Siddharth
-
హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి
టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో నటించే ఛాన్స్ వస్తే ఏ నటులైనా ఎగిరి గంతేస్తారు. అలా ఆయన డైరెక్షన్లో హీరామండి (Heeramandi: The Diamond Bazaar) వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం హీరోయిన్ అదితిరావు హైదరి (Aditi Rao Hydari)కి వచ్చింది. సెకండ్ థాట్ లేకుండా వెంటనే ఓకే చేసింది. హీరామండి: ద డైమండ్ బజార్ సిరీస్లో బిబ్బోజాన్గా నటించింది. అందులో ఆమె గజగామిని నడక సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే!అవకాశాలు జలపాతంలా కురుస్తాయనుకున్నా..అయితే ఈ సిరీస్ తర్వాత తనకు మంచి అవకాశాలే రావడం లేదంటోంది బ్యూటీ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితిరావు హైదరి మాట్లాడుతూ.. హీరామండి సిరీస్లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకున్నాను. కానీ ఆ ఊహలో నుంచి త్వరగానే బయటపడ్డాను. ఎందుకంటే అవకాశాలు జలపాతంలా కురవడం కాదు కదా.. ఏకంగా కరువే ఏర్పడింది. ఆ సిరీస్ తర్వాత ఏ ప్రాజెక్టుకూ నన్ను సంప్రదించలేదు. ఛాన్సులు లేవని పెళ్లి చేసుకోలేదు కానీ... సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాను.అందుకే పెళ్లి చేసుకున్నా.. ఎలాగోలా ఖాళీ సమయం దొరికింది కాబట్టి సిద్దార్థ్తో మూడు ముళ్లు వేయించుకున్నాను. సిద్దార్థ్ చాలా మంచి మనిషి. పెళ్ల ప్రస్తావన తెచ్చినప్పుడు సెకను ఆలోచించకుండానే ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. సిద్దార్థ్, అదితి రావు హైదరి గతేడాది సెప్టెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక అదితి రావు ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో భాగం కానుంది. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో అవినాష్ తివారితో కలిసి నటించనుంది. ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కి.మీ పర్ హవర్, వి, మహాసముద్రం చిత్రాలు చేసింది.చదవండి: పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానన్నా.. కానీ తనే..: జెనీలియా -
డిజిటల్ యాడ్లో మెరిసిన సిద్ధార్థ్, అదితీ
ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్’ను గుర్తు చేసేలా ఫన్రీల్తో సిద్ధార్థ్ ఇన్స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్ స్వీట్హార్ట్ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్కి ఫ్యాన్నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్ ఫిలింకి భారీ స్పందన లభించడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)ఈ సందర్భంగా లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు. -
సిద్దార్థ్కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్ చేశాడు. సిద్దార్థ్తో కలిసి బాయ్స్ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.బాయ్స్ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!ఈ సినిమా ప్రమోషన్స్లో తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్లో ఓసారి సిద్దార్థ్కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్పీరియన్స్.చాలా పెంట చేశా..బాయ్స్ సినిమాకు అరివళగన్.. శంకర్ దగ్గర అసోసియేటివ్గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్ సెట్లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్ -
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
అలాంటివి చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడిని.. నేనే వదిలేశా!: సిద్దార్థ్
సిద్దార్థ్.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరో.. కానీ ఆ క్రేజ్ను అలాగే కాపాడుకోలేకోయాడు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, .. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇటీవలి కాలంలో కోలీవుడ్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అయితే తన కెరీర్లో కొన్ని పనులు చేయకపోవడం వల్లే స్టార్ కాలేకపోయానంటున్నాడు.అలాంటివి రిజెక్ట్ చేశా..ఇటీవల హైదరాబాద్ సాహిత్య వేడుకకు హాజరైన హీరో సిద్ధార్థ్ (Siddharth) సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా దగ్గరికి చాలారకాల స్క్రిప్టులు వచ్చేవి. అమ్మాయిలను కొట్టడం, ఐటం సాంగ్స్ చేయడం, నడుము గిల్లడం.. నేను చెప్పినట్లుగా అమ్మాయిలు నడుచుకోవడం.. ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలన్నది నేనే ఆదేశాలివ్వడం.. ఇలాంటి కంటెంట్తో కొన్ని కథలు వచ్చాయి. వాటిని నేను రిజెక్ట్ చేశాను. బహుశా అవి ఒప్పుకుని ఉంటే ఈరోజు నేను పెద్ద స్టార్ అయ్యుండేవాడినేమో! కానీ నేను నా మనసుకు నచ్చినవే చేసుకుంటూ పోయాను.ఆ సంతోషాన్ని, అభిమానాన్ని వెలకట్టలేంచాలామంది నా దగ్గరకు వచ్చి మీరు ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారని చెప్తూ ఉంటారు. మహిళలకే కాదు, పేరెంట్స్కు, పిల్లలకు.. ఇలా అందరికీ గౌరవప్రాధాన్యతలిస్తారని అంటుంటారు. అంతేకాదు వారి పిల్లలు పదిహేనేళ్లుగా నా సినిమాలు చూస్తున్నారని చెప్తుంటారు. ఇంతకంటే సంతోషకరమైనది ఇంకేముంటుంది? ఈ అభిమానానికి కోట్లల్లో కూడా వెలగట్టలేం. చాలామంది హీరోలు యాక్షన్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మగవాళ్లు బాధను బయటకు చూపించకూడదన్నట్లుగా ఉంటున్నారు. కానీ నేనలా కాదు.. స్క్రీన్పై ఏడవడాన్ని కూడా సంతోషంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.(చదవండి: Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ)చేసిందంతా చేసి సుద్దపూసలా..అయితే ఈయన మాటలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆట (Aata Movie), గృహం సినిమా (Gruham Movie)లో నువ్వు చేసిందేంటి? అని ప్రశ్నిస్తున్నారు. చేసిందంతా చేసి ఇలాంటి నీతులు చెప్పడం అవసరమా? అని సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో.. ఈ మార్పు ఎప్పుడు మొదలైందో చెప్పుంటే బాగుండేది.. ఎందుకంటే గతంలో సిద్దార్థ్ కూడా హీరోయిన్స్తో హద్దుమీరి రొమాన్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక బుద్ధి వచ్చినట్లుంది.. అందుకే ఈ మార్పు అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాసిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే.. 2023లో చిత్తా (చిన్నా) సినిమాతో హీరోగా, నిర్మాతగా విజయం అందుకున్నాడు ఈయన చివరగా ఇండియన్ 2, మిస్ యు మూవీలో యాక్ట్ చేశాడు. త్వరలోనే ఇండియన్ 3, టెస్ట్ చిత్రంలో భాగం కానున్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హీరోయిన్ అదితిరావు హైదరిని గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ రెండో పెళ్లితెలంగాణలోని వనపర్తిలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. తర్వాత రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరికిద్దరికీ ఇది రెండో పెళ్లే కావడం గమనార్హం! ఇకపోతే వీరిద్దరికీ మహాసముద్రం సినిమా సమయంలో పరిచయం, స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. దాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లారు.చదవండి: 19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్కి వస్తారన్నాడు: హీరోయిన్ -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన సిద్దార్థ్ మూవీ
హీరో సిద్దార్థ్ (Siddharth).. ఒకప్పుడు టాప్ హీరో! ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు! తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఇతడు ఈ మధ్యకాలంలో మాత్రం హిట్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్కు దూరంగా ఉన్న సిద్దార్థ్ రెండేళ్లక్రితం చిత్తా (చిన్నా) మూవీతో విజయం అందుకున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాకు తమిళంలో వచ్చినంత ఆదరణ తెలుగులో రాకపోవడం గమనార్హం.ఓటీటీలో సిద్దూ మూవీసిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.(గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)సిద్దార్థ్ కెరీర్ అలా మొదలైందిబాయ్స్ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు సిద్దార్థ్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సెన్సేషన్ అయ్యాడు. బొమ్మరిల్లుతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లోనూ అడుగుపెట్టాడు. అతడు హిందీలో నటించిన తొలి చిత్రం రంగ్ దే బసంతి. బాలీవుడ్ స్ట్రైకర్, చష్మే బద్దూర్ సినిమాలు చేశాడు. హిందీలోనూ లక్ పరీక్షించుకున్న సిద్దార్థ్కానీ అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సౌత్లోనే తన స్టార్డమ్ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాడు. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహా సముద్రం సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లుగా తమిళంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టెస్ట్, ఇండియన్ 3 సహా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.సింగర్ కూడాసిద్దార్థ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, సింగర్ కూడా! లవ్ ఫెయిల్యూర్, జిల్ జంగ్ జుక్, చిత్తా (చిన్నా) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఇతడు ఎన్నో పాటలు పాడాడు. అపుడో ఇపుడో ఎపుడో.. (బొమ్మరిల్లు మూవీ), నిను చూస్తుంటే.. (ఆట), ఓయ్ ఓయ్ (ఓయ్ మూవీ), మా డాడీ పాకెట్స్.. (ఓ మై ఫ్రెండ్), ఎక్స్క్యూజ్ మీ రాక్షసి.. (నిను వీడని నీడను నేనే) ఇలా ఎన్నో పాటలు ఆలపించాడు.గతేడాది పెళ్లిసిద్ధార్థ్ 2024 సెప్టెంబర్లో తన ప్రేయసి, హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో మొదటగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే!చదవండి: భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్ -
అదితిరావు- సిద్ధార్థ్ పెళ్లి.. ప్రపోజల్ ఫోటో వైరల్
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.(ఇది చదవండి: అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?)తాజాగా అదితిరావు హైదరీ న్యూ ఇయర్ సందర్భంగా పోస్ట్ చేసింది. గతేడాది జరిగిన మధుర జ్ఞాపకాలను షేర్ చేసింది. హీరామండిలో నటన, సిద్ధార్థ్ ప్రపోజల్ ఫోటోతో పాటు అతనితో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంది. ఓ వీడియో రూపంలో తన ఇన్స్టాలో పంచుకుంది. ఇందులో తన ఎంగేజ్మెంట్, పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయి. థ్యాంక్యూ యూ 2024.. వెల్కమ్-2025 అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్నారు. జూన్లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్ల్యాండ్లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్లోని ఓ రిసార్ట్లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
నువ్వునువ్వుగా,నేనునేనుగా..నా చేయి పట్టుకో ప్రియతమా: అదు-సిద్ధూ ఫోటోషూట్ అదిరిందిగా (ఫొటోలు)
-
రెండోసారి పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్ - అదితీ (ఫొటోలు)
-
మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-అదితీ
హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు సరిగానే విన్నారు. హీరోయిన్ అదితీతో గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఇతడు.. సెప్టెంబరులో ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణలోని వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథ స్వామి దేవాలయం దీనికి వేదికైంది. ఇప్పుడు మరోసారి వివాహమాడాడు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే)సెప్టెంబరులో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్లోని అలీలా ఫోర్ట్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అదితీ, సిద్ధార్థ్ తమ తమ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తోటీ నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.'మహాసముద్రం' సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్-అదితీకి పరిచయం ఏర్పడింది. అలా కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. హీరోయిన్ అదితీ రావు హైదరీ పూర్వీకులది వనపర్తి. అందుకే రంగనాథ్ స్వామి ఆలయండో నిశ్చితార్థం, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ కోరిక ప్రకారం రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్) -
చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్
‘‘మిస్ యు’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. రాజశేఖర్ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత ‘మిస్ యు’ లాంటి ఒక అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనిపిస్తోంది’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఎన్. రాజశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ యు’. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థ ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ‘మిస్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి మా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ‘మిస్ యు’ తర్వాత నాకు మరిన్ని మంచి ప్రేమకథలు వస్తాయి.గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది అద్భుతమైనపాటలు ఇచ్చారు. శామ్యూల్గారు ΄్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు. మా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ మీట్లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. -
నా జీవితంలోకి ఒక దేవత వచ్చింది: పెళ్లిపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ హీరీ సిద్ధార్థ్ మరోమూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది చిన్నా మూవీతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మిస్ యూ అంటూ వచ్చేస్తున్నారు. ఈ చిత్రంలో నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈవెంట్లో హాజరైన సిద్ధార్థ్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆదితి రావు హైదరీతో పెళ్లి తర్వాత వస్తోన్న మీ మొదటి చిత్రం.. మీ లైఫ్ ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా లైఫ్ ఇప్పుడైతే చాలా బాగుంది. ఇలాంటి వరం దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. అంతేకాదు నా లైఫ్లోకి నా దేవత వచ్చింది. 2024లో ఒక మంచి విషయం జరిగితే ఫస్ట్ నా రియాక్షన్ సర్ప్రైజ్. ఏంటి మంచి జరిగిందా? అనేది. సెకండ్ రిలీఫ్. హమ్మయ్య ఆ దేవుడి దయతో అంతా మంచి జరిగిందని.. అలాంటి టైమ్లో మనం బతుకుతున్నాం కాబట్టి.. నాకైతే నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు' అంటూ తన పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపారు.కాగా.. కోలీవుడ్ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. అగ్రతారలతో అరుదైన ఫోటోలు
-
అదితి-సిద్ధార్థ్ పెళ్లి.. వీరి ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా?
హీరో, హీరోయిన్ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ ఇటీవలే వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనే వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవీ కాస్తా వైరల్ కావడంతో అభిమానులు, సినీతారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అయితే వీరి పెళ్లి తర్వాత నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ వీరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆదితిరావు హైదరీ రాజవంశానికి చెందిన కుటుంబం కావడంతో అభిమానులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.అయితే ప్రస్తుతం గణాంకాల ప్రకారం అదితి రావు హైదరీ ఆస్తులు రూ.60కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటుందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. జాగరణ్ ఇంగ్లీష్ నివేదిక ప్రకారం నిర్మాత, హీరోగా రాణిస్తున్నసిద్ధార్థ్ ఆస్తులు కూడా దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ లెక్కన ఇద్దరికీ కలిపి సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.135 కోట్లకు మధ్య ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉంది. మార్చి 2024న సిద్ధార్థ్- అదితి నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆ ఆలయంలోనే పెళ్లి ఎందుకంటే?ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ వనపర్తిలోని ఆలయంలోనే పెళ్లి చేసుకోవడంపై కూడా చర్చ మొదలైంది. దాదాపు 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి ముఖ్యమైదని సమాచారం. ఆ సెంటిమెంట్తోనే వీరి పెళ్లి అక్కడే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదితి తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు కావడం విశేషం. అదితిరావు చివరిసారిగా హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్లో కనిపించింది. సిద్ధార్థ్ ఇటీవల విడుదలైన ఇండియన్-2లో కనిపించారు. -
అదితి-సిద్ధార్థ్ ఒక్కటైంది ఇక్కడే (చిత్రాలు)
-
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అదితి-సిద్ధార్థ్ (ఫొటోలు)
-
ఐఫోన్ లాంఛ్ ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ కపుల్.. ఫోటోలు
-
కాబోయే భర్తకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు.. పిక్స్ షేర్ చేసిన హీరోయిన్!
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు అవార్డులు రావడం పట్ల ఆదితిరావు సంతోషం వ్యక్తం చేసింది. ఈ గెలుపు మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.తాజాగా సిద్ధార్థ్ తన ఫిల్మ్ఫేర్ అవార్డులు పక్కన పెట్టుకుని నిద్రిస్తున్న ఫోటోను అదితి రావు హైదరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో సిద్ధార్థ్ నటించిన చిత్తా(చిన్నా) సినిమా ఏకంగా ఏడు అవార్డులు సాధించింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్తా మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (క్రిటిక్స్), లీడ్రోల్లో ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ సహాయ పాత్ర (ఫీమేల్), ఉత్తమ సంగీత ఆల్బమ్, ఉత్తమ నేపథ్య గాయని (ఫీమేల్) విభాగాల్లో అవార్డులు దక్కాయి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
Hyderabad: అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన తూటా
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు. శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్లకు సమీపంలో అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్లోకి బుల్లెట్లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు. -
భారతీయుడు 2 మూవీ స్టిల్స్ HD
-
ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్బాస్ భోలే షావలి
కమల్హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్గా ఇండియన్-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. #Kalki2898AD రేంజ్ లో #Bharateeyudu2 ఎంజాయ్ చేస్తారు - Audience ReactionWatch Full public response here ▶️ https://t.co/rez0iLsFFFRead review here 🔗 https://t.co/8I8RV7o8em#KamalHaasan #Shankar #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/XnxlwRPuXr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
Indian 2 Review: ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ
టైటిల్: భారతీయుడు 2(ఇండియన్ 2)నటీనటులు: కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్,సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్కరన్ కథ, దర్శకత్వం: ఎస్.శంకర్సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్సినిమాటోగ్రఫీ: రవి వర్మన్విడుదల తేది: జులై 12, 2024కమల్ హాసన్ నటించిన బెస్ట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్(సిద్దార్థ్), హారతి(ప్రియాభవాని శంకర్) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్ డాగ్స్ అనే పేరుతో య్యూట్యూబ్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో షేర్ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్బ్యాక్ ఇండియా(Comeback India) హ్యాష్ట్యాగ్తో సేనాపతి(కమల్ హాసన్) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్బ్యాక్ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్ వర్కౌంట్ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్. స్టోరీ లైన్ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్ అయిన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. ప్రతి సీన్ సినిమాటిక్గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్ప్లే కూడా చాలా రొటీన్గా ఉంటుంది. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్ లేదనే పార్ట్ 3 ప్లాన్ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్ గ్యాంగ్ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో మర్మకళను ఉపయోగించి సీక్స్ ఫ్యాక్తో కమల్ చేసే యాక్షన్ సీన్ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్ సీన్ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్కి ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్ హాసన్కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్ ఫ్యాక్స్తో కమల్ చేసే యాక్షన్ సీన్కి థియేటర్లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్ ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ప్రియురాలు దిశగా నటించిన రకుల్కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్గా ఎస్ జే సూర్యకి పార్ట్ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.(Bharateeyudu 2 Telugu Movie Review)-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Bharateeyudu 2 X Review: ‘భారతీయుడు 2’ టాక్ ఎలా ఉందంటే.. ?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు(1996)’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి(కమల్ హాసన్) చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్గా భారతీయుడు 2(ఇండియన్ 2) వచ్చింది. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న శంకర్.. మరోసారి తనదైన మార్క్ సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Bharateeyudu 2 Telugu Review: ‘భారతీయుడు 2’ మూవీ ఎలా ఉందంటే..?ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘భారతీయుడు కథేంటి?, సేనాపతిగా మరోసారి కమల్ ఆకట్టుకున్నాడా? లేదా? శంకర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. . ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో ‘భారతీయుడు 2’కి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వరకు నెగెటివ్ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్ దర్శకత్వం వహించాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Bharateeyudu2 Movie Review 🔥🔥🔥 1/2Hats off to director #Shankar for his top level direction.#KamalHassan is steel the complete show. Social Message of the movie will reach to every audience.Overall movie wins normal audience heart💐💐#Bharateeyudu2Review#Indian2Review pic.twitter.com/tRB6cidHsV— Movie Muchatlu (@MovieMuchatlu1) July 12, 2024 డైరెక్టర్ శంకర్కి హాట్సాఫ్. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్ హాసన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్ మెసేజ్ ప్రతి ఆడియన్కి రీచ్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Genuine #Indian2Review/#Bharateeyudu2ReviewDISASTER👎Rating 1.5/5Impactless,Dragged, Boring,Outdated,Cringe Movie👎#Siddharth #KamalHaasan (Less Screen time) &Director #Shankar gone Outdated👎#Indian2 #Bharateeyudu2#Hindustani2Review #Hindustani2 https://t.co/3c9WuK58GK— #Kalki2989AD ❤ (@TheWarriorr26) July 12, 2024 భారతీయుడు 2 డిజాస్టర్ మూవీ. బోరింగ్, ఔడేటెడ్ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్ కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు. first half: movie starts well, but follows conventional shankar sir’s screenplay making it very predictable and boring.. no gripping/exciting sequences.. needs a very strong second half #Indian2 #Bharateeyudu2 https://t.co/fgOf5prfHJ— movie buff (@newMovieBuff007) July 12, 2024 ఇప్పుడే ఫస్టాఫ్ కంప్లీట్ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్గా అనిపించింది. శంకర్ స్క్రీన్ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్గా, ఎగ్జైట్మెంట్ చేసే సీక్వెన్స్లేవి లేవు. సెకండాఫ్ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.. #Indian2 Review 1.5/5Fully disappointed Bad screenplay Emotions lackIndian 3 kastame... pic.twitter.com/fcaOB7vPHX— 👥𝕳𝖆𝖗𝖘𝖍𝖆💫 (@Harsh___07__) July 12, 2024 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్ప్లే అస్సల్ బాగోలేదు. ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదు. ఇండియన్ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్ చేశారు.#Indian2 is an outdated and tedious movie. Though the movie tries to give honest messages, it’s done in a boring way with no proper emotion and drama at all. Shankar tried to repeat the screenplay of his old movies but fails to recreate the magic big time. All of the emotions…— Venky Reviews (@venkyreviews) July 12, 2024#Indian2 #Bharateeyudu2 #indian2review Telugu review:It’s just an average to below average movie. There is no story it is just like a set up to Indian3. Yes Indian3 trailer was played after the rolling titles and Indian3 seems pretty interesting and I think Indian3 would be…— Vijay (@vijay827482) July 12, 2024#Bharateeyudu2 #Indian2 Stil remember the first part can't say whether the sequel could match it as the bench mark was high it releases today but there is no buzz at least in Hindi. Why aren't films being promoted ##Kalki2898AD too was released in a similar way. WOM will decide.— Bhaskar Agnihotri (@BHASKARAGNIHOT) July 12, 2024#Indian2 #Bharateeydu2 #Indian2Review #Bharateeydu2Review #Review *Not Engaging at all*No shankar mark*No emotional ConnectDid Shankar directed this movie for real ?— Raju (@rsofficial18) July 12, 2024Finally Kamal Hassan's entry.. But it has zero impact in the audience with 30 mins of lag boring scenes. Even Kamal Hassan's entry failed to excite the mass audience. Till now, there is not even a single scene of Shankar's calibre #Indian2 #Bharateeyudu2 pic.twitter.com/gztpLV2iwJ— Taran Adarsh (@tarann_adarshh) July 12, 2024 -
'భారతీయుడు 2' టీమ్కి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు.. ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2' చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ కూడా వేశారు. అయితే ఓ సినిమా కోసం సీఎం రేవంత్ ఇలా ట్వీట్ ఎందుకు చేశారు? అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్)కొన్నిరోజుల క్రితం సినిమా టికెట్ రేట్ల గురించి ఓ సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇకపై ఎవరికైనా సరే రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే 'భారతీయుడు 2' టీమ్ నుంచి కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. ఓ వీడియో రిలీజ్ చేశారు.దీనికి రిప్లై ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 'భారతీయుడు 2 బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా.. శ్రీ కమల్ హాసన్, శ్రీ శంకర్, శ్రీ సిద్దార్, శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం' అని రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: 'ఈ జనరేషన్లోనే వరస్ట్ హీరో'.. అందుకే 4 జాతీయ అవార్డులు!)భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.డ్రగ్స్ రహిత సమాజం కోసం…ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024 -
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
-
నా కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు: హీరో సిద్ధార్థ్
ఇండియన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. వారి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. బెటర్ సొసైటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నా కెరీర్లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని పేర్కొన్నారు. కాగా.. సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా పేరు సిద్ధార్థ్. నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా.. తెలుగు సినిమాలో ఒక చేతిలో కండోమ్ పట్టుకుని బిల్ బోర్డ్స్లో నా ఫోటో వచ్చేలా గతంలోనే ప్రభుత్వానికి సహకరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 నుంచి 2011 వరకు ఎక్కడా హోర్డింగ్ కనిపించినా కండోమ్ పట్టుకుని మీకు సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆ సామాజిక బాధ్యత నాది. ఒకరు చెబితే నాకు గుర్తుకు రాదు. ఎవరైనా చెప్తే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదు' అని అన్నారు. -
భారతీయుడు 2 తీయడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే..
-
ఇండియన్ 2 అమ్ముతున్నాం అందరూ కొనండి ప్లీజ్
-
Kamal Haasan: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
Indian 2: 103 ఏళ్ల సేనాపతి ఫైట్స్ ఎలా చేస్తాడు..? శంకర్ సమాధానం ఇదే
హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఇండియన్ 2’ (తెలుగులో ‘భారతీయుడు 2’). 1996లో విడుదలైన బ్లాక్బస్టర్ సినిమా ‘ఇండియన్’కి సీక్వెల్స్గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలు రూసొందాయి. కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్స్లో ముందు ‘ఇండియన్ 2’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో సేనాపతిగా కమల్హాసన్ కొన్ని మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు చేశారు. అయితే ‘ఇండియన్’ సినిమాలో సేనాపతికి 75 సంవత్సరాలు. ఈ ప్రకారం 2024లో ఆయన వయస్సు 103కి చేరుతుంది. అలాంటప్పుడు అంత వయసులో సేనాపతి మార్షల్ ఆర్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఎలా చేయగలుగుతున్నాడు అనే సందేహాలను వ్యక్తపరచారు కొందరు నెటిజన్లు. ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో శంకర్ స్పందించారు. ‘‘నా దృష్టిలో సేనాపతి ఓ సూపర్ హీరో. ‘భారతీయుడు’ కథ రాసుకున్నప్పుడు సేనాపతిని ఓ స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపించాలని అప్పుడు సేనాపతికి 75 సంవత్సరాలు అన్నట్లుగా చూపించాం. అప్పుడు సీక్వెల్ ఆలోచన లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్గా సేనాపతి కనిపిస్తాడు. అత్యధిక వయసు కలిగిన ఫైటర్స్ చైనాలో ఉన్నారు. 108 సంవత్సరాలు ఉన్న లు జీజీయన్ అనే చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నారు. వారి సాధన, క్రమశిక్షణ వారిని అలా తీర్చిదిద్దుతుంది. సేనాపతి కూడా అలాంటివాడే’’ అని చెప్పుకొచ్చారు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్జే సూర్య, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ‘ఇండియన్ 3’ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. -
కమల్హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
-
సోనాక్షి పెళ్లి.. రిసెప్షన్లో మెరిసిన కాబోయే వధూవరులు!
బాలీవుడ్ భామ సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు. బాంద్రాలో జరిగిన ఈ ఫంక్షన్లో కాబోయే వధూవరులు అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మెరిశారు.కాగా.. అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ ఈ ఏడాది మార్చి 27న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అఫీషియల్గా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా సోనాక్షి పెళ్లికి వీరిద్దరు జంటగా హాజరయ్యారు. అయితే ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్లో ఆదితిరావు కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో సోనాక్షి సిన్హాతో కలిసి నటించింది. వీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. 2021 తెలుగు సినిమా మహా సముద్రం సెట్స్లో సిద్ధార్థ్, అదితి మొదటిసారి కలుసుకున్నారు. -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
చాలా కాలం తరువాత లవ్స్టోరీతో వస్తున్న సిద్ధార్థ్
తమిళసినిమా: ఇటీవల చిత్తా వంటి విజ యవంతమైన చిత్రంలో నటించిన నటుడు సిద్ధార్థ్. తాజాగా మరోసారి ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి మిస్యూ అనే టైటిల్ను నిర్ణయించారు. తమిళనాడులో బ్రాండింగ్, డిజిటర్ మార్కెటింగ్ రంగాల్లో పేరు గాంచిన 7 మైల్స్ ఫర్ సెకండ్ సంస్థ అధినేత సామ్యువేల్ మ్యాధ్యూ ఈ చిత్రం ద్వారా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. కాగా ఇందులో తెలుగు, కన్నడం భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఆషికా రంగనాథ్ కథానాయకిగా కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు.నటుడు జేపీ, పొన్వన్నన్, కరుణాకరన్, నరేన్, అనుపమ, రమ, బాలా శరవణన్, లొల్లు సభ మార న్, సస్టిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా మాప్పిళై సింగం, కళత్తిల్ సంధిప్పోమ్ వంటి సక్సెస్పుల్ చిత్రాల దర్శకుడు ఎన్.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, కేజీ.వెంకటేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హీరో హీరోయిన్లకు మాత్రమే ప్రాముఖ్యత ఉండేలా కాకుండా, అందరికీ ప్రాధాన్యత ఉండేలా కథ, కథనాలు ఉంటాయన్నారు. వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రంగా మిస్యూ ఉంటుందన్నారు. చాలా కాలం తరువాత నటుడు సిద్ధార్థ్ పూర్తిగా ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ లవర్ బాయ్గా నటిస్తున్నట్లు చెప్పారు. కాగా ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 చిత్రంలో సిద్ధార్థ్ ముఖ్యపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
'భారతీయుడు 2' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ కొత్త కబురు చెపారు. తన కెరీర్లోని 40వ సినిమాను ప్రకటించారు. ‘8 తోట్టాకళ్’ ఫేమ్ శ్రీ గణేశ్ దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా (తెలుగు– తమిళం) చిత్రాన్ని ‘మావీరన్’ ఫేమ్ అరుణ్ విశ్వ నిర్మించనున్నారు. శనివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత శ్రీగణేశ్ చెప్పిన ఈ సినిమా కథ నచ్చడంతో ఓకే చెపాను. అరుణ్ విశ్వలాంటి మంచి నిర్మాతతో కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు యూత్తో పాటు పరిణితి గల నటుడు కావాలనుకున్నాను. అందుకే సిద్ధార్థ్ కరెక్ట్ అనుకున్నాను. ఆయన కొన్ని సూచనలు పంచుకున్నారు’’ అన్నారు శ్రీ గణేశ్. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా, భాషలకు అతీతంగా ఆకట్టుకునే చిత్రం అవుతుందని నేను బలంగా నమ్మాను. జూన్లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు అరుణ్ విశ్వ. -
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
Siddharth-Aditi Rao Marriage: సిద్దార్థ్ పెళ్లిలో ట్విస్ట్.. వారికి అబద్ధం చెప్పారా?
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. షూటింగ్ అని చెప్పి వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్ఫమ్ చేసిన హోస్ట్ అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ.. -
Siddharth-Aditi Rao Photos: ఆ వార్తల్లో నిజమెంత?.. ట్రెండింగ్ లో సిద్దార్థ్ ,అదితిరావు హైదరీ
-
అదితిని పెళ్లాడిన సిద్ధార్థ్.. ఆ విషయంపైనే అందరి చర్చ!
ఎట్టకేలకు టాలీవుడ్ హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లాడారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో వీరిద్దరి పెళ్లికి జరిగింది. రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021)చిత్రంలో నటించారు. ఆ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు ఈ జంటపై వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ.. ఒక్కసారిగా వాటన్నింటికీ తెరదించారు. పెళ్లి జరిగిపోవడంతో వీరిద్దరి గురించి అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ జంట వయస్సు గురించి అభిమానులు చర్చ మొదలెట్టారు. ఈ జంటకు ఏజ్ గ్యాప్ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. మరీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలు ఏంటో చూసేయండి. (ఇది చదవండి: హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?) అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా కనిపిస్తోంది. కాగా.. గతంలో అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. అతను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్ను పెళ్లాడారు. ఆమెతో 2007లోనే సిద్ధార్థ్ విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అదితి రావు హైదరీ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన అదితి.. తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. మరోవైపు సిద్ధార్థ్.. కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ -2లో నటించనున్నారు. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్ చిత్రాలతో మెప్పించారు. -
హీరో సిద్దార్థ్ మాజీ భార్య గురించి తెలుసా?
సిద్దార్థ్ తమిళ హీరో.. కానీ తెలుగులో కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాయ్స్ సినిమాతో వరుస అవకాశాలు అందుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో తన నటనతో కట్టిపడేశాడు. బొమ్మరిల్లు మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆట, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు.. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ నెమ్మదిగా తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో టాలీవుడ్కు దూరమయ్యాడు. ఆ మధ్య మహాసముద్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా హిట్ కొట్టలేకపోయాడు. గతంలో పెళ్లి కొంతకాలంగా హీరోయిన్ అదితిరావు హైదరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాడు సిద్దార్థ్. మీడియా ముందు మాత్రం ఆమెతో కలిసి పోజివ్వడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈరోజేమో సడన్గా అదితిని రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు.. అతడికి ఆల్రెడీ పెళ్లయిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిలాగే కనిపిస్తాడు కాబట్టి ఇది రెండో పెళ్లంటే నమ్మలేకపోతున్నారు. మూడేళ్లకే మనస్పర్థలు సిద్దార్థ్ 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలో అతడి పక్కింట్లోనే ఉండేది. సిద్దార్థ్- మేఘన మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లకే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కలిసుండటం కష్టమని భావించి 2007లో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ సోహా అలీ ఖాన్తో ప్రేమ వ్యవహారం నడపడం వల్లే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఆమె వల్లే బ్రేకప్ వారు తరచూ కలుసుకుంటూ, సినిమాలకు వెళ్తూ కనిపించడంతో ఇది నిజమేనని పలువురు భావించారు. సదరు హీరోయిన్ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సిద్దార్థ్.. సోహాతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. చదవండి: తెలుగు హీరోయిన్ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే! -
సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్
హీరో సిద్దార్థ్ పెళ్లి పీటలెక్కాడు. తెలుగు హీరోయిన్ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది. తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించడం విశేషం. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరిగింది. జర్నీ ఎక్కడ మొదలైంది? అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రం(2021) మూవీలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వెకేషన్కు, ఈవెంట్స్కు కలిసే వెళ్తున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్, పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అని సిద్దార్థ్కు ప్రశ్న ఎదురవగా.. 'అదితి' దేవో భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు. కానీ డైరెక్ట్గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్దార్థ్.. ఇప్పుడేకంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎవరీ అదితి? అదితిరావు హైదరి.. అచ్చ తెలుగమ్మాయి. తన కెరీర్ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో! హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం, వి, అంతరిక్షం, మహాసముద్రం మూవీస్లో హీరోయిన్గా మెరిసింది. గతంలో ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. 2012లో అతడికి విడాకులిచ్చింది. సిద్దార్థ్ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను పెళ్లాడాడు. వీరి మధ్య బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. సినిమాల విషయానికి వస్తే బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, ఓయ్, ఓ మై ఫ్రెండ్.. ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు. చదవండి: తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్ -
Oy! Re Release: థియేటర్లో యువతి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రస్తుతం టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి నెల నాలుగైదు పాత సినిమాలను మళ్లీ ఒక్కరోజు థియేటర్స్లో ప్రదర్శిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రీరిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలన్నీ మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు ఏకంగా 9 సినిమాలను రీరిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయిన మూవీ ఓయ్. సిద్ధార్థ్, షామిలీ హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2009లో రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ టీవీల్లోకి వచ్చిన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని బాగా ఆదరించింది. అందుకే ప్రేమికుల రోజు ఈ మూవీని మళ్లీ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్ లో ఓయ్ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. దానికి ఈ వీడియోనే నిదర్శనం. రీరిలీజ్లో భాగంగా నిన్న వైజాగ్లోని ఓ థియేటర్స్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మూవీ చూసేందుకు వచ్చిన ఓ అమ్మాయి.. తన డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఎల్లో శారీలో వచ్చిన ఆ యువతి.. ఓయ్ సినిమాలోని ప్రతి పాటకు ఊర మాస్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. హీరోయిన్కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ..అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. Finally lengthy video mikosam🌝 🤌 rampp asalu dance 🥵❤️#OyeReRelease #OyeMovie Thanks for the movie @AnandRanga 💥 pic.twitter.com/DEBKaMC3WV — Iconboy (@bunny_tweetz) February 14, 2024 -
వేసవిలో మ్యాచ్ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. వీడియో వైరల్!
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్ధార్ఠ్. గతేడాది చిన్నా సినిమాతో అభిమానులను అలరించారు. అయితే సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్ ఆదితి రాయ్ హైదరతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరు జంటగా కనిపించారు. ఇప్పటికే చాలాసార్లు జంటగా కనిపించిన వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. తాజాగా రూమర్ జంట మరోసారి కెమెరాలకు చిక్కింది. ముంబైలో ఓ ఫంక్షన్కు హాజరైన వీరిద్దరు ఫోటోలకు పోజులిచ్చారు. తాజాగా ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తన నివాసంలో నిర్వహించిన కచేరీకి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. ఈ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న అదితి, సిద్ధార్థ్ కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ 'ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్' అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు అక్కడే ఉన్న నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు. అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. సినిమాల విషయానికొస్తే అదితి ప్రస్తుతం ఇండో-యుకె కో-ప్రొడక్షన్ 'లయనెస్'లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అదితి.. సంజయ్ లీలా భన్సాలీ 'హీరమండి' చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
బౌద్ధవాణి: సత్యం పలకడం చాలా అవసరం!
సిద్ధార్థుడు శాక్య యువరాజు. కానీ, సన్యసించి రాజ్యాన్ని వదిలాడు. భిక్షువుగా మారాడు. ఆ తర్వాత తన బిడ్డ రాహులుణ్ణి కూడా భిక్షువుగా మార్చాడు. ఒకరోజున రాహులుడు అంబలట్ఠిక అనే చోట ఒక వనంలోని ఆరామంలో ఉన్నాడు. బుద్ధుడు రాజగృహంలోని వేణువనం నుండి అక్కడికి వచ్చాడు. బుద్ధుని రాకను గమనించిన రాహులుడు లేచి వచ్చి, నమస్కరించాడు. ఒక చెట్టుకింద బుద్ధునికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. బుద్ధుడు కాళ్ళు కడుక్కుని, ఆ పాత్రలో కొంచెం నీటిని ఉంచాడు. బుద్ధుడు ఎంత కష్టమైన విషయాన్నైనా ఉపమానంతో తేలికగా అర్థం అయ్యేలా చెప్పడంలో నేర్పరి. ఆయన వచ్చి ఆసనం మీద కూర్చొని.. ‘‘రాహులా! ఈ పాత్రలో మిగిలిన నీటిని చూశావా?’’అని అడిగాడు. ‘‘భంతే! చూశాను. అడుగున కొద్దిగా ఉన్నాయి’’ ‘‘అవును కదా! తెలిసి తెలిసీ ఎవరు అబద్ధాలు ఆడతారో, మోసపు మాటలు చెప్తారో, అలా చెప్పడానికి సిగ్గుపడరో.. అలాంటి వారికి దక్కే శ్రామణ్య ఫలం చాలా చాలా కొద్దిదే’’ అన్నాడు. రాహులుడు నిండు వదనంతో నింపాదిగా ఆ నీటి పాత్రవైపు చూశాడు. బుద్ధుడు ఆ పాత్రలో ఉన్న నీటిని అంతా పారబోశాడు. 'శ్రామణ్యం అంటే ధ్యాన సాధన ద్వారా పొందే ఫలం. తమకు తాము స్వీయ సాధన ద్వారా ఈ ధ్యానఫలాన్ని పొందుతారు. అందుకే ఈ సాధకుల్ని ‘శ్రమణులు’ అంటారు. తమకు తాము ఎంతో శ్రమించి ఎన్నో కఠోర శ్రమలకోర్చి సాధించే యోగ సాధన ఇది. బౌద్ధ భిక్షువుల్ని శ్రమణులు అనీ, బుద్ధుణ్ణి శ్రమణ గౌతముడని ఇందుకే పిలుస్తారు.' ‘‘రాహులా! నీరు పారబోయడం చూశావా?’’ ‘‘చూశాను భగవాన్’’ ‘‘తెలిసి తెలిసీ అసత్యాలు పలికే వారి మోసపు మాటలు చెప్పే వారి శ్రామణ్యం కూడా ఇలా పారబోసిన నీటిలాంటిదే’’ బుద్ధుడు ఆ పాత్రను తీసుకుని తన పక్కనే ఉన్న రాతిపలక మీద బోర్లించాడు. రాహులుడు ఆ పాత్రవైపు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. అప్పుడు బుద్ధుడు.. ‘‘రాహులా! అలాంటి అబద్ధాలకోరు మోసపు మాటల కోరుకు దక్కే ధ్యానఫలం కూడా బోర్లించిన పాత్ర లాంటిదే’’ అన్నాడు. రాహులుడు తదేకంగా ఆ పాత్ర మీదే దృష్టి నిలిపాడు. బుద్ధుడు మరలా ఆ పాత్రని తీసి నేల మీద ఉంచాడు. పాత్రలోకి చూపుతూ.. ‘‘రాహులా! ఇప్పుడు ఈ పాత్ర నిలబడి ఉంది. కానీ ఎలా ఉంది?’’ ‘‘ఖాళీగా ఉంది భగవాన్’’ ‘‘అబద్ధాల కోరుకు దక్కే సాధనాఫలం కూడా ఖాళీ పాత్ర లాంటిదే’’ అన్నాడు. అలా ఆ ఒక్క పాత్రని నాలుగు రకాలుగా ఉపమానంగా చూపుతూ అబద్ధాల కోరులు ఎంత సాధన చేసినా ధ్యానఫలాన్ని పొందలేరు. కాబట్టి సత్యభాషణం చాలా అవసరం అనే విషయాన్ని తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాడు బుద్ధుడు. అందుకే ఆయనను ‘మహా గురువు’గా భావిస్తారు, గౌరవిస్తారు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: ముఖ స్తుతి -
సొంత ఫిన్టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొన్ని సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించే కంటెంట్ ఉంటుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ కావడం వల్ల.. థియేటర్లలోకి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. తీరా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇదే సినిమా జనాలకు నచ్చేయొచ్చు. అలా హీరో సిద్ధార్థ్కి హిట్ వచ్చేలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఏంటా సినిమా? తెలుగోడు కానప్పటికీ హీరోగా టాలీవుడ్లో సిద్ధార్థ్ మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ రానురాను సరైన మూవీస్ చేయకపోవడంతో ఇతడిని తెలుగు ప్రేక్షకులు కూడా పక్కనబెట్టేశారు. అలా గత కొన్నాళ్ల నుంచి తమిళంలోనే నటిస్తూ, వాటిని తెలుగులో డబ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 'చిన్నా' అనే మూవీని నిర్మించి, లీడ్ రోల్ చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల అనే సెన్సిటివ్ పాయింట్తో ఈ సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!) 'చిన్నా' కథేంటి? అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపతో కలిసి ఈశ్వర్ (సిద్ధార్థ్).. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు ఉంటున్న ఊరిలో చిన్నపిల్లల్ని అహహరించి అత్యాచారం చేయడం, దారుణంగా చంపేయడం లాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఈశ్వర్పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తాయి. మరోవైపు ఈశ్వర్ అన్న కూతురు కిడ్నాప్ అవుతుంది. మరి అన్న కూతుర్ని ఈశ్వర్ వెతికి పట్టుకున్నాడా? చివరకు ఏమైందనేదే 'చిన్నా' స్టోరీ. ఓటీటీ రిలీజ్ డేట్ అక్టోబరు 6న తెలుగులో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నిలబడలేకపోయింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నవంబరు 17 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్తో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
సిద్దార్థ్ ఎమోషనల్ మూవీ 'చిన్నా' ఓటీటీ పార్ట్నర్ ఇదే!
