన్ ఉంటేనే ‘రంగస్థలం’ లాంటి ఔట్పుట్ సాధ్యం. మా మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి నాకు, సుకుమార్కు అలాంటి రిలేషన్ ఉంది. సుకుమార్ అన్ని అంశాల్ని పట్టించుకుంటాడు కానీ కెమెరా విషయంలో ఏం మాట్లాడడు. అతనికేం కావాలో అది నేను ఇస్తాననే నమ్మకం. సాధారణంగా సినిమాటోగ్రాఫర్కు అంతగా పేరు రాదు. కానీ, ‘రంగస్థలం’ విడుదలైన మొదటి రోజు నుంచి నన్ను ఇండస్ట్రీవారు, క్రిటిక్స్, ప్రేక్షకులు అభినందించారు. యూనిట్ మొత్తం క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశా. నా బిగ్గెస్ట్ హిట్, పేరు తెచ్చిన సినిమా ‘సేతు’. దాని తర్వాత అంతటి సినిమా ‘రంగస్థలం’. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు’’ అన్నారు. -
రామలక్ష్మి పాత్ర ఛాలెంజ్గా తీసుకున్నా
‘‘నటిగా నేను చాలా దూరం ప్రయాణించి నాకంటూ ఓ దారి ఏర్పరచుకున్నా. ఇప్పుడు అర్థం పర్థం లేని పాత్రలు చేస్తే ఉపయోగం ఉండదు. నా పాత్రకి ప్రాముఖ్యత ఉండే సినిమాలే ఒప్పుకుంటున్నా. అందుకే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఇక నేను కనిపించకపోవచ్చు. ఈ నిర్ణయం నటిగా తీసుకున్నదే తప్ప పెళ్లి తర్వాత వచ్చిన మార్పు కాదు’’ అని సమంత పేర్కొన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ... నాకు రిస్క్లంటే చాలా ఇష్టం. నా కెరీర్ అంతా రిస్క్లతోనే గడిచింది. ఛాలెంజ్ అంటే భయం ఉన్నా చేయాలని ఉంటుంది. రామలక్ష్మి పాత్రకి కాస్త భయపడ్డా.. భిన్నమైన పాత్ర అని చేశా ∙ఐదేళ్ల క్రితం ‘రంగస్థలం’ వచ్చి ఉంటే ఇంత మంచి అభినందనలు వచ్చేవి కాదేమో?. ప్రేక్షకుల మైండ్సెట్ మారింది. నా కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ మూవీగా ‘రంగస్థలం’ నిలిచినందుకు హ్యాపీ ∙‘ఏమాయ చేసావె’ లో జెస్సీ, ‘ఈగ’లో బిందు, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లోనూ మంచి పాత్రలు చేశా. అయితే.. రామలక్ష్మి డిఫరెంట్ పాత్ర. ఛాలెంజ్గా తీసుకుని వందశాతం ఎఫర్ట్ పెట్టి చేశా. ∙‘రంగస్థలం’ ఫస్ట్ లుక్లో నా ట్రాన్స్ఫర్మేషన్ చూడగానే షాకయ్యి ‘ఏయ్ ఏంటిది?’ అన్నాడు. నేనెప్పుడూ గర్వంగా ఫీలవ్వలేదు. కానీ, ‘రంగస్థలం’ లో భాగమైనందుకు గర్వంగా అనిపించింది. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. సినిమా ఇంత పెద్ద బ్లాక్బస్టర్ అవుతుందనుకోలేదు ∙చరణ్ లవ్లీ కోస్టార్. ఇంతకు ముందు నా సినిమాలు రిలీజవుతున్నాయంటే ఎవర్నీ నిద్రపోనిచ్చే దాన్ని కాదు. ఇప్పుడలా కాదు. ‘వందశాతం నీ పాత్రకు న్యాయం చెయ్.. తర్వాత మరచిపో. ఆడియన్స్ ఫీలింగ్ని మనం కంట్రోల్ చేయలేం’ అనే విషయం చైతన్య నుంచి నేర్చుకున్నా ∙పెళ్లైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు చూడరనేది ఫిలిం మేకర్స్ ఆలోచన. ప్రేక్షకులు ఆ మాట చెప్పలేదు. నా పాత్రను ప్రేక్షకులు అంగీకరించారంటే ఫిలిం మేకర్స్కి మెసేజ్ ఇచ్చినట్టే కదా?. నాకు నా కుటుంబాలే(అక్కినేని, దగ్గుబాటి) పెద్ద బలం. ప్రస్తుతం ‘యూ టర్న్’ మూవీ చేస్తున్నా. -
ఇంతకీ పవన్ వస్తారా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ భారీ కలెక్షన్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారు. రామ్ చరణ్, డైరెక్టర్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్కు ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి పెట్టింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం విజయానందంలో ఉంది. ‘రంగస్థలం’ టీమ్ తమ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఏప్రిల్ 12 ఈ సెలబ్రేషన్ ఈవెంట్ నగరంలోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగనున్నట్లు సమాచారం. మొదట ఈ వేడుక అమరావతిలో చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ, హైదరాబాద్లోనే చేస్తున్నారనే క్లారిటీ వచ్చేసింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని సమాచారం. తాజాగా పవన్ కల్యాణ్ భార్యతో కలిసి ‘రంగస్థలం’ చిత్రాన్ని చూసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉన్నందున ఈ వేడుకకు హాజరు కావడం అనుమానమే అని చెబుతున్నారు. -
‘రంగస్థలం’ బాటలో వరుణ్
సినీరంగంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తేన్న మెగా హీరో వరుణ్ తేజ్. ఇటీవల వరుసగా ఫిదా, తొలిప్రేమ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో త్వరలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఘాజీ లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా యూరప్లో షూట్ చేయాలని భావించారు. అయితే రంగస్థలం రిలీజ్ తరువాత చిత్రయూనిట్ అభిప్రాయాన్ని మార్చుకున్నారట. పూర్తిగా సెట్ వేసి సెట్లోనే చిత్రీకరణ జరపాలని నిర్ణయించారని తెలుస్తోంది. రంగస్థలంలో కోసం 1980ల నాటి పల్లెను సృష్టించిన రామకృష్ణ, మౌనికలే వరుణ్ సినిమా కోసం సెట్ రెడీ చేస్తున్నారు. స్పేష్ షెటిల్, శాటిలైట్, ఇస్రో వాతావరణాన్ని హైదరాబాద్లోనే సృష్టించనున్నారు. వరుణ్ తేజ్ సరసన అధితి రావు హైదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకడు క్రిష్ నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ను వినియోగించనున్నారు. -
అక్కడ ‘బాహుబలి 1’ని దాటిన ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్ సీస్లో 28 లక్షల డాలర్లకు పైగా వసూళు చేసిన ఈ సినిమా 30 లక్షల డాలర్ల మార్క్ను కూడా ఈజీగా సాధిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు కలెక్షన్ రికార్డ్ లను సొంతం చేసుకున్న రంగస్థలం ఖాతాలో మరో భారీ రికార్డ్ చేరింది. తొలి వారాంతంలో 80 కోట్లకు పైగా షేర్ వసూళు చేసి బాహుబలి 1 తరువాతి స్థానంలో నిలిచిన ఈ సినిమా తమిళనాట మాత్రం బాహుబలి 1 రికార్డ్ లను దాటేసింది. సమ్మె కారణంగా కోలీవుడ్ లో తమిళ చిత్రాలేవి విడుదల కాకపోవటం రంగస్థలంకు కలిసొచ్చింది. తొలి ఎనిమిది రోజులకు చెన్నై నగరంలోనే కోటి రూపాయల షేర్ వసూళు చేసి సత్తా చాటింది రంగస్థలం. -
రంగస్థలంపై రాజమౌళి స్పందన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు దర్శకులు రంగస్థలం సినిమా చూసి స్పందించారు. అయితే ప్రతీ సినిమాను తొలిరోజే చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించే రాజమౌళి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. శనివారం ఉదయం రంగస్థలం టీంను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు రాజమౌళి. ‘రంగస్థలంలో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. కానీ చిట్టిబాబు పాత్రను సుకుమార్ మలిచిన విధానం, ఆ పాత్రలో చరణ్ నటన అన్నింటిని మరుగున పడేలా చేశాయి. చిట్టిబాబు పాత్రలోని ప్రతీ చిన్న ఎక్స్ప్రెషన్ కన్నుల పండుగగా ఉంది. నెమ్మదిగా సంభాషణలు పలుకుతూ నటించిన జగపతి బాబు అద్భుతం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ఇతర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. బాహుబలి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. The only person who could stand his ground to Charan, to an extent was JB. His slow drawling dialogue and performance was really menacing. Congratulations to Mythri, Sukku and Team Rangasthalam for the terrific box office performance as well.. — rajamouli ss (@ssrajamouli) 7 April 2018 -
దేవీ కెరీర్ బెస్ట్ అన్న గురూజీ
రంగస్థలం సినిమాకు పనిచేసి ప్రతీ ఒక్కరూ ప్రశంసల వర్షంలో తడిపోతున్నారు. హీరో రామ్ చరణ్, హీరోయిన్ సమంత, దర్శకుడు సుకుమార్లతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ను కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే తాజాగా తనకు వచ్చిన ఓ మెసేజ్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రంగస్థలం సినిమా చూసిన సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ.. దేవీ శ్రీ ప్రసాద్ను ప్రశంసిస్తూ మెసేజ్ చేశారు. ‘నీ సంగీతంతో తెలుగు చలనచిత్ర రంగస్థలం మీద ఓ భారీ విజయాన్ని నమోదు చేశావు. గర్వంగా ఉంది’ అంటూ దేవీ శ్రీకి మెసేజ్ చేశారు కోడి రామకృష్ణ. తనకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన కోడి రామకృష్ణను దేవీ శ్రీ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన ప్రశంసించటంతో దేవీ శ్రీ ఆనందానికి అవధుల్లేవు. అందుకే వెంటనే కృతజ్ఞతలు అంటూ కోడి రామకృష్ణ రిప్లయ్ ఇచ్చిన దేవీ ఆ మెసేజ్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Feel so Blessed to get this message frm d Great Director, SRI KODI RAMA KRISHNA GARU, who introduced me as a Music Director ! Thank U soo much for this wholehearted Love Filled message Dearest Uncle !! 🎹🎹🎹🎵🎵🎵🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️ Wil Cherish this forever !! 🎹🎹 pic.twitter.com/BX4yFpYANM — DEVI SRI PRASAD (@ThisIsDSP) 6 April 2018 -
గ్రామస్థులకు రంగమ్మత్త విందు భోజనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. గత వారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. రాంచరణ్, సమంతతో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్లు ముఖ్య పాత్రలు పోషించారు. మరోవైపు ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అనసూయ ఆనందం పట్టలేకపోతోంది. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్ని తనకిచ్చినందుకు సుకుమార్కి ఆమె కృతజ్ఞలు తెలిపారు కూడా. చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనసూయ తాజాగా.. రంగస్థలం టీంకు విందు భోజనం ఇచ్చింది. రంగస్థలం అసిస్టెంట్ డిజైనర్ గౌరీ నాయుడు ‘రంగమ్మత్త విందు భోజనం’ అంటూ అందరూ కలిసి ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘రంగమ్మత్త విందు భోజనం.. మా రంగస్థలం గ్రామస్థులు మరియు మా ప్రెసిడెంట్ గారి సన్నిహితులు’ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ ట్వీట్కు అనసూయ ‘సచ్ లవ్లీ టైమ్’ అని సమాధానమిస్తూ రీట్వీట్ చేసింది. రంగస్థలం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్న ఈ ఫొటో నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంతో రంగస్థలం తెరకెక్కిన విషయం తెలిసిందే. Rangammatta Vindhu Bhojanam ❤️ @anusuyakhasba 😘 Ma Rangasthalam gramasthulu mariyu ma president gari sannihithulu 😛 #Rangasthalam #RangasthalamMemories 😎 pic.twitter.com/DfMKngaLjB — Gauri Naidu (@Gauri_Naidu) April 5, 2018 Hahaha❤️❤️ Such lovely time!!! https://t.co/duOPz2WwmD — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 6, 2018 -
రామ్చరణ్ రంగస్థలంకు బ్రేక్
చెన్నై(తమిళసినిమా) : నటుడు రామ్చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం చిత్రానికి బ్రేక్ పడింది. కంగారు పడకండి ఈ బ్రేక్ అనేది తమిళనాడు వరకేలెండి. వివరాల్లోకి వెళ్లితే.. కోలీవుడ్ ప్రస్తుతం చాలా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకపక్క క్యూబ్ సంస్థల మంకు పట్టు, మరోవైపు థియేటర్ల యాజమాన్యం పంతంతో కోలీవుడ్ కష్టాల్లో పడింది. నిర్మాతల మండలికి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య మొదలైన సమస్య ఆ తరువాత నిర్మాతలమండలికి, థియేటర్ల సంఘం వరకూ పాకింది. ఈ సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల ప్రదర్శనల నిలిపివేత, మార్చి 16వ తేదీ నుంచి షూటింగ్లు, ఇతర కార్యక్రమాలను రద్దు చేస్తూ నిర్మాతలమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అటు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్ల యాజమాన్యం దిగివస్తుందని భావించిన నిర్మాతల మండలి నిర్వాహకులకు అది జరగలేదు. థియేటర్ల మాజమాన్యం పాత చిత్రాలను, ఇతర భాషా చిత్రాలను ప్రదర్శించుకుంటున్నారు.దీంతో నిర్మాతల మండలి తీసుకున్న కొత్త చిత్రాల విడుదల రద్దు నిర్ణయం పెద్దగా వారిపై ప్రభావం చూపడం లేదు. కాగా ఇటీవల విడుదలైన రామ్చరణ్, సమంత జంటగా నటించిన తెలుగు చిత్రం రంగస్థలం తమిళ స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శంపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో సమ్మె సమయంలో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతల మండలిపై పడింది. దీంతో రంగంలోకి దిగిన ఆ మండలి అధ్యక్షుడు విశాల్ తెలుగు చిత్ర నిర్మాతల మండలితో మాట్లాడి తెలుగు చిత్రాలను తమిళనాట విడుదల చేయకుండా తమ సమ్మెకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విశాల్ ప్రయత్నం ఫలించింది. తెలుగు నిర్మాతలమండలి ఈ నెల 8వ తేదీ నుంచి తెలుగు చిత్రాలను తమిళనాడులో విడుదల చేయబోమని ప్రకటించారు. ఐపీఎల్ దెబ్బ.. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. తాజాగా తమిళ నిర్మాతలకు ఐపీఎల్ క్రికెట్ రూపంలో మరో ముంపు ముంచుకొస్తోంది. అవును తమిళ నిర్మాతల మండలి కొత్త చిత్రాలను విడుదల చేయరాదని నిర్ణయం తీసుకోవడంతో ఇతర భాషా చిత్రాలను, పాత తమిళ చిత్రాలను ప్రదర్శించుకుంటున్న థియేటర్ల యాజమాన్యం నష్టాలనే ఎదుర్కొంటోందన్నది వాస్తవం. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో కార్మికుల జీతాలు, ఇతరత్రా నిర్వహణ భారం పెరుగుతోంది. నిర్మాతల మండలితో సయోధ్య కుదిరే పరిస్థితి కానరావడం లేదు. ఇలాంటి సమయంలో థియేటర్ల మాజయాన్యానికి ఐపీఎల్ క్రికెట్ పోటీలు అదృష్టంగా మారాయి. ఆ పోటీలను నేరుగా థియేటర్లలో ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు నగర పోలీసు కమిషనర్ అనుమతి కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అందులో కోలీవుడ్లో సమ్మె కారణంగా కొత్త చిత్రాల విడుదల నిలిచిపోయిందని, దీంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోయి నష్టాలను చవిచూస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను రావడం లేదని పేర్కొన్నారు. కాబట్టి ఐపీఎల్ క్రికెట్ పోటీలను థియేటర్లలో ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తే, ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యానికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల ప్రదర్శనకు కనుక అనుమతి లభిస్తే మరో 51 రోజులు థియేటర్ల యాజమాన్యానికి తమిళ చిత్రాల అవసరం ఉండదు. మరి తెలుగు చిత్రాలను నిలువరించినట్లు నిర్మాతల మండలి ఐపీఎల్ క్రికెట్ పోటీల ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి. -
అప్పుడు రామ్చరణ్ హీరో అని తెలియదు
‘‘2009లో ‘ఆర్య 2’లో నటించమని సుకుమార్గారు అడిగినప్పుడు చేయలేకపోయా. ఆయన ‘రంగస్థలం’ కథ చెప్పినప్పుడు రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉన్నా ధైర్యం చేసి చేశా. ఈ రేంజ్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు నటి అనసూయ. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన అనసూయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ –‘‘నా విజయ రహస్యం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ అనుకోను. తక్కువ చేసి చూసుకొంటాను. అందుకే నాకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రేక్షకుల్ని మెప్పించగలిగాను. నేను ఒకే ఇమేజ్లో కూరుకుపోవాలనుకోవడం లేదు. ప్రకాశ్ రాజ్గారిలా అన్ని పాత్రలూ చేయాలనీ, కరెక్ట్గా చెప్పాలంటే ‘లేడీ ప్రకాశ్ రాజ్’లా అవ్వడం నా ధ్యేయం. ‘రంగస్థలం’ కథ విన్నప్పుడు రామ్చరణ్ హీరో అనే విషయం నాకు తెలియదు. తెలిసాక ‘చరణ్తో అత్త అని పిలిపించుకోవాలా.. కనీసం రంగమ్మ అని అయినా పిలిపించండి’ అని సుకుమార్గారిని రిక్వెస్ట్ చేశా. ‘రంగస్థలం’ సినిమా చూశాక ‘నటిగా ఎదిగావ్ అనసూయ’ అని మా ఆయన చెప్పడం ఎప్పటికీ మరువలేను. నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ అది’’ అన్నారు. -
ఆ జీన్స్తో ఎంతో కంఫర్ట్: రంగమ్మత్త
సాక్షి, హైదరాబాద్ : రంగమ్మత్త రంగు రంగుల క్యాజువల్ క్యాస్టూమ్స్, పార్టీ వేర్కు బదులు.. సమ్మర్ వేర్ ధరించి సందడి చేశారు. సాధారణ జీన్స్ ఫ్యాషన్ ముగిసింది. ఇప్పుడంతా టోర్న్, రిప్డ్ జీన్స్ ఫ్యాషన్ వచ్చేసింది. ఎక్కడా చూసిన పెద్ద పెద్ద రంధ్రాలతో కూడిన టోర్న్ జీన్స్ సమ్మర్లో మంచి కంపర్ట్ ఇవ్వడంతో కుర్రకారు వాటివెంట పరుగులు తీస్తున్నారు. వేలకు వేలకు పోసి కొనుక్కుని ట్రెండీగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా చేరారు. తెల్లని గీతలతో కూడిన నల్లని షర్ట్, టోర్న్ జీన్స్ ధరించి ‘ఇవి.. ఫ్యాషన్ అండ్ సమ్మర్ స్పెషల్’ అంటున్నారు అనసూయ. టోర్న్ జీన్స్తో చాలా కంఫర్ట్ అంటూ గోల్డ్ కలర్ గాగుల్స్తో ఫోటోలకు ఫోజిస్తూ ఈ బుల్లి తెర యాంకర్ హొయలు పోయారు. ఇప్పటికే వెండితెరపై పలు సినిమాల్లో నటించిన అనసూయ తాజాగా సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అనసూయ ఆనందం పట్టలేకపోతున్నారు. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్ని తనకిచ్చినందుకు ఆమె సుక్కూకు కృతజ్ఞలు తెలిపారు. -
బాహుబలితో ‘రంగస్థల’ బ్రహ్మ..!
రామ్ చరణ్ హీరోగా రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో చేయనున్నట్టుగా తెలిపారు. రంగస్థలం ఘనవిజయం సాధించటంతో ప్రేక్షకులు సినీ వర్గాలు సుకుమార్ను రంగస్థల బ్రహ్మగా కీర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న సుక్కు, తన తదుపరి చిత్రాన్ని కూడా ఓ స్టార్ హీరోతో చేయాలని భావిస్తున్నారు. రంగస్థలం ప్రచార కార్యక్రమాల్లో తనకు ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కించాలనుందన్న కోరికను బయట పెట్టారు. దీంతో సుకుమార్ తదుపరి చిత్రం ప్రభాస్తోనే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సాహో తరువాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించారు. ఒకవేళ ప్రభాస్, సుకుమార్తో సినిమా అంగీకరిస్తే సాహో పూర్తయిన వెంటనే ప్రారంభిస్తారా..? లేక రాధకృష్ణ సినిమా కూడా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తారో చూడాలి. -
హీరో అంటే ఎవరు?
‘‘దర్శకులు ఎంతో ఇష్టపడి రాసుకొచ్చిన కథను హడావిడిగా వినేసి ‘యస్’ ఆర్ ‘నో’ అని చెప్పే టైప్ కాదు నేను. ఓ రోజంతా కథ ప్రశాంతంగా వింటా. ఆ తర్వాత నా నిర్ణయం చెబుతా. ‘నిన్ను కోరి’ టైమ్లో సుకుమార్గారు రెండు గంటల్లో నాకు ‘రంగస్థలం’ కథ చెప్పారు. ఆయనపై ఉన్న కాన్ఫిడెన్స్, కథపై ఉన్న నమ్మకంతో టైమ్ తీసుకోకుండా ‘ఈ సినిమా నేను చేస్తాను’ అని చెప్పా’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రామ్చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రకు అన్నగా కుమార్బాబు పాత్రలో ప్రేక్షకులను అలరించిన ఆది మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ►‘రంగస్థలం’లో కుమార్బాబు లాంటి పాత్ర నేనిప్పటివరకూ చేయలేదు. ఈ చిత్రంలో నా పాత్ర చనిపోతుందనే విషయం అమ్మ, నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి)లకు చెప్పలేదు. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూశా. నా పాత్ర చనిపోయినప్పుడు వారంతా చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్గా భావిస్తా. అమ్మ చేయి పట్టుకుని ‘అది సినిమా’ అని ధైర్యం చెప్పా. ► ‘సరైనోడు’ సినిమా నుంచి తెలుగులో మంచి పాత్రలొస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదిరిస్తున్నారు. ‘నిన్నుకోరి, అజ్ఞాతవాసి, రంగస్థలం’ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చింది. ‘రంగస్థలం’ సినిమాలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యి ఏడవడం చూశా. ఇలాంటి హానెస్ట్ సినిమా తెలుగులో వచ్చి చాలా ఏళ్లవుతోంది. వెరీ హానెస్ట్ ఫిల్మ్. ►కుమార్బాబు పాత్రకి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తుండటంతో ఫుల్ హ్యాపీ. ఓ నటుడికి ఇంతకంటే ఇంకేం కావాలి? డబ్బులు కాదు... సంతృప్తి ముఖ్యం. ‘రంగస్థలం’ తర్వాత నాపై మరింత బాధ్యత పెరిగింది. మంచి పాత్రలు, సినిమాలు ఎంచుకోవాలి. మా సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ►నా పాత్ర నెగెటివ్వా? పాజిటివ్వా? అని ఆలోచించను. కథ బాగుంటే చేసేస్తా. అసలు నాకు హీరో, విలన్, కమెడియన్.. అనే ఆలోచన ఉండదు. అసలు.. హీరో అంటే ఎవరు? అందరం నటులమే. రియల్ హీరోలు బోర్డర్లో ఉంటారు. నా దృష్టిలో వాళ్లే హీరోలు. హీరో అంటే లీడ్ రోల్ చేసేవారు. నేను కూడా లీడ్ రోల్స్ అయితేనే చేస్తా అంటే ఎన్నో మంచి పాత్రలు మిస్ అయ్యేవాణ్ణి. ► నాన్నగారు లేకుంటే నేనీ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. ఆయన సినిమాని ఎంత ప్రేమించేవారో చిన్నప్పటి నుంచి చూశాం. అందుకే నాకూ సినిమా అంటే అంత ప్రేమ. నేను కథ విన్నాక నాన్నగారితో పంచుకుంటా. ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. ►‘రంగస్థలం’ కథని రాయడం ఒక ఎత్తయితే.. దాన్ని అలానే తెరపైకి తీసుకురావడం మరో ఎత్తు. సుకుమార్గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన వన్నాఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు చాలా ఓపిక కావాలి. నవీన్, రవిశంకర్, మోహన్ చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. వారి పాజిటివ్ ఎనర్జీ కూడా సినిమాకి ప్లస్ అయింది. ►మా సినిమాకు సంగీతం, కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్.. నాలుగు పిల్లర్స్లా నిలిచాయి. నా పాత్ర చనిపోయిన సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు ఒక మనిషి చచ్చిపోతే ఇంతలా ఏడుస్తారా? అని పించింది. రోహిణీగారు రియల్గా ఏడ్చారు. ఆ పాత్రలో అంతలా జీవించారామె. నరేశ్గారి పాత్ర కూడా సూపర్బ్. ►ప్రస్తుతం నేను లీడ్రోల్లో తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్స్గా చేస్తున్న సినిమా సెట్స్పై ఉంది. మరో రెండు ద్విభాషా చిత్రాలు సెట్స్కి వెళ్లాల్సి ఉంది. ►చిట్టిబాబు పాత్రలో చరణ్ని తప్ప వేరే ఎవర్నీ ఊహించలేకపోయా. తను చేసినంత ఈజ్, డెప్త్తో ఎవరూ చేసి ఉండేవారు కాదేమో? ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ క్రెడిట్ సుకుమార్, చెర్రీలదే. ఈ సినిమా ద్వారా చిట్టిబాబు రూపంలో నాకో తమ్ముడు దొరికాడు. నాకు తమ్ముడు లేని లోటు తీరింది. సమంత చాలా వైవిధ్యమైన పాత్ర చేశారు. -
‘నా ప్రియమైన స్నేహితుడు గర్వపడుతున్నాడు’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల గ్రాస్ను సాధించి సత్తా చాటింది. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. చిట్టిబాబుగా అద్భుతమైన నటన కనబరిచిన రాంచరణ్కు టాలీవుడ్ ప్రముఖల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా రంగస్థలంపై నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. ‘రంగం స్థలం సినిమా గురించి మంచి టాక్ వింటున్నాను. చరణ్, మూవీ యూనిట్కు కంగ్రాంట్స్. త్వరలో నేను సినిమా చూస్తాను. కొడుకులు ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణించడం చూసి ఏ తండ్రి అయినా గర్వపడతాడు.. ఇప్పుడు నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవి కూడా అంతే గర్వపడుతున్నాడని అనుకుంటున్నా..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. Hearing good things about #Rangastalam Will watch it soon. Congrats to Charan and the entire team. Fathers need nothing more than seeing their sons excel in their chosen field. And I am sure my dear friend Chiranjeevi is quite proud! Congratulations! — Mohan Babu M (@themohanbabu) April 2, 2018 అంతేకాకుండా ఈ చిత్రంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన రీతిలో స్పందించాడు. రంగస్థలం సినిమా చాలా బాగుందని, రాంచరణ్ మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అని.. హేయ్ సుక్కూ నీకు 3 ముద్దులంటూ ఎమోజీలను పోస్ట్ చేశాడు వర్మ. -
పాట మార్పుపై స్పందించిన సుకుమార్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా సరికొత్త రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత ఈ గట్టునుంటావా పాటపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. పాటకు ఆడియోలో శివ నాగులు గొంతు వినిపించగా.. సినిమాలో మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ గొంతు వినిపించింది. దీంతో అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శివ నాగులు ఈ పాటను అద్భుతంగా ఆలపించినట్టుగా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన చిత్రయూనిట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న చర్చ జరిగింది. అయితే ఈ విషయాలపై దర్శకుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. షూటింగ్ సమయానికి శివ నాగులతో పాట రికార్డ్ కాలేదని దీంతో దేవీ పాడిన వర్షన్తో షూటింగ్ కానిచ్చేశారట. తరువాత శివ నాగులుతో పాట రికార్డ్ చేసినా.. రీ రికార్డింగ్ సమయంలో ఈ వర్షన్కు లిప్ సింక్ కాకపోవటంతో దేవీ శ్రీ ప్రసాద్ వర్షన్ను అలాగే ఉంచేశామని సుకుమార్ వెల్లడించారు. అంతేకాదు ఆల్బమ్లో ఎప్పటికీ శివ నాగులు పాడిన పాటే ఉంటుందని, పాటను ఉద్దేశ పూర్వకంగా మార్చలేదని కేవలం సాంకేతిక కారణాల వల్లే అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
వంద కోట్ల క్లబ్లో ‘రంగస్థలం’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల గ్రాస్ను సాధించి సత్తా చాటింది. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 1980ల కాలంలో జరిగే కథ తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్.. చిట్టిబాబు గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటించగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్రకాష్ రాజ్లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. -
‘బాహుబలి తర్వాత రంగస్థలం టాప్...’
‘మీరు ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?’ అని అడుగుతుంటారు. నేనెప్పుడూ అలా సినిమాలు ఒప్పుకోలేదు. కథ ముందు నాకు నచ్చాలి. ఆ తర్వాత అందరికీ నచ్చుతుంది. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం’’ అని రామ్చరణ్ అన్నారు. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. రామ్చరణ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్కి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్ను మా భుజాలపై పెట్టాడు. తన మిషన్ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, సినిమా సక్సెస్లో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వేసవిలో రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకెంతో ఇష్టం. సినిమా రంగంలో వచ్చే ప్రతి రూపాయిని వారు మళ్లీ తర్వాతి సినిమాపైనే పెడతారు. వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు, చరణ్కి కామన్ ఫ్రెండ్ రంగ. అతని ద్వారా ‘నాన్నకు ప్రేమతో’ సమయంలో చరణ్ని కలిశా. తను నా మైండ్లో ఉండిపోయాడేమో.. కాబట్టి ‘రంగస్థలం’ టైటిల్ పెట్టా. జగపతిబాబుగారు ఏ ప్రాత చేసినా బంగారమే. ఆయనతోనే ప్రేమలో పడిపోయా. ఆయనతో నా ప్రతి సినిమా చేయాలనుకుంటున్నాను. రత్నవేలుగారు ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్కు పెళ్లయితే ఆమెను ప్రేక్షకులు ఆదరించరని అంటుంటారు. కానీ, సమంత విషయంలో అలా జరగలేదు. రూల్స్ను బ్రేక్ చేసిన సినిమా ఇది. చిట్టిబాబుగా రామ్చరణ్ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేదు’’ అన్నారు. ‘‘సెకండ్ ఇన్నింగ్స్లో నాకు ‘లెజెండ్’ చిత్రం ఓ లైఫ్ అయితే.. ‘రంగస్థలం’తో మరో లైఫ్ వచ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్’’ అన్నారు జగపతిబాబు. ‘‘రంగస్థలం తొలి మూడురోజులకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో, నాలుగోరోజు సోమవారం కూడా అంతే కలెక్షన్స్ రావడం సినిమా బ్లాక్బస్టర్ అనడానికి పెద్ద నిదర్శనం. ‘ఆర్య’ తర్వాత సుక్కు చిత్రాల్లో పూర్తిగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుక్కు కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్ హీరో కొత్తగా ట్రై చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలకు వర్కవుట్ అయ్యింది. ‘మగధీర’ను కూడా ఈ సినిమా క్రాస్ చేయబోతోంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘రంగస్థలం’ స్టార్టింగ్ షాట్ నుంచి ఎండింగ్ వరకు చరణ్గారి నటన సూపర్బ్ అని అందరూ చెబుతున్నారు. ‘రంగస్థలం’ ఫస్ట్ షెడ్యూల్ కాగానే మరో సినిమా చేయమని సుకుమార్గారితో కమిట్ అయ్యామంటే మా జర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. మా మూడు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘బాహుబలి, బాహుబలి 2’ తర్వాత ‘రంగస్థలం’ టాప్ గ్రాసర్ అవుతుంది. ‘ఖైదీనంబర్ 150’ చిత్రాన్ని కూడా చరణ్గారు దాటేస్తారు’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత సీవీఎం, రవిశంకర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటి అనసూయ, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు. -
వారికోసం ఉపాసన 'స్పెషల్ షో'లు
సాక్షి, హైదరాబాద్ : రామ్చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమాజ సేవకురాలిగా ఎంతో మంది చిన్నారులను ఆదరిస్తున్నారు. అంతేకాదు ఉపాసన జంతు ప్రేమికురాలు కూడా. ఇందులో భాగంగానే అక్కినేని అమల నిర్వహించే బ్లూక్రాస్ సంస్థ నుంచి జంతువులను దత్తత తీసుకొని వాటి సంక్షేమ బాధ్యతలును నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు పండుగలకు, ప్రత్యేకమైన రోజుల్లో భర్త రామ్చరణ్తో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పలు అనాథ శరణాలయాలను సందర్శిస్తుంటారు. వారితో పాటు కలిసి ఆడుతూ పాడుతుంటారు. వారికోసం పలుసార్లు చరణ్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ఉచిత షోలను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగానే ఉపాసన మరోసారి తన మంచితనం చాటుకున్నారు. హైదారాబాద్కు చెందిన ఆశ్రయ ఆకృతి అనే స్వచ్చంద సంస్థకు చెందిన వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగ చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే విడుదైల బ్లాక్బస్టర్గా దూసుకుపోతున్న రంగస్థలం సినిమాను ప్రత్యేక షోలను ఉపాసన ఏర్పాటుచేశారు. దగ్గరుండీ మరీ వారికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకున్నారు. వారితో పాటు సినిమా చూసి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇక రంగస్థలం విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్లో ఇప్పటికే 2.5 మిలియన్ల మార్క్ను సైతం దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం చిట్టిబాబు హవా కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం కూడా సుమారు రూ.10 కోట్లపైనే వసూలు చేసిందని టాలీవుడ్ టాక్. -
రంగస్థలం.. ఆ లొల్లి లేనట్లే!
రంగస్థలం బ్లాక్బస్టర్ టాక్తో మెగా ఫ్యాన్స్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన తొలి చిత్రం కావటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఓ అంశం వారిని కలవరపెడుతోంది కూడా. అదే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ వ్యవహారం. ఈ మధ్య సినిమాల డిజిటల్ హక్కులను దక్కించుకుంటున్న అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు.. నెల రోజులు తిరగకుండానే సినిమాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి. రంగస్థలం చిత్రం కోసం కూడా భారీగా వెచ్చించి (సుమారు రూ.18 కోట్లు అని చెబుతున్నారు) అమెజాన్ ప్రైమ్ హక్కులను దక్కించుకుంది. దీంతో చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ.. 50 రోజులు తిరగకుండానే డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తుందేమోనని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల క్లారిటీ... అయితే ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని రంగస్థల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇస్తోంది. అమెజాన్ ప్రైమ్తో ‘50 రోజుల పూర్తయ్యాకే చిత్రం వినియోగదారులకు అందుబాటులోకి తేవాలి’ అన్న షరతు మేరకే ఒప్పందం చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నినేని స్పష్టం చేశారు. -
మూడురోజుల్లో ‘రంగస్థలం’ భారీ వసూళ్లు!
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా ‘రంగస్థలం’ బాక్సాఫీస్ సత్తా చాటుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మౌత్టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబడుతోంది. చిత్రవర్గాల సమాచారం ప్రకారం మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్టిబ్యూటర్స్ వాటా రూ. 55 కోట్లు అని చిత్రవర్గాలు తెలిపాయి. మొదటి వీకెండ్లో తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 37.40 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో రూ. 4.8 కోట్లు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 1.3 కోట్లు రాబట్టింది. ఇక, అమెరికాలోనూ ‘రంగస్థలం’ దుమ్మురేపుతోంది. మొదటి మూడురోజుల్లో ఈ సినిమా రూ. 9 కోట్లు వసూలుచేసింది. మిగతా దేశాల్లో రూ. 2.7 కోట్లు రాబట్టింది. 1980 నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్.. వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. చెర్రీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా ఈ సినిమా నిలిచిపోతుందని ప్రశంసల జల్లు కురుస్తోంది. చెర్రీ సరసన నటించిన సమంత కూడా రామలక్ష్మి పాత్రలో మంచి అభినయం కనబర్చింది. రేవంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ, ఆది పిన్నిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
డైరెక్టర్ సుకుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
మేకింగ్ ఆఫ్ మూవీ - రంగస్థలం
-
చరణ్ నువ్వు తప్ప ఎవరూ చేయలేరు : తారక్
సాక్షి, హైదారాబాద్ : రంగస్థలం బ్లాక్బస్టర్ అయిన నేపథ్యంలో సినిమాపై ప్రసంశల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చేరారు. తాను ఇప్పుడే రంగస్థలం చూశానని చెప్పిన తారక్, రామ్ చరణ్పై పొగడ్తలు గుప్పించారు. సినిమాలో చరణ్ చేసిన నటనకు అభినందనలు, ప్రశంసలు అందుకునే అర్హత ఉందని వ్యాఖ్యానించారు. తన తరపునుంచి కూడా అభినందనలు తెలిపారు. చిట్టిబాబు పాత్రను చరణ్ కంటే ఎవరూ బాగా చేయలేరంటూ ఆకాశానికెత్తేశారు. దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో అద్భుతంగా సినిమాను తెరకెక్కించారని, దర్శకత్వం అద్భుతంగా ఉందన్నారు. ఆకాలం నాటి పరిస్థితులను కళ్లలకు కట్టినట్లు చూపించారని అన్నారు. హీరోయిన్ సమంతకు అభినందనలు తెలిపారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్.. ఇలా రంగస్థలం బృందంలోని ప్రతిఒక్కరు ఉండటానికి అద్భుతంగా చేశారని పొగడ్తల వర్షం కురిపించారు. -
కలెక్షన్స్: ఆ మార్క్ను దాటిన రంగస్థలం
సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాకు యూఎస్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన అతితక్కువ రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. చెర్రీకి ఓవర్సీర్ మార్కెట్లో పెద్దగా పట్టు లేదనే వారికి ‘రంగస్థలం’ ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడు. ధృవ సినిమాతో యూఎస్లో మిలియన్ డాలర్ హీరోగా చెర్రీ ఎంట్రీ ఇచ్చాడు. ధృవ సినిమాకు చెర్రీ, చిత్రయూనిట్ కలిసి అమెరికాలో ప్రమోషన్ చేశారు. అయితే రంగస్థలం సినిమాకు మాత్రం యూఎస్లో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో అభిమానులు కంగారుపడ్డారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుంటే ఓవర్సీస్లో కలెక్షన్లు తగ్గుతాయేమోనని అనుకున్నారు. కానీ కంటెంట్ ఉంటే ప్రమోషన్స్ లేకున్నా కలెక్షన్లు దుమ్ముదులుపుతాయని రంగస్థలం నిరూపించింది. గ్రామీణ నేపథ్యం, చెర్రీ నటన, సుకుమార్ టేకింగ్ ఈ సినిమాకు హైలెట్ కావడంతో ఎన్నారైలు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. Whatte solid #RangasthalamWave at the Box Office, #2MillionRangasthalam 🔥 pic.twitter.com/AkIAM1Z5Do — Mythri Movie Makers (@MythriOfficial) April 1, 2018 -
ఇక మీదట హీరోగానే..!
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు. ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు. -
చిట్టిబాబు చెవికి ఆపరేషన్ చేయిస్తా..!
రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 1980ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు సుకుమార్.. పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సుకుమార్. రంగస్థలం సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు చెప్పలేనన్న సుక్కు.. ఒక వేళ చేస్తే మాత్రం ఆ సినిమాలో చిట్టిబాబు చెవికి ఆపరేషన్ అయి అన్ని మంచిగా వినిపిస్తున్నట్టుగా చూపిస్తానని తెలిపారు. కేవలం పాత్రలను మాత్రమే తీసుకొని కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తానని తెలిపారు. చిరంజీవితో సినిమా చేయటం తన కల, నేను రాసిన కథ చిరుకు నచ్చితే నా కల నెరవేరినట్టే అన్నారు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయలు ఇతర కీలకపాత్రల్లో నటించారు. -
మిలియన్ డాలర్ల బ్యూటీ
తమిళసినిమా: మిలియన్ డాలర్ల బ్యూటీగా వాసికెక్కడం అంత సులభం కాదు. మిలియన్ డాలర్ అంటే విదేశాల్లో గొప్ప విషయమే. అంటే 10 లక్షల డాలర్లు అన్నమాట. అమెరికాలో విడుదలయ్యే తమిళం, తెలుగు చిత్రాలు ఒక మిలియన్ డాలర్లు వసూలు చేస్తే గొప్ప విషయమే అవుతుంది. అలా మిలియన్ డాలర్లు వసూలు చేసిన అధిక చిత్రాలు ఈ ముద్దుగుమ్మ ఖాతాలోనే చేరాయట. అందువల్ల సమంత నమోదు మిలియన్ డాలర్ల బ్యూటీగా వాసి కెక్కారు. సమంత నటించిన తమిళ చిత్రం తెరి, 24, మెర్శల్ చిత్రాలు అమెరికాలో 10 లక్షల డాలర్లు వసూలు చేశాయి. ఇటీవలే ప్రేమికుడు నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన సమంత నటిగా కొనసాగడం, అదీ హీరోయిన్గా బిజీ గా ఉండడం సహ నటీమణులు ఈర‡్ష్య పడుతున్నార ట. గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని చిత్రాల్లో నటిస్తున్న సమంత పాత్రల ఎంపికలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నటనకు అవకాశం ఉందనిపిస్తే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారట. ఈమె రామ్చరణ్తో జత కట్టిన రంగస్థలం చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చి మంచి హిట్ టాక్ను తె చ్చుకోవడంతోపాటు సమం త నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే ఏ డా ది సమంత నటించిన ద్విభా షా చిత్రం నడిగైయార్ తిలగం (తెలుగులో మహానటి) విశాల్కు జంటగా నటించిన ఇరుంబుతిరై, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సీమరాజా, లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం యూటర్న్ చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఇవన్నీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రాలేనని అం టున్నారీ మిలియన్ డాలర్ల బ్యూటీ. -
మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్..
‘‘తెల్ల కాగితంలా రండి... సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’. ‘రంగస్థలం’ రిలీజ్కు ముందు సుకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆడియన్స్ వస్తున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ మళ్లీ ‘తెల్ల కాగితం’ తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే జస్ట్ నెల తర్వాత. ఈ తెల్ల కాగితంపై కొత్త కథ రెడీఅవ్వబోతోంది. మళ్లీ సేమ్...ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు..తెల్ల కాగితంలా థియేటర్కి వెళ్లాలి. సినిమా చూడాలి. ఎందుకంటే ‘అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ’స్ ఇవ్వడం సుకుమార్కి అలవాటు. లెక్కల మాస్టారిలా స్టూడెంట్స్కిమార్కులు వేసిన సుకుమార్ ఇప్పుడు ఆడియన్స్తో మంచి మార్కులు వేయించుకుంటున్నారు. ► సక్సెస్ రీ–సౌండ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు? (నవ్వుతూ). అవును. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ► సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ‘సిటీ బ్యాక్డ్రాప్’ అని ఒక రూట్లో వెళుతుంటే.. ‘విలేజ్ బ్యాక్డ్రాప్’ రూట్లో వచ్చారు.. ఈ రూట్లోకి డైవర్ట్ అవ్వడానికి కారణం? నేను ఇప్పటివరకూ తీసినవన్నీ సిటీ బ్యాక్డ్రాప్ సినిమాలే. ఖరీదు గల కార్లు, బంగ్లాలు, రిచ్ సెట్స్, ఫారిన్ లొకేషన్స్. ఇవన్నీ నా సినిమాల్లో చూపించాను. డిఫరెంట్గా ఆలోచిస్తే బాగుంటుందనిపించింది. అందుకే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలనుకున్నాను. అది కూడా పక్కా పల్లెటూరిని చూపించాలనుకున్నాను. ► బాగానే ఉంది.. ముందు హీరోకి వినికిడి లోపం లేదట. తర్వాతే స్క్రిప్ట్లో యాడ్ చేశారట కదా. వినగానే రామ్చరణ్ ఏమన్నారు? అవును. ముందు రాసుకున్న స్క్రిప్ట్లో లేదు. తర్వాత యాడ్ చేశాను. క్యారెక్టర్లో కామెడీ కూడా ఉండాలనుకున్నాను. కథ వినగానే చరణ్ ఒక్క క్షణం ఆలోచనలో పడినట్లు అనిపించింది. ‘కొత్తగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది’ అన్నాను. చరణ్ ఇంకో క్షణం కూడా ఆలోచించలేదు. ► ‘రామ్చరణ్ ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు’ అని అందరూ అంటున్నారు. చరణ్ అలా చేయడానికి మీరు తనని ఏం చేశారు? ఏమీ చేయలేదు. స్టోరీ, క్యారెక్టరే తనని అలా డ్రైవ్ చేశాయి. ఏ ఆర్టిస్ట్ అయినా అంతే. వాళ్లకు మంచి క్యారెక్టర్ వస్తే రెచ్చిపోయి నటిస్తారు. డైరెక్టర్గా నేనా స్టోరీని, క్యారెక్టర్ని తన మనసుకి బాగా ఎక్కేలా చెప్పాను. ► సమంతను డీ–గ్లామరైజ్డ్గా చూపిస్తూనే అందంగా చూపించారు. ఆ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నా ఫ్యామిలీలోనే ఉన్నారు. నా చిన్నక్క కట్టూబొట్టూ అలానే ఉండేది. రామలక్ష్మీ క్యారెక్టర్ అనుకున్నప్పుడే అక్క కట్టూబొట్టూ ఫాలో అవ్వాలనుకున్నాను. సమంత కూడా చాలా బాగా చేసింది. ► ఫుల్ విలేజ్ బ్యాక్డ్రాప్.. అందులోనూ హీరోకి వినికిడి లోపం.. రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డారా? కొంచెం ఉండేది. అయితే చిరంజీవిగారు ఫస్ట్ కాపీ చూసి, ‘చాలా బాగుంది’ అన్న తర్వాత, చరణ్ పెద్దమ్మ (వసంతలక్ష్మీ – చరణ్ అమ్మ సురేఖకు అక్క)గారు చూసి, బాగుందన్నాక మొత్తం టెన్షన్ పోయింది. ఆవిడ జడ్జిమెంట్ బాగుంటుంది. ఆర్య, ఆర్య–2, 100% లవ్ సినిమాలు ‘చాలా బాగున్నాయి. హిట్ ఖాయం’ అని ఆమె అన్నారు. అది నిజమైంది. వసంతలక్ష్మీగారు ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెబుతారు. ఆవిడ చెప్పింది కరెక్ట్ అని అల్లు అరవింద్గారి ఫ్యామిలీ నమ్ముతుంది. నాకూ ఆవిడ మీద నమ్మకం. సినిమా చూశాక నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. సురేఖగారు కూడా చాలా బాగుందన్నారు. అప్పుడే నా టెన్షన్ మొత్తం పోయింది. ► ‘సినిమా బాగుంది’ అనే టాక్తో పాటు నాలుగు డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటుంది. కలెక్షన్స్ వైజ్గానూ ‘రంగస్థలం’ మీకు శాటిస్ఫ్యాక్షన్ ఇస్తుందనొచ్చా? డెఫినెట్లీ. బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరీర్. ప్రొడ్యూసర్స్ నవీన్, రవిశంకర్, మోహన్గార్లు హ్యాపీగా ఉన్నారు. వీళ్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో వీళ్ల మీద జోక్ వేసుకునేవాళ్లం. అదేంటంటే.. ఒకవేళ వర్షం వస్తే మబ్బులను కూడా కొనేసి, వర్షం రాకుండా చూస్తారని నవ్వుతూ చెప్పుకునేవాళ్లం. వాళ్లెంత అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్సో చెప్పడానికి ఇలా అనుకునేవాళ్లం. ‘ఇది కావాలి’ అంటే చాలు.. వెంటనే ఎరేంజ్ చేసేసేవారు. ఇవాళ ప్రాడెక్ట్ ఇలా ఉందంటే దానికి కారణం వాళ్లే. ► అది సరే.. ‘రంగస్థలం’ క్యారెక్టర్స్లో మీరు ఏ టైప్? అన్ని క్యారెక్టర్స్ మీరే రాసుకున్నప్పటికీ మీకేది ఇష్టం? నేను కుమార్ బాబు (రామ్చరణ్కి అన్నగా ఆది పినిశెట్టి చేసిన రోల్) టైప్ అండి. నేను రాసిన అన్ని పాత్రలూ నాకిష్టమే. కాకపోతే చిట్టిబాబుది స్పెషల్ ప్లేస్. ► మీది లవ్ మ్యారేజ్ కదా. కుమార్బాబు తన లవర్ని కలవడం కోసం మోపెడ్లో వెళతాడు.. మీరు? (గట్టిగా నవ్వేస్తూ). సైకిల్. అయ్య బాబోయ్. ఇప్పుడు నా లవ్స్టోరీ ఎందుకండీ? ఇంకోసారి మాట్లాడుకుందాం. ► ఇంతకీ మీ పిల్లలు ఏమన్నారు? ఏ పాట ఎక్కువగా పాడుతున్నారు? మా ఇంట్లో సినిమా అందరికీ నచ్చింది. మా అబ్బాయి ‘ఎంత సక్కగున్నావే..’ పాట పాడుతున్నాడు. వాళ్ల అమ్మని పట్టుకుని (నవ్వుతూ). మా ఇంట్లో మా ఆవిడే రామలక్ష్మీ (సమంత చేసిన క్యారెక్టర్ పేరు). ► మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అల్లు అర్జున్, మహేశ్బాబు, ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్. ఎలా బుట్టలో పడేస్తున్నారు? బుట్టలో పడేయడం ఏమీ ఉండదండి. ఒక సినిమా కోసం నేను హీరోలతో కనీసం రెండేళ్లు ట్రావెల్ చేస్తాను. వాళ్లతో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే పని సజావుగా జరగదు. నేను వాళ్లను బాగా ప్రేమిస్తాను. ఎంత అంటే 100% ఇష్టపడతాను. ఆ ప్రేమంతా నిజమైనదే. నటన కాదు. వాళ్లతో నేను ఎప్పుడైతే ప్రేమగా ఉంటానో అప్పుడు వాళ్లకూ నా మీద అభిమానం ఏర్పడుతుంది. సినిమా చేస్తున్నంతసేపు చాలా బాగుంటాం. చేశాక కూడా ఆ ఎఫెక్షన్ అలానే కంటిన్యూ అవుతుంది. ► కంటిన్యూస్గా సిటీ బోర్ అని విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు? వాట్ నెక్ట్స్? ఇంకా ఏమీ అనుకోలేదు. తెల్ల కాగితం బయటకు తీయాలి. రాయడం మొదలుపెట్టాలి. ► మీకు ‘రంగస్థలం’ హ్యాంగోవర్ ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది? ఇప్పట్లో వదలదు. ముందు ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించాలి. ► మూడు గంటల సినిమా చూస్తారో? లేదో? అనే డౌట్ ఉండేదా? ఉండేది కానీ, సినిమా చూశాక చిరంజీవిగారు ఒక్క ఫ్రేమ్ తీసినా బాగుండదన్నారు. ఆయన మాటలు విన్నాక నమ్మకం కుదిరింది. మరో నమ్మకానికి కారణం ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమా మూడు గంటలకు పైన కొంచెం ఉంటుంది. చూశారు కదా అనుకున్నా. ► ‘రంగస్థలం’ చూసి ఎవరు బాగా ఇంప్రెస్ అవ్వాలనుకున్నారు? నా టార్గెట్ చిరంజీవిగారే. సినిమా చూశాక నాతో గంట సేపు మాట్లాడారు. పక్కనే సురేఖగారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. – డి.జి. భవాని -
దేవీ.. ఎందుకిలా చేశావ్?
సాక్షి, హైదరాబాద్ : అనూహ్యమైన స్పందనతో రంగస్థలం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. సెకండాఫ్లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నప్పటికీ.. చెర్రీ నటన, విలేజ్ సెట్టింగ్తో సుక్కూ చేసిన మాయ వర్కవుట్ అయ్యింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు కూర్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. అయితే సినిమాలోని ఓ పాట గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలో ‘ఆ గట్టునుంటావా నాగన్న?’ పాట ఆడియో ఆల్బమ్లో ఇన్స్టాంట్ హిట్గా నిలిచింది. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఆ పాట సినిమాలో హైలెట్ కావటమని అంతా అనుకున్నారు. అయితే థియేటర్లకు వెళ్లిన వారికి ఆ సాంగ్తో దేవీ షాకిచ్చాడు. ఆడియోలో ఈ పాటను దేవి పాడిన వర్షన్ ఉంది. (రంగస్థలం రివ్యూ) నిజానికి ఒరిజినల్ వర్షన్ పాడింది జానపద గేయకారుడు శివ నాగులు. ఆడియోలో ఆ పాట అంత హిట్ కావటానికి కూడా ఆయన గాత్రమే కారణం. కానీ, సినిమాలో నాగులు వాయిస్ బదులు దేవీ గొంతు వినిపించటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సోషల్మీడియాలో దేవీని నిలదీస్తూ ట్వీట్లు చేస్తున్నారు. @ThisIsDSP Totally unfair playing your version of Aa gattununtava song in the Rangasthalam movie. Then what’s the point to have it sung by Shiva Nagulu in the first place. Disappointment! — Lee Keith (@ilikith) 30 March 2018 Enti @ThisIsDSP Garu ila chesaru.. #aagattununtava song entha trend aindi entha bagundi #ShivaNagulu voice lo.. didn’t expect this from you sir..album motham super anukuni movie ki vellelope ila chesaru.. ide movie lo chinna dissatisfaction #Rangasthalam — No One (@AnirudhBhupathi) 30 March 2018 The Only Complaint I have in this movie. Is @ThisIsDSP Singing for #Agatununava song instead of Shiva nagulu .. He Completely Ruined it.#Rangastalam#Rangasthalam — Pawan Kalyan™ (@Nanistweetz) 30 March 2018 @ThisIsDSP Is there any reason to sing "aa gattununnava" song instead of shiva nagulu's version ? Just curious to know. — Gowtham Lokanadham (@gowthamrebel) 30 March 2018 @ThisIsDSP Shiva nagulu song is Missing, why does the movie has DSP sung version #DSP #Rangasthalam. — Abhishek (@abhishek_2411) 30 March 2018 -
దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్ రావడం, రాంచరణ్, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే మన మిలియన్ మార్క్ను అధిగమించింది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్ను అధిగమించింది. సినిమా టాక్ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు. -
‘రంగస్థలం’ నిలిపివేత.. ఫ్యాన్స్ ఆందోళన
సాక్షి, నందిగామ : కృష్ణ జిల్లా నందిగామలోని మయూరి థియేటర్లో రంగస్థలం చిత్ర ప్రదర్శనను మధ్యలో నిలిపివేసారు. దీంతో అభిమానులు ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం టికెట్ పై రేటు లేకుండా అధిక ధరలు రూ.100, రూ. 150లకు అమ్ముతున్నారని ప్రేక్షకులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సూచనల మేరకు స్పందించిన స్థానిక తహశీల్దార్ థియేటర్కు చేరుకొని విచారణ పేరుతో చిత్ర ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి లోనవ్వడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మెగా పవర్స్టార్ రాంచరణ్ కథానాయుకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్తో దూసుకెళ్తుంది. -
చిట్టిబాబు
-
తెల్ల కాగితంలా రండి... ఓ మంచి సినిమా చూడండి
‘‘1980 బ్యాక్డ్రాప్లో ‘రంగస్థలం’ ఉంటుంది కాబట్టి అందుకు తగట్టుగా సెట్ డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనికా. నా టీమ్ అందరూ చాలా బాగా సహకరించారు. ఎక్కడా రాజీ పడకుండా మేం ఏది అడిగితే అది ఇచ్చిన ప్రొడ్యూసర్స్కు థ్యాంక్స్. ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాలు. ఎక్కడా తగ్గించొద్దు. అలానే రిలీజ్ చేయమని చిరంజీవిగారు చెప్పడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. అనసూయ ‘రంగమ్మత్త’ కారెక్టర్కి వంద శాతం న్యాయం చేశారు. నరేశ్ బాగా యాక్ట్ చేశారు. సినిమాలో కామెడీ సెపరేటుగా ఉండదు. క్యారెక్టర్స్లోనే కామెడీ ఉంటుంది. థియేటర్స్కి తెల్ల కాగితంలా రండి. ఓ మంచి సినిమా చూడండి. అద్భుతమైన ఫీల్ కలుగుతుందని గ్యారెంటీగా చెప్పగలను. ఎక్స్పెక్టేషన్స్తో రావద్దు’’ అన్నారు సుకుమార్. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ‘రంగస్థలం’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘రంగస్థలం’ విలేజ్ సెట్లో చిత్రబృందం విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.నవీన్ ఎర్నేనీ మాట్లాడుతూ –‘‘రంగ స్థలం’ సినిమాను వరల్డ్వైడ్గా 1700 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. సినిమాకు టీజర్ దగ్గర నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలను రీచ్ అవుతాం. ఇంత మంచి మూవీని మా బ్యానర్కు అందించిన సుకుమార్కి, రామ్చరణ్కు థ్యాంక్స్. చరణ్ నటన ఈ సినిమాలో పీక్స్లో ఉంటుంది. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎగై్జటెడ్గా ఉన్నాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రతి ఏడాది 2–3 అద్భుతమైన హిట్స్ వస్తున్నాయి. సుకుమార్గారు చేసిన సినిమాలన్నింటిలో ‘రంగస్థలం’ బెస్ట్ స్క్రీన్ ప్లే. నాకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారు. న్యాయం చేశాననే అనుకుంటున్నాను. చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. నేషనల్ అవార్డు వస్తుంది’’ అన్నారు నరేశ్.‘‘నా ఫేవరెట్ యాక్టర్ చరణ్కు అత్తగా నటించడం థ్రిల్లింగ్గా ఉంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేక్యారెక్టర్ చేద్దాం అనుకునే టైమ్లో సుకుమార్గారు ఈ పాత్ర ఇచ్చారు’’ అన్నారు అనసూయ. -
రంగస్థలం తొలి రివ్యూ: టాక్ ఏంటీ?
సాక్షి, హైదరాబాద్ : మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ నెల 30న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎంతసక్కగున్నావే, రంగమ్మ మంగమ్మ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించేశాయి. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈచిత్రానికి సెన్సార్ బృందం సైతం సినిమా బాగుందని కితాబు ఇచ్చిందంట. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న రంగస్థలంపై తొలి రివ్యూ వచ్చేసింది. యూఏఈకి చెందిన సినీ విమర్శకుడు ఉమర్ సంధూ ‘రంగస్థలం’పై తన రివ్యూను ప్రకటించారు. ఫుల్ పైసా వసూల్ మసాలా ఫ్లిక్గా అభివర్ణించారు. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశారు. అద్భుతమైన కథతో సుకుమార్ తెరకెక్కించాడని, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాకింగ్గా ఉందంటూ కితాబిచ్చారు. అంతటితో ఆగకుండా సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ రివ్యూపై టాలీవుడ్ అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. ఎందుకుంటే ఉమర్ సంధూ గతంలో కాటమరాయుడు, స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలకు టాప్ రేటింగ్ ఇచ్చాడు. ఈచిత్రాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందబోతోందో అని టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. కానీ మెగా అభిమానులు మాత్రం సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంధూ రివ్యూతో రంగస్థలాన్ని ముడిపెట్టి చూడలేమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. First Review #Rangasthalam from #UAE ! A Well Made Mass Entertainer. #RamCharan, #JagapatiBabu & @Samanthaprabhu2 Top Notch Performances, Eye Catching Cinematography, @ThisIsDSP Rocking Music & #Sukumar Terrific Direction & Story ! Go for it. 3.5*/5* 👏🇮🇳 pic.twitter.com/PXEihGISsm — Umair Sandhu (@sandhumerry) March 29, 2018 EXCLUSIVE First Review #Rangasthalam from #UAE Censor Board ! Paisa Vasool Commercial Masala flick. #RamCharan, @Samanthaprabhu2 & #JagapatiBabu gave Power Packed Performances ! Engaging Story & Direction by #Sukumar & Rocking Songs by @ThisIsDSP ! Go for it. 3.5*/5* 👏👌🇮🇳 pic.twitter.com/YhISI0cjg5 — Umair Sandhu (@sandhumerry) March 28, 2018 -
భారీ స్థాయిలో రంగస్థలం విడుదల
సాక్షి, సినిమా : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈచిత్రం యూ/ఏ సర్టిఫికేట్ను సొంతం చేసుకుంది. మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రంగస్థలం, విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమా విడుదలను సైతం భారీ స్థాయిలోనే ప్లాన్ చేశారు. ఇందు కోసం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని ఇతర ఏరియాలు, అమెరికాలో కలిపి మొత్తం సుమారు 1700 పైగా థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది. పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ రాబట్టడం కోసం నిర్మాతలు ఈ ఏర్పాట్లు చేశారు. 1980 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించింది. సమంత హీరోయిన్గా నటించింది. -
‘రంగస్థలం’ మూవీవర్కింగ్ స్టిల్స్
-
హీరోయిన్ బామ్మ ‘జిగేల్ రాణి’ స్టెప్పులు!
‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది. రాంచరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలోని ఈ ప్రత్యేక పాట వీడియో ప్రోమోను.. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే చూపించిన సోయగాలు, వేసిన స్టెప్పులు.. డ్యాన్స్తో అదరగొట్టిన రాంచరణ్.. అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ప్రస్తుతం (బుధవారం సాయంత్రానికి) య్యూటూబ్లో నంబర్ వన్గా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆన్లైన్లో దుమ్మురేపుతున్న ఈ పాటకు స్వయంగా పూజాహెగ్డే బామ్మ కూడా స్టెప్పులు వేశారు. 86 ఏళ్ల బామ్మ హుషారుగా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘మా బామ్మ గతకొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంది. నా ‘జిగేల్ రాణి’ పాట ప్రోమోను చూసి ఆమె సంతోషంలో మునిగిపోయారు. వెంటనే లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ పాట ఆమెకు ఎనర్జి ఇచ్చినట్టు ఉంది. అందుకే నేను చేసి పనిని ఇష్టపడి చేస్తాను’ అని పూజ ట్వీట్ చేశారు. జిగేల్ రాణి పాటకు పూజ బామ్మ స్టెప్పులు వేయడం నెటిజన్లను అలరిస్తోంది. -
జిగేల్ రాజా.. జిగేల్ రాణి...
బాగున్నారు కదూ. స్టిల్ చూస్తే డ్యాన్స్ ఇరగదీశారనిపిస్తోంది కదూ. జిగేల్ రాజా ఎవరో కాదు చిట్టిబాబు. అదేనండీ రామ్చరణ్. జిగేల్ రాణి పూజా హెగ్డే. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ‘రంగస్థలం’లో ఓ ఐటమ్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. ‘జిగేల్ రాజా.. జిగేల్ రాణి’ అంటూ సాగే ఈ పాట టీజర్ను చరణ్ బర్త్డే సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కానుంది. -
మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్
మెగాపవర్స్టార్ రామ్చరణ్ మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన పుట్టిన రోజు సందర్భంగా జిగేల్ రాణి ప్రోమో సాంగ్ను రిలీజ్ చేశాడు. మాస్ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్. ఈ పేటకు నేనే మేస్త్రీ..., ఆట కావాలా...పాట కావాలా... ఇలా మాస్కు హుషారు ఎక్కించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటలలో చిరు లుంగీ కట్టుకుని వేసిన స్టెప్స్ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గుర్తుండిపోయేవే. అయితే చిరు తనయుడు చరణ్ గత సినిమాల్లో లుంగీ కట్టుకుని మాస్ను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ, చిరు స్థాయిని మాత్రం అందుకోలేకపోయాడు. తాజాగా రంగస్థలం సినిమాలో చెర్రీ దాదాపుగా లుంగీలోనే దర్శనమివ్వబోతున్నాడు. అయితే సుకుమార్ సినిమాలో ఐటం సాంగ్స్కు ఉండే ప్రత్యేకతే వేరు. సుక్కు మేకింగ్, దేవీ మ్యూజిక్, విజువైలేజేషన్ ఐటం సాంగ్ను ఓ లెవల్కు తీసుకెళ్తాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నా...అభిమానులు మాత్రం జిగేల్ రాణి ప్రోమో కోసమే ఎదురుచూశారు. చెర్రీ బర్త్డే సందర్భంగా...ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. వీడియోలో చెర్రీ స్టెప్పులు, ఎనర్జీ చూస్తే అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. థియేటర్లో ఈ సాంగ్కు బాక్స్ బద్దలు అవుతాయేమో. -
రంగస్థలం టీంకు చెర్రీ గిఫ్ట్స్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన బుచ్చిబాబు, కాశీ, శ్రీనివాస్లకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చాడు. సినిమా అవుట్పుట్ విషయంలో చాలా ఆనందంగా ఉన్న చరణ్ తన ఆనందాన్ని యూనిట్ సభ్యులతో పంచుకుంటున్నాడు. ఈ రోజు (మంగళవారం) తన పుట్టిన రోజు కూడా కావటంతో యూనిట్ సభ్యులకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన రంగస్థలం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చరణ్ కొత్త సినిమా లుక్
రంగస్థలం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు రంగస్థలం సినిమా కోసం డిఫరెంట్ లుక్లో కనిపించిన చెర్రీ బోయపాటి సినిమా కోసం సరికొత్త లుక్ను ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. తాజా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కొత్త సినిమా లుక్ ను రివీల్ చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బోయపాటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండగా మరోసారి దేవీ ప్రసాద్ చరణ్ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ స్టైలిష్గా కనిపించనున్నాడు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రంగస్థలం ప్రమోషన్కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ కు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఇచ్చోటనే కదా..!
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయేఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించేఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయేఇచ్చోటనే ఎట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించె..! – జాషువా ఈ కరిగిపోవడం, అంతరించడం, కలిసిపోవడం, నశించడం.. ఇప్పుడు ఇచ్చోటనే రంగస్థలానికి వర్తిస్తోందా అనిపిస్తోంది! కానీ ఒక నమ్మకం. నాటక కళాకారులు ఆ పరిస్థితి రానివ్వరు. సుమారు 700 దశాబ్దాల చరిత్ర కలిగిన సురభి కళాకారులు నేటికీ ఎక్కడ నాటకం ఉందంటే అక్కడికి పెట్టేబేడా సర్దుకుని పొట్ట చేతబట్టుకుని వెళ్లి నాటకం ఆడుతున్నారు. ఎక్కడో ఒక మూలనైనా రంగస్థల కళలను ఆదరించే మారాజులు లేకపోతారా అని వారి ధీమా. టీవీ వచ్చాక ఠీవి తగ్గింది ఒకప్పుడు పల్లెల్లో వానలు పడలేదంటేనో, గతేడాది పంటలు సరిగా పండలేదంటేనో హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, రంగస్థల నాటకాలు ఆడించేవారు. అలా ఆడిస్తే వానలు కురుస్తాయని నమ్మకం. వీటి నిర్వహణకు అప్పట్లో పల్లె ప్రజలు తలా ఇంత మొత్తం వేసుకునేవారు. అలా రెండు దశాబ్దాల కిందటి వరకు కూడా రంగస్థలానికి మంచి ఆదరణే ఉండేది. ఎప్పుడైతే ఇంటింటికీ టీవీ రావడం మొదలైందో అప్పుడే రంగస్థలం పునాదులు కదలడం మొదలయ్యాయి. సాయంత్రం కాగానే జనం బయటకు రావడం మానేశారు. టీవీ సీరియళ్లతోనే కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయారు. కలతే బతుకు అయింది! ఒక్కరున్నా నాటకం ఆగదు. కానీ ఆ ఒక్కరైనా ఇప్పుడు చూడ్డానికే కరువయ్యారు. కళంటే బతుకునిచ్చేది మాత్రమే కాదు.. బతుకు నేర్పేది కూడా అని కళాకారులు చెబుతారు. అయితే కళాకారుల జీవితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మరో ఐదేళ్లు, పదేళ్లు దాటితే ఈ రంగస్థలాన్ని చూసే వారు కూడా ఉండరేమో అన్న ప్రశ్నకు కళాకారుల నోటి వెంట మాటలేదు. కళ ఎప్పటికీ బతికే ఉంటుందని ఎంత గాంభీర్యంగా చెప్పినా, వారి మోములో ఏదో చిన్నపాటి బెరుకు కనిపించింది. ‘నరుని లోపలి పరునిపై ద్రిష్టి పరుపగా..తలవంచి కైమోక్షి శిష్యుడవు నీవైతే..నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే.. అని ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పగలిగే కళాకారులు ఇంకా రంగస్థలంపై ఆశతో బతికే ఉన్నారు. అవును గంట సేపు ఏకధాటిగా మాట్లాడితేనే మా గొంతు బొంగురు పోతుంది. అలాంటిది మీరెలా తెల్లవార్లు పద్యాలు చెప్పగలరు అని కళాకారిణులను అడిగితే ఆ పరమేశ్వరుడి దయా కటాక్షం అంటారు. అది ఆయనిచ్చిన వరమంటారు. ఇలా ఏకబిగిన గంటలపాటు పద్యాలు చెప్పగలిగే కళాకారిణుల బతుకులెలా ఉన్నాయో తొంగిచూస్తే వర్ణించలేని బాధాతప్తత కనిపించింది. ఈ రంగంలోకి తమ పిల్లల్ని రానివ్వకూడదని కొందరు, ఈ రంగంలోనే వారసత్వంగా పిల్లల్ని తెచ్చేవారు కొందరు ఉన్నారు. వీళ్లు కాక.. పిల్లలు ఉన్నత చదువులు చదివినా విధిలేక ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వారిని ఈ రంగస్థలంలోకి తీసుకొచ్చిన మరికొందరున్నారు. రంగుల వెనుక వెలవెల బతుకు వెనుక ఎన్ని బాధలున్నా ముఖానికి రంగేసుకోగానే వాటన్నిటినీ పక్కనబెట్టి ప్రేక్షకులను మెప్పించడానికి రంగస్థల కళాకారిణులు పడే తపన, కష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడ ప్రేక్షకులు లేచిపోతారో అని రంగస్థల నాటకాల్లో సినిమా పాటలు పాడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ నాటకాన్ని రక్తి కట్టించవలసిన సందర్భాలూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు రంగస్థల నటీమణులను ‘ఫ్యామిలీ’ కలుసుకుంది. వారి మనోభావాలను తెలుసుకుంది. – జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి ఒకచోట స్థిరంగా ఉండలేం గత ఇరవై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. 2014లో జరిగిన నంది నాటకోత్సవాల్లో సతీసావిత్రి నాటకానికి నాకు నంది అవార్డు వచ్చింది. ఏ వృత్తిలోనైనా ఒకరిద్దరు కలిస్తే రాణించవచ్చు. కానీ, మాకు అలా ఉండదు. నాటకం వేయాలంటే ఒక బృందం కావాలి. నాటకం వేయాలని ఎక్కడి నుంచి పిలుపు వస్తుందో అక్కడికి అంతా వెళ్లిపోతాం. స్థిరంగా ఒక ప్రాంతానికే పరిమితం కాలేం. అందుకేనేమో మా కష్టాలను ప్రభుత్వం పట్టించుకోదు. – వనజకుమారి, రంగస్థల నటి ‘పని’ నాలుగు నెలలే! గత నలభై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. ఏడాదిలో మూడు, నాలుగు నెలలు తప్ప మిగిలిన రోజుల్లో పనులు ఉండవు. సంపాదించింది ఖర్చులకూ సరిపోదు. విగ్గులు, నగలు, చీరలు సరిపడా కొనడానికి సంవత్సరానికి ముప్పై వేలకు పైగా కావాలి. రెండు నెలలకోసారి మేకప్ కిట్ కొంటాం దానికి కూడా వెయ్యికి పైగా ఖర్చవుతుంది. ఈ కష్టాలన్నీ వినేవారెవరు? చిన్నప్పటి నుంచి కళ అంటే ప్రాణం. సాంఘిక నాటకాల్లో ఎక్కువగా నటించాను. రైతు సమస్యలపై రాసిన ‘పడమటి గాలి’ నాటకంలో నా పాత్ర (లచ్చిందేవి)కు చాలా మంచి పేరు వచ్చింది. పౌరాణికాల్లో బాలనాగమ్మ పాత్ర అంటే నాకు ఇష్టం. చిన్నచూపు వల్లే మానేశా ఎనిమిదేళ్ల వయసులో ఈ రంగానికి వచ్చాను. నలభై ఏళ్ల పాటు రంగస్థల నటిగా ఉన్నా. ఎక్కువగా చింతామణి పాత్ర వేశా. కందుకూరి పురస్కారం కూడా పొందాను. కానీ నాటకాలవాళ్లంటే ప్రజల్లో చిన్న చూపు ఉంది. ప్రేక్షకులైనా మా నటనను చూసి చప్పట్లు కొడితే అదే పదివేలు అనుకుంటాం. ఇప్పుడు అదీ దక్కడం లేదు. అందుకే బయటికి వచ్చేశాను. నా పిల్లలు కూడా ఈ రంగం వైపు రావడం నాకు ఇష్టం లేదు. – రజనీబాయి, రంగస్థల నటి తల్లిలా ఆదరించింది ప్రేక్షకుల అభిరుచీ మారింది. అందుకు అనుగుణంగా మేము ఆడాలి. మా పిల్లలకైతే ఈ రంగం మీద ఆసక్తి లేదు. నా వయసు 54 ఏళ్లు. నాటకాల్లో నాకు 36 ఏళ్ల అనుభవం. రంగస్థలం మమ్మల్ని తల్లిలా ఆదరించింది. ఇప్పుడు రంగస్థలమే ఆదరణ కోసం చూస్తోంది. – విజయలక్ష్మి, అనంతపురం రంగస్థలమే నా స్వస్థలం మా దగ్గర ఐదారు నెలల గర్భిణులు కూడా నాటకాలు వేస్తారు. ఎందుకంటే మరో జీవనోపాధి ఉండదు. 12 ఏళ్ల వయసులో నేను మొదటి సారి సురభి వాళ్ల దగ్గర బాలకృష్ణుడి పాత్ర వేశా. అప్పటి నుంచి రంగస్థలమే నా స్వస్థలమైపోయింది. నా కూతురు విజయశారద ఎం.ఏ వరకు చదివింది. ఆమె కూడా నాటక రంగంలోనే ఉంది. నా భర్త పేరు ఎస్వీ సెల్వం. ఆయన కూడా నాటకరంగంలోనే కాస్ట్యూమర్గా ఉండేవారు. మూడేళ్ల కిందట మా సొంత ఖర్చులతో ‘శ్రీనివాస కల్యాణం నాటకం’ వేశాం. అందుకు నాకు రూ.88,000 ఖర్చయింది. కానీ ప్రభుత్వం నుంచి నాకు అందిన సాయం రూ.8,000. అలాగే ఎస్ఆర్కే అనే నాట్యమండలిని స్థాపించి రూ.1,45,000 ఖర్చుతో నాటక పోటీలు నిర్వహించాం. ప్రభుత్వం నుంచి వచ్చింది మాత్రం రూ.5,000 మాత్రమే. ప్రభుత్వం కనీసం మాకు హెల్త్కార్డులైనా ఇవ్వాలి. – విజయకుమారి (58), అనంతపురం, కళాకారిణి అంతకాలం బతుకుతామా?! ఇప్పుడున్న రంగస్థలం ఉన్నతంగా ఏం లేదు. ఆడేది పాడేది రాకపోయినా రికార్డు డ్యాన్సులతో కాలం గడుపుతున్నారు. అందుకే నా పిల్లలను ఈ రంగంలోకి తీసుకురాలేదు. ఈ ప్రభుత్వాలు 60 ఏళ్లకు పింఛన్ ఇస్తున్నాయి. మేము అంతకాలం బతుకుతామన్న నమ్మకం కూడా లేదు. ఇంక పింఛన్ తీసుకునేదెప్పుడు? వై.ఎస్.జగన్ 45 ఏళ్లకే పింఛను అంటున్నారు. అది వస్తే మా బతుకులు కొంతైనా నయం అవుతాయి. – ఆశాలత, సురభి కళాకారిణి, శ్రీకాకుళం వింతగా చూసేవాళ్లు నేను ఐదేళ్ల వయసు నుంచే నాటక రంగంలో ఉన్నా. నాటకాల్లో కొన్ని ఏడ్చే సీన్ల కోసం జెండూ బామ్ వాడుతాం. అలా చేయడం వల్ల విపరీతమైన మంట, బాధగా ఉన్నా ప్రేక్షకులను అలరించడానికి, నాటకాన్ని రక్తి కట్టించడానికి చేయక తప్పేది కాదు. పైగా లైట్ల నుంచి వచ్చే కాంతి, వేడి వల్ల కళ్లకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా చూపు తగ్గిపోవడానికి అదే కారణం. నాటకం అయ్యాక ముఖానికి వేసుకున్న మేకప్ తీయడానికి కొబ్బరి నూనె వినియోగించేవాళ్లం. అది అందుబాటులో లేకపోతే కిరోసిన్తో శుభ్రం చేసుకుని మేకప్ తీయాల్సి వచ్చేది. అలా చేయడం వల్ల 40 ఏళ్లకే చర్మ రోగాలు వస్తాయని తెలిసినా మాకు వేరే గత్యంతరం లేదు. నా పెద్ద కూతురు వనజకుమారికి 45 ఏళ్లు. తను గత 25 ఏళ్లుగా నాట్యమండలిలో ఉంది. నా రెండో కుమార్తె అనిత కుమారికి చిన్న వయసులో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త సంపాదన చాలక తప్పనిసరి పరిస్థితుల్లో నాటకం వేయడం ప్రారంభించింది. ఒక్కోసారి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితులు వస్తాయి. అన్నింటినీ దిగమింగుకుని బతుకుతున్నాం. కానీ కళ అంటే మాకు గౌరవం. – సరోజ, రంగస్థల నటి, అనంతపురం -
