పేరడీ సినిమా టీం షాకింగ్ ఎనౌన్స్ మెంట్ | Tamizh Padam 2.0 team shocking announcement | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 9 2017 1:35 PM | Last Updated on Sat, Dec 9 2017 1:35 PM

Tamizh Padam 2.0 team shocking announcement - Sakshi

సాధారణంగా సినిమా పోస్టర్ తో పాటు ఆడియో రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేయటం చూస్తుంటాం. కానీ ఓ తమిళ సినిమా నిర్మాతలు ఏకంగా ఈ సినిమా ఎప్పుడు పైరసీ వర్షన్ వస్తుందో కూడా ఎనౌన్స్ చేశారు. కోలీవుడ్ ఘన విజయం సాధించిన తమిళపడం సినిమాకు సీక్వల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ పడం 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను వినూత్నంగా ప్రకటించారు చిత్రయూనిట్.

తమిళ హీరో సిద్ధార్థ్ రిలీజ్ చేసిన పోస్టర్ లో టైటిల్ లోగోతో పాటు సినిమాను 25 మే 2018 న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆ మరుసటి రోజు 26 మే 2018న సినిమా తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో పైరసీ వర్షన్ రిలీజ్ అవుతుందని అదే పోస్టర్ లో ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోల సినిమాల పేరడీ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అముదన్ దర్శకుడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement