Tamil cinema
-
అజిత్ కుమార్ విదాముయార్చి.. ఆ సినిమా కంటే తక్కువగా తొలి రోజు కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్ కలెక్షన్స్కే పరిమితమైంది. అయితే వీకెండ్స్లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ భారీ బడ్జెట్తో నిర్మించారు. -
93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!
రిలీజైన ప్రతి సినిమా హిట్టవదు. కంటెంట్లో దమ్మున్నవి మాత్రమే హిట్టు, సూపర్ హిట్టుగా నిలుస్తాయి. కథలో ఏమాత్రం పస లేకపోయినా సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. అలా తమిళ సినిమాలోనూ వందల సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించారు. 2024లో తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలెన్ని? (Kollywood Box Office Report - 2024) లాభనష్టాలేంటి? అనేవి ఓసారి చూసేద్దాం..రూ.1000 కోట్ల నష్టంకోలీవుడ్ (Tamil Cinema Industry)లో గతేడాది 241 సినిమాలు రిలీజయ్యాయి. వీటికోసం తమిళ ఫిలిం మేకర్స్ దాదాపుగా రూ.3000 కోట్లు ఖర్చుపెట్టారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసిన నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గ భంగపాటు ఎదురైంది. ఏకంగా 223 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేకపోయాయి. దీంతో వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లింది. సూర్య, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోల సినిమాలు సైతం చతికిలపడ్డాయి. రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన కంగువా రూ.1000 కోట్లు రాబడుతుందనుకున్నారు. అతి కష్టమ్మీద రూ.100 కోట్లు!తీరా చూస్తే కేవలం రూ.106 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాగే టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇండియన్ 2 సినిమా (Indian 2 Movie)ను రూ.250 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. చివరకు ఇది కూడా కంగువా బాటలోనే పయనించింది. రూ.150 కోట్లకంటే ఎక్కువ రాబట్టలేకపోయింది. రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రాన్ని సైతం ప్రేక్షకులు ఇలాగే తిరస్కరించారు.చదవండి: పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన93% సినిమాలు ఫ్లాప్2024లో కేవలం 18 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి. ఈ లెక్కన గతేడాది 93% చిత్రాలు ఫ్లాప్ లిస్ట్లో చేరిపోగా ఏడు శాతం మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ జాబితాలో అమరన్ (Amaran Film), ద గోట్, రాయన్ వంటివాటితో పాటు లబ్బర్ పందు, గరుడన్, డిమాంటి కాలనీ 2, వాళై చిత్రాలూ ఉన్నాయి. 2025కి తమిళ ఇండస్ట్రీ శుభారంభం పిలికింది. మదగజరాజ, కుడుంబస్తాన్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి. కానీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్గా నిలిచింది.ఆశలన్నీ ఈ ఏడాదిపైనే!2023లో జైలర్, పొన్నియన్ సెల్వన్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కాసులవర్షం కురిపించాయి. కానీ 2024లో మాత్రం ఇండియన్ 2, కంగువా, వేట్టైయాన్ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడ్డాయి. ద గోట్, అమరన్, మహారాజా, రాయన్, అరణ్మణై 4 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే హిట్టందుకున్నాయి. 2024 అత్యంత చెత్త సంవత్సరంగా నిలిచింది. 2025లో ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాం.- నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జి. ధనాంజనేయన్చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ -
అనూహ్య మలుపులతో.. ఇరవిల్ విళిగల్
తమిళసినిమా: సైకో థ్రిల్లర్ కథా చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినప్పటికీ ఆ తరహా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తూ నే ఉంటుంది. ఆ తరహాలో రూపొందుతున్న మరో చిత్రం ఇరవిల్ విళిగల్. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత రీమా రే ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈమె బంగారా అనే కన్నడ చిత్రంలో నటించడానికి గానూ ఉత్తమ కథానాయకి అవార్డును పొందారు. దర్శకుడు సిక్కల్ రాజేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నిళల్ గల్ రవి, మస్కార అస్మిత, కుందాజ్, చరణ్ రాజ్, సిజర్ మనోహర్, ఈశ్వర్ చంద్రబాబు,కిళి రామచంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిక్కల్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది సైకో థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. సైకోగా మారడానికి ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తి గత కారణం ఉంటుందని, అలా ఈ చిత్రంలో ఒక వ్యక్తి సైకోగా మారడానికి సమాజంపై కోపం, ఒక విషయం కారణం అవుతాయన్నారు. అవేమిటన్న విషయాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్ను అధిక భాగం ఏర్కాడు సమీపంలోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహించినట్లు చెప్పారు. కొంత భాగాన్ని పాండిచ్చేరి, మరక్కాణం పరిసర ప్రాంతాలలో చిత్రీకరించి మొత్తం 50 రోజుల్లో షూటింగ్ను పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి ఎంఎం.అజార్ సంగీతాన్ని, భాస్కర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
కోలీవుడ్ టార్చ్ బేరర్స్
కొంతకాలంగా నడక మార్చుకుంటోంది తమిళ సినిమా. వెండితెర నిర్వచనాన్ని మార్చే బాధ్యతను భుజానకెత్తుకున్నారు కోలీవుడ్ కొత్త కథనాయకులు. ఇక్కడ కథానాయకులు అంటే తెరపై కనిపించే హీరోలు కారు. సిల్వర్ స్క్రీన్ను రీ డిఫైన్ చేస్తూ ఇండస్ట్రీకే టార్చ్ బేరర్స్గా మారిన దర్శకులు. హీరోల ఇమేజ్ చుట్టూ తిరిగే కథలకు ఎండ్ కార్డ్ వేసి రొటీన్ ఫార్ములా సినిమాలకు మంగళంపాడేశారు ఈతరం దర్శకులు.సమాజం పెద్దగా పట్టించుకోని అంశాలనే ముడి సరుకుగా తీసుకుని ఈ దర్శకులు తెరకెక్కిస్తున్న చిత్రాలు తమిళ సినిమాను కొత్త పంథాలోకి తీసుకెళ్తున్నాయి. అట్టడుగు ప్రజల జీవితాలే ఆ చిత్రాల కథా వస్తువులు. ప్రతి ఫ్రేమ్లోనూ సామాజిక స్పృహ ఉట్టిపడేలా సోషల్ కమిట్మెంట్తో సినిమాలు తీస్తున్నారు. కోలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఆ ముగ్గురు దర్శకుల గురించి తెలుసుకుందాం.సామాజిక వివక్షే కథగా...అణిచివేతకు గురైన వాడికే వివక్ష వికృత రూపం తెలుస్తుంది. తమిళనాడులో అణగారిన వర్గానికి చెందిన మారి సెల్వరాజ్ తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షనే సినిమా కథలుగా మార్చుకున్నారు. అట్టడుగు ప్రజల గళంగా మారారు ఈ దర్శకుడు. తమిళ సంస్కృతి నేపథ్యంలో వాస్తవ జీవిత గాథలను ఆవిష్కరిస్తున్నారు.2018లో తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ నుంచి ‘కర్ణన్, మామన్నన్’, మొన్నటి ‘వాళై’ వరకు ప్రతి చిత్రంలోనూ కులం కట్టుబాట్లు, ప్రజల హక్కులు, గౌరవప్రదమైన జీవితం... మారి సెల్వరాజ్ చర్చకు పెట్టే అంశాలు ఇవే. మెయిన్ స్ట్రీమ్ సినిమా పట్టించుకోనిపాత్రలకు వాయిస్ ఇస్తూ తన సినిమా ద్వారా సామాజికపోరాటం చేస్తున్నారు. మారి సెల్వరాజ్ సినిమాల్లో కల్చరల్ రిప్రజంటేషన్ తప్పక ఉంటుంది. బడుగు బలహీన వర్గాల గ్రామీణ జీవన విధానాన్ని నిజాయితీగా కళ్లకు పట్టే ప్రయత్నంలో ఈయన ప్రతి సందర్భంలోనూ సక్సెస్ అవుతున్నారు.పోరాట యోధులుగా...సినిమా అంటే ఏదో ఒక కథ చెప్పడం కాదు. వివక్ష కారణంగా పూడుకుపోయిన గొంతులకు వాయిస్ ఇవ్వాలి. శతాబ్దాల నుంచి వివక్షను అనుభవిస్తున్న కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తి స్వరం సినిమాగా చూపించాల్సి వచ్చినప్పుడు ఘాటుగానే ఉంటుంది.పా. రంజిత్ సినిమాలు కూడా అంతే. అంబేద్కర్ ఆలోచనా విధానానికి తగ్గట్టు దళిత్ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసేందుకు చిత్ర పరిశ్రమలో రాజీలేనిపోరాటమే చేస్తున్నారాయన.కబాలి (2016), కాలా (2018)... ఈ రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్కి సామాజిక న్యాయం కోసంపోరాడే యోధుడిపాత్రను మేళవించిపా. రంజిత్ చిత్రించిన విధానం తరాలుగా అన్యాయాలకు గురవుతున్న వర్గాలకు కొత్త బలాన్ని ఇచ్చింది. రంజిత్ సినిమాలకు రజనీకాంత్ కూడా ఫిదా అయిపోయారు. సామాజిక అంశాలు... వాటిని ప్రభావితం చేసే ΄పొలిటికల్ డైనమిక్స్ రంజిత్ సినిమాలో నిండి ఉంటాయి. చరిత్ర మూలాల్లోకి వెళ్లి దళితుల సంఘర్షణలను, వారి ఆత్మగౌరవపోరాటాలను వెలికి తీసి ఈ ఏడాది ‘తంగలాన్’ రూపంలోపా. రంజిత్ సృష్టించిన సునామీ సినీ విమర్శకుల మెప్పు ΄పొందింది.దర్శకుడిగా దృశ్య రూపం ఇవ్వడంతో సరిపెట్టకుండా నిర్మాతగా మారి ఈ తరహా చిత్రాలెన్నింటికో బ్యాక్బోన్గా నిలిచారు. మారి సెల్వరాజ్ తొలి చిత్రం ‘పరియేరుం పెరుమాళ్’ అందులో ఒకటి. దళిత జీవితాలను తెరకెక్కించే క్రమంలో వారిని బాధితులుగా కాకుండాపోరాట యోధులుగా చూపిస్తూ అవసరమైన చోట కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా జోడించి సాగిస్తున్న మూవీ జర్నీ తమిళ ఇండస్ట్రీలోపా. రంజిత్కు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.కఠినమైన వాస్తవాలతో...తమిళనాడులోని సామాజిక–రాజకీయ వాతావరణాన్ని నిజ జీవితాలకు దగ్గరగా చూపించడంలో వెట్రిమారన్ది ప్రత్యేక శైలి. వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో వెట్రిమారన్ సినిమాలు కూడా అంతే. విభిన్న వర్గాల జీవితాలను సజీవంగా చూపించడంలో వెట్రిమారన్ ముందుంటారు. ఈయన సినిమాల్లో కనిపించే సామాజిక సమస్యల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘ఆడుగళం, విశారణై, అసురన్’... ఏ సినిమా తీసుకున్నా వాటి నేపథ్యంలో కనిపించేది ప్రజలపోరాటాలే. కళను వినోదానికి పరిమితం చేయకుండా సామాజిక మార్పుకు ఆయుధంగా మార్చుకున్న దర్శకులుగా మారి సెల్వరాజ్,పా. రంజిత్, వెట్రిమారన్ కనిపిస్తారు. కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించినా సరే ఈ ముగ్గురి సినిమాలో పీడిత ప్రజలే ప్రధానపాత్రలుగా ఉంటారు. వాళ్లే హీరోలుగా సినిమాను నడిపిస్తారు. భిన్న చిత్రాల ద్వారా వీళ్లు సంధిస్తున్న ప్రశ్నలు దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ వీళ్ల ముద్ర కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ వినోద సాధనంగా మారి, నేల విడిచి సాము చేస్తున్న సందర్భంలో వాస్తవికత, సామాజిక చైతన్యాన్ని నమ్ముకుని స్టోరీ టెల్లింగ్కు కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురు. దర్శకులుగా వీరిది బాధ్యతాయుతమైన ప్రయాణం. – ఫణి కుమార్ అనంతోజు -
ఆస్కార్ రేస్లో 6 తమిళ చిత్రాలు
తమిళసినిమా: ఈసారి ఆస్కార్ అవార్డుల రేస్లో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఆస్కార్ అవార్డు అనేది తమిళ చిత్రాలను ఊరిస్తూనే ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నా, అవి ఆంగ్ల చిత్రానికి కావడం గమనార్హం. కాగా 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినట్లు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించారు. అందులో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మంచి కథా బలం ఉన్న చిత్రాలే. ఈ సారి అయినా వీటిలో ఏదైనా అస్కార్ అవార్డును గెలుచుకుంటుందేమో చూడాలి. -
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
నడిగర్ సంఘం హెచ్చరిక.. అలాంటి వారిపై ఐదేళ్ల నిషేధం!
హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు. -
సై, సై అంటున్న కోలీవుడ్
-
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ!
ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్. తమిళం, మలయాళం, కన్నడతో వంటి పలు భాషా చిత్రాలు ఉన్నాయి. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన సాక్షి అగర్వాల్ హీరోయిన్, గ్లామర్, యాక్షన్, విలనిజం, గ్రామీణ యువతిలాగా అన్ని రక రకాల పాత్రలో నటిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సారా లో నటిస్తున్నారు. అదేవిధంగా 8 బుల్లెట్స్ చిత్రం ఫేమ్ వెట్రికి జంటగా నటించిన చిత్రంను పూర్తి చేశారు. ఇది కాకుండా సాక్షి అగర్వాల్ చేతిలో 'అతిథి 2'తో పాటు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో సాక్షి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. అదేవిధంగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి అగర్వాల్కు తాజాగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట. సాక్షి అగర్వాల్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనుంది. మొత్తం మీద ఈ దీపావళి ఈ బ్యూటీకి కొత్త ఆనందాన్నే తీసుకొచ్చినట్లుంది. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
నటి రోహిణి చిత్రానికి అరుదైన ఘనత..!
లెన్స్, మస్కిటో ఫిలాసఫీ, తలైకూత్తల్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై. ఈ చిత్రాన్ని ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్ర దర్శకుడు జియో బేబీ సమర్పణలో మెన్ కైండ్ సినిమాస్, నితీష్ ప్రొడక్షన్స్, సిమెట్రీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి కీలకపాత్రలో నటించారు. ఆమెతో పాటు లిజోమోల్, వినీత్, కలేశ్ రామనాథ్, అనుష్క, దీప ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కాదల్ ఎంబదు పొదువుడమై మూవీ 54వ ఇండియన్ పనోరమ అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైనట్లు మేకర్స్ తెలిపారు. తమిళ చిత్రం కాదల్ ఎంబదు పొదువుడమై ఎంపిక కావడం విశేషం. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరగనున్నాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఈ ఆధునికకాలంలో మనుషుల భావాలు, దురాలోచనలు, సామాజిక పరిస్థితి, విజ్ఞానం వంటి అంశాలతో కూడిన ఆధునిక ప్రేమను ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కాగా 2023 ఏడాదిగానూ ఇండియన్ పనోరమ చిత్రోత్సవాలకు 408 చిత్రాలు నామినేట్ కాగా.. అందులో 25 చిత్రాలు మాత్రమే ఎంపికై నట్లు చెప్పారు. ఆ 25 చిత్రాల్లో తమ కాదల్ ఎంబదు పొదువుడమై చిత్రం చోటుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ఈ సినిమాకు కన్నన్ నారాయణన్ సంగీతమందించగా.. శరవణన్ సినిమాటోగ్రఫీ అందించారు. -
మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!
అరవింద స్వామి పేరు వినగానే గుర్తొచ్చేది దళపతి, బాంబే, రోజా చిత్రాలే. మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో నటించిన దళపతి చిత్రంలో యువ కథానాయకుడిగా పరిచయమైన నటుడు అరవిందస్వామి. కొన్ని చిత్రాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్లోనూ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్గా మెప్పించారు. (ఇది చదవండి: Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!) అయితే ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ అయ్యి తనీ ఒరువన్ వంటి పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు గానూ నటించి మెప్పించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నా ఈయన త్వరలో మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలిసింది. ఈయన ఇప్పటికే కథ కథనాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఆల్ ఇండియా స్టార్ ఫాహద్ ఫాజిల్ను ప్రధాన పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో అరవిందస్వామి కూడా ఓ కీలకపాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రం 2024 ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన మామన్నన్ చిత్రంలో విలన్గా తన విశ్వరూపం చూపించిన నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆయనకు ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాగా అరవిందస్వామి దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్తో పెళ్లి!) -
రికార్డు బ్రేక్ చేసిన డైరెక్టర్, 23 గంటల్లో సినిమా పూర్తి
ఈ తరం దర్శకులు సినిమాను ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. ప్రయోగాలతో గిన్నిస్ రికార్డులను సాధిస్తున్నారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం కలైంజర్నగర్. దీనికి సుగన్కుమార్ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పోదాం అనే చిత్రాన్ని 23 గంటల 23 నిమిషాల్లో తెరకెక్కించారు. తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ 23 గంటల 7 నిమిషాలకు ముందే తాజా సినిమా షూటింగ్ను పూర్తి చేయడం విశేషం. ఎస్ఆర్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై శివరాజ్ నిర్మించిన ఈ చిత్రానికి గాయత్రి సుగన్ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇందులో నటుడు ప్రాజన్, నటి ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటించగా, నటుడు లివింగ్ స్టన్, పుగళ్ ముఖ్యపాత్రలు పోషించారు. నరేశ్ సంగీతాన్ని, ఇళయరాజా ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్ర మీడియా సమావేశాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో ని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. కార్యక్రమంలో బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షుడు దళపతి పాల్గొని చిత్ర యూనిట్ను అభినందించారు. ముందుగా చిత్ర దర్శకుడు సుగన్కుమార్ మాట్లాడుతూ పెద్ద పెద్ద దర్శకులు భారీ చిత్రాలను తెరకెక్కిస్తానని, తాను ఈ చిన్న చిత్రాన్ని భారీగా రూపొందించినట్లు చెప్పారు. ఇది పూర్తిగా స్టేజీ నృత్య కళాకారుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్ ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్ను 23 గంటల్లో పూర్తి చేసిన ఘనత తనది మాత్రమే కాదని దీనికి పనిచేసిన అందరికీ చెందుతుందని పేర్కొన్నారు. చదవండి: నేను ఇంజనీర్ను.. హీరోయిన్ అవుతాననుకోలేదు -
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు. -
నటుడు సంతానంతో మేఘా ఆకాష్ రొమాన్స్!
తమిళసినిమా: సంతానంతో రొమాన్స్ చేయడానికి నటి మేఘా ఆకాష్ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్ విజయ్ ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్ రోల్డెన్ సంగీతాన్ని, దీపక్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్ను కోలీవుడ్లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్ ఊరే యావరుమ్ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్ శంకరుమ్ స్మార్ట్ పోన్ సిమ్రానుమ్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
వారీసు Vs తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్లో సంక్రాంతి హడావుడి పీక్స్లో ఉంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఎవరు విన్నర్గా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి పందేలుగా బరిలో దిగగా తమిళనాట అజిత్ తునివు, విజయ్ వారీసు(వారసుడు) బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు జనవరి 11వ తేదీన గ్రాండ్గా రిలీజైన విషయం తెలిసిందే! ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు కలిపితే రూ.50 కోట్ల గ్రాస్ కన్నా తక్కువే ఉన్నాయట. తమిళనాడులో తునివు మొదటిరోజు పాతిక కోట్ల మేర కలెక్షన్స్ కురిపించగా వారీసు దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాలు, విదేశీ వసూళ్లు కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రెండు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్గా నిలిచేందుకు తెగ పోటీపడుతున్నాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఫస్ట్డే ఫస్ట్ షో చూడాలన్న ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. Pongal 2023 TN Box Office Day 1#Thunivu - ₹ 24.59 cr#Varisu - ₹ 19.43 cr — Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2023 చదవండి: తండ్రి మరణించిన రెండు రోజులకే సెట్కు వచ్చేశాడు: చిరంజీవి థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
హీరోగా పరిచయం కాబోతున్న నిర్మాత
తమిళసినిమా: గతంలో అమ్మువాగియన్ నాన్, మాత్తియోసి వంటి సక్సెస్ఫుల్ త్రాలను నిర్మింన పీఎస్ఎస్ఆర్ ఫిలిమ్స్ అధినేత శేఖర్ సీతారామన్ తాజాగా కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఏ4. రవికుమార్ టీఎస్ కథ, కథనం, మాటలు సమకూర్చుతున్నారు. నటుడు ఇనిగో ప్రభాకర్, నటి ఐశ్వర్య దత్తలతోపాటు పలువురు ప్రముఖ నటినటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను రవికుమార్ తెలుపుతూ.. నిర్మాత శేఖర్ సీతారామన్ను కలిసి కథ వినిపించినప్పుడు ఆయనకు బాగా న్చిందన్నారు. హీరోగా ఎవరిని ఎంపిక చేద్దామని అడిగారన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా మీరే నటిస్తే బాగుంటుందని చెప్పానన్నారు.. ముందు ఆయన సంకోంచినా తన ఒత్తిడి మేరకు హీరోగా నటించారని తెలిపారు. ఏ 4 చిత్రం టైటిల్ మాదిరిగానే కథా, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా చిత్రంలో సంభాషణలు ఉంటాయన్నారు. చిత్ర షటింగ్ చెన్నై, ఊటీ, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్లు చెప్పారు. శేఖర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటిస్తున్నారని ప్రశంసించారు. దీనికి కేఏ రోయిన్ చాయగ్రహణను, సెంతమిళ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హీరోగా చంద్రబాబు మనవడు
దివంగత హాస్య నటుడు చంద్రబాబును తమిళ సినిమా ఎప్పటికీ మర్చిపోదు. కాగా ఆయన వారసత్వాన్ని ఆయన మనవడు సారత్ తన భుజాలపైన వేసుకున్నారు. తెర్కత్తివీరన్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, కథానాయకుడు అన్నీ తానే కావడం విశేషం. ఈయన ఇంతకు ముందు ఏ దర్శకుడి వద్ద పని చేయలేదు. చంద్రబాబు ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కథానాయకుడికి స్నేహితులుగా మురుగా అశోక్, నాడోడిగళ్ భరణి, మారి వినోద్ నటించగా హీరో తండ్రిగా వేల రామ్మూర్తి నటించారు. అదే విధంగా మధుసూదనన్, కబీర్ తుహాన్ సింగ్, పవన్, ఆర్ఎన్ఆర్ మనోహర్, నమో నారాయణ, రాజసింహన్, ఆర్యన్, రేణుక, ఉమా పద్మనాభన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, ఎన్. షణ్ముఖ సుందరం చాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు సారత్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది తూత్తుకుడి నేపథ్యంలో యథార్థ సంఘటనలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. హీరో నలుగురు మిత్రులు ఐదుగురు పిల్లల మధ్య పగ, ప్రతీకారం ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. ఐదు పాటలు ఎనిమిది ఫైట్లు అంటూ పక్కా కమర్షియల్ ఫార్మెట్లో తెరకెక్కించిన చిత్రం తెర్కత్తి వీరన్ తెలిపారు. చిత్రంలో కడవలమ్మ అనే ఇంట్రో సాంగ్ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవా పాడారని చెప్పారు. ఈ పాటలో శ్రీకాంత్ దేవా తనతో కలిసి నటించడం మరో విశేషం అని పేర్కొన్నారు. చదవండి: (రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?) -
సెట్స్పైకి రజనీ ‘జైలర్’.. కొత్త పోస్టర్ రిలీజ్
‘అన్నాత్తే’ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం ‘జైలర్’. బీస్ట్ మూవీఫేం నెల్సన్ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల మూవీ టైటిల్, ఫస్ట్లుక్ పోస్టర్ వదిలిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు సోమవారం(ఆగస్ట్ 22న) జైలర్ షూటింగ్ ప్రారంభమైందని చెబుతూ తలైవా ఫ్యాన్స్కు గుడ్న్యూస్ అందించారు మేకర్స్. చదవండి: ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సందర్భంగా రజనీకి లుక్కు సంబంధించిన పోస్టర్ను వదిలారు. ఇందులో రజనీ ఫార్మల్ డ్రెస్లో సీరియస్ లుక్తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో రజనీ లైటిల్ రోల్ పోషించనున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన లుక్కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించన్నాడు. #Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA — Sun Pictures (@sunpictures) August 22, 2022 -
Trisha-Vijay: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే!
కోలీవుడ్లో హిట్ పెయిర్గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం వారీసు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చాలా భాగం షూటింగ్ను పూర్తి చేసుకుంది. దీంతో ఆయన తన 67వ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మహానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఇందులో ఆరుగురు విలన్లు ఉంటారనే ప్రచారం వైరల్ అవుతోంది. చదవండి: (స్లోగా వెళుతున్నాను తప్ప... డౌన్ కాలేదు) ఇకపోతే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో నటి త్రిష విజయ్తో రొమాన్స్ చేసే పాత్రలో నటించనున్నట్లు, సమంత ఆరుగురు విలన్లలో ఒకరిగా తనదైన విలనిజాన్ని ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా విజయ్తో మరోసారి జత కట్టనుండడం గురించి ఒక భేటీలో స్పందిస్తూ విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని త్రిష పేర్కొన్నారు. ఆయన ప్రొఫెషలిజం, అంకిత భావం తనకు నచ్చుతాయన్నారు. సెట్లో చాలా సైలెంట్గా ఉంటారని, గిల్లీ చిత్రం తమ మధ్య ఫ్రెండ్షిప్ను పెంచిందని చెప్పారు. తాను మంచి కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విజయ్తో 14 ఏళ్ల తరువాత నటించనున్న తాజా చిత్రం నవంబర్ 3వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
అన్నకు నమ్మకం.. తమ్ముడికి ధైర్యం
తమిళసినిమా: కోలీవుడ్లో అన్నదమ్ములు కథానాయకులుగా రాణించడం అరుదైన విషయం. అలాంటి అరుదైన అపూర్వ సోదరులు సూర్య, కార్తీ. నటనలో ఎవరికి వారు ప్రత్యేక బాణీని అలవరచుకుని సక్సెస్ఫుల్ కథానాయకులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్ వారసులుగా ఒక నిబద్ధత కలిగిన వీళ్లు ఏ విషయంలోనూ ఒకరిని ఒకరు వదులుకోరు. తన తమ్ముడు కార్తీ తన కంటే తెలివైన వాడని, మంచి నటుడు అని సూర్య చాలాసార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. ఇక సూర్య రాముడైతే తాను లక్ష్మణుడిని అని, ఆయన వెనుక కూర్చోవడమే అందం అని, తన ముందు అన్నయ్య ఉన్నాడనే ధైర్యం తనకు, తన వెనుక తమ్ముడు ఉన్నాడే నమ్మకం అన్నయ్యకు కలుగుతుందని కార్తీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. కార్తీ కథానాయకుడిగా ఇంతకుముందు సూర్య కడైకొట్టి సింగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందింది. తాజాగా మరోసారి కార్తీ హీరోగా విరుమాన్ అనే చిత్రాన్ని తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. చదవండి: (స్టయిలిష్ రేణుక) ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల మదురైలో నిర్వహించారు. ఆ వేదికపై సూర్య మాట్లాడుతూ.. గ్రామీణ కథా చిత్రాలు తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తులన్నారు. ఈ విషయంలో తాము పోటీ పడుతామని అన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు తనను అప్డేట్ చేసుకుంటూ చిత్రాలు చేసే దర్శకుడు శంకర్ అన్నారు. ఆయనతోనూ తాము పోటీ పడుతామన్నారు. అలా లక్ష్యాన్ని పెట్టుకుంటే వారి స్థాయికి కాకపోయినా సగం చేసినా సంతోషం అన్నారు. కాగా నటుడు కార్తీ విరుమాన్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఒక భేటీలో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. తాను మణిరత్నం వద్ద ఆయుధ ఎళత్తు చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసినప్పుడు అన్నయ్య కోసం ఒక బయోపిక్ కథను రాశానని చెప్పారు. కాగా కార్తీ తన అన్నయ్య సూర్యను డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారన్నమాట. -
మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్ప్రైజ్ గిఫ్ట్
సాక్షి, చెన్నై: మాయోన్ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథణం, నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రంలో శిబిరాజ్, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. నవ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించారు. శిలల స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఫాంటిసీ సన్నివేశాలతో రూపొందిన చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. గురువారం చిత్ర యూనిట్ చెన్నైలో కేక్ కట్ చేసి వేడుకగా సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత.. దర్శకుడు కిషోర్కు బంగారు గొలుసును కానుకగా అందించారు. కాగా ఈ చిత్రం 7వ తేదీన తెలుగులోనూ విడుదల కానుందని ఈ సందర్భంగా నిర్మాత తెలిపారు. అదే విధంగా మాయోన్కు సీక్వెల్ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
లెజెండ్ శరవణన్ హీరోగా ‘ది లెజెండ్’మూవీ, ట్రైలర్ విడుదల
ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ది లెజెండ్ చిత్రాన్ని నిర్మిస్తునండమే కాక ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. జేడి-జెయర్ ద్యయం దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి హారిశ్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. వేల్రాజ్ ఛాయగ్రణం అందిస్తున్నారు. నిరమ్ణ క్యాక్రమాలను పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్స్ తమన్నా, హన్సిక, పూజా హెగ్డే, శ్రద్ధాశ్రీనాథ్, రాయ్ లక్ష్మితో పాటు నటులు ప్రభు, నాజర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందరంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత లెజెండ్ శరవణన్ మాట్లాడుతూ.. సినీ రంగంలో రజనీకాంత్, విజయ్ తనకు రోల్ మోడల్ అన్నారు. తనపై విర్మశలు చేసే వారి గురించి బాధపడనన్నారు. కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. -
హీరో కార్తీ, అతిథి శంకర్ విరుమన్ రిలీజ్ డేట్ ఫిక్స్
సాక్షి, చెన్నై: ‘విరుమన్’ చిత్రం వినాయక చవితికి విడుదలకు ముస్తాబవుతోంది. కార్తీ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్నారు. ముత్తయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటుడు రాజ్కిరణ్, ప్రకాష్రాజ్, సూరి, ఆర్కే సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాగా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ஆகஸ்ட் 31 விநாயகர் சதுர்த்திக்கு வர்றோம் #விருமன் #VirumanFromAug31@Karthi_Offl @Suriya_offl @2D_ENTPVTLTD @dir_muthaiya @thisisysr @AditiShankarofl @rajsekarpandian @prakashraaj #Rajkiran @sooriofficial @sakthivelan_b pic.twitter.com/qnr2X1NKKT — Actor Karthi (@Karthi_Offl) May 18, 2022 -
విలేకరిగా మారిన హీరో విమల్
సాక్షి, చెన్నై: నటుడు విమల్ విలేకరి అవతారమెత్తారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుడిక్కుమ్ కరంగళ్’. ముంబై బ్యూటీ మనీషా నాయికగా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈమె ఇంతకుముందు తెలుగులో రెండుచిత్రాలు, కన్నడంలో ఒక చిత్రం చేశారు. ఒడియన్ టాకీస్ పతాకంపై కె.అన్నాదురై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేలుదాస్ దర్శకత్వంతో పాటు సహ నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద 23 ఏళ్లు పని చేసిన ఆయన సోదరుడి కొడుకు రాఘవ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్మీ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నటుడు విమల్ యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూ విలేకరిగా బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. ఈ షూటింగ్ను చెన్నైలో 45 రోజుల్లో పూర్తి చేశామన్నారు. -
అలా అయితేనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తా: హీరో శివకార్తికేయన్
Sivakarthikeyan About Pan India Movies: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా నటించిన డాన్ చిత్రం ఈ రోజు ప్రపపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శిబిచక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల నేపథ్యంలో గురువారం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా చిత్రాలపై స్పందించాడు. ఐడియా కొత్తగా ఉంటేనే పాన్ ఇండియా చిత్రాలలో నటించడానికి తాను సిద్ధమని అన్నాడు. అనంతరం డాన్ కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని, దర్శకుడు కథ చెప్పగానే కాలేజీ రోజులు గుర్తుకు రావడంతో వెంటనే నటించడానికి ఒకే చెప్పానన్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ఐలాన్ చిత్రాన్ని తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్తో కలిసి తన ఎస్.కె.ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం -
కమల్ హాసన్ ‘విక్రమ్’లో హీరో సూర్య!
కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా నటించారు. ముగ్గురు హీరోలు నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించనున్నారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. ముఖ్యమైన అతిథి పాత్రలో సూర్యని చూపించనున్నారట లోకేష్. ఇటీవల ‘విక్రమ్’ షూటింగ్ లొకేషన్కి సూర్య వెళ్లినప్పుడు కమల్ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. -
పలు వాయిదాల అనంతరం రిలీజ్కు రెడీ అయిన రంగా మూవీ
సాక్షి, చెన్నై: నటుడు సిబిరాజ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రం రంగా. నిఖిలా విమల్ నాయికగా, డీఎల్ వినోద్ను దర్శకుడిగా బాస్ మూవీ పతాకంపై విజయ్ కె.చెల్లయ్య నిర్మించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సిబిరాజ్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నటించడానికి సిద్ధమయ్యానన్నారు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు, అక్కడ సినిమాలు తీసి టైం వేస్ట్ చేసుకోను షూటింగ్ అధికభాగం కశ్మీర్లో నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు. కథ బావుంది గానీ.. కొత్త దర్శకుడు ఎలా తెరకెస్తారన్న సంశయం కలిగిందన్నారు. దీంతో కొన్ని రోజులు చెన్నైలో షూటింగ్ చేసి దర్శకుడి ప్రజెంటేషన్ చూసిన తర్వాత కశ్మీర్కి వెళ్దామని నిర్మాతకు చెప్పానన్నారు. కానీ కథకు తగిన వాతావరణం ఇప్పుడు కశ్మీర్లో ఉంటుందని అక్కడే షూటింగ్ చేద్దామని ఆయన చెప్పారన్నారు. -
ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ ‘కన్ని దీవు’
సాక్షి, చెన్నై: ‘కన్ని దీవు’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్, సుభిక్ష, ఐశ్వర్య దత్త, ఆస్నా దేవేరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. సుందర్ బాలు దర్శకత్వంలో కృతిక ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ప్రతాప్ సంగీతాన్ని అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నై ప్రాంతంలోలోని ఓ హౌసింగ్ బోర్డులో నివశించే నలుగురు యువతుల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలోని ‘పోరాడి వా’ అనే సింగిల్ సాంగ్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. -
మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, కార్యదర్శిపై కేసులు
మాజీ అధ్యక్షుడు శరత్కుమార్, కార్యదర్శి రాధారవి అక్రమాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సంఘం 66వ సర్వసభ్య సమావేశం ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ సంఘం ఎన్నికలు 2019లో జరిగినా.. అక్రమాలు జరిగాయంటూ ఐసరి గణేష్కు చెందిన స్వామి శంకరదాస్ జట్టు చెన్నై హైకోర్టు గుమ్మం తొక్కింది. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పలు దఫాలు విచారణ జరిపినా న్యాయస్థానం ఇటీవల సంఘం ఎన్నికలు సక్రమమే అంటూ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పోటీ చేసిన పాండవర్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం స్థానిక శాంథోమ్ రోడ్లోని శాంథోమ్ హైయ్యర్ సెకండరీ పాఠశాలలో నడిగర్ సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు కరుణాస్, పూచి మురుగన్లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ సభ్యుల అనుమతి కోరారు. ముఖ్యంగా నడిగర్ సంఘం నూతన భవనాన్ని పూర్తి చేయడం, అందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటి అంశాలపై చర్చించారు. చదవండి: ఏంటో.. అందరికి నా బర్త్డే సెంటిమెంట్ అయిపోయింది క్లిష్ట పరిస్థితులు చూశాం, మా కూతురు తిరిగొచ్చింది.. -
బాబీ సింహ హీరోగా ‘తడై ఉడై’ సినిమా
సాక్షి, చెన్నై: జాతీయ అవార్డు గ్రహీత నటు డు సింహ కథానాయకుడిగా నటిస్తున్న ‘తడై ఉడై’ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటి మిశా నరాంగ్ నాయికగా నటిస్తున్న ఇందులో ప్రభు, సెంథిల్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఎస్ఎస్ రాజేష్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ముద్రాస్ ఫిలిం ఫ్యాక్టరీ, ఆరుద్ర పిక్చర్స్ సంస్థల అధినేతలు పి.రాజశేఖర్, రేష్మి సింహా (సింహా భార్య) కలిసి నిర్మిస్తున్నారు. ఎడ్వెర్ట్ ఛాయాగ్రహణంను, ఆదీప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వైరముత్తు పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యూనిట్ వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. బహుభాషా నటుడు సింహ ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం కావడం, చిత్ర టైటిల్ క్యాచీగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్ షూటింగ్ను 5వ తేదీ నుంచి ప్రారంభించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
మరో గ్రీన్ సిగ్నల్!
తెలుగులో ‘బోళాశంకర్’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్లో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్ను సంప్రదించగా ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
పశుపతి హీరోగా మరో సినిమా.. షూటింగ్ ప్రారంభం
చెన్నై: నటుడు పశుపతి తమిళంతో పాటు తెలుగులో విభిన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా చాలాకాలం తరువాత పసుపతి మళ్లీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రామ్ సంగైయ్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి రోహిణి, అమ్ము అభిరామి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కెఎస్ సుందరమూర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: మెగా అభిమానం : క్యూబ్స్తో 6.5 ఫీట్ల చిరు ఫోటో సలార్: బసిరెడ్డిని మించిన రాజమన్నార్! -
అజిత్.. వలిమై తర్వాతేంటి..?
తమిళసినిమా: హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం వలిమై. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది ఘట్టానికి చేరుకుంది. దీంతో అజిత్ నటించనున్న నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కాగా బోనీ కపూర్కి మరో అవకాశం ఇస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గతంలో నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలలో అజిత్ నటించారు. ఈ రెండింటికీ హెచ్.వినోద్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. తదుపరి చిత్రా నికి కూడా ఈయనే దర్శక త్వం వహించనున్నారు. నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలకు యువన్ శంకర్రాజా సంగీతం అందించారు. కాగా అజిత్ తాజా చిత్రానికి జిబ్రాన్ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు తెలిసింది. -
వైద్యుడు.. నలుగురు గర్భిణులు..!
చెన్నై : ఒక వైద్యుడు.. నలుగురు గర్భిణుల ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం వాసువిన్ గర్బిణీగల్. విజయ్ కథానాయకుడిగా మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సేవియర్ బ్రిట్టో తాజాగా తన ఎస్తల్ ఎంటర్టైనర్ పతాకంపై అళగియ కన్నె అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు వాసువిన్ గర్బిణీగల్ అనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్సిల్ చిత్రం ఫేమ్ మణి నాగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నీయా నాన్న గోపినాథ్, నటి అనిక, సీత, అనితా విజయకుమార్, లెనా కుమార్, అభిషేక్, సచిన్, క్రిషికా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పీకే వర్మ ఛాయాగ్రహణ, విష్ణు మోహన్ సితార సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. ఒక వైద్యుడు, నలుగురు గర్భిణుల ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం వాసువిన్ గర్భిణీగల్ అని చెప్పారు. గర్భిణుల సమస్యలకు పరిష్కారం చూపించే కథాంశంతో, కథకు ప్రాముఖ్యతనిచ్చి తెరకెక్కిస్తున్న చిత్రమని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
చిరంజీవి అన్నా, మీ సాయం మర్చిపోలేను: నటుడు
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ చిరంజీవి మాత్రం కళాకారులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారు నోరు తెరిచి అడగకముందే కావాల్సింది సమకూర్చుతాడు, ఆర్థికంగా ఆదుకుంటాడు, చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటాడు, వెన్నంటే ఉంటూ మనోధైర్యాన్ని కల్పిస్తాడు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. తాజాగా ఈ హీరో ఓ సీనియర్ నటుడిని ఆదుకున్నాడు. పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిసిన చిరంజీవి వెంటనే అతడికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. కష్టకాలంలో తనను దేవుడిలా ఆదుకున్నందుకు అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. 'చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటూ.. జై శ్రీరామ్' అని పొన్నాంబళం తమిళంలో తన సందేశాన్ని తెలియజేశాడు. చదవండి: మిస్ యూ యర్రా నాగబాబు: చిరంజీవి భావోద్వేగం -
మూగబోయిన ‘ఆనంద’ గానం
చెన్నై : ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ముఖ్యంగా చెన్నైలోని సంగీత కళాకారులు, సంగీత అభిమానులు జీర్ణించుకోలేని బాధాకరమైన సంఘటన. జి.ఆనంద్ గానం అమృతం. మనసు సున్నితం. సౌమ్యం, నిడారంబరమే ఆయనకు ఆభరణాలు. ఆయన మృతిపై చెన్నైలోని తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్ మరణవార్త చాలా బాధాకరం. కొన్ని సభల్లో అతిథులుగా పాల్గొన్న పరిచయం. స్వర మాధురి పేరుతో సంస్థని స్థాపించి 7,500 సంగీత కార్యక్రమాలు నిర్వహించిన రికార్డు సృష్టించిన గాయకుడు ఆయన. 20 సార్లు అమెరికాలోని తానా సభల్లో పాల్గొన్నారు. కచేరీల్లో ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉన్నత స్థితికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకున్న మంచి మనిషి జి.ఆనంద్. విశాల హృదయం గల మహా మనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. –గుడిమెట్ల చెన్నయ్య, జనని కార్యదర్శి, చెన్నై ఎందరో యువ కళాకారులను ప్రోత్సహించారు గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరమాధురి వ్యవస్థాపకుడు జి.ఆనంద్ ఆకస్మిక మృతికి అఖిల భారత తెలుగు సమాఖ్య ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. 2014లో నెహ్రూ స్టేడియంలో జరిగిన ముప్పెరుం మహాసభలో జి.ఆనంద్ మాకు మంచి సంగీతాన్ని సమకూర్చారు. మితభాషి, స్నేహశీలి, ఎందరో కళాకారులను ప్రోత్సహించిన జి.ఆనంద్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాం. –సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య ఉదారస్వభావుడు మనందరికీ ఆయన దూరం కావడం చాలా బాధాకరం. ఆంధ్ర కల్చరల్ అండ్ సోషల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాటలకు ఆనంద్, నాట్యానికి నేను చాలా ఏళ్లుగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాం. ఆ సమయంలో ఆయన ఉదార స్వభావం, సౌశీల్యం, గాత్రాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను, ఆనంద్ శారీరకంగా మన మధ్య లేకున్నా ఆయన గాత్రం ఎల్లప్పుడూ మన మధ్యే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. –ఏవీ శివకుమార్, చెన్నై -
ఛలో జైపూర్
ఒకవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు తాప్సీ. తాజాగా ఓ తమిళ సినిమాలో లీడ్ రోల్ చేయడానికి అంగీకరించారు. ఈ సినిమా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది. హీరోగా నటిస్తూ, విలన్ పాత్రలు కూడా చేస్తూ విలక్షణ నటుడు అనిపించుకున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారట. దీపక్ సుందరరాజన్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సెప్టెంబర్లో జైపూర్లో షూటింగ్ను ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట దర్శక,నిర్మాతలు. -
త్రిష పరమపదంకు టైమ్ వచ్చింది
నటి త్రిష పరమపదం విళైయాట్టుకు టైమ్ వచ్చింది. ఈ చెన్నై చిన్నది ప్రస్తుతం రాంగీ చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. కాగా త్రిష ఇంతకుముందు నటించిన రెండు, మూడు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు ఎదురుచూస్తున్నాయి. అందులో ఒకటి పరమపదం విళైయాట్టు. విశేషం ఏమిటంటే ఇది ఈ బ్యూటీకి 60వ చిత్రం కావడం. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. కే.తిరుజ్ఞానం తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిషతో పాటు నటుడు నందా, బేబీ మానసి, రిచర్డ్, ఏఎల్,అళగప్పన్, వేల రామమూర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. 24 హెచ్ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్ సంగీతాన్ని అందించారు. ఇది యథార్థ సంఘటన ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అని దర్శకుడు తెలిపారు. నటి త్రిష ఇందులో డాక్టర్గా నటించారని, కొందరు ఆమెను కిడ్నాప్ చేయడంతో వారెవరు, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? వారి నుంచి ఎలా తప్పించుకుందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా పరమపదం విళైయాట్టు చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా త్రిష నటించిన హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం ఇది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు ఇప్పటి వరకూ సక్సెస్ కాలేదు. దీంతో పరమపదం విళూయాట్టు చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని తెలిసింది. కాగా చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం అధికారికంగా ప్రకటించారు. కాగా దీని తరువాత నటి త్రిష నటించిన గర్జన విడుదల కావలసి ఉంది. ఇదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రమే. ఇకపోతే ప్రస్తుతం నటిస్తున్న రాంగీ చిత్రం కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రమే కావడం విశేషం. మరో విషయం ఏమిటంటే నటి త్రిష ఈ మధ్య నటించిన 96, పేట చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పరమపదం విళూయాట్టు చిత్రానికి ఆ మ్యాజిక్ పని చేస్తుందనే నమ్మకంతో త్రిష ఉంది. ఈ చిత్రం హిట్ అయితే కొత్త సంవత్సరంలోనూ త్రిష సక్సెస్ పయనం కొనసాగినట్లే అవుతుంది. అన్నట్టు ఈ బ్యూటీ చాలా కాలం తరువాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో జత కట్టనుంది. -
వారి మనసు దోచడానికి గ్లామర్ అవసరం
నేనూ అమ్మాయినేగా అంటోంది నటి మాళవికామోహన్. ఈ కేరళా కుట్టి ఇప్పుడు కోలీవుడ్లో హాట్ నటిగా మారింది. ముంబయిలో చదివిన ఈ చిన్నది మాతృభాష మలమాళంలో తొలిసారిగా 2013లో కథానాయకిగా పరిచయమైంది. పట్టం పోల్ అనే చిత్రంలో దుల్కర్సల్మాన్కు జంటగా నటించింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపైన వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలెట్టాయి. అయితే నటిగా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటికి ఏడు చిత్రాలే చేయడం విశేషం. వీటిలో మూడు మలయాళం, ఒక కన్నడం, రెండు తమిళం, ఒక హిందీ చిత్రం ఉన్నాయి. అంటే అప్పుడే దక్షిణాదితో పాటు ఉత్తరాదికి ఎంట్రీ ఇచ్చేసిందన్న మాట. అంతే కాదు త్వరలో తెలుగులోనూ పరిచయం కానుంది. హిందీలో మజీద్ మజీద్ అనే చిత్రంతో పరిచయమైంది. చదవండి: వివాదాల 'దర్బార్' అలా తమిళంలో గత ఏడాది పేట చిత్రంతో దిగుమతి అయ్యింది. అందులో శశికుమార్ భార్యగా చిత్రానికి కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందింది. అంతే ఇప్పుడు దళపతి విజయ్తో నటించే లక్కీఛాన్స్ను దక్కించుకుంది. దీనికి మాస్టర్ అనే టైటిల్ను నిర్ణయించారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి మాస్టర్ రెడీ అవుతున్నారు. కాగా నటి మాళవిక మోహన్ కోలీవుడ్లో తన క్రేజ్ను పెంచుకునే పనిలో పడింది. దీంతో తరచూ ఫొటో సెషన్ చేయించుకుని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. ఆ ఫొటోలు చాలా గ్లామరస్గా ఉండడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని గురించి మాళవికమోహన్ స్పందిస్తూ ఫొటోలను తీయించుకోవడానికి నటీమణులు చాలా ఇష్టపడతారంది. చదవండి: త్రిష పరమపదంకు టైమ్ వచ్చింది ఇక అమ్మాయిలకు ఇంకా ఇష్టం అంది. నటినైనా తానూ అమ్మాయినే కదా అని అంది. సినిమాలతో బిజీగా ఉన్నా ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవడంలో తనకు చాలా ఆసక్తి అని పేర్కొంది. ఇక అలాంటి ఫొటోలను థ్రిల్లింగ్గా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటానని మాళవిక మోహన్ చెప్పుకొచ్చింది. ఇక గ్లామర్ అంటారా ఈ తరం యువత గ్లామర్నే కోరుకుంటారని, అలా వారి మనసును దోచుకోవడానికి ఆ మాత్రం గ్లామర్ అవసరం అని చెప్పింది. కాగా ప్రస్తుతం మాస్టర్ చిత్రానే నమ్ముకున్న ఈ బ్యూటీ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుందట. కాగా తెలుగులో విజయ్దేవరకొండకు జంటగా హీరో చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఆ చిత్రం ఏమైందన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు మాళవికమోహన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ చిత్రం విడుదల తరువాత ఈ అమ్మడి లెవల్ ఏ స్థా«యికి చేరుకుంటుందో చూడాలి. -
అలాంటి వారిపై జాలి పడతా..!
సాక్షి, తమిళ సినిమా : అలాంటి వారిని చూసి తాను జాలి పడతానని చెప్పింది నటి అదితిరావు. కోలీవుడ్లో కాట్రువెలియిడై, సెక్క సివందవానం వంటి చిత్రాల్లో నటించిన జాణ ఈ అమ్మడు. టాలీవుడ్లోనూ తన ఉనికిని చాటుకుంటున్న అదితిరావ్ ఆశించిన స్థాయిలో అవకాశాలను కానీ, క్రేజ్ను కానీ ఇంకా సంపాదించుకోలేదు. అయితే విమర్శకులకు మాత్రం ఎక్కవ పనిచెబుతూ ఉంటోంది. ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉండే అదితిరావ్ అందాలను ఆరబోసిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వారి విమర్శలకు గురవుతుంటుంది. అలాంటిది ఈ సారి తనే విమర్శకులపై విరుచుకుపడింది. దీని గురించి ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శించిన వారి గురించి పాపం అని జాలి పడతానంది. అలావిమర్శలు చేసేవారి నుంచి దూరంగా తాము పారిపోలేమంది. ఎలాంటి విమర్శనలనైనా నిజాయితీగా స్వాగతించాలని అంది. ఇతరులపై విమర్శలు చేసేవారు ఏదో సమస్యతో బాధపడుతున్నారన్నది తన భావన అని చెప్పింది. విమర్శకులకు ఏదో విషయంపై కోపం ఉండి ఉంటుందని, లేకపోతే వారి జీవితం మీద వారికే విరక్తి కలిగి ఉండవచ్చునని పేర్కొంది. ఆ కోపాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శల ద్వారా తీర్చుకుంటున్నారని అంది. అలాంటి వారికి మనం ఒక్కటే చేయగలం అంది. అది వారిని చూసి జాలి పడడమేనని చెప్పింది. అంతేకాకుండా వారు బాగుండాలని తాను భగవంతుడిని ప్రారి్థంచిన సంఘటనలు కూడా ఉన్నాయని చెప్పింది. ఈ రోజు మీకు మధురమైన రోజుగా గడవాలని ప్రారి్థస్తుంటానని చెప్పింది. వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటానంది. ఇక పోతే నటిగా తాను బిజీగానే ఉన్నానని, తమిళం, తెలుగు భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని నటి అదితిరావ్ పేర్కొంది. -
జెస్సీతో మళ్లీ జత కుదిరేనా?
సాక్షి, తమిళ సినిమా: తమిళంలో జెస్సీ-కార్తీక్ కాంబినేషన్ మళ్లీ కుదరబోతుందా? అంటే కోలీవుడ్ నుంచి ఔననే సమాధానం వినిపిస్తోంది. గౌతం మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె) సినిమాలో జెస్సీగా త్రిష మెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులో జెస్సీ పాత్రతో సమంత అరంగేట్రం చేస్తే.. తమిళంలో జెస్సీగా తన కెరీర్లో ఒక మైలురాయిని త్రిష సొంతం చేసుకుంది. తమిళంలో త్రిషకు జంటగా శింబు నటించాడు. వీరు జోడీగా నటించిన ‘విన్నైతాండి వరువాయా’ చిత్రం ఒక ఫీల్ లవ్ స్టోరీగా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు విన్నైతాండి వరువాయా జంటను మరోసారి తెరపై చూపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. మణిరత్నం తాజా ‘చిత్రం సెక్క సివంద వానం’ శింబుకు నూతనోత్సాహానివ్వగా, ఆ తర్వాత వచ్చిన ‘వందారాజా వాదాన్ వరువేన్’ (అత్తారింటికి దారిదే రీమేక్) నిరాశ పరిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వెంకట్ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో శింబు నటించబోతున్నారు. ఇందులో ఆయనకు జంటగా లక్కీ భామ రాశీఖన్నా నటించనున్నట్లు ప్రచారంలో ఉన్నా.. త్రిష అయితే బాగుంటుందని శింబు చెప్పడంతో దర్శకుడు వెంకట్ప్రభు ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. శింబు, త్రిష చిరకాల స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ జంట ఇప్పటికే అలై, విన్నైతాండి వరువాయా చిత్రాల్లో జోడీగా నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మానాడు సినిమాలో శింబు, త్రిష కలిసి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
-
హగ్ ఇస్తుంటే కంగారుపడ్డాడు
ఈ రోజుల్లో యువతీ యువకులు అభినందించుకోవడంలో భాగంగా కౌగిలించుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక సినీరంగంలో అయితే చెప్పనక్కర్లేదు. అయితే అలా ఇక హీరోయిన్ దర్శకుడికి హగ్ ఇస్తుంటే ఆయన కంగారు పడి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్, దర్శకుడు ఎవరనేగా మీ ఆసక్తి. అది సంచలన నటి అమలాపాల్, యువ దర్శకుడు రామ్కుమార్. ఈ దర్శకుడి చిత్రం రాక్షసన్లో నటి అమలాపాల్ హీరోయిన్గా నటించింది. ఇటీవల జరిగిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో తాను దర్శకుడికి హగ్ ఇవ్వబోతే ఆయన కంగారు పడి తప్పించుకున్నారని నటి అమలాపాల్ స్వయంగా చెప్పింది. దీని గురించి ఈ అమ్మడు చెబుతూ 'దర్శకుడు రామ్ చాలా మంచి వ్యక్తి. అంతే కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రాక్షసన్ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. చిత్ర షూటింగ్ పూర్తి కాగానే హమ్మయ్య పూర్తి అయ్యింది అని సంతోషంతో దర్శకుడు రామ్కుమార్ను హగ్ చేసుకోబోయాను. ఆయన కాస్త కంగారు పడి వెనక్కు వెళ్లారు. ఆయన ముండాసిపట్టి చిత్రం సక్సెస్ తరువాతనే పెళ్లి చేసుకోవలసింది. ఈ రాక్షసన్ చిత్రం తరువాత ఆయనకు పిల్ల దొరకడం కష్టమే అంటూ నవ్వుతూ సెటైర్ వేసింది. నిజంగా రామ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు త్వరలోనే మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని భావిస్తున్నాను. రాక్షసన్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇకపోతే ఇప్పుడు మీటూ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి దీని గురించి ట్వీట్ చేసిన మొదటి వ్వక్తిని నేనే. గత ఫిబ్రవరిలో లైంగికవేధింపులు ఎదురైనప్పుడు నేను మీటూ అని ట్వీట్ చేశాను. ఆ తరువాతే మీటూ అంతర్జాతీయంగా పాచుర్యం అయ్యింది. మీటూ అనేది ఒక మంచి విషయం. ఇది ఇంకా విస్తరించాలి. 18 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి వచ్చాను. నటించడానికి వచ్చినప్పుడే ప్రముఖ నటిని కావాలని అనుకున్నాను. అయితే ఆ పేరు తెచ్చుకోవడానికి 8 ఏళ్లు పట్టింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. ఇకపై నటనకు బ్రేక్ ఇవ్వను. చిత్రపరిశ్రమనే నాకు తల్లి. చిత్రాలను ఆస్వాదిస్తూ నటిస్తా' అని పేర్కొంది. -
అవసరమైనందుకే ఆ సన్నివేశాలు!
తమిళసినిమా: కథకు అవసరం అయినందువల్లే అర్ధనగ్న సన్నివేశాలను ఎక్స్ వీడియోస్ చిత్రంలో పొందుపరచినట్లు ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ అంటున్నారు. దర్శకుడు హరి శిష్యుడైన ఈయన తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. కలర్ షాడోస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అజయ్రాజ్, ప్రభుజిత్, అహిరుతిసింగ్, రియామిక, షాన్ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ దశ నుంచి సంచలనంగా మారిన ఎక్స్ స్టూడియోస్ చిత్రం తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కి శుక్రవారం తెరపైకి రానుంది చిత్ర దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన పలు సందేహాలకు వివరణ ఇస్తూ ఈ రోజుల్లో ఇంటర్నెట్లనేవి స్త్రీల నగ్న దృశ్యాలను, అశ్లీల దృశాలను విడుదల చేస్తూ సమాజాన్ని చెడ గొడుతున్నాయని చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందన్నారు. ఈ ఇంటర్నెట్లు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది చిత్రంలో చెప్పామన్నారు. అలా ఇది ఎక్స్ స్టూడియోస్ అనే ఇంటర్నెట్కు వ్యతిరేకంగా ఆవిష్కరించిన చిత్రం అని చెప్పారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందనే అదే టైటిల్ను చిత్రానికి నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఎక్స్ అనే పదమే తప్పు అని ఈ చిత్రంలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది మహిళలకు అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కన్నుకు తెలియని బ్రహ్మాండ సైబర్ ప్రపంచం జరుగుతోందన్నారు. అవి మనకు తెలియడం లేదుగానీ, మనల్ని 24 గంటలు చుట్టి తిరుగుతోందన్నారు. అందులో మన అంతరంగ విషయాలన్నీ బహిరంగమేనని అన్నారు. మన ఇంట్లో బాత్రూమ్, బెడ్ రూమ్లోనో మన స్మార్ట్ఫోన్ ఉంటే దానిలోని ఆప్షన్లతో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి మీ ఫోన్ను ఆపరేట్ చేయవచ్చునన్నారు. ఇలాంటి విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ చిత్రం ఉంటుందని వివరించారు. ఇందులో నగ్న దృశ్యాలు చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే అర్ధనగ్న దృశ్యాలు మాత్రం కథ డిమాండ్ చేయడంతో పొందుపరచినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన వారెవరూ ఇంతకు ముందు ద్వందార్థాల కథా చిత్రాల్లో నటించలేదని అన్నారు. ఈ చిత్రంలో సమాజానికి కావలసిన విషయం ఉండడంతో ఇందులో నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బృందంలో 7 గురు మహిళా సభ్యురాళ్లు ఉన్నారని తెలి పారు. అందులో ఒకరైన నటి గౌతమి ఎక్స్ స్టూడియోస్ లాంటి చిత్రాలు సమాజానికి అవసరమని, మరిన్ని విషయాలతో దీని రెండవ భాగాన్ని కూడా రూపొందించమని సలహా ఇచ్చారని దర్శకుడు అన్నారు. -
మాటలు వద్దోయ్... సైగలు చాలోయ్!
అవును... హీరోయిన్ తమన్నా ఏమీ మాట్లాడరు. మీరు ఏం మాట్లాడినా వినిపించుకోరు. ఓన్లీ సైగలే. అయ్యో... తమన్నాకి ఏమైంది? ఎందుకీ కోపం అనుకుంటున్నారా? ఓ క్యారెక్టర్ కోసం కెమెరా ముందు ఇలా చేస్తున్నారామె. చక్రి తోలేటి దర్శకత్వంలో ప్రభుదేవా, తమన్నా, భూమిక ముఖ్య తారలుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘కామోషీ’. ఈ సినిమాలో మూగ–చెవిటి అమ్మాయి పాత్రలో తమన్నా కనిపించనున్నారని టాక్. హిందీలో తమన్నా అయితే.. తమిళ్లో నయనతార ఈ పాత్ర చేశారు. ‘కొలైయుదిర్ కాలమ్’ పేరుతో తమిళంలో ఈ సినిమా రూపొందింది. తమిళ వెర్షన్ రిలీజ్కి రెడీగా ఉంది. ఈలోపు హిందీ రీమేక్ మొదలైంది. హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపించే తమన్నా.. ఈ మూవీ రిలీజ్ తర్వాత బోలెడన్ని చాన్స్లు చేజిక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘బాహుబలి’లో నటనకుగానూ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు తమన్నాకు దక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా’లోను, బాలీవుడ్ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్లోనూ నటిస్తున్నారు తమన్నా. -
నాన్నే నిజమైన హీరో !
సినీరంగంలో మా నాన్నే నా హీరో అని అంటోంది రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని. వైద్యవిద్య చదువుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్గా పరిచయం కానుంది. ఇప్పటికే 2స్టేట్స్ హిందీ చిత్ర తెలుగు రీమేక్లో నటించడానికి ఎంపికైన శివాని త్వరలో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా శివాని ఏమంటుందో చూద్దాం. ‘నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన డాక్టరు వృత్తిని వదిలి పెట్టకుండానే నటనను కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకునేవారు ఆయన్ని మ్యాజిక్మ్యాన్ అంటుంటారు. నాకు నచ్చిన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టరుగా, నటిగా అవుతాననే నమ్మకం ఉంది. కుటుంబం, స్నేహితుల ముందు నటిస్తున్నానని భావించు. అప్పుడే కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించగలవు అని నాన్న చెప్పారు. ఆయన మాటల్ని పాఠిస్తున్నాను. నేను కూచిపూడి, కథకళి డాన్స్ నేర్చుకుంటున్నాను. కిక్బాక్సింగ్ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. చిత్రాల్లో గాయనిగానూ పేరు తెచ్చువాలన్న ఆశ ఉంది. అందుకే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినీ ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉన్నానంటే సంతోషమే. ఈ తరం హీరోయిన్లలో నటి సమంత నచ్చిన నాయకి’. అని తన అభిరుచులు, అభిప్రాయాలు తెలిపారు. -
16 నుంచి థియేటర్లకు తాళం
తమిళసినిమా: ఈ నెల 16వ తేదీ నుంచి తమిళనాడులోని అన్ని థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు థియేటర్ల యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే దక్షిణాది నిర్మాతలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్కు మధ్య రేట్లు తగ్గించాలన్న విషయంపై చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను విడుదలను నిలిపేశారు. ఈ వ్యవహారంలో తెలుగు చిత్ర నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్కడి నిర్మాతలు కొత్త సినిమాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే తమిళ నిర్మాతలు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం తమిళనాడు థియేటర్ల సంఘం నిర్వాహకులు చెన్నైలోని రోహిణి థియేటర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. సంఘం కార్యదర్శి పన్నీర్సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చిన హామీలను వారంలోగా నెరవేర్చాలని లేనిపక్షంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రదర్శనలను నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విధిస్తున్న వినోదపు పన్ను 8శాతాన్ని పూర్తిగా రద్దు చేయాలి. థియేటర్ల నిర్వహణ చార్జీలను ఏసీ థియేటర్లకు ఒక్క రూపాయి నుంచి రూ.5వరకూ, నాన్ ఏసీ థియేటర్లకు 50పైసల నుంచి రూ.3వరకూ పెంచేందుకు అనుమతించాలని, థియేటర్ల లైసెన్స్ మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకునేలా చర్యలు చేపట్టాలి తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇలా ఉండగా నిర్మాతల మండలి నిర్ణయంతో తమకు ఎలాంటి సమస్యలేదని, ప్రభుత్వం విధిస్తున్న 8శాతం వినోదపు పన్ను కారణంగానే నష్టపోతున్నామని థియేటర్ల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 16వ తేదీ నుంచి చిత్రాల షూటింగ్ను సైతం రద్దు చేస్తున్నట్టు నిర్మాతల మండలి నిర్ణయించింది. -
అరుళ్పతికే పట్టం
తమిళ సినిమా: డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ అరుళ్పతికే పట్టం కట్టారు. తమిళనిర్మాతల మండలి ఎన్నికలు, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల తరువాత అంత సంచలనాన్ని కలిగించిన ఎన్నికలు డిస్ట్రిబ్యూటర్ల సంఘానివే. ఆదివారం స్థానిక చింతాద్రిపేటలోని మీరాసాహెబ్ వీధిలోని ఆ సంఘం కార్యలయంలో జరిగిన ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న టీఏ.అరుళ్పతి జట్టు మళ్లీ పోటీ చేయగా వారికి వ్యతిరేకంగా నిర్మాత కేఈ.జ్ఞానవేల్రాజా జట్టు, నిర్మాత దేవరాజ్లు అధ్యక్షపదవికి పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఉపకార్యదర్శి పదవి మినహా అన్ని పదవులను అరుళ్పతి జట్టే కైవసం చేసుకుంది. ఫలితాలివే.. మొత్తం సంఘంలో 527 సభ్యులుండగా 469 ఓట్లు పోలయ్యాయి. కాగా అధ్యక్షపదవికి పోటీ చేసిన అరుళ్పతి 248 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన కేఈ.జ్ఞానవేల్రాజాకు 194 ఓట్లు, దేవరాజ్ 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కాగా జ్ఞానవేల్రాజా జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీరామ్ 202 ఓట్లతో గెలుపుపొందారు. ఆయనపై పోటీ చేసిన రాజ్గోపాలన్ 173, ఎన్.చంద్రన్56 ఓట్లకే పరిమితం అయ్యారు. కార్యదర్శి పదవికి పోటీ చేసిన మెట్రో జయ 169 ఓట్లతో గెలుపోందారు. ఆయనతో పోటీ పడిన నేశమణి 142 ఓట్లు, కలైపులి జీ.శేఖర్ 140 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీనివాసన్ 216 ఓట్లతో ఆయనతో పోటీ పడ్డ కే.రాజన్ 199 ఓట్లు, ఆర్.సంపత్ 30 ఓట్లతో ఓటమిని చవిచూశారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన బాబురావ్ 201ఓట్లతో గెలుపోందగా, ఆయన్ను ఢీకొన్న సిద్ధిక్ 142 ఓట్లతో, జీ.మోహన్రావ్ 54 ఓట్లతోనే సరిపట్టుకుని ఓటమిపాలయ్యారు. మరోసారి సంఘం అధ్యక్ష పదవిని చేపట్టిన అరుళ్మణిని నిర్మాత కలైపులి ఎస్.థాను, ఎస్వీ.శేఖర్ తదితర సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
ఆ కష్టమేంటో నాకు తెలుసు!
తమిళ సినిమా: ఇవాళ తమిళ సినిమా చాలా వరకు యథార్థాలను వెతుక్కుంటూ సక్సెస్కు దగ్గరవుతోందనే చెప్పాలి. చరిత్రను తవ్వుకుంటూ అందులో ఆసక్తికర సంఘటనలకు చిత్ర రూపం ఇస్తోంది.అలా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాండు. వివిధ విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి గుర్తింపు పొందిన మహాగాంధీ, షికా, రిషీరిత్విక్, రమ, సాయ్దీనా,భువనశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఎంఎం.పవర్ సినీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. వాసన్ షాజీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సెల్వరాఘవన్తో పాటు పలువురు దర్శకుల వద్ద సహాయదర్శకుడిగా పని చేశారు. ఏఆర్.నేశన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శక నటుడు సముద్రకని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యంలేకుండా చిత్రాన్ని రూపొందించడం ఎంత కష్టమో తనకు బాగా తెలుసన్నారు. వాండు చిత్రాన్ని దర్శకుడు వాసన్ షాజీతో పాటు మొత్తం యూనిట్ ఎంతో శ్రమించి తెరకెక్కించారని అన్నారు.ఉత్తర చెన్నై భూమి పుత్రులని పేర్కొన్నారు. వారి ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే గోలీసోడా చిత్రం గుర్తుకొస్తోందన్నారు. వాండు చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు సముద్రకని పేర్కొన్నారు. అవకాశాలు మనల్సి వెతుక్కుంటూరావు. మనమే వాటిని కల్పించుకోవాలి అన్న భావనతో చేసిన చిత్రం వాండు అని, ఇది ఉత్తర చెన్నై ప్రజల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని దర్శకుడు వాసన్ షాజీ అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు. -
సొంతం నీకా..? నాకా..?