మంచి స్థలం
‘బీయింగ్ ఇన్ ఎ గుడ్ ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్’.అంటే.. మనసు ఒక మంచి చోట ఉండాలి.మనసు కుదుటగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి.రంగస్థలం మీద ఎన్నో భావాలు కనబడొచ్చు, వినబడొచ్చు. కానీ రంగస్థలం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. మనసుకు అలాంటి రంగస్థలం మంచి స్థలం. అంతకుముందులా కాకుండా మీలో మార్పు కనిపిస్తోంది. వ్యక్తిగా, ఆర్టిస్ట్గా ‘మంచి స్పేస్’లో కూల్గా ఉన్నారనిపిస్తోంది. ఎక్కువ కాన్ఫిడెన్స్తోనూ కనిపిస్తున్నారు... రామ్చరణ్: నేను మార్పు కోరుకునే వ్యక్తిని. ‘సెల్ఫ్ చెక్’ అవసరమని నా నమ్మకం. పదేళ్లయింది... నేను ఇండస్ట్రీకి వచ్చి. నటుడిగా, వ్యక్తిగా ప్రతీ ఐదేళ్లకు నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకొని మారాలనుకుంటాను. ఐదేళ్ల క్రితం వేరు. ఇప్పుడు వేరు. ఐదేళ్ల తర్వాత ఇంకో మార్పు. ఈ మార్పుకి కొంత మీ బెటరాఫ్ ఉపాసనగారు కూడా కారణం అనుకోవచ్చా? కొంత మార్పు స్వతహాగా వచ్చింది. ఇంకో మనిషి జీవితంలోకి వచ్చాక వాళ్ల ప్రభావం మన మీదా.. మన ప్రభావం వాళ్ల మీదా పడుతుంది. నా మార్పుకి కొంత కారణం ఉపాసన. ‘ఐయామ్ హ్యాపీ ఫర్ దట్’. మీ డైట్ గురించి మీరు హైరానా పడాల్సిన అవసరం లేనంతగా ఉపాసనగారికి హెల్దీ డైట్ మీద అవగాహన ఉందికదా? యస్. మేం ఎక్కువ శాతం వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. నాన్–వెజ్ దాదాపు తగ్గించేశాం. నిజానికి మా డైట్ వినడానికి చాలా బోరింగ్గా ఉంటుంది. అన్నీ వెజిటబుల్ సూప్స్ ఉంటాయి. బీట్రూట్, స్పినాచ్ ఇలా. డైట్ గురించి నేను పెద్దగా శ్రద్ధ పెట్టను. నేను కష్టపడకుండా నా డైట్ అంతా తనే చూసుకుంటుంది. ‘రంగస్థలం’కి డైట్ ఏమైనా ఫాలో అయ్యారా? అస్సలు ఫాలో అవ్వలేదు. శుభ్రంగా తిన్నాను. గోదావరి చేపలన్నీ లాగించేశా (నవ్వుతూ). ‘ధృవ’ సినిమాకు పూర్తి ఆపోజిట్ ఇది. ఆ సినిమాకు డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాణ్ణి. ‘ధృవ’కి శారీరకంగా, ‘రంగస్థలం’కు మానసికంగా కష్టపడ్డారు. రెండిటిలో ఏది ఎక్కువ కష్టంగా అనిపించింది? ‘రంగస్థలం’ కష్టం. క్యారెక్టర్ని చాలా ఎంజాయ్ చేశా. అయితే అంతే భారం కూడా అనిపించింది. ఇంటికి వస్తే ‘చిట్టిబాబు’ (‘రంగస్థలం’లో రామ్చరణ్ పేరు) ఎక్కడ చరణ్లా అయిపోతాడో అని అదే మూడ్లో ఉండటానికి ట్రై చేసేవాణ్ణి. షూటింగ్ ఇన్సిడెంట్స్ రాత్రి కల్లోకి వచ్చేవి. స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయ్యారా? స్ట్రెస్ అనను కానీ నాలో చాలా భాగాన్ని ‘చిట్టిబాబు’కి ఇవ్వాల్సి వచ్చింది. ‘ఏంటి ఎప్పుడూ’ అనకుండా నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ఎక్కువ శాతం రాజమండ్రిలో ఉన్నాం. అక్కడ ఉన్నన్ని రోజులూ రాత్రీ పగలు షూటింగ్లో ఉండేవాళ్లం. గళ్ల లుంగీ, పూల చొక్కా ఇవన్నీ కొత్తగా అనిపించాయా? మా ఇంట్లో సాయంత్రమైతే నేను లుంగీలోనే ఉంటా. కంఫర్ట్బుల్గా అనిపిస్తుంది. ఈ సినిమా ఎఫెక్ట్ అని కాదు. ఒక రెండు సంవత్సరాల నుంచి లుంగీ కట్టుకోవడం అలవాటైంది. సుక్కూ (సుకుమార్) ఈ కథ చెప్పటానికి వచ్చినప్పుడు నేను లుంగీలోనే ఉన్నాను. యాక్చువల్లీ ముందు షార్ట్స్ అని డిజైన్ చేశాం. కానీ నన్ను లుంగీలో చూసి మాకు కావల్సిన విధంగానే ఉన్నావని ఇదే ఫిక్స్ చేసేశారు. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబుగా ‘రంగస్థలం’లో నటించారు కదా.. ఆ క్యారెక్టర్ నుంచి సినిమా పూర్తి కాగానే బయటికి రాగలిగారా? నిజం చెప్పాలంటే ఈ పాత్ర నుంచి బయటకు రావడం కొంచెం కష్టమే. సినిమా కంప్లీట్ అయిన కొన్ని రోజుల వరకూ నన్ను హాంట్ చేసింది. బేసిక్గా మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఈ ఫీల్ ఉంటుంది. లోపం లేకుండా ఉన్నట్టు నటించడం కష్టం. ఎలా మేనేజ్ చేశారు. సీన్స్లో ఎప్పుడైనా విన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టేసి, టేక్స్ తీసుకున్నారా? అలా జరగలేదు. సీన్ టూ సీన్ డిజైన్ చేసి మరీ చేశాం. వినికిడి లోపం ఉన్నవాళ్లు టక్కున రియాక్ట్ కారు. కొంచెం డిలే ఉంటుంది. ఒకటికి రెండు మార్లు గట్టిగా చెప్పాలి. ఇందులో పూర్తిగా చెవుడు కాదు. గట్టిగా మాట్లాడితే తప్ప వినిపించదు.. అంతే. సరిగ్గా వినిపించనివాళ్లు ఎదుటి వ్యక్తి లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తారు. ఆ విషయం మీకు తెలుసా? అవునండి. నాక్కొంచెం ఐడియా ఉంది. సుక్కూ (సుకుమార్) చాలా బాగా తీశాడు. ప్రతీ పాత్రను రీసెర్చ్ చేసి మరీ రాశాడు. నేనైతే నా ఒక్క పాత్ర గురించి తెలుసుకుంటే చాలు. తను అందరి పాత్రలూ బాగా స్టడీ చేశాడు. విమర్శకులు కూడా ఏం వంక పెట్టలేరు. ప్రతి సీన్కీ కేర్ తీసుకున్నాడు. యాస విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. డబ్బింగ్ అప్పుడు ప్రతీ పదం కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నాం. పాత్ర కోసం వినికిడి లోపం ఉన్నవారితో మాట్లాడారా? ఒక వ్యక్తితో మాట్లాడా. వినికిడి లోపం ఉన్న స్కూల్లో కేర్ టేకర్ ఆయన. వాళ్లు ఎలా ఉంటారు? మిషిన్ పెట్టుకొని ఎలా ఉంటారు? తీసేసినప్పుడు ఎలా వింటారు? అని బాగా రీసెర్చ్ చేశాం. ఇప్పటివరకూ మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకీ చిట్టిబాబు డిఫరెంట్. ఎలా అనిపించింది? నటుడిగా ఒక మార్పు కోరుకుంటున్నా. ఫుల్ డిఫరెంట్గా ఉండే స్టోరీ వస్తే బాగుండు అనుకుంటున్న టైమ్లో ‘రంగస్థలం’ స్క్రిప్ట్ వచ్చి నా ఒళ్లో పడింది (నవ్వుతూ). చాలా మంచి రోల్. ఇలాంటి రోల్స్ చాలా ఎక్కువ రావాలి అని కోరుకునేటటువంటి రోల్. చాలా ఎంజాయ్ చేశాను. సో.. కావాలని సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ అన్నమాట? యస్. కావాలని తీసుకున్నదే. ఇలాంటి మార్పు కనిపించకపోతే ఒక యాక్టర్గా నా జాబ్ నాకే బోర్ కొడుతుంది. డిఫరెంట్ రోల్స్ చేయాలి. అలాగే కమర్షియల్ హంగులన్నీ ఉండాలనుకున్నాను. అటు ఆడియన్స్కు ఇటు విమర్శకులకు... ఇద్దరికీ నచ్చేలాంటి కథ ఇది. ఒకేసారి అటు ఫ్యాన్స్కీ, ఇటు ఫిల్మ్ క్రిటిక్స్కీ నచ్చే స్క్రిప్ట్ అంటే చాలా రేర్గా కుదురుతుందేమో కదా? అవును. ఇద్దరికీ నచ్చే సినిమాలంటే నా కెరీర్లో ‘మగధీర’.. అలా కొన్ని ఉన్నాయి. డాడీ (చిరంజీవి) ఎయిటీస్లో చేసినవన్నీ అలాంటి సినిమాలే కదా. అప్పట్లో రియలిస్టిక్గా, జెన్యూన్గా తీసేవారు. అవే కమర్షియల్గా కూడా బాగా ఆడేవి. హీరో క్యారెక్టర్ ఫ్యాన్స్కు నచ్చేలా, కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేసేవారు. మీరు పెరిగిందంతా సిటీలోనే. గేదెలను, ఆవులను పల్లె వాతావరణాన్ని దగ్గరగా చూసి ఉండరేమో? అలా ఏం లేదండి. మాకు ఫార్మ్ ఉంది కదా. అక్కడ ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. మాకు పాలు అవీ అక్కడ నుంచే వస్తాయి. కానీ పల్లెటూరి వాతావరణంలో ఎక్కువ రోజులు ఎప్పుడూ ఉండలేదు. ‘ఆపద్బాంధవుడు’ షూటింగ్ టైమ్లో పూడిపల్లి వెళ్లాను. కానీ అది జస్ట్ ఒక వారం అంతే. డాడీ బర్త్డే ఉందని అక్కడికి వెళ్లాం. అప్పటి జ్ఞాపకాలేమైనా గుర్తున్నాయా? ఆ సినిమాలో డాడీ ఒడ్డున కూర్చుని శివలింగంతో మాట్లాడతారు. అది షూట్ చేసిన చోటే మేం ‘రంగస్థలం’ షూట్ చేశాం. నేను ఈత కొట్టే షాట్ అక్కడే షూట్ చేశాం. అప్పుడు మేం వెళ్లినప్పుడు ఉన్న ఇల్లు కూడా చూశాం. ‘రంగస్థలం’ చూశాక మీ మమ్మీ, డాడీ ఏమన్నారు? సాధారణంగా అమ్మ నా సినిమాలు చూసినప్పుడు బావుంది, నీ క్యారెక్టర్ బావుందని చెబుతుంటారు. కానీ ఈ సినిమా చూశాక చేయి పట్టుకొని పక్కన కూర్చున్నారు. ‘ఒక ఐదు నిమిషాలు అలా పక్కన కూర్చోరా’ అన్నారు. ఏం మాట్లాడలేదు. ఒకలాంటి బరువైన ఫీలింగ్లో ఉండిపోయారు. అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఉపాసనగారు మిమ్మల్ని ‘మిస్టర్ సి’ అని ట్విట్టర్లో సంబోధిస్తుంటారు. అలానే పిలుస్తారా? ట్విట్టర్లో వర్డ్స్ లిమిటేషన్ ఉంటుంది కదా. అందుకే ‘మిస్టర్ సి’ అని పెడుతుందేమో (నవ్వుతూ). ఇంతకీ ఆమె ఈ సినిమాని చూశారా? తనింకా చూడలేదు. నేనూ ఓన్లీ డబ్బింగ్లో చూశాను. గమనిస్తే మీకు పిల్లల మీద ప్రత్యేకమైన ఇష్టం కనిపిస్తుంటుంది. షూటింగ్స్ స్పాట్స్లో పిల్లలతో దిగిన ఫొటోలవీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి... నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం. జంతువులను కూడా ఇష్టపడతాను. వాళ్లున్నంత స్వచ్ఛంగా ఎవరూ ఉండరు. ఆ ప్యూరిటీకి దగ్గరగా ఉండాలని ఎక్కడైనా పిల్లలు కనిపించినప్పుడు సరదాగా టైమ్ స్పెండ్ చేస్తాను. అలాగే యానిమల్స్కి కూడా దగ్గరగా ఉంటాను. నెక్ట్స్ మూవీస్? నెక్ట్స్ బోయపాటిగారితో సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత రాజమౌళిగారి సినిమా. నేనూ తారక్ ఇద్దరం ఫ్రీ అయ్యాక ఈ ఇయర్ ఎండ్లో ఆ సినిమా స్టార్ట్ అవ్వొచ్చు. ఫైనల్లీ ఈరోజు మీ బర్త్డే. ఎలా జరుపుకోబోతున్నారు? హడావిడి ఏం లేదండి. సింపుల్గానే. బర్త్డేకి రెండు రోజుల తర్వాత ‘రంగస్థలం’ రిలీజ్ అవుతోంది.. మీ బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చా? ఎగ్జాట్లీ. డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టర్. మంచి బహుమతి. అల్లు అర్జున్ తనయుడు అయాన్ ‘రంగస్థలం’ కోసం మీరు వేసుకున్నట్లుగానే లుంగీ, చొక్కా తొడుక్కున్నా డు. అయాన్ని ఆ గెటప్లో చూసి మీకేమనిపించింది? మామూలుగా అయాన్ వాళ్ల నాన్నని ‘చరణ్ మామ పాట పెట్టు’ అని అడుగుతుంటాడట. ‘ధృవ’నుంచి ఇలా అడగడం మొదలుపెట్టాడట. ‘అయాన్ని మీ ఇంటికి తీసుకెళ్లిపో’ అని బన్నీ సరదాగా అంటుంటాడు. ఇప్పుడు ‘రంగస్థలం’ గురించి అడగడం మొదలుపెడితే, వాళ్ల నాన్న తన షర్ట్ని ఆల్ట్రేషన్ చేయించి కుట్టిస్తే.. దాన్నే లుంగీలా అనుకున్నాడట అయాన్. ఆ విషయం బన్నీ చెబితే నేను టైలర్ని పిలిపించి, ‘రంగస్థలం’లో నేను వేసుకున్నట్లుగానే లుంగీ, చొక్కా కుట్టించి ఇచ్చాను. అవి తొడుక్కుని చిట్టిబాబులా అయాన్ స్టిల్లిచ్చాడు. పిల్లలు వెరీ స్వీట్ అండీ. చిరంజీవిగారు అయ్యప్ప మాల వేసుకుంటారు. మీరూ మీ నాన్నగారిని ఫాలో అవుతుంటారు. మాలలో ఉన్నన్ని రోజులూ నేల మీదే పడుకుంటారా? అవును. దీక్షలో ఉన్న ఆ నలభైరోజులు జస్ట్ చాప మీద పడుకుంటా. చాలా నిష్టగా చేస్తా. అలా చేయగలననే నమ్మకం ఉంది కాబట్టే మాల వేసుకుంటాను. ఇలాంటి దీక్షలు చేసినప్పుడే మన మీద మనకు ఎంత కంట్రోల్ ఉంటుందో అర్థమవుతుంది. దీక్షలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ‘రంగస్థలం’ సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా మాలలోనే ఉన్నాను. మాల తీసేసిన తర్వాత కూడా ఆ ప్రశాంతత చాలా రోజులు నాతోనే ఉంటుంది. మీకు దైవభక్తి కూడా ఎక్కువే కదా.... నేను బేసిక్గా ఆంజనేయస్వామి భక్తుణ్ణి. నా పేరు కూడా ఆయనదే కదా. దేవుడంటే నమ్మకమే. కానీ సోమవారం ఈ దేవుడు.. మంగళవారం ఆ దేవుడు.. అని రోజుకొక దేవుణ్ణి కొంతమంది పూజిస్తుంటారు కదా. నాకు అంత లోతుగా తెలియదు. ఆంజనేయ స్వామిని పూజిస్తాను. ఉపవాసాలు చేస్తారా? అబ్బే... అస్సలు లేదు. జీవితం అంటేనే ‘రంగస్థలం’ అంటారు.. ఈ జీవిత రంగస్థలం గురించి ఏం చెబుతారు? ఫస్ట్ సాంగ్లో ఎగ్జాట్గా అదే చెప్పాం. మనమంతా కేవలం బొమ్మలం. మనమంతా రంగులేసుకోకుండా ఉన్న తోలు బొమ్మలం అని. అదే జీవితం. మీరు జీవితాన్ని ఎలా చూస్తారు. తేలికగా తీసుకుంటారా? సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఒకేలా తీసుకునేంత పరిపక్వత ఉందా? కొంతవరకూ తేలికగా తీసుకోగలుగుతా. లైఫ్ గురించి పెద్ద పెద్దగా చెప్పడం పెద్దగా తెలియదు. అయితే మన జీవితంలో రోజువారీ జరిగే విషయాలను ఎనలైజ్ చేసుకుంటూ వెళితే లైఫ్ అంటే ఏంటి? అనేది తెలిసిపోతుందని నమ్ముతాను. ఎప్పుడూ లేని విధంగా మీరు అనాథ శరణాలయాలకు వెళ్లడం, అక్కడ పిల్లలతో డ్యాన్స్ చేసి, స్వీట్స్ పంచడం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తోంది. దీనికి ఎవరు ఇన్స్పిరేషన్? ఇలా చేయాలని లోలోపల ఎప్పటి నుంచో ఉంది. కానీ అది ఆచరణలో పెట్టాలంటే అన్నీ కలసి రావాలి. ఆవైపు నన్ను ముందుకు నడిపే వ్యక్తి దొరకలేదు. ఉపాసన వచ్చిన తర్వాత ‘నీ ఆలోచనలు అటువైపు ఉన్నాయి. మనం వెళ్దాం’ అని నన్ను తీసుకెళ్తుంది. నా ఆలోచనలు ఆచరణలోకి వచ్చింది ఉపాసన వల్లే. తనకు థ్యాంక్స్ చెప్పాలి. తనలోనూ స్వతహాగా ‘హెల్పింగ్ నేచర్’ ఉంది. నాకూ అదే ఉండేసరికి ఇద్దరి ఈక్వేషన్ కుదిరింది. ‘ఇలాంటి ఈవెంట్స్ ఏవైనా ఉంటే చెప్పు. తప్పకుండా ఖాళీ సమయాల్లో వస్తాను’ అని తనకు చెప్పాను. – డి.జి.భవాని -