సిద్దార్థ్.. తమిళ హీరోనే అయినా తెలుగువారికి ఎంతో దగ్గరయ్యాడు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలతో బాక్సాఫీస్ హిట్లు కొట్టి ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ప్రేక్షకులకు కొంత దూరమయ్యాడనే చెప్పాలి. సరైన హిట్ కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఎమోషనల్ కథను సెలక్ట్ చేసుకుని నటించడమే కాక నిర్మాతగానూ మారాడు. ఇటీవల అతడు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చిత్తా'. ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజైంది. తమిళనాడులో హిట్ కొట్టిన ఈ మూవీ తెలుగులో చిన్నా పేరుతో అక్టోబర్ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో చిన్నా చిత్రం ఓటీటీలోకి రానుంది. ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నిమిష సజయాన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: రైతుబిడ్డ పేరు జపం చేసిన అశ్విని.. ఈ వారం నామినేషన్స్లో ఎవరున్నారంటే? -
డబుల్ ఎలిమినేషన్.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా!
బిగ్బాస్ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్.. ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్బాస్ ఎపిసోడ్లో పస లేకుండా పోతోంది. ఈసారి కూడా అదే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్బాబు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్ టాక్! గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లి ఎపిసోడ్ అంతా అయ్యాక తిరిగి హౌస్ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్ రూమ్ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్ హౌస్లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్.. ఓటీటీ పార్ట్నర్ ఏదంటే? -
సురేశ్ కొండేటికి సిద్ధార్థ్ సీరియస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే?
బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్. ఈ చిత్రంలో జెనీలియా అతనికి జంటగా నటించింది. ప్రస్తుతం ఆయన చిత్తా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాగా.. తెలుగు ఈనెల 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వరుసగా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్కు ఆయన హాజరయ్యారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే? ) అయితే ఈ ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సినిమా ఈవెంట్స్లో కాంట్రవర్సీ ప్రశ్నలకు కేరాఫ్గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి కూడా హాజరయ్యారు. ఆయన ప్రశ్నలు అడిగేముందే హీరో సిద్ధార్థ్.. అతనిపై సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు కాస్తా పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో సలహా ఇచ్చారంటూ సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. 'కొండేటి సురేశ్కు ఒక వార్నింగ్. మొత్త ఇంటర్నెట్ నీకు వార్నింగ్ ఇవ్వమంది. ఆయనను పిలిస్తే పద్ధతిగా కూర్చొని, పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి. అలాంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని సలహా ఇచ్చారు. అయితే నేను వారికి కూడా ఒకటి చెప్పాను. సురేశ్ కొండేటి నా ఫ్రెండ్ అయ్యా. అతనికి రైట్స్ ఉన్నాయి అని చెప్పా' అని నవ్వుతూ అన్నారు. ఈ వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) Sariponu....... pic.twitter.com/DBYIHOGOAl — Arehoo_official (@tweetsbyaravind) October 3, 2023 -
ప్రభాస్ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్
-
గేటు బయట నిలబెట్టి మాట్లాడారు.. సిద్ధార్థ్ ఎమోషనల్
హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినా.. తెలుగు హీరోలతో సమానంగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాలు సిద్ధార్థ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సిద్ధార్థ్కి సరైన హిట్ పడలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ టాలెంటెడ్ హీరోని పక్కన పెట్టేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇటీవల టక్కర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఆ సినిమా రిలీజైన విషయమే చాలా మందికి తెలియదు. ‘చిన్నా’తో కమ్బ్యాక్ చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతవుతున్న సిద్ధార్థ్కి తాజాగా ఓ సూపర్ హిట్ పడింది. ఆయన నటిస్తూ నిర్మించిన ‘చిట్టా’ చిత్రం తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడే ఇదే చిత్రాన్ని ‘చిన్నా’పేరుతో తెలుగులో అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. అంజలీ నాయర్, నిమిష సజయన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ 28నే తెలుగులో కూడా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ రోజు ఇక్కడ చాలా సినిమాలు విడుదల కావడంతో థియేటర్స్ కొరత ఏర్పడింది. దీంతో అక్టోబర్ 6న వాయిదా వేశారు. రిలీజ్కు ఎవరూ ముందుకు రాలేదు ‘చిన్నా’చిత్రాన్ని తమిళ్తో పాటు కన్నడ, మలయాళంలో కూడా సెప్టెంబర్ 28 నాడే రిలీజ్ చేశారు. కానీ తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. దానికి గల కారణం ఏంటో తాజాగా జరిగిన తెలుగు ప్రెస్మీట్ సిద్ధార్థ్ వెల్లడించాడు. ‘నా సినిమా బాగుందని ఉదయనిధి స్టాలిన్ తమిళ్లో కొన్నాడు. కేరళ కూడా అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గోకులమ్ గోపాలన్ మా సినిమాను తీసుకున్నాడు. కన్నడలో కేజీయఫ్ నిర్మించివారు విడుదల చేశారు. కానీ తెలుగులో మాత్రం చిన్నా రిలీజ్కు ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది అయితే ‘సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారని’అడిగారట. (చదవండి: హీరో సిద్ధార్థ్ భావోద్వేగం.. ఇక్కడికి ఇకపై రానంటూ!) మా సినిమా చూసి విడుదల చేయండి అని కొంతమంది దగ్గరకు వెళ్తే.. గేటు బయటే నిలబెట్టి మాట్లాడారు. ఇన్నేళ్ల నా సినీ కెరీర్లో ఇలాంటి అవమానం జరగలేదు. నేను తెలుగు సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఉంది. 2013 నుంచి 2022 వరకు నా దగ్గరకు కేవలం మూడు కథలు మాత్రమే టాలీవుడ్ నుంచి వచ్చాయి. అందులో ‘మహా సముద్రం’ ఒకటి. నేనొక నటుడిని మాత్రమే. నాకు ఒక ప్రాంతం అంటూ ఉండదు. మంచి కథలు వస్తే ఎక్కడైనా నటిస్తాను. ఇప్పుడు ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చా. చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!
హీరో సిదార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలారోజుల తర్వాత తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఇతడు.. స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తనని, తన సినిమా అవమానించారని చెబుతూ బరస్ట్ అయిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది? సిద్ధార్థ్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? స్వతహాగా తమిళ నటుడు అయినప్పటికీ పలు సూపర్హిట్ తెలుగు సినిమాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటిది గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. చాన్నాళ్ల తర్వాత 'మహాసముద్రం' అనే సినిమాలో నటిస్తే అది ఘోరంగా ఫ్లాప్ అయింది. అలా సక్సెస్ లేక అల్లాడుతున్న సిద్ధార్థ్.. తానే నటిస్తూ, నిర్మిస్తూ 'చిట్టా' అనే సినిమా తీశాడు. గత వారం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజుల్లో రూ.11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో 'చిన్నా' పేరుతో రిలీజ్ చేద్దామని చూస్తే.. సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ బాధపడ్డాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!) సిద్ధార్థ్ కామెంట్స్ 'ఇంతకన్నా గొప్ప సినిమా నేను చూడలేదు' అని ఉదయనిధి స్టాలిన్, తమిళంలో నా సినిమాను కొన్నారు. కేరళలోనూ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ నా సినిమా తీసుకున్నారు. కన్నడలో 'కేజీఎఫ్' నిర్మించిన వాళ్లు రిలీజ్ చేశారు. తెలుగులోకి వచ్చేసరికి.. 'సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారు?' అని అన్నారట. నేనో మంచి మూవీ తీస్తే ప్రేక్షకులు చూస్తారని నా నమ్మకం. ఆ టైంలో నా దగ్గరకొచ్చి.. మేం మీతో ఉన్నామని ఏషియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. వాళ్లకు చాలా థ్యాంక్స్. నా సినిమాలో అది ఉంది, ఇది ఉందని చెప్పి అడుక్కు తినే బ్యాచ్ కాదు. మీకు సినిమాలపై నమ్మకం, ఇష్టం ఉంటే థియేటర్కి వెళ్లి 'చిన్నా' చూడండి. ఇది చూసిన తర్వాత 'తెలుగులో సిద్ధార్థ్ సినిమాలు చూడం' అనిపిస్తే.. ఇక తెలుగులో ప్రెస్మీట్స్ పెట్టను. ఇక్కడికి రాను అని చెబుతూ సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. (ఇదీ చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) On of my friend Said #Chithha movie is very good and he praised #Siddharth in this movie. Hope Telugu Audience will encourage this good movie 👍#Chinna releasing on October 6thpic.twitter.com/HIq8I35sFp — ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) October 3, 2023 -
క్షమించమని సిద్ధార్థ్ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
ఇక్కడి నుండి వెళ్ళిపో.. హీరో సిద్ధార్థ్ ను తరిమేసిన కన్నడ సంఘాలు
-
బొమ్మరిల్లు విడుదల రోజులను గుర్తు చేసుకున్న సిద్ధార్థ
-
ఎన్ని సినిమాలు తీసిన..తెలుగు వారి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను
-
ప్రేమకథ విన్నారా?
కెరీర్లో హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్ అండ్ సౌత్ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు. ఇదే స్పీడ్ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్. శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి ఉడయార్ ఇటీవల ఓ లవ్స్టోరీ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్కు వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్ టాక్. -
థ్రిల్లర్ మూవీతో వస్తోన్న సిద్ధార్థ్.. ఇప్పుడైనా కమ్ బ్యాక్ ఇస్తాడా?
తమిళ స్టార్ నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం చిత్తా. ఈ మూవీకి ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇటకీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సిద్ధార్థ్ నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిమిషా నటించగా.. అంజలీ నాయర్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. దీపు నినన్, థామస్, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్, దర్శకుడు అరుణ్కుమార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది కిడ్నాప్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చాలా సహజత్వంగా అదే సమయంలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. తాను 25 ఏళ్లుగా ఇలాంటి చిత్రం కోసమే ఎదురు చూశానన్నారు. ఇది తనకు కమ్ బ్యాక్ చిత్రం అవుతుందన్నారు. బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే కథా చిత్రంగా చిత్తా ఉంటుందన్నారు. దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని సిద్ధార్థ్ అన్నారు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. కాగా.. ఈ నెల 28వ తేదీన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. -
యువత గెలవాలి – సిద్ధార్థ్
‘‘రామన్న యూత్’ టైటిల్ బాగుంది. అభయ్ నాకు ఇష్టమైన నటుడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తన జీవితంలో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్లో వినోదం, భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా యువత గెలవాలి.. అలా ఈ ‘రామన్న యూత్’ కూడా గెలవాలి’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. అభయ్ నవీన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రామన్న యూత్’. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ను సిద్ధార్థ్ విడుదల చేశారు. అభయ్ నవీన్ మాట్లాడుతూ– ‘‘ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి? అనేది సినిమాలో చూపిస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో సాగే పోలిటికల్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: శివ ఎంఎస్కే. -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar) -
Brahmanandam Son Siddharth: బ్రహ్మనందం కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
సాక్షి, రంగారెడ్డి: శామీర్పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. భర్త సిద్దార్థ్తో(42) విడిపోయిన స్మిత గ్రంథి.. మనోజ్తో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్పై స్మిత కొడుకు ఫిర్యాదు మనోజ్పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్పల్లిలోని ఫిడ్జ్ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్పేటలోని శాంతినికేతన్ రెడిసెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. పిల్లల కోసం రావడంతో ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్లోని సెలబ్రిటీ క్లబ్లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్ను చూసి ఆగ్రహించిన మనోజ్.. ఎయిర్ గన్తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు. సిద్ధార్థ్, స్మిత మధ్య విడాకుల కేసు సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్లో హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. నేడు సిద్ధార్థ్ తన పిల్లలను చూడటానికి రిసార్ట్కు రాగా మనోజ్ ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడని తెలిపారు. చదవండి: పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి -
ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, దివ్యాన్షా జంటగా నటించిన తాజా చిత్రం 'టక్కర్'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కార్తీక్ క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలరోజులు కాకముందే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?) ఈనెల 7 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిశ్కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, అరుణ్ వైద్యనాథన్, విశ్వ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!) -
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఆ స్టార్డమ్ను అలాగే కాపాడుకోలేకయాడు. వరుస అపజయాలతో తెలుగు చిత్రసీమకు దూరమయ్యాడు. ఒరేయ్ బామ్మర్ది, మహాసముద్రం చిత్రాలతో మళ్లీ తెలుగు ఆడియన్స్ను పలకరించినప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షే అయింది. తెలుగులో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో టక్కర్తో ముందుకు వచ్చాడు సిద్దార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శుక్రవారం (జూన్ 9న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో థియేటర్లో టక్కర్ చూసిన సినీ ప్రియులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి టక్కర్ సినిమా ఎలా ఉంది? సిద్దార్థ్ ఈసారైనా హిట్టు కొట్టాడా? అనే అంశాలను నెటిజన్ల మాటల్లో తెలుసుకుందాం. సిద్దార్థ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యోగి బాబు కామెడీ బాగుంది. ఆర్జే విఘ్నేశ్కాంత్ పాత్ర పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ యావరేజ్ కంటే కూడా దారుణంగా ఉందంటున్నారు. సినిమా యావరేజ్ అని చెప్తున్నారు. Premier show🎬 ~ #Takkar @sathyamcinemas ... Sidharth done his role really gud, Yogi Babu comedy works gud & rj Vigneshkanth portion is okay ... But stry wise aracha maava aracha maari iruku 😮💨 1 word review - takkar knjm makkar 🥱 — 𝑁𝐾 (@_naviin_13) June 9, 2023 #Takkar first half So far so good except yogibabu comedy😀😀 — Poovanesh S (@poova4u) June 9, 2023 #TakkarReview Decent first half with below avg second half. Fight sequences good. Old template. Script could have been better in Second half. Cringe comedy. Siddharth🔥, Divyansha😍, yogibabu waste Decent BGM, Good visuals. Run time big plus. Overall - Average pic.twitter.com/WZhBHudCEi — Poovanesh S (@poova4u) June 9, 2023 Racy second half, @iYogiBabu's nonstop comedy,worked well, Feel good commercial movie after a longtime. #Takkar #TakkarFromJune9 #TakkarFromTomorrow — Karthick T (@karthickt) June 8, 2023 #TAKKAR - Didn't work for me. Dull 1st half, below par 2nd half. Mass moments & Love portions didn't work at all. Songs good. Yogi Babu scenes worked at some places. Climax 🤐🤧😷 Disappointed 💔🚶🏻 https://t.co/JjfJMuNWxu pic.twitter.com/vM7t608A0d — Kumarey (@Thirpoo) June 8, 2023 #Takkar Movie Review : ⭐⭐½ Strictly Average 1st half and decent 2nd Half Comedy Worked in bits and decent songs👍 But Action & Emotions didn't work well 👎 Overall another Below Par Movie from #Siddharth Hope he gives comeback soon🤞 — Thyview (@Thyveiw) June 8, 2023 చదవండి: కోలీవుడ్ నుంచి ఆఫర్, నో చెప్పిన హీరోయిన్ శ్రీలీల -
నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది
‘‘నేనో సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాను తీసేంత స్వేచ్ఛ నాకు కావాలి. ఇదే నా డ్రీమ్. తమిళంలో నేను చేయగలుగుతున్నాను. కానీ తెలుగులో నాకు అంతగా సపోర్ట్ లభించలేదు. అయినా తెలుగు ఆడియన్స్కు, నాకు ఫుల్స్టాప్ కాదు కదా.. చిన్న కామా కూడా పడలేదు.. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్యలో ఉన్నది చిన్న టైమ్ గ్యాప్ మాత్రమే. ఇప్పుడు ‘టక్కర్’తో టైమ్ కలిసొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు. ► ధనవంతుణ్ణి కావాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు ఓ కుర్రాడు. అయితే అన్నీ అతని ఊహలకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఏం చేస్తాడు? ఎవరితో అతను ఘర్షణ పడాల్సి వస్తుంది? అన్నదే ‘టక్కర్’ కథాంశం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హీరో, హీరోయిన్ రిలేషన్షిప్లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు, అహం, లింగబేధం, వయసు.. ఇలాంటి అంశాలు కథలో చర్చకు వస్తాయి. కార్తీక్ క్రిష్ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. ► లవ్స్టోరీస్ సినిమాల గురించి చర్చకు వస్తే.. వాటిలో ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నాకు లవ్స్టోరీ చెబితే, దాదాపు నో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లవ్స్టోరీ సినిమా చేసి, అది హిట్ అయితే నాకు మళ్లీ ఓ పదేళ్ల పాటు లవ్స్టోరీలే వస్తాయి. నేను లవ్స్టోరీస్ మాత్రమే చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. యాక్టర్గా డిఫరెంట్ సినిమాలు చేయాలి. ► రచయితగా ‘గృహం’ ఫ్రాంచైజీకి కథలు రెడీ చేస్తున్నాను. మా ప్రొడక్షన్ హౌస్లో కొత్తవారితో సినిమాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్లో దర్శకత్వం చేస్తాను. ‘బొమ్మరిల్లు 2’ ఆలోచన ఉంది. కానీ అది పెద్ద చాలెంజ్తో కూడుకున్న పని.. చూడాలి. ► యాక్టర్గా నేను మంచి ఫామ్లోకి వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది. మళ్లీ తెలుగులో నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో కీలక పాత్ర, ‘ది టెస్ట్’లో ఓ లీడ్ రోల్, ‘చిన్నా’ సినిమా చేస్తున్నాను. ఓ స్ట్రయిట్ లవ్స్టోరీ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. కార్తీక్ క్రిష్తో మరో సినిమా చేయనున్నాను. ► మీకు ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలేదంటారా? అని ఓ విలేకరి అడగ్గా... ‘మ్యారేజ్ చేసుకునే ఏజ్ నాకు వచ్చినప్పుడు.. ఆ పెళ్లి భోజనం తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పెళ్లి భోజనం నాకు గొంతు దిగడం లేదు. సో.. దానికి ఓ టైమ్ ఉంది. డైరెక్షన్ నా డ్రీమ్. నా మ్యారేజ్ నా పేరెంట్స్ డ్రీమ్. నా పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి వార్తలు వచ్చాయంటే అవి రాసిన వారిని అడగాలి’’ అని అన్నారు సిద్ధార్థ్. -
ఈ మూడు కారణాల వల్లే తెలుగులో రిలీజ్ అవుతున్న టక్కర్
‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘టక్కర్’ ఒక యాక్షన్ ఫిల్మ్. న్యూ ఏజ్ లవ్స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘టక్కర్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘‘విశ్వప్రసాద్, వివేక్గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా తదితరులు పాల్గొన్నారు. -
జైపూర్లో అదితిరావు, సిద్ధార్థ్ సందడి..
-
శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!
యంగ్ హీరో సిద్దార్థ్తో హీరోయిన్ అదితి రావు హైదరీ డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ఎక్కువగా పార్టీల్లో కనిపించడంతో అభిమానులు వీరి గురించే చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరి రిలేషిప్పై ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. గతంలో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ జంట జైపూర్లో జరిగిన శర్వానంద్ పెళ్లికి కూడా హాజరయ్యారు. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) శర్వానంద్ పెళ్లికి జైపూర్ వెళ్తూ అదితి, సిద్ధార్థ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. సిద్ధార్థ్, అదితి విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించారు. అంతే కాకుండా జైపూర్లో రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి కూడా వెళ్లారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శర్వానంద్ పెళ్లికి జంటగా వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by Bina Kak (@kakbina) -
ఒక వర్ణం చేరెలే...
‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
అదితిరావు హైదరితో డేటింగ్ గురించి సిద్ధార్థ్ మాటల్లో వినండి..!
-
ప్రభాస్ కి నాకు ఉన్న లింక్ ఏంటిటంటే..!
-
నా ఏజ్ కనిపించక పోవడానికి సీక్రెట్ ఏంటంటే..!
-
అలాంటి వారికి సమాధానమే టక్కర్
‘‘మీరెప్పుడూ లవర్ బోయ్ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్’. ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్’ న్యూ జనరేషన్ సినిమా. ఇందులో సిద్ధార్థ్ని రగ్డ్ లవర్ బోయ్గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
మజిలీ బ్యూటీతో హీరో సిద్ధార్థ్.. రిలీజ్ డేట్ ఆరోజే
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినివ కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమాస్తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో ΄పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంనాథన్ మురుగేశన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! -
కయ్యాలే...కయ్యాలే
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నివాస్ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను నిరంజన్ రామనన్ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
'లవ్ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్
‘నేనంటే ఇష్టం లేదా’ అని అబ్బాయి అంటే... ‘లవ్ అంటేనే ఇష్టం లేదు’ అని అంటుంది అమ్మాయి. ఈ ఇద్దరి కథ ఏంటనేది ‘టక్కర్’లో తెలుస్తుంది. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ పైన పేర్కొన్న సంభాషణలతో సాగుతుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్తో కలిసి టీజీ విశ్వప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంచినాథన్ మురుగేశన్. -
అఫీషియల్: శంకర్ డైరెక్షన్లో ఛాన్స్ కొట్టేసిన హీరో సిద్దార్థ్..