తమిళ సినిమా: ఒక మార్కెట్ను సొంతం చేసుకోవడానికి హీరో, రౌడీ మధ్య జరిగే పోరాటం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం సెయల్. నవ జంట రాజన్తేజేశ్వర్, తరూషి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో నటి రేణుక, మునీష్కాంత్, సూపర్గుడ్ సుబ్రమణియం, వినోదిని, టీపోట్టి గణేశన్, ఆడుగళంజయబాలన్, దీనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటుడు ఛమక్ చంద్ర విలన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్.క్రియేషన్స్ నిర్మలారాజన్ సమర్పణలో దివ్యక్షేత్ర ఫిలింస్ పతాకంపై సీఆర్.రాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో విజయ్ హీరోగా షాజహాన్ చిత్రాన్ని తెరకెక్కించిన రవి అబ్బులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన 15 ఏళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీ.ఇళయరాజా ఛాయాగ్రహణ, సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఉత్తర చెన్నైలోని తంగశాలై మార్కెట్ను సొంతం చేసుకోవడానికి వచ్చిన ఒక రౌడీని అదే మార్కెట్లో సరకులు కొనుక్కోవడానికి వచ్చిన హీరో చితకబాదే పరిస్థితి నెలకొంటుందన్నారు. దీంతో ఆ మార్కెట్లో ప్రజలకు రౌడీ అంటే భయం పోతుందన్నారు. ఆ మార్కెట్ను సొంతం చేసుకోవాలంటే ఆ రౌడీ అదే చోట హీరోను తిరిగి కొట్టాలన్నారు. మరి ఆ రౌడీ కొట్టారా? లేక మరోసారి హీరో చేత చావు దెబ్బలు తిన్నాడా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సెయల్ చిత్ర కథ సాగుతుందన్నారు. ఇందులో హీరోను ప్రేమించమని వెంటపడే పాత్రలో హీరోయిన్ నటిస్తోందని, అయితే ఆమె హీరోను కలిసి నప్పుడల్లా ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుందని చెప్పారు. -
జాతీయ అవార్డు గెలుచుకుంటుంది!
తమిళసినిమా: పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల ప్రేమ వ్యవహారంతో ఇంతకుముందు పలు చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. ఎదిగీఎదగని ఆ వయసులోని ప్రేమను విభిన్న కోణంలో ఆసక్తిగా, అదే సమయంలో మంచి సందేశంతో రూపొందిన తాజా చిత్రం పళ్లిపరువత్తిలే. వాసుదేవ్ భాస్కర్ కథ ,కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని వీకేపీటీ క్రియేషన్ పతాకంపై డి.వేలు నిర్మించారు. ప్రముఖ సంగీతదర్శకుడు సిర్పి కొడుకు నందన్రావు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయకిగా వెంబ నటించింది. ప్రధాన పాత్రల్లో దర్శకుడు కేఎస్.రవికుమార్, ఊర్వశి నటించగా, తంబిరామయ్య, గంజాకరుప్పు హాస్య పాత్రల్లోనూ, పొన్వన్నన్, ఆర్కే.సురేశ్, పరుత్తివీరన్ సుజాత, పూవిత, భువన, వైశాలి ముఖ్యపాత్రల్లో నటించారు. వినోద్కుమార్ ఛాయాగ్రహణం, విజయ్నారాయణన్ సంగీతాన్ని అందించారు.ఈయన ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్ల శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు వాసుదేవ్ భాస్కర్ తెలుపుతూ తల్లిదండ్రుల తరువాత పిల్లలకు ఉపాధ్యాయుడే పూజ్యసమానులు.పిల్లలు తల్లిదండ్రుల తరువాత ఎక్కువగా గడిపేది ఉపాధ్యాయులతోనే నన్నారు.అలాంటి గురువులు చూపే మార్గాన్ని బట్టే పిల్లల భవిష్కత్ ఉంటుందన్నారు. అలాంటి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం పళ్లిపరువత్తిలే అని చెప్పారు. ఇది ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు.అందుకే ప్రపంచంలోని ఉపాధ్యాయులందరికీ పళ్లిపరువత్తిలే చిత్రాన్ని అంకితం ఇస్తున్నామన్నారు. గామీణ ప్రాంతానికి వెళ్లి వైద్యసాయం అందించే ఇతివృత్తంతో తెరకెక్కిన ధర్మదురై చిత్రం ప్రేక్షకాదరణతో పాటు జాతీయ అవార్డును గెలుసుకుందని, అదే విధంగా ఈ చిత్రం జాతీయ అవార్డును సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు అన్నారు.ఈ చిత్ర క్లైమాక్స్ ట్రాజిడీగా ఉంటూ చూసిన ప్రతి ప్రేక్షకుడి గుండెల్ని బరువెక్కిస్తుందని చెప్పగలనన్నారు. సెన్సార్ ప్రశంసలు దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రం చూసి చాలా కాలం తరువాత మంచి చిత్రాన్ని చూశానని మెచ్చుకున్నారన్నారు. సెన్సార్బోర్డు సభ్యులు మంచి చిత్రం అని ప్రశంసించారని చెప్పారు. చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నామని, దీన్ని తెలుగులోనూ రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్ర కథానాయకి వెంబ ఇంతకు ముందు నటించిన కాదల్ కసక్కుదయా చిత్రం తెలుగులో అనువాదం అయ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోందని తెలిపారు. -
పేరడీ సినిమా టీం షాకింగ్ ఎనౌన్స్ మెంట్
సాధారణంగా సినిమా పోస్టర్ తో పాటు ఆడియో రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేయటం చూస్తుంటాం. కానీ ఓ తమిళ సినిమా నిర్మాతలు ఏకంగా ఈ సినిమా ఎప్పుడు పైరసీ వర్షన్ వస్తుందో కూడా ఎనౌన్స్ చేశారు. కోలీవుడ్ ఘన విజయం సాధించిన తమిళపడం సినిమాకు సీక్వల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ పడం 2.0 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను వినూత్నంగా ప్రకటించారు చిత్రయూనిట్. తమిళ హీరో సిద్ధార్థ్ రిలీజ్ చేసిన పోస్టర్ లో టైటిల్ లోగోతో పాటు సినిమాను 25 మే 2018 న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు ఆ మరుసటి రోజు 26 మే 2018న సినిమా తమిళ రాకర్స్ వెబ్ సైట్ లో పైరసీ వర్షన్ రిలీజ్ అవుతుందని అదే పోస్టర్ లో ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. స్టార్ హీరోల సినిమాల పేరడీ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అముదన్ దర్శకుడు. Ellame inimey oru maadhiriya dhaan nadakkum! Happy to launch the release poster of #TP2point0 No theory. Only practical. A @csamudhan classic. Starring Akila Ulaga Superstar @actorshiva Puratchi producer @sash041075 Joooot!!! pic.twitter.com/q4BDw9ZcjH — Siddharth (@Actor_Siddharth) 9 December 2017 -
ఫ్రాన్స్లోనూ మేల్నాట్టు మరుమగన్
తమిళ సినిమా: తమిళసినిమా పరిధి పెరిగి చాలా కాలమే అయ్యింది. అయితే విదేశాల్లో మన స్టార్స్ నటించిన చిత్రాలే అధికంగా విడుదలవుతాయి. అలాంటి చిత్రాలకే అక్కడ ఆదరణ ఉంటుంది. అలాంటిది ఒక చిన్న తమిళ చిత్రం ఫ్రాన్స్ దేశంలో 30 థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషమే అవుతుంది. ఆ చిత్రమే మేల్నాట్టు మరుమగన్. రాజ్కుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆండ్రియన్ అనే ఆంగ్ల బ్యూటీ కథానాయకిగా నటించడం విశేషం. వీఎస్.రాఘవన్, అంజలీదేవి, అశోక్రావు, సాతన్య ముఖ్య పాత్రలను పోషించారు. ఉదయ క్రియేషన్స్ పతాకంపై మనో ఉదయకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎంఎస్ఎస్ నిర్వహించారు. చిత్రం గురించి ఈయన తెలుపుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు నచ్చడంతో ఫ్రాన్స్కు చెందిన ఒక యువతి ఇక్కడి యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మేల్నాట్టు మరుమగన్ చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు. చిత్రంలో ప్రేక్షకులను అలరించే పలు అంశాలు ఉంటాయని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలుమార్లు ప్రయత్నించినా, ఆటంకాలు ఎదురయ్యాయని అన్నారు. ఈ రోజుల్లో చిన్న చిత్రాల విడుదల ఎంత కష్టంగా మారిందో తెలియంది కాదన్నారు. తమ చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన అంశం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఫ్రాన్స్ దేశంలోనూ 30 థియేటర్లలో విడుదల చేయనున్నామని చెప్పారు. -
టికెట్ ధరలు పెంచుకోండి: రాష్ట్ర ప్రభుత్వం
పెరంబూరు(తమిళనాడు): ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే సగటు జనం ఇప్పుడు కూసంత వినోదం కోసం సినిమాకు వెళ్లేటట్టూ లేదని పాడుకునే రోజు వచ్చింది. సినిమా టికెట్ ధరలకు ప్రభుత్వం గేట్లేసింది. ముందుగా థియేటర్లపై వినోదపు పన్ను భారం మొపేసి ఇప్పుడు టికెట్ ధరను పెంచుకోండంటూ థియేటర్ల యాజమాన్యానికి అనుమతి ఇచ్చింది. సినిమాలపై జీఎస్టీ 28 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను 10 శాతం వేసేసింది. దీంతో బాబోయ్ మా వల్ల కాదంటూ ఆ 10 శాతం పన్నును రద్దు చేయాలని, లేని పక్షంలో థియేటర్లను మూసివేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని థియేటర్ల యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. ఇక నిర్మాతలమండలి వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ శుక్రవారం విడుదల కావలసిన కొత్త చిత్రాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చునని శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో చెన్నై నగరంలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరను గరిష్టంగా రూ. 160 వరకూ పెంచుకోవచ్చుని తెలిపింది. ఇతర నగరాల్లో రూ.140 వరకూ పెంచుకోవచ్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో థియేటర్ల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏతా వాతా ప్రభుత్వం వినోదపు పన్ను వేసినా, థియేటర్లు టికెట్ ధరను పెంచినా ఆ భారం మోయాల్సింది ప్రజలే. ఇక సగటు ప్రేక్షకుడికి సినిమా మరింత ప్రియం అయింది. మొత్తం మీద ప్రభుత్వం, సినీ థియేటర్ల మధ్య వివాదంతో మధ్య తరగతి ప్రేక్షకులకు చుక్కలంటే ధరలతో నిజంగానే సినిమా చూపిస్తున్నారు. -
నన్ను గెలవలేరు!