‘ఆ సమస్య రాకూడదనే టైటిల్ మార్చాం’
రంగస్థలం సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో టైటిల్ లోగోలో 1985 అనే పదం హైలెట్ అయ్యింది. కానీ కొంతకాలం తర్వాత 1985ను తొలగించి.. కేవలం రంగస్థలం అని ప్రచారం చేశారు. ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్స్లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘టైటిల్లో 1985 అని ఫిక్స్ చేయడం వల్ల సమస్యలు తలెత్తే ఛాన్సు ఉంది. ఎందుకంటే ప్రతీ ఐదేళ్లకొకసారి జనరేషన్లో ట్రెండ్.. ఫ్యాషన్ మారుతుంటాయి. అలా ఒక సంవత్సరానికి పరిమితం చేస్తే.. అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకునే చూస్తారు. అలాంటప్పుడు తప్పులను ఎత్తిచూపే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ గొడవా లేకుండా దాన్ని తీసేసి 80 నేపథ్యంలో జరిగే కథ అని పిరియాడికల్ డ్రామాగా రంగస్థలాన్ని ప్రకటించాం’ అని చెర్రీ చెప్పుకొచ్చాడు. ఇక మొదటగా చెర్రీకి.. సుకుమార్ కథేంటో కూడా చెప్పలేదంట . కేవలం చెవిటివాడిగా నటించాలనీ కోరాడని.. అందుకు ఒప్పుకుంటేనే కథ చెబుతానని తేల్చేశాడంట మన లెక్కల మాష్టార్. అయితే సుక్కూ మీద నమ్మకంతో అలా కథేంటో కూడా వినకుండా ఓకే చెప్పానని చెర్రీ తెలిపాడు. ఇక రంగస్థలం మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ విలేజ్ పొలిటికల్ డ్రామాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
చిట్టిబాబుకు ‘చిరు’ గిఫ్ట్
మెగా అభిమానులకు పండుగల పర్వం మొదలైంది. రామ్ చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత చెర్రీ బర్త్డే, రంగస్థలం రిలీజ్ ఇలా వెంటవెంటనే సంబరాలు చేసుకోబోతున్నారు. కాగా మెగా పవర్స్టార్ రామ్ చరణ్ బర్త్డే మంగళవారం(మార్చి 27) రోజున మెగా అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే పుట్టినరోజుకు ముందు రోజే చిరంజీవి ...చెర్రీకి గిఫ్ట్ ఇచ్చారు. ఓ వాచ్ను కుమారుడికి కానుకగా అందచేశారు. ‘ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్ను తగిలించిన పోస్టును చెర్రీ తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. మరోవైపు చెర్రీ సతీమణి ఉపాసన కూడా చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇక తల్లిదండ్రులతో కలిసి రామ్ చరణ్ దిగిన ఆ ఫోటోను మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. Mr.C gets Timeless love for his birthday 😘❤️🕰#happybirthdayMrC #ramcharan #megastarchiranjeevi pic.twitter.com/Og58EWcmol — Upasana Kamineni (@upasanakonidela) 25 March 2018 ఒక పక్క రంగస్థలం ప్రమోషన్స్లో భాగంగా అటు చెర్రీ, ఇటు సుకుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమా దగ్గర పడుతుండటంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు, రికార్డులు అంటూ అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఇదంతా ఎలా ఉన్నా...చెర్రీ బర్త్డేను అభిమానులు మాత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నారు. -
మల్టీ స్టారర్.. షాకిచ్చిన చెర్రీ
సాక్షి, హైదరాబాద్ : ఏ క్షణాన క్రేజీ కాంబో(ఆర్ఆర్ఆర్)లో మల్టీస్టారర్ చిత్రం అనౌన్స్ అయ్యిందో.. అప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలైపోయాయి. రాజమౌళి.. చెర్రీ-తారక్లతో ఫోటోను అప్ లోడ్ చేసినప్పటి నుంచే వీరి చిత్రం స్టోరీ గురించి మీడియాలో రకరకాల కథనాలు వినిపించాయి. ఇదిలా ఉంటే చెర్రీ ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చాడు. అసలు ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ఏదీ సిద్ధం కాలేదని తెలిపారు. ప్రస్తుతం రంగస్థలం చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రామ్ చరణ్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... ‘ఈ చిత్రానికి సంబంధించి కథ సిద్ధమైందన్న దానిపై నాక్కూడా స్పష్టత లేదు. కేవలం రాజమౌళిని నమ్మే ఆ చిత్రానికి సంతకం చేశాను. అంతేకాదు తారక్తో కాంబినేషన్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. అయితే కథను త్వరలోనే వినిపిస్తానని రాజమౌళి నాతో చెప్పారు’ అని చెర్రీ వెల్లడించాడు. మరోవైపు రాజమౌళి మాత్రం కథ నేపథ్యాన్ని ఓకే చేసుకున్నాడని.. స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడన్న వార్త ఒకటి వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఈ మల్టీస్టారర్ విషయంలో ఎలాంటి తొందరపాటు పనికి రాదని రాజమౌళి భావిస్తున్నాడనిపిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా తారాగణం.. టెక్నీషియన్ల పేర్లను ఆ సమయంలోనే ప్రకటించనున్నారు. -
సుకుమార్కు రంగమ్మత్త గురోపదేశం!
పాపులర్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రోటిన్కు భిన్నమైన పాత్ర అనే చెప్పాలి. ‘జబర్దస్త్’యాంకర్గా ఒకవైపు టీవీపై రాణిస్తున్న అనసూయ.. అడపదడపా సినిమాల్లోనూ మెపిస్తున్నారు. ‘క్షణం’ సినిమాలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇటీవల మోహన్బాబు ‘గాయత్రి’ సినిమాలోనూ కనిపించింది. ఇప్పుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా పలుకరించబోతుంది. మెగా హీరో రాంచరణ్, సమంత జోడీగా తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్తగా అనసూయది కీలకపాత్రేనని అంటున్నారు. ఈ సినిమాలో రంగమ్మత్త ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ నెల 30 వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా.. ‘రంగస్థలం’ షూటింగ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను అనసూయ ట్విట్టర్లో షేర్ చేసింది. అనసూయ ఒక పుస్తకాన్ని చదువుతూ.. దర్శకుడు సుకుమార్తో మాట్లాడుతున్న ఈ ఫొటోకు ‘గురువుగారికి రంగమ్మత్త గురోపదేశం’ అంటు కామెంట్ చేసింది. అనసూయ సుకుమార్కు చేసిన గురోపదేశం ఏమిటో కానీ, ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Guruvu gariki Rangammatta guropadesam.. 🤪🤩😍#Throwback #WhileShootInProgress#RangasthalamOn30thMarch #Rangammatta pic.twitter.com/YX489t2GO6 — Anasuya Bharadwaj (@anusuyakhasba) March 24, 2018 -
చిరుతో మూవీ.. సుక్కూ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో రంగస్థలం ద్వారా చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్. చిట్టిబాబుగా చెర్రీ చేయబోయే సందడి.. పొలిటికల్ విలేజ్ డ్రామా కోసం మెగా అభిమానుల కౌంట్డౌన్ మొదలైపోయింది. అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ ఓ చిత్రం చేయబోతున్నాడంటూ ఈ మధ్య జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం ఫలితంపైనే అది ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్లో పాల్గొంటున్న సుక్కూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశాడు. ‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేయాలన్నది నా కల. కానీ, తర్వాతి చిత్రం ఆయనతో అన్న వార్త వాస్తవం నిజం కాదు. అలాంటి ప్రతిపాదన కూడా చర్చకు రాలేదు’ అని సుకుమార్ తేల్చేశాడు. అయితే అల్లు అర్జున్తో తన తర్వాతి చిత్రం ఉండే ఛాన్స్ ఉందంటూ సుకుమార్ చివర్లో ఓ హింట్ ఇచ్చాడు. -
చిట్టిబాబు కథలో ‘సవ్యసాచి’
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. మల్టీ స్టారర్ సినిమాలకు ఒకే చెప్పటంతో పాటు ఒకరి సినిమాకు ఒకరు ప్రమోషన్ పరంగా సాయం చేసుకుంటున్నారు. ఇదే బాటలో అక్కినేని యువ హీరో సినిమాకు మెగా పవర్ స్టార్ సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగస్థలం సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి టీజర్ ను కూడా ప్రదర్శిచనున్నారట. ఈ టీజర్ మార్చి 27నే ఆన్లైన్లో రిలీజ్ కానుంది. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మాధవన్, భూమికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అదేంటో ఇప్పుడే చెప్పను : సమంత
సాక్షి, సినిమా : ఆ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ఇప్పుడే బయట పెట్టనని అంటున్నారు నటి సమంత. ప్రేమించిన వాడిని (నాగచైతన్య) మనువాడి సంతోషంగా ఉన్నానంటున్న ఈ మగువ నటిగానూ ఉన్నతిని చాటుకునే విధంగా పాత్రలను ఎంచుకుంటున్నారట. నిజం చెప్పాలంటే వివాహానంతరమే కథానాయకిగా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటిస్తున్నారు. దీని గురించి సమంత తెలుపుతూ తాను తెలుగులో రామ్చరణ్కు జంటగా నటిస్తున్న రంగస్థలంలో తానింతవరకూ పోషించనటువంటి గ్రామీణ పాత్రలో నటించానని, అలా అనడం కంటే గ్రామీణ యువతిగా జీవించాననే చెప్పాలని అన్నారు. ఇక సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం మహానటిలో తాను పాత్రికేయురాలిగా నటిస్తున్నానని, మరి కొందరు జమున పాత్రలో నటిస్తున్నానని ప్రచారం చేస్తున్నారని, వాటిలో నిజం లేదని అన్నారు. అయితే అందులో తన పాత్ర ఏమిటన్న సస్పెన్స్ను మాత్రం ఇప్పుడే బ్రేక్ చేయనని అన్నారు. ఇకపోతే కన్నడంలో మంచి విజయాన్ని సాధించిన యూటర్న్ చిత్ర రీమేక్లో నటిస్తున్నానని, అయితే దాని వర్జినల్గా నటించిన నటి కంటే విభిన్నంగా తాను నటిస్తున్నట్లు చెప్పారు. కన్నడ చిత్రం చూసిన వారికి కూడా తన చిత్రం కొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఇకపై కూడా వైవిధ్యం ఉన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానని సమంత అన్నారు. ఈమె తమిళంలో విశాల్కు జంటగా నటించిన ఇరుంబుతిరై చిత్రం కూడా విడుదలకు ముస్తాబుతోంది. అదే విధంగా శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సీమరాజా చిత్రం శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటోది. -
ఎంత సక్కగున్నావో
...బుజ్జి అయాన్ని చిట్టిబాబు గెటప్లో చూసినవాళ్లు ఇలా అనకుండా ఉండలేకపోయారు. బుడతడు అచ్చంగా తన మామ రామ్చరణ్ గెటప్లో దిగిపోయాడు. ఫొటోలు చూశారుగా. చిన్న చిట్టిబాబు భలే ముద్దుగా ఉన్నాడు కదూ. ‘‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు! హార్డ్కోర్ చరణ్ మామ ఫ్యాన్. ‘రంగస్థలం’ సాంగ్స్ను ప్లే చేయమని ప్రతి రోజూ అయాన్ అల్లరి చేస్తున్నాడు. ఎంత సక్కగున్నావ్ బే’ అని చిట్టిబాబు గెటప్లో ఉన్న కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లుఅర్జున్. ‘లైక్ మామ లైక్ అల్లుడు’ అన్నారు అల్లుఅర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి. రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, చిట్టిబాబు బ్రదర్ కె. కుమార్బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. జగపతిబాబు, ప్రకాశ్రాజ్, సీనియర్ నరేష్, అనసూయ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఒక్క పోస్ట్తో సమాధానం చెప్పిన బన్నీ
మెగా పవర్స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు మధ్య దూరం పెరిగిందనీ, అందుకే చెర్రీ కొత్త సినిమా రంగస్థలంపై కామెంట్ చేయడం లేదని సోషల్మీడియాలో బన్నీపై రూమర్స్ వచ్చాయి. పైగా సుకుమార్, అల్లు అర్జున్లు కూడా స్నేహితులే. అయినా కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడం లేదేంటని మెగా అభిమానులు తెగ ఆవేదన చెందారు. నిజంగానే బన్నీకి, చెర్రీకి దూరం పెరిగిందేమో అనుకుంటుంటే.. బన్నీ వీటన్నింటికి ఒకే ఒక పోస్ట్తో సమాధానం చెప్పాడు. మెగా హీరోలందరు రంగస్థలం సినిమాపై కామెంట్ చేశారు. కానీ, బన్నీ మాత్రం తన తనయుడు అయాన్కు చిట్టిబాబు గెటప్ వేసి ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఫోటోతో పాటు రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. ఎంత సక్కగున్నవ్.. అంటూ రంగస్థలంలోని పాటలతో చిట్టిబాబు గెటప్లో ఉన్న తనయుడిని పొగిడాడు. దీంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని మెగా అభిమానులు భావిస్తున్నారు. -
మెగా హీరోతో సుకుమార్ హ్యాట్రిక్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం ఈ నెలాఖరున రిలీజ్ అవుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ గత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. రంగస్థలం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతుండగా సుకుమార్ చేయబోయే తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ తన తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్లో చేయనున్నాడు. అంతేకాదు సుకుమార్ నెక్ట్స్ సినిమాలో కూడా మెగా హీరోనే నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఘనవిజయం సాధించగా.. ఆర్య 2 యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. తాజాగా మరోసారి బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా.. బన్నీతో సుకుమార్ సినిమా అన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది. -
అంతా అనసూయ గురించే...
సాక్షి, సినిమా : రంగస్థలం ప్రీ రీలీజ్ ఈవెంట్లో తన పాత్ర గురించి యాంకర్ అనసూయ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. అసలు తనకు ఆ పాత్ర చేయటం అస్సలు ఇష్టం లేదని.. కానీ, సుకుమార్ బలవంతం మేరకు తాను ఆ పాత్ర చేశానని, ఆ తర్వాతే ఆ పాత్ర విలువేంటో తెలిసి ట్రావెల్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అంతలా ఆ పాత్రలో ఏం స్పెషాలిటీ ఉందా? అన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రంగమత్త పాత్రకు సంబంధించి పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇప్పటిదాకా క్లాస్, గ్లామర్ రోల్ల్లో కనిపించిన అనసూయ.. ఇందులో పూర్తిగా డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నట్లు అర్థమౌతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన్న రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ఇంపార్టెన్స్ ఉంటుందనే.. అందుకే అనసూయ ఓకే చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్, సమంత లుక్కులు ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నప్పటికీ అనసూయ పాత్ర విషయంలోనే చిన్నపాటి సస్పెన్స్ మెయింటెన్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. -
రంగస్థలం ట్విస్ట్ లీక్ చేసిన చిరు
మెగా అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఆదివారం ( మార్చి 18) నాడు విశాఖలోని ఆర్కే బీచ్లో మెగా అభిమానుల మధ్య సందడిగా రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు. ట్రైలర్ లాంచ్ అనంతరం మెగాస్టార్ చిరు ప్రసంగిస్తూ.. పుత్రోత్సాహమో మరేమో కానీ రంగస్థలంలోని ట్విస్ట్ చెప్పేశాడు. ఈ సినిమా చూశానని ప్రతీ సన్నివేశం అభిమానులన అలరిస్తుందనీ, ఆర్టిస్ట్గా చరణ్ను చూసి అసూయపడుతున్నాననీ, తండ్రిగా గర్వ పడుతున్నానని ఉద్వేగంగా చెప్పారు. రంగస్థలం సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుందని సగటు ప్రేక్షకుడికి తెలుసు. ట్రైలర్ రిలీజైన తర్వాత సినిమాలోని కథ రాజకీయ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఇక ట్విస్ట్ ఏముందీ అనుకునే లోపు... కుమార్బాబు(ఆది) చనిపోతాడని చిరు చెప్పేయడంతో అందరికి తెలిసిపోయింది. కుమార్బాబు తమ్ముడు చిట్టిబాబు తర్వాత ఏంచేస్తాడో అందరూ ఊహించే విషయమే. అయితే అనసూయకు సంబంధించిన పాత్ర కూడా ప్రేక్షకులకు తెలిసిపోయింది. రంగమ్మత్త క్యారెక్టర్లో అనసూయ నటించినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విషయమై అనసూయను అడగ్గా అలాంటిదేమీ లేదని దాటేసింది. కానీ అదే నిజమని తేలిపోయింది. చరణ్ పక్కన అత్తగా చేయాలంటే మొదట ఒప్పుకోలేదనీ, సుకుమార్ కోసమే ఈ క్యారెక్టర్ చేసినట్లు చెప్పిన అనసూయ, ఈ పాత్ర తనకెంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. -
రంగస్థలం ట్విస్ట్ లీక్ చేసిన చిరు
-
‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నా: చిరంజీవి
‘‘విశాఖకి వచ్చిన ప్రతీసారి ఆనందం, ఉద్వేగం అనిపిస్తుంది. విశాఖను చూస్తే నా సినిమాలు ‘ఆరాధన, అభిలాష’, ‘బంగారు కోడిపెట్ట..’ గుర్తుకొస్తాయి. మైత్రీ మూవీస్ మిత్ర త్రయానికి ధన్యవాదాలు. ముగ్గురి కో–ఆర్డినేషన్ చూస్తే ముచ్చటేస్తోంది. మంచి సినిమాలు తీయాలని తపిస్తుంటారు. సుకుమార్ అద్భుతమైన పనితనం చూపించాడు. ఎన్నో సినిమాలు వచ్చాయి పల్లెటూరి నేప«థ్యంలో. ఇది చాలా ప్యూర్ సినిమా. సుకుమార్ ఎలా చెప్పాడో అలాగే తీశాడు. పల్లె మనస్తత్వాలను బాగా చిత్రీకరించాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్వరకు ఎంజాయ్ చేశాను. ఇది చరణ్కు స్టార్ స్టేటస్ను పెంచి నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించే సినిమా. ఆర్టిస్ట్గా ఈర్ష్య పడుతున్నాను.. తండ్రిగా గర్వ పడుతున్నాను’’ అన్నారు నటుడు చిరంజీవి. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగస్థలం’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక వైజాగ్లో జరిగింది ఈ సందర్భంగా ‘‘చిరంజీవి మాట్లాడుతూ – ‘‘హీరోకి వినికిడి లోపం ఉంది అంటే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అని కంగారుపడ్డాం. అయితే చరణ్ ఫుల్గా ఎంటర్టైన్ చేశాడు. నవ్వించాడు, ఏడిపించాడు. ఒక డీ గ్లామరైజ్డ్ పాత్రలో శభాష్ అనిపించుకున్నాడు. సుకుమార్ ఈ సినిమాకి అగ్రతాంబులాం. కర్త, కర్మ క్రియ. దేవిశ్రీ ప్రసాద్ చాలా అద్బుతమైన బాణీలు ఇచ్చాడు. చంద్రబోస్ తెలంగాణ బిడ్డ అయ్యుండి ఈ సినిమాలో గోదారి గడ్డ మీదుండే పల్లె పదాలను అంత చక్కగా రాయడం మాములు విషయం కాదు. ‘మీ పెన్నుకు నా వెన్ను’ వంచి నమస్కరిస్తున్నాను. ‘రోబో’ చేసిన రత్నవేలేనా ఈ సినిమా చేసింది అనిపించింది. జూబ్లీ హిల్స్లో విలేజ్ను సృష్టించారు. గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్స్ సెట్ వేస్తే అసలు సెట్ వేసినట్టు ఉండదు. ఆ వాతావరణాన్ని అలా క్రియేట్ చేసిన రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. సినిమా చూశాక స్పెల్బౌండ్ అయ్యాను. కొడుకును హగ్ చేసుకుంది సురేఖ. విలేజ్ను చూసింది లేదు. రాణిస్తాడా లేదా అనుకున్నాను కానీ చాలా చక్కగా చేశాడు. డెప్త్కి వెళ్లి చేశాడు. ఏడవకుండా ఏడిపించటం చాలా గ్రేట్. సమంత సమంతలా కనిపించలేదు. ఆమె హావభావాలు బాగా చూపించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డులు రాకపోతే అన్యాయం జరిగినట్టే’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘సినిమా రషెస్ చూసినవాళ్లు చెప్పిన మాటేంటంటే చరణ్ మునుపెన్నడూ చేయనంత అద్భుతంగా చేశాడని. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో సినిమాను లిఫ్ట్ చేశాడు. సుకుమార్ ఎంత గొప్ప డైరెక్టర్ అంటే సినిమా చేస్తానంటే చాలు ఏ హీరో అయినా తనకు డేట్స్ ఇచ్చేస్తాడు. చిరంజీవిగారు వేసిన రహదారి మీదే ఇప్పుడున్న మెగా హీరోలంతా వెళ్తున్నారు. ఆయన పడ్డ కష్టమే ఇదంతా’’ అన్నారు. ‘‘చిన్నప్పటినుంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలనుకున్నాను. అది సుకుమార్ సినిమాతోనే నేరవేరటం హ్యాపీగా ఉంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘సుకుమార్గారు చాలా ప్రేమతో రాశారు రామలక్ష్మి క్యారెక్టర్. ఆయన గర్వపడేలా చేయాలని చాలా కష్టపడి చేశాను. చిరంజీవిగారికి ‘స్వయంకృషి’ సినిమా ఎలానో చరణ్కి ‘రంగస్థలం’ అలా అవుతుంది’’ అన్నారు సమంత. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు రాజకీయాల్లోకి వెళ్తుంటే దేవి ఓ మాట అన్నాడు. ముఖ్యమంత్రి పదవి కంటే మెగాస్టార్ పదవే పెద్దది కదా అని. అవును సార్.. ఎన్ని పదవులున్నా మెగాస్టార్ పదవి చాలా ప్రత్యేకం. చిరంజీవిగారు సినిమా చూసి ఇంటికి పిలిచారు. చిరంజీవిగారు అభినందించినప్పుడు పక్కన ఎవరూ లేరు. ఒకవేళ అది బయట చెబుదాం అంటే అబద్దం అనుకుంటారేమో అని భయం. అంత గొప్పగా పొగిడారు. మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఖర్చు దగ్గర అస్సలు వెనకాడరు. ఒకవేళ నేను గుడ్ డైరెక్టర్ అని ఎవరైనా అంటే ఆ గుడ్ రత్నవేలు గారు. నేను సినిమా చేయాలంటే కథ అవసరం లేదు, దేవి ఉంటే చాలు. మూడున్నర రోజుల్లో పాటలన్నీ కంప్లీట్ చేశాం. చంద్రబోస్గారు పాటలు ఎలా రాశారంటే ఒక కవి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో అలాంటి పదాలు వాడారు. సమంతను లైఫ్ లాంగ్ డైరెక్ట్ చేయాలనుంది. అంత గొప్ప న టి. ఆర్ట్ డైరెక్టర్స్కు అవార్డు క్రియేట్ చేసి ఇవ్వాలని ఉంది. ఆది క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. చరణ్ చాలా తొందరగా క్యారెక్టర్లోకి వెళ్లిపోయాడు. చరణ్ ఫస్ట్ డే టేక్ చేయగానే చప్పట్లు కొట్టాం’’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాను డీల్ చేశారు. విజువల్స్ను రత్నవేలు తెరమీద అందంగా చూపించారు. ఊరిని బాగా పరిచయం చేసిన సుక్కుకి థ్యాంక్స్. షూటింగ్ చేసిన తర్వాత ఎందుకు సిటీలో ఉంటున్నామా? అనిపించింది. సిటీలో మనం కొంచెం కలుషితం అయిపోయాం. కానీ అక్కడి మనుషులు చాలా ప్యూర్గా ఉంటారు. గోదావరి నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి. ఆది నిజంగా నాకు అన్నయలాగానే ఉన్నాడు. ఒక మంచి కో–ఆర్టిస్ట్ దొరికితే ఎంత బాగా చేయొచ్చో సమంత వల్ల తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇస్తే, చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు. సుక్కు ఒక కొత్త చరణ్ని నాకు పరిచయం చేశారు. ఆ చరణ్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. మార్చి 30 తర్వాత సుకుమార్ని చూడనా అని బెంగ పట్టుకుంది. అమ్మానాన్న, ఫ్యాన్స్ గర్వపడే ఒక సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత నవీన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి గారికి థ్యాంక్స్. చరణ్గారి విశ్వ రూపం చూస్తారు. సమంత అద్భుతంగా చేశారు. దేవిశ్రీ, సుకుమార్ టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు. ఈ వేడుకలో ఉపాసన, పూజా హెగ్డే, ఆది, చంద్రబోస్, అనసూయ, రామకృష్ణ, మోనికా, రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగస్థలం ట్రైలర్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్ : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రంగస్థలం థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. ‘మా ఇంజన్కు కులం గోత్రాలు ఉండవు ఏ చేను అయినా తడిపేస్తది అంతే’ ‘చిట్టిబాబు చెవిలోకి మాటెళ్లడం కష్టం గానీ... ఒక్కసారి వెళ్లిందంటే అది గుండెల్లో ఉండిపోద్దయ్యా..’ గిల్లుతున్నావేంటి గాజులు కొనిపెట్టమంటే..! అనే సమంత డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. గ్రామ నేపథ్యంలో సాగే కథ కోసం నటీనటులు పడిన కష్టం ట్రైలర్లో అర్థం అవుతోంది. ఇప్పటికే విలేజ్ గర్ల్ పాత్రలో సమంత లుక్స్కు ఫిదా అయిన ఫ్యాన్స్కు తాజా ట్రైలర్తో పండుగ చేసుకుంటారనడంలో సందేహం లేదు. ట్రైలర్ను కింద వీక్షించొచ్చు.