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్హాసన్తో ఇండియన్-2 సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు. నేడు(సోమవారం)సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్డే విషెస్ను అందిస్తూ సిద్దార్థ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, బాబి సింహ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. Team #INDIAN2 🇮🇳 wishes Mr. Charming & multi talented #Siddharth 🤩 a Happy B'day 🥳 & a fabulous year ahead ✨ 🌟 @ikamalhaasan 🎬 @shankarshanmugh 🪙 @LycaProductions @RedGiantMovies_ 🎶 @anirudhofficial 🌟 #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar #BobbySimha 📽️… pic.twitter.com/VkBQ5SJ3nr — Lyca Productions (@LycaProductions) April 17, 2023 -
‘టెస్ట్’ కోసం రెడీ అవుతున్న నయనతార
లేడీ సూపర్స్టార్ నయనతార తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ బాద్షా షారూక్ఖాన్తో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈమె నటించి నిర్మించిన కనెక్ట్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఆశించిన విజయం సాధించకపోయినా ఇదో విభిన్న ప్రయత్నం. అయితే ఇటీవల నయనతారకు అవకాశాలు తగ్గాయని, ఆమె కూడా నటనకు స్వస్తి చెప్పి చిత్ర నిర్మాణ రంగంపై దృష్టి పెట్టబోతున్నార నే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే అదంతా ఒక ప్రచారం మాత్రమే. వాస్తవానికి నయనతార చిన్న గ్యాప్ తీసుకున్నారంటే. కవల పిల్లలకు తల్లి అవడం అదే విధంగా తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజా చిత్రం మిస్ కావడంతో కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా మళ్లీ నటిగా విజృంభించడానికి సిద్ధమయ్యారు. ఆమె నటిస్తున్న 75వ చిత్ర షూటింగ్ సైలెంట్గా శనివారం చైన్నెలో ప్రారంభమైంది. ఇది ఆమె నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. తాజాగా మరో భారీ చిత్రానికి కూడా నయనతార గ్రీన్ సిగ్న్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో నయనతారతో పాటు నటుడు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. దీనిని నిర్మాత వై నాట్ శశి స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఈయన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నారన్నమాట. ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. దీనిని ది టెస్ట్ అనే పేరును నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
కాదు.. లేదు అంటూనే!
కాదంటే అవుననిలే...అనే సూపర్ హిట్ పాట ఉంది కదా. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి పరిస్థితి ఇలానే ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. సినీ వివాహ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తారు. లవ్వా అంటే చా..చా... అలాంటిదేమీ లేదు....మంచి స్నేహితులం అంటారు. మీడియాలో మాత్రం సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి సహజీవనం అంటూ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఈ సంచలన జంట గురించి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన నటుడు సిద్ధార్థ్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రు వెలియిడై చిత్రంతో కోలీవుడ్కు అతిథి రావ్ హైదరి పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ కలిసి తెలుగులో సముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అయినా వీరి మధ్య పరిచయం బలపడిందంటారు. మరో విషయం ఏంటంటే సిద్ధార్థ్కి ఇప్పటికే పెళ్లి, విడాకులు కావడం జరిగిపోయింది. నటి అతిథి రావ్ హైదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ జంట ముచ్చట చూసి ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు చేసిన డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతంది. అయితే దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. -
హీరోయిన్తో సిద్దార్థ్ చెట్టాపట్టాల్.. లవ్లీ జోడీ అనగానే సిగ్గులమొగ్గైన అదితి
హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని అటు ఫిల్మీదునియాలో ఇటు సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. అబ్బే, అదేం లేదంటూనే వీరిద్దరు పార్టీలకు, షికార్లకు వెళ్తూ ఉంటారు. వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి అభిమానులు మాత్రం భలే ఉన్నారిద్దరూ అని ముచ్చటపడిపోతుంటారు. తాజాగా సిద్దార్థ్, అదితి ముంబైలో జూబ్లీ వెబ్ సిరీస్ ప్రీమియర్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ జంటగా కెమెరాకు పోజులిచ్చారు. అక్కడున్న వాళ్లు ఈ జంటను చూసి లవ్లీ జోడి అని కామెంట్ చేయగా అదితి సిగ్గుపడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సిద్, అదితి ఎంత ముద్దొస్తున్నారో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇప్పటికైనా ఇది ప్రేమంటారా? కాదంటారా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో అదితి రావుకు సిద్దార్థ్తో డేటింగ్పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆమె స్పందిస్తూ అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేనే చెప్తానంటూ మాట దాటవేసింది. అయినా నేనేం చెప్పినా చివరకు మీకు నచ్చినట్లుగానే ఊహించుకుంటారుగా అని కౌంటర్ వేసింది. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచే ఈ లవ్ మొదలైందని టాక్! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
హీరో సిద్ధార్థ్తో డేటింగ్పై ప్రశ్న.. అదితి షాకింగ్ కామెంట్స్
హీరో సిద్దార్థ్తో డేటింగ్ వార్తలపై హీరోయిన్ అదితి రావు హైదరి మరోసారి స్పందించింది. గతంలో డేటింగ్ రూమర్స్ను ఖండించిన అదితికి తాజాగా ఇంటర్య్వూలో అదే ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఆమె నటించిన తాజ్ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆమె ఓ చానల్కు ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిలేషన్షిప్పై స్పందించాలని యాంకర్ ఆమెను కోరగా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. అందరితో పంచుకునే విషయం ఏదైనా ఉంటే నేను చెప్తాను అంది. చదవండి: ఇంత నిర్లక్ష్యమా..‘విరూపాక్ష’ మేకర్స్పై హీరోయిన్ ఆగ్రహం తన రిలేషన్ స్టేటస్పై మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు. కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్పై చూడటమంటనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్ను అందించగలం. అదే మాకు ముఖ్యం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం సిద్దార్థ్తో రిలేషన్పై మాట్లాడుతూ అసహనం చూపించింది. చదవండి: ఐశ్వర్య ఇంట్లో చోరీ.. ఆ డబ్బుతో చెన్నైలో ఇల్లు, లగ్జరీ వస్తువులు కొన్నారు.. ‘ఈ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంకా నేనేమి చెప్పాలి. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’ అని వాఖ్యానించింది. దీంతో యాంకర్ ఇది ఆడియన్స్ ప్రశ్న అనగానే వారెప్పుడు తనని ఇలాంటి ప్రశ్న అడగలేదని, మీరు అడుగుతున్నారంటూ నవ్వుతూ చెప్పింది. కాగా అదితి-సిద్ధార్థ్లు మాత్రం తమపై వచ్చే రూమర్స్ పట్టించుకోకుండా కలిసి పార్టీలు, విందులకు హాజరవుతున్నారు. అంతేకాదు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, రీల్స్ను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. -
సిద్దార్థ్తో లవ్.. స్పందించిన హీరోయిన్
ప్రేమలో పడటం సహజమే.. కానీ ఆ ప్రేమ విషయాన్ని కొందరు మాత్రమే నిర్మొహమాటంగా చెప్తారు. సినీ ఇండస్ట్రీలో అయితే అతికొద్ది మంది మాత్రమే అవునని ఒప్పుకుంటారు, లేదంటే లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. కానీ హీరోహీరోయిన్లు సెట్స్లో కాకుండా బయట కలిసి కనిపించినా, షికార్లు కొడుతూ కెమెరాలకు చిక్కినా వారిని మాత్రం లవ్ బర్డ్స్గానే వర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు మాత్రం అది ప్రేమ అనో, స్నేహమనో క్లారిటీ ఇవ్వరు. దీంతో ఇది కచ్చితంగా లవ్వేనని అంతా ఫిక్సైపోతారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి రూమర్స్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావుల మధ్య ఎక్కువయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ పాటకు చిందేసిన డ్యాన్స్ సైతం తెగ వైరల్ అయింది. తాజాగా తన గురించి వస్తున్న ప్రేమ పుకార్లపై స్పందించిందీ హీరోయిన్. 'నేను ఎవరితో ఏ రిలేషన్లో ఉన్నాను అనేదానిపై కాకుండా నా సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. మంచి డైరెక్టర్లతో కలిసి పని చేస్తున్నాను. కెరీర్పైనే దృష్టి సారించాను. నన్ను నటిగా అంగీకరించినంతవరకు నటిస్తూనే ఉంటా. దయచేసి నా వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడండి' అని పేర్కొంది అదితి. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో హీరో సిద్దార్థ్ డ్యాన్స్.. వీడియో వైరల్
హీరోయిన్ అదితి రావ్ హైదరితో హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసముద్రం అనే సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు అప్పటినుంచి ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఇదిలా ఉంటే మరోసారి ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. సిద్దార్థ్-అదితి కలిసి విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమాలోని పాపులర్ ‘టమ్ టమ్’అనే పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియోను అదితి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వీరి డ్యాన్స్ రీల్ నెట్టింట వైరల్గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఇంక లేట్ ఎందుకు త్వరలోనే మీ రిలేషన్షిప్ అనౌన్స్ చేయండి.. మీ పెళ్లి ఫోటోల కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
పల్లెటూర్లో పరేషాన్
తిరువీర్, పావని కరణం జంటగా రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన చిత్రం ‘పరేషాన్’. తెలంగాణలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో తీరువీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా సహజంగా వుంటుంది’’ అన్నారు. ‘‘అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం’’ అన్నారు రూపక్ రోనాల్డ్సన్. ఇదొక ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సిద్ధార్థ్. -
ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజులుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరి నుంచి అధికారిక సమాచారం లేదు. చదవండి: ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్ ట్వీట్ రీసెంట్గా యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించడంలో వీరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా అదితి సిద్ధార్థ్కు షాకిచ్చింది. సిద్ధార్థ్కు కాకుండ మరో సీనియర్ హీరోకి ఆమె ప్రపోజ్ చేసింది. వాలంటైన్స్ డే సందర్భంగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్కి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్రతో పాటు అదితి కూడా ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా అదితి ఆయనకు రెడ్ గులాబి ఇచ్చి సరదగా ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎయిర్పోర్ట్ వివాదం: విజయ్ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఈ ఫొటోని అదితి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ది మోస్టెస్ట్ హ్యాండ్సమ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పోస్ట్పై హీరో సిద్ధార్థ్ స్పందించడం విశేషం.పోస్ట్ 2 హార్ట్ ఎమోజీలతో అదితి పోస్ట్పై స్పందించాడు. అయితే వాలంటైన్స్ డే రోజున సిద్ధార్థ్కు ప్రపోజ్ చేయకపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్పై స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు మహాసముద్రం చిత్రంలో ప్రేమికులుగా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్తో డేటింగ్ రూమర్స్తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
డేటింగ్ రూమర్స్.. శర్వానంద్ ఎంగేజ్మెంట్లో జంటగా సిద్ధార్థ్, అదితి!