అంతే కాదు. నాపై గెలుస్తాననుకోవడమూ కష్టమే! ఒకవేళ ఎవరైనా అటువంటి కలలు కంటుంటే... త్వరగా మేల్కోవడం మంచిది. మేల్కొని మమ్మల్ని క్షమించమని నన్ను వేడుకోండని చెబుతున్నారు త్రిష. ఇప్పుడీ గెలుపోటముల ప్రస్తావన ఎందుకు? ఎందులో ఆమెను గెలవలేరు? పదేళ్లకు పైగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోన్న ఆమె కొత్త కథానాయికలకు ఏమైనా సవాల్ విసురుతున్నారా? వంటి ఆలోచనల్లోకి వెళ్లొద్దు. ఎందుకంటే... త్రిష చెబుతున్నది కథానాయికల గురించి కాదు, బాక్సింగ్ గురించి! త్రిషకు కొత్తగా బాక్సింగ్పై ప్రేమ పుట్టుకొచ్చింది. ఫిట్నెస్ కోసం ఇటీవల రెగ్యులర్ వర్కౌట్స్లో బాక్సింగే ఎక్కువ చేస్తున్నారు. దీనికి మరో కారణం కూడా ఉందండోయ్... ఓ తమిళ సినిమా కోసం త్రిష బాక్సింగ్ నేర్చుకోవలసి వచ్చింది. ఆ సినిమాలో ఓటమి ఎరుగని బాక్సర్గా కనిపించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ టాక్! అటు సినిమాకూ, ఇటు స్లిమ్ముగా ఉండడడానికీ ఆమెకు బాక్సింగ్ అక్కరకు వస్తోందన్న మాట. -
ఇక్కడే పుట్టాను
తమిళసినిమా: చెన్నైలో గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోçషంగా ఉంది. నేను తమిళనాడు నీళ్లు తాగి పెరిగాను. చెన్నైలోనే పుట్టాను. నేను మీలో ఒకరినే. తమిళం, తెలుగు అని కాకుండా మనమంతా భారతీయులం. అని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు అదే పేరుతో తమిళంలో అనువాదం అవుతోంది. ఆర్ఎన్సీ సినిమా పతాకంపై రఘునాధ్ సమర్పణలో నరేంద్ర తమిళంలోకి అనువధిస్తున్న ఈ చిత్ర తమిళ వెర్షన్కు మరుదభరణి సంభాషణలు రాశారు. పాటలను వైరముత్తుతో కలిసి మరుదభరణి రాశారు. చిరంధన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్లోని కలైవానర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు బాలకృష్ణ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రావడం విశేషం. కాగా నటుడు కార్తీ ముఖ్య అతిథిగా పాల్గొన్ని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్ తొలి ప్రతిని అందుకున్నారు. కార్యక్రమానికి చెన్నైలోని బాలకృష్ణ అభిమానులతో పాటు నెల్లూరు నుంచి ఎన్బీకే ఫాన్స్ సంఘం అధ్యక్షుడు శివ నేతృత్వంలో పలువురు అభిమానులు హాజరయ్యారు. -
జీఎస్టీతో సినిమా టికెట్ ధరల మోత
తమిళసినిమా: తమిళనాట జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి రావడంతో సినిమా టికెట్ ధరలు మోతమోగుతున్నాయి. జీఎస్టీ పన్నును కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం, దానికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా మరో 30 శాతం వినోదపు పన్నును విధించడానికి సిద్ధం అవడంతో చిత్ర వర్గాలు బెంబేలెత్తిపోయారు. దీంతో రాష్ట్రప్రభుత్వం విధించే పన్నును రద్దు చేయాలంటూ తమిళనాడు థియేటర్ల యాజమాన్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రభుత్వం చర్చలకు సిద్ధమవడంతో థియేటర్ల యాజమాన్యం గురువారం సమ్మెను విరమించుకుంది. శుక్రవారం నుంచి థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.అయితే మధ్యతరగతి ప్రేక్షకుడు మాత్రం టికెట్ ధర చూసి భయపడిపోతున్నాడు. ఇప్పటి వరకూ రూ.120 టికెట్ ధర ఉండగా అది 28శాతం జీఎస్టీ పన్నుతో కలిపి రూ. 153కు పెరిగింది. ఇక 18 శాతం జీఎస్టీ పన్ను పరిధిలో ఉన్న రూ.100 టికెట్ ఇప్పుడు రూ.118కు పెరిగింది. అదే విధంగా రూ. 90 టికెట్ ధర 106కు, రూ.50 టికెట్ ధర రూ.59కు పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వినోదపు పన్ను విధించడానికి సిద్ధం అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. -
తమిళనాడుతో అనుబంధం
దాసరి మృతిని జీర్ణించుకోలేని అభిమానులు తమిళ సినిమా (చెన్నై): పాలకొల్లు నుంచి తన కళను నమ్ముకుని మద్రాసు మహానగరంలో అడుగుపెట్టి, ప్రపంచం గర్వించేంత స్థాయికి ఎదిగిన దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇకలేరన్న సమాచారం తమిళనాట అభిమానుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు కళారంగానికి చెందిన వారే కాదు తమిళ సినీ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గిన్నిస్ రికార్డుతో తెలుగువాడి ప్రభంజనాన్ని చాటిన దాసరికి చెన్నైతో అనుబంధం చాలానే ఉంది. ఒకప్పటి మద్రాసు పట్నంలో నాటి నటీనటుల వలే దాసరి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఘోస్ట్ రైటర్గా సినీ పయనాన్ని ప్రారంభించి, అచంచల ఆత్మవిశ్వాసంతో రచయితగా, మాటల రచయితగా, చిన్న చిన్న పాత్రలు అంటూ ఒక్కోమెట్టు ఎదిగి చిత్ర పరిశ్రమలో వటవృక్షంలా ఎదిగి, ఎందరికో ఆశ్రయమిచ్చి, వారి ఎదుగుదలకు దోహదపడి దాసరి వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించారు. అగ్రనటుడిగా ఎన్.టి.రామారావు హవా కొనసాగుతున్న తరుణంలో స్థానిక టీనగర్ హబిబుల్లా రోడ్డులోని ఆయన ఇంటికి ఎదురుగా ఇంటిని నిర్మించుకుని ఆయనకు ధీటుగా వెలిగారు. హీరోల హవా కొనసాగుతున్న తరుణంలో దర్శకుడే సినిమాకు కెప్టెన్ అని చాటిచెప్పిన దిగ్గజం దాసరి. విడదీయరాని అనుబంధం దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, పత్రికాధిపతిగా, రాజకీయ నేతగా తమిళులకు దాసరి సుపరిచితుడే. జాతీయ పురస్కారాలు అందుకున్నా, నంది అవార్డులతో రికార్డులు సృష్టించినా తెలుగు, తమిళ భాషల్లోనూ ఆయన ఉత్తమ నటుడిగా మన్ననల్ని అందుకున్నారు. తమిళంలో ‘అడిమై పెన్’ (ఒసేయ్ రాములమ్మ)తో అశేష అభిమాను ల్ని సంపాదించుకున్నారు. దీని తర్వాత దాసరి చిత్రాలు తమిళ అనువాదంలోకి వరుసగా క్యూకట్టాయి. అత్యధిక చిత్రాల దర్శకుడిగా, ప్రజలను ప్రభావితం చేసే ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దాసరి తమిళంలో ‘నక్షత్రం’ పేరుతో తొలి సినిమా తీశారు. ఇక్కడ జరిగే కార్యక్రమా లకు, వేడుకలకు తరచూ హాజరయ్యేవారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్హాసన్లకు దాసరితో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా రజనీకాంత్ దాసరిని ‘గురువు గారు’ అంటూ సంబోధిస్తుంటారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే వైద్యలింగం, అనకాపుత్తూరు తెలుగు ప్రముఖుడు భారతి కుమార్ వంటి వారు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధికార ప్రతినిధి శ్రీదేవి రెడ్డి కూడా దాసరి మృతికి సంతాపం తెలిపారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చిత్రను ‘అమ్మ’పేరుతో సినిమాగా తెరకెక్కించడానికి దాసరి సన్నాహాలు చేశారు. ఆ ప్రయత్నం నెరవేరకుండానే తనువు చాలించడం తమిళ ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. నా చిత్రాలకు గోరింటాకు పండించారు ‘నా చిత్రాలకు గోరిటాకు పండించారు. ఆయన లేని తెలుగు సినిమాను ఊహించలేం. ఆయన నిర్మాతల్లో నాకు ప్రత్యేకతను ఇచ్చారు. నేను తెలుగు చలన చిత్ర నిర్మాతల పుస్తకాన్ని రాసినప్పుడు ఎంతోమంది అడ్డుకున్నా నాకు అండగా నిలబడ్డారు. తెలుగు నిర్మాతల చరిత్ర ఉన్నంతకాలం నేనుండేలా చేశారు. అలాంటి దాసరి మరణం తీరని లోటు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’ – నిర్మాత మురారి ‘కటకటాల రుద్రయ్య’తో నా అనుబంధం ‘కటకటాల రుద్రయ్య సినిమాకు ఫైనాన్షియర్గా, డిస్ట్రిబ్యూటర్గా దాసరితో పనిచేసి అనుభవం మరువలేనిది. ఆర్యవైశ్య సమావేశాలకు తరచూ హాజరై అండగా నిలిచారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు.’ – టంగుటూరి రామకృష్ణ, తెలుగు తెర అధ్యక్షుడు -
ఆ సినిమాలో నటిస్తే బాగుండేది: క్రికెటర్
క్రికెట్ నేపథ్యంగా తాజాగా తమిళంలో వచ్చిన సినిమా చెన్నై 28. గల్లీ క్రికెట్ నేపథ్యంగా యువత జీవితాల్లో ఈ క్రీడ ఎలా భాగమయిందో వివరిస్తూ రూపొందిన ఈ సినిమాపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మనస్సు పడ్డాడు. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన అశ్విన్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'చెన్నై 28 (2) చాలా మంచి సినిమా. నా జీవితం మొత్తాన్ని తిప్పి చూసుకున్నట్టు ఉంది ఈ సినిమాను చూస్తే. ఈ సినిమాలో నేను కూడా భాగమై ఉంటే బాగుండేది అనిపించింది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. 2007లో వచ్చిన చెన్నై-28 సినిమాకు ఈ సినిమా సీక్వెల్. ఈ సినిమాలో అశ్విన్ తో అతిథి పాత్ర చేయించాలని తాము కూడా అనుకున్నామని, అది కుదరలేదని, మూడో పార్టు గనుక తీస్తే అందులో అశ్విన్ ను తీసుకుంటామని చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభూ తెలిపారు. -
కరుణ.. జయ.. కలిసి పనిచేశారా?
తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి గట్టి ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి ఏ క్షణంలోనూ పడేది కాదు. అలాంటిది ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం అసలు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉంటుందా? జయలలిత దాదాపు 140కి పైగా సినిమాల్లో నటించారు. 1960ల నుంచి 1980ల వరకు ఆమె తమిళ తెరను తిరుగులేకుండా ఏలిన రారాణి. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమే కాకుండా.. తమిళ రాజకీయాల్లో ఉన్న మరికొందరు ప్రముఖ నాయకులకు కూడా సినీ పరిశ్రమతో సంబంధం, అనుబంధం ఉన్నాయి. డీఎంకే అధినేత ఎం. కరుణానిధి.. అన్నాడీఎంకే అధినేత్రికి గట్టి ప్రత్యర్థి. కానీ ఆయన కూడా రాజకీయాల్లోకి రాకముందు పేరుమోసిన సినిమా రచయిత. అందుకే వీళ్లిద్దరూ కలిసి ఏమైనా సినిమాలో పనిచేశారా అన్న విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. అవును.. ఒకే ఒక్క మాత్రం సినిమాకు ఇద్దరూ పనిచేశారు. జయలలిత తమిళంలో చేసిన తొలి సినిమా వెన్నిరాడై (1965). అప్పటికి తమిళ సినీ పరిశ్రమలో కరుణానిధి చాలా విజయవంతమైన స్క్రిప్టు రచయిత. ఆయనతో రాయించుకోవాలని దర్శకులు, నిర్మాతలు వెంటపడుతుండేవారు. కానీ, జయలలిత నటిగా ఎదిగే సమయానికి ఆయన సినిమాలకు రాయడం దాదాపు మానేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశారు. కానీ, 1966 సంవత్సరంలో ఎస్.రాజేంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మణి మకుటం సినిమా మాత్రం వీళ్లిద్దరినీ కలిపింది. ఆ సినిమాలో జయలలిత సెకండ్ హీరోయిన్గా చేశారు. ఆ సినిమాకు కరుణానిధి స్క్రిప్టు అందించారు. రాజకీయాల్లో ఇద్దరూ భీకరంగా తలపడినా, సినిమా రంగంలో మాత్రం ఒక్కసారి ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లభించింది. కరుణానిధి సృష్టించిన పాత్రను జయలలిత పోషించారు. -
జిల్లా కలెక్టర్ గా నయనతార..
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకునే కొద్దిమంది తారల్లో నయనతార ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో ఆమె.. బలమైన వ్యక్తిత్వమున్న కథానాయిక పాత్రల్లో నటించి మెప్పించారు. అందుకే ఇప్పటికీ నయన్ను క్రేజీ ప్యాకేజ్తో భారీ ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆమె ఓ తమిళ సినిమాలో బలమైన పాత్రలో కనిపించనున్నారు. ఒక ఊరికి సంబంధించిన తాగు నీటి సమస్య ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నయన్ జిల్లా కలెక్టర్గా దర్శనమివ్వనున్నారు. నయనతార పాత్ర సినిమాకే హైలెట్గా ఉండనుంది. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేశారట. గోపీ నానర్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా చెన్నైలో మొదటి షెడ్యూల్ షూటింగ్ను పూర్తిచేసుకుంది. 'కాక్కాముట్టై' సినిమాతో మెప్పించిన చిన్నారులు విఘ్నేష్, రమేష్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రజలు ప్రస్తుతం తీవ్రంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య నేపథ్యంలో సినిమాను తెరకెక్కించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు దర్శకుడు గోపి అన్నారు. తమ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
61వ వసంతంలోకి ప్రయోగాల ఆధ్యుడు
సిల్వర్ స్క్రీన్పై ప్రయోగాలకు ఆధ్యుడు కమలహాసన్ అంటే అతిశయోక్తి కాదేమో. అసలు కమల్ అంటేనే వండర్ అని చెప్పవచ్చు. ఈయన ఒక నటపిపాచి అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఐదో ఏటనే నటనలో బుడిబుడి అడుగులు వేసిన కమలహాసన్ తొలి చిత్రం కలత్తూర్ కన్నమ్మ చిత్రానికిగానూ అప్పటి రాష్ట్రపతి చేతుల మీదగా బంగారు పతకాన్ని అందుకున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనడానికి ఈ బాల నట మేధావి విషయంలో ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది. 1954లో తమిళనాడు పరమకుడిలో జన్మించిన కమలహాసన్ విశ్వనటుడవుతారని బహుశ ఆయనే ఊహించి ఉండరు. నటన, నాట్యం, నృత్య దర్శకత్వం, దర్శకత్వం, కథకుడు, గాయకుడు, పాటల రచయిత, స్క్రీన్ప్లే రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్లో గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు. మొత్తం మీద సినీ ఎన్సైక్లోపీడియాగా పేరెన్నికగన్న కమలహాసన్ శనివారం 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సినిమాల్లో నిత్యకృషీవలుడు, నిరంతర శ్రామికుడు, ప్రయోగాలకు ఆధ్యుడు, ప్రపంచ సినిమాను అవపోసన పట్టిన విశ్వనటుడు కమల్ నట విధూషణకు నిదర్శనాలు ఎన్నో. కమల్ నటించిన అపూర్వరాగంగళ్ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్నారు. అలా నాలుగు జాతీయ అవార్డులు, 19 ఫిలింఫేర్ అవార్డులకు కమల్ అలంకారమయ్యారు. 1979లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం, 1990లో కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ అవార్డులు కమల్ను వరించాయి. సాధారణంగా పాత్రకు తగ్గట్లుగా నటులు తమను మలచుకుంటారు. అలాంటిది క్లాస్, మాస్ ఏ తరహా కథాచిత్రం అయినా ఈ నట దిగ్గజానికి మౌల్డ్ అవ్వాల్సిందే. అంతగా తన మార్కు ఉంటుంది. ఒక మరోచరిత్ర, ఒక నాయకుడు, ఒక 16 వయదినిలే, ఒక దేవర్మగన్, ఒక మైఖెల్ మదనకామరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ నట తృష్ణకు తార్కాణాలు ఎన్నో ఎన్నెన్నో. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించి మెప్పించిన ఏకైక నటుడు కమలహాసనే అని ప్రతి తమిళుడూ గర్వంగా చెప్పుకునే చరిత్ర దశావతారం చిత్రం. ఇక ప్రయోగాల విషయానికి వస్తే అపూర్వసహోదర్గళ్ చిత్రంలో కమలహాసన్ నటించిన అప్పు అనే మరుగుజ్జు పాత్ర ఇప్పటికీ చాలా మందికి అబ్బురపరచే అంశమే. హాలీవుడ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ సినిమాకు పరిచయం చేయడంలో ఆధ్యుడు కమలహాసనే. డిజిటల్ సినిమాను తన ముంబయి ఎక్స్ప్రెస్ చిత్రం ద్వారా భారతీయ సినిమాకు స్వాగతం పలికింది ఈ సినీ విజ్ఞానే. అలాగే డీటీఎస్ సౌండ్, ఆరా 3డీ సౌండ్స్ పరిజ్ఞానానికి తమిళంలో శ్రీకారం చుట్టింది ఈ ప్రయోగాల వీరుడే. ఆరా 3డీ సౌండ్ పరిజ్ఞానాన్ని కమల్ తన విశ్వరూపం చిత్రం ద్వారా భారతీయ సినిమాకు దిగుమతి చేశారు. కొత్తదనం కోసం తపించే కమల్ విశ్వరూపం, ఉత్తమవిలన్, తాజా చిత్రం తూంగావనం చిత్రాల సౌండ్ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ వంటి సాంకేతికపరమైన అంశాలను అమెరికాలో రూపొందించడం గమనార్హం. చెన్నై, హైదరాబాద్లలో సౌండ్ రికార్డింగ్ స్టూడియోస్.. ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగించడానికి ప్రయత్నించే కమలహాసన్ అమెరికాలో సౌండ్ రికార్డింగ్ వంటి పనులు భారం అవుతున్న నేపథ్యంలో తానే అంతటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సౌండ్ రికార్డింగ్ స్టూడియోలను ఇతరులకు అందుబాటులో ఉండే విధంగా చెన్నై, హైదరాబాద్లో సొంతంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందే.. కమలహాసన్ చేసే గుప్త దానాలెన్నో. వ్యక్తిగతంగా నాస్తికుడయిన కమల్లో మానవత్వం మెండు. ఈ చేత్తో చేసిన సాయం ఆ చేయికి కూడా తెలియవన్నంతగా ఆయన సేవలు ఉంటాయి. అభిమాన సంఘం పేరుతో అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా వికలాంగులను, నిరుపేదలను, విద్యార్థులను ఆర్థికంగా, ఉపాధి పరంగా ఆదుకుంటున్న మానవతావాది కమలహాసన్. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం. - తమిళసినిమా -
సినీ నటి మనోరమ ఇక లేరు
-
సినీ నటి మనోరమ ఇక లేరు
చెన్నై: ప్రముఖ సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. 1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు. (ఫోటో గ్యాలరీ ...) 1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు. మనోరమ అసలు పేరు గోపీశాంత. మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2. మనోరమ నటించిన తెలుగు చిత్రాలు: ♦ శుభోదయం ♦ జెంటిల్మేన్ ♦ రిక్షావోడు ♦ పంజరం ♦ బావనచ్చాడు ♦ మనసున్నమారాజు ♦ అరుంధతి ♦ నీప్రేమకై ♦ కృష్ణార్జున -
మణి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా హీరో కూతురు
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, చిత్ర నిర్మాత ఆర్. పార్థిపాన్ కూతురు నటి కీర్తన ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కార్తీ సురేశ్, దుల్కర్ సల్మాన్ నటీనటులుగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఈ ప్రాజెక్టులో సహాయ దర్శకురాలిగా పనిచేస్తూ ఆడిషన్లలో కీర్తన బిజీగా ఉన్నట్టు సినిమా యూనిట్ పేర్కొంది. మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన తమిళ సినిమా 'కన్నాథిల్ ముత్తాముట్టాల్' లో కీర్తన నటించింది. ఆ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రాజెక్టులో హీరోయిన్ కోసం చూస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నటి కీర్తీ సురేశ్ కథానాయకగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్పైకి వెళ్లనుంది. -
నటి సిమ్రాన్ అంటే ఎంతో ఇష్టం: మనీషా యాదవ్
తమిళ సినిమా : నటి సిమ్రాన్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేనని ఆమెకు తీవ్ర అభిమానినని అంటోంది నటి మనీషా యాదవ్. వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా తమిళ తెరపై ప్రత్యక్షమైన ఈ ఉత్తరాది భామ, ఆ తరువాత కాదల్ చెయ్వీర్ తదితర విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ మధ్య చిన్న వివాదంలో చిక్కుకుని కోలీవుడ్కు దూరమైన మనీషా తాజాగా జి.వి.ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. టైటిల్తోనే బోలెడు ప్రచారం పొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే కయల్ చిత్రం ఫేమ్ ఆనంది ఒక నాయికగా నటి స్తోంది. అలాగే మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తోంది. కాగా ఇప్పుడు నటి మనీషా యాదవ్ మరో హీరోయిన్గా ఎంపికయ్యింది. ఈ చిత్రంలో చోటు సంపాదించుకోవడం గురించి మనీషా మాట్లాడుతూ, ‘త్రిష ఇల్లన్న నయనతార’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇందులో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రని చెప్పింది. జి.వి.ప్రకాశ్ కుమార్ మంచి సంగీత దర్శకుడే కాక, నటనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారన్న విషయాన్ని మూడు రోజుల షూటింగ్లోనే తాను గ్రహించానని పేర్కొంది. దర్శకుడు ఆదిక్ సన్నివేశాలను అర్థవంతంగా వివరిస్తూ ఆర్టిస్టుల నుంచి తనకు కావలసిన అభినయాన్ని రాబట్టుకుంటున్నారని అంది. ఇకపోతే తాను నటి సిమ్రాన్కు తీవ్ర అభిమానినని పేర్కొంది. ఆమె నటిస్తున్న చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. సిమ్రాన్లా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ తాను ఆమెను కలుసుకోలేదని, త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో కలుసుకునే అవకాశం రాబోతుందన్న ఎగ్జయిట్మెంట్తో ఉన్నానని మనీషా అంది. కాగా ఈ చిత్రాన్ని కామియో ఫిల్మ్స్ పతాకంపై సీజె. కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
రజనీ, అమీర్ తో ఎందిరన్-2 ?
2010లో అద్భుత విజయాన్ని సాధించి తమిళ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ఎందిరన్. అలాంటి చిత్రానికి సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆ చిత్ర కెప్టెన్ శంకర్ కూడా ఎందిరన్కు కొనసాగింపును తెరకెక్కించాలనుకుంటున్నారు. ఎందిరన్ చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్ రోబోగా, దాన్ని కనుగొన్న శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేశారు. ఐశ్వర్యారాయ్ నాయకిగా నటించారు.ఈ చిత్ర సీక్వెల్ నిర్మాణం గురించి ఇటీవల మళ్లీ ప్రచారం ఊపందుకుంది. లింగా తరువాత రజనీ, ఐ చిత్రం తరువాత శంకర్ రిలాక్స్ అవడం అందుకు ఒక కారణం కావచ్చు. అయితే ఎందిరన్ చిత్రానికి కొనసాగింపు గురించి వీరిద్దరూ ఇటీవల కథా చర్చలు జరిపినట్లు కూడా కోలీవుడ్ టాక్. ఈ విషయంలో తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఎందిరన్-2లో సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ నటించే అవకాశం ఉంది. ఈ ఇద్దరిని కలిపి శంకర్ తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున వెండి తెరపై మరోసారి అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నట్లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు సమాచారం. ఎందిరన్ చిత్ర నిర్మాణం 130 కోట్లుగా ప్రచారం అయ్యింది. అయితే ఈ చిత్రానికి అత్యధికంగా 200 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. శంకర్ ఐ చిత్రాన్ని 120 కోట్లతో తెరకెక్కించారు. కాగా అమీర్ఖాన్ నటించిన పికె చిత్ర నిర్మాణ వ్యయం 85 కోట్లు అని తెలిసింది. అయితే ఈ రెండు చిత్రాల బడ్జెట్ కలిపితే ఎందిరన్-2 తయారవుతుందన్నమాట. వీటిలో రజనీ, అమీర్ఖాన్, శంకర్ల పారితోషికమే 100 కోట్లకు చేరుతుందని మరో 100 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందనేది గణాంకాలు. చిత్ర ప్రచార ఖర్చు రూ.50 కోట్లు, పైగా మరో 50 కోట్లు వ్యయం ఉంటుందని మొత్తం 300 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాత ముందుకు వస్తేనే ఎందిరన్-2 చిత్ర రూపకల్పన సాధ్యం అని సినీ పండితులు వాదన. వారి అంత భారీ బడ్జెట్తో చిత్రం చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. -
శ్రీదేవికి చిరు కోపం కూడా రాలేదు!
సుదీర్ఘ కాలం తరువాత శ్రీదేవి తమిళ సినిమాలో నటిస్తున్న విషయం సినీ అభిమానులకు తెలిసిన విషయమే. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు ‘పులి’ అని నామకరణం చేశారు. ‘‘టైటిల్ బాగా నచ్చింది. ఈ సినిమాకు పనిచేయడం అద్భుతమైన అనుభవం’’ అని శ్రీదేవి ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీదేవి వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా ఆమె స్టార్డమ్, ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. చాలామంది అభిమానులకు ఆమె ఇప్పటికీ ‘అతిలోక సుందరే!’ ఆమె సినిమా చేస్తానంటే క్యూకట్టే నిర్మాతలకు కూడా కొదవలేదు. మరి అలాంటి శ్రీదేవికి ‘పులి’ చిత్రం షూటింగ్లో... మిస్మేనేజ్మెంట్ వల్ల అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందట! అయినప్పటికీ ఆమె చాలా హుందాగా ప్రవర్తించారట! సహనటి హన్సిక పుణ్యమా అని... తన షాట్ కోసం శ్రీదేవి నాలుగు గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట! శ్రీదేవి స్థానంలో వేరొకరు ఉండి ఉంటే అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారని... అతిలోక సుందరి మాత్రం చిరు కోపం కూడా ప్రదర్శించలేదని అంటున్నారు. -
'ఐ' తెలుగు రైట్స్.. అన్ని కోట్లకా..?!
-
వంద కోట్ల క్లబ్లో.. విజయ్ 'కత్తి'..!
-
పెళ్లికి భాజా మోగిందే!!
-
ఇప్పట్లో పెళ్లి లేనట్టే(నా)?!
-
ఇప్పటికైనా సక్సెస్ చిక్కేనా ?
-
సహజ సినిమాల 'భారతీ'య 'రాజా'
-
నిను వీడని నీడను నేనూ..!
-
కష్టపెడుతున్నారా ? కష్టపడుతున్నాడా ?
-
ఇద్దరి సినిమాల కథా ఒకేలా ఉందే.. మరెలా..!
-
ఐఫోన్ కొట్టేసి.. ఇలా నవ్విస్తున్నాడు..!
-
నాటకాలైనా సిద్ధార్థ్ను నిలబెట్టేనా?!
-
స్నేహాన్నిచాటే తొట్టాల్ విడాదు
సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. కొన్ని సమయంలో మిత్రబేధం కలిగినా అది శాశ్వతంగా ఉండదు. స్నేహం ఇతివృత్తంగా తెరపైకొచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అలాంటి ఇతివృత్తంతో రూపొందుతున్న తాజా చిత్రం తొట్టాల్ విడాదు అంటున్నారు చిత్ర దర్శకుడు అజిత్ రవి పికాసస్. పికాసస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు అజిత్ రవి పికాసస్తోపాటు సనం శెట్టి, షాజియాన్, పరయిల్, విణు, అభిరగం, అనూఫ్, జార్జ్, బిపెన్జార్జ్, ప్రసాద్, నాన్సీ గుప్తా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమకు మరణం లేనట్లుగానే స్నేహానికి అంతం ఉండదన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం తొట్టాల్ విడాదు అని తెలిపారు. ఒక యువకుడు దుబాయ్లోని తన స్నేహ బృందంతో కలసి వ్యాపారం చేయడానికి సొంత ఊరుకు వస్తారని చెప్పారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అదనంగా వచ్చి చేరిన వ్యక్తి కారణంగా వారి జీవితాలు తలకిందులవుతాయన్నారు. ఆ సమస్యల నుంచి ఆ మిత్ర బృందం ఎలా బయటపడిందన్నదే చిత్ర కథ అని చెప్పారు. వినోద్ వేణు గోపాల్ సంగీతాన్ని, కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.