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్కి వెళ్లడి, సినిమా ఈవెంట్స్కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇంత వరకు డేటింగ్ రూమర్స్పై ఈజంట క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు జంటగా ఓ యంగ్ హీరో నిశ్చితార్థం వేడుక సందడి చేశారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నేడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. చదవండి: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన ఈ వేడుకలో రామ్ చరణ్, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు సతీసమేతంగా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే హీరో సిద్ధార్థ్ కూడా తన రూమార్డ్ గర్ల్ఫ్రెండ్ అదితి రావ్ హైదరితో కలిసి హజరయ్యాడు. ఈ కొత్త జంటతో వీరిద్దరు తీసుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా ఇండస్ట్రీలో సిద్ధార్థ్, శర్వానంద్లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. శర్వా, సిద్ధార్థ్ల కాంబినేషన్లో సముంద్రం అనే మూవీ రాగా అందులో అదితి హీరోయిన్గా నటించింది. చదవండి: ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్చరణ్ దంపతులు -
‘భారత్లో ఇలానే ఉంటుంది’!.. ఎయిర్పోర్ట్లో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: బహు భాషా నటుడు హిరో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది. తమినాడులోని మధురై ఎయిర్పోర్ట్లో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులను బ్యాగులోంచి కొన్ని నాణేలను తీసేయమని ఒత్తిడి చేశారని అన్నారు. సుమారు 20 నిమిషాల పాటు వేధింపులకు గురిచేశారని చెప్పారు. తాము ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వారు పదే పదే హిందీలో మాట్లాడి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. దీన్ని తాము వ్యతిరేకించగా.. ‘భారత్లో ఇలానే ఉంటుంద’ని ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రాం వేదికగా సిద్ధార్థ్ వెల్లడించారు. మధురై విమానాశ్రయంలోని భద్రతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) నిర్వహిస్తోంది. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
మోసగాడు సిద్ధార్థ్పై కేసు నమోదు
విజయవాడ స్పోర్ట్స్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన డయల్ ఇన్స్టిట్యూట్ యజమాని సిద్ధార్థ్పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదయింది. విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అందులో యువతులను నియమించి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేసి కోట్లాది రూపాయలను వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు సిద్ధార్థ్పై 409 (బ్యాంక్ చెక్కులను మోసానికి వినియోగించడం, అగ్రిమెంట్లను ఆర్థిక మోసాలకు వినియోగించడం), 406 (ఉద్దేశపూర్వకంగా నేరపూరిత కుట్రకు పాల్పడటం), 406 (నమ్మించి మోసం చేయడం) సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి.జానకిరామయ్య తెలిపారు. ఈ మోసంపై 14వ తేదీ అర్ధరాత్రి వరకు 25 మంది బాధితులు తమను ఆశ్రయించారని, గురువారం మరో పది మంది ఆశ్రయించినట్లు చెప్పారు. పకడ్బందీగా మోసం నిందితుడు సిద్ధార్థ్ పక్కా ప్రణాళికతో అత్యంత పకడ్బందీగా మోసానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. నిరుద్యోగులను ఆకర్షించేందుకు అతను ఏర్పాటు చేసిన డయల్ ఇన్స్టిట్యూట్లో యువతులను మాత్రమే నియమించడం, వారిని గరిష్టంగా రెండు నెలల్లో ఉద్యోగం నుంచి తొలగించేవాడు. నిరుద్యోగులు అతని బ్యాంక్ అకౌంట్కు చెల్లించిన నగదును వెంటనే విత్డ్రా చేసి బ్యాంక్ ఖాతాలను నిత్యం ఖాళీగానే ఉంచే వాడు. అతని రేషన్కార్డ్, ఇంటి అడ్రస్, ఆధార్ వివరాలు ఆన్లైన్లో లేకుండా ముందస్తుగానే వ్యూహ రచన చేసుకున్నాడు. అయితే డయల్ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న మోసంపై ఆరు నెలల క్రితమే పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పోలీసులు సెటిల్మెంట్ చేసి కేసు నమోదు చేయకుండా మిన్నకుండిపోవడంతో ఇటీవల కాలంలో నిందితుడు సిద్ధార్థ్ వలలో మరికొంత మంది బాధితులు బలి అయ్యారు. -
డేటింగ్ రూమర్స్..హోటల్లో కెమెరాలకు చిక్కిన హీరో, హీరోయిన్లు
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ముంబైలోని ఓ హోటల్లో సిద్ధార్థ్- అదితిలు జంటగా కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. కాగా ఇక సిద్దార్థ్, అదితిలు కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. అదే ప్రేమకు దారితీసిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ పెళ్లి చేసుకోగా, 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి కూడా చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికే అతడితో విడిపోయింది. -
బాలీవుడ్ హీరోతో కియారా లవ్? డిసెంబర్ లో మ్యారేజ్?
-
సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్గా హీరో పోస్ట్
Siddharth-Aditi Rao Hydari Dating Rumours: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు వీరిద్దరు జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా అదితి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. చదవండి: కోలుకోవడం సాధ్యం కాలేదు, బతకాలనిపించలేదు : దీపికా పదుకొణె అదితితో కలిసి క్లోజ్గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదితితో ప్రేమలో ఉన్నట్లు సిద్ధార్థ్ ఈ పోస్ట్తో క్లారిటీ ఇచ్చాడా? అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్ధార్థ్ పోస్ట్పై వారి సన్నిహితులు సైతం వీరిద్దరిని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్దార్థ్ పోస్ట్కి అదితి స్పందిస్తూ సిద్దూ… అంటూ స్పెషల్ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే అదితి బర్త్డే సందర్భంగా వీరిద్దరు జంటగా వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె బర్త్డే రోజున(అక్టోబర్ 28న)ముంబై ఎయిరోపోర్ట్లో సిద్దార్థ్, అదితిలు జంటగా దర్శనం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
ఒక్క పోస్ట్తో లవ్ కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్?
అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో హీరో సిద్దార్థ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో ఏదో ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య వీళ్లు ఓ సెలూన్ నుంచి కలిసి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కారు. ఇకపోతే తొలిసారి అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడీ హీరో. 'హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్, నీ కలలన్నీ సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చాడు. ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటే అందరి హృదయాల్లో కొలువైన రాణి అంటున్నాడా? లేదా తన మనసు దోచుకున్న మహారాణి అని హింటిస్తున్నాడా? అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. ఇకపోతే అదితి.. సిద్దార్థ్తో బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవడానికి చెన్నైకి చెక్కేసిందట. మరి ఈ బర్త్డే వేడుకల ఫొటోలను వారు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారో లేదో చూడాలి! View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే! నిజమే, పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీయాల్సిందే! -
గర్ల్ఫ్రెండ్తో సిద్దార్థ్ షికార్లు.. ఫొటోలు తీసినవారికి హీరో వార్నింగ్!
'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఈ మధ్య అతడి సినిమాలేవీ పెద్దగా ఆడటం లేదు. చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది సక్సెస్ అవలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అదితి రావు హైదరీతో సిద్దార్థ్ లవ్లో పడ్డాడంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇది నిజమేనంటూ మరో వార్త నెట్టింట వైరల్గా మారింది. ముంబైలోని ఓ సెలూన్ నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కెమెరాల కంట పడింది. ఇంకేముందీ.. ఫొటోగ్రాఫర్లు వెంటనే వారిని ఫొటోలు తీస్తూ కెమెరాలు క్లిక్మనిపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్దార్థ్.. తనను ఫొటోలు తీయొద్దని హెచ్చరించాడట. 'నేను ఇక్కడివాడిని కాదు, వెళ్లి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ల ఫొటోలు తీసుకోండి. నెక్స్ట్ టైం మాత్రం ఇంత మర్యాదగా అస్సలు చెప్పను, అర్థమైందా?' అని ఓరకంగా వార్నింగే ఇచ్చాడట. చదవండి: చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ క్యాస్టింగ్ కౌచ్ వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు వదులుకున్నా.. -
రీల్స్తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. 'ఎస్కేప్ లైవ్' రివ్యూ
టైటిల్: ఎస్కేప్ లైవ్ (హిందీ వెబ్ సిరీస్) నటీనటులు: సిద్ధార్థ్, ఆకాంక్ష సింగ్, సుమేధ్ ముద్గాల్కర్, రిత్విక్ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్, జావేద్ జాఫెరి తదితరులు దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్ తవారీ విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్) ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్స్టార్ టాలీవుడ్లో లవర్ బాయ్గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్ సిరీస్ ఎస్కేప్ లైవ్. సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్, సోషల్ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్ లైవ్' అనే వీడియో షేరింగ్ యాప్లో మోడరేటర్గా జాయిన్ అవుతాడు. ఎస్కేప్ లైవ్ యాప్ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్ వివిధ రకాల వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్ రూపంలో వారి అకౌంట్కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్ వరకు ఎక్కువ డైమండ్స్ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్ లైవ్ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్లో పాల్గొన్న యాజర్స్ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ప్రస్తుతం యూత్ ఫాలో అవుతున్న రీల్స్, టకా టక్, జోష్, మోజో, చింగారీ వంటితదితర యాప్స్ యూత్ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ సిద్ధార్థ్ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు డైరెక్టర్. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్ కుమార్ తివారీ. సిరీస్లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. ఇక ఎస్కేప్ లైవ్ యాప్ కాంటెస్ట్ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్ ఎదుగుదల కోసం కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్ లైఫ్లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్ 5) కొద్దిగా బోర్ కొట్టిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. ఎవరెలా చేశారంటే? సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్ క్యారెక్టర్ డెప్త్ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్ బాయ్ఫ్రెండ్ విషయంలో సిద్ధార్థ్ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్ గర్ల్ (ప్లబితా), ఆమ్చా స్పైడర్ (రిత్విక్ సాహోర్), రాజ్ కుమార్ రోహిత్ చందేల్ నటన సూపర్బ్గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్లు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సైకో వ్యక్తిగా డార్క్ ఏంజిల్ పాత్రలో సుమేధ్ ముద్గాల్కర్ అదరగొట్టాడు. సిరీస్కు అతడి యాక్టింగ్ హైలెట్ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్లో కృష్ణుడిగా సుమేధ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్ కూడా సిద్ధార్థ్ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్ ఆఫిసర్గా ఆకాంక్ష సింగ్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్గా సిరీస్ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
‘కేజీయఫ్’ను పాన్ ఇండియా అంటుంటే ఫన్నీగా ఉంది: సిద్ధార్థ్
Siddharth Shocking Comments On KGF 2, Pan India: కేజీయఫ్ 2 మూవీని పాన్ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఎస్కేప్ లైవ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా కేజీయఫ్2 సక్సెస్, ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఆ సీన్స్తో మళ్లీ రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ! ఈ మేరకు సిద్ధార్థ్ మాట్టాడుతూ.. ‘పాన్ ఇండియా.. ఈ పదం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్గా, టాలీవుడ్లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్కు కూడా. అయితే, నా వరకు వాటిని ఇండియన్ సినిమాలు అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఈ వ్యాఖ్యలు ఎవరిని ఇబ్బంది పెట్టడాలని అనడం లేదన్నాడు. ‘పరిశ్రమలో అధిక ప్రాధాన్యత ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఓ హిందీ సినిమా అత్యధిక ప్రేక్షాకదరణ పొందితే దానిని హిందీ సినిమా అనే అంటారు. కానీ, ప్రాంతీయ సినిమాలకు విషయానికి వస్తే అలా ఎందుకు ఉండదు. ప్రాంతీయ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభించి, భారీ విజయం సాధిస్తే వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అనొచ్చు కదా. లేదా కేజీయఫ్ జర్నిని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు. చదవండి: తెలుగు ఫిలిం చాంబర్పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు లేదా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సినిమా అని పిలవచ్చు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ ఫిలిం అని చెప్పండి. పాన్ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది’ అంటూ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో కూడా సిద్ధార్థ్ పాన్ ఇండియా పదంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారని, అలా అయితే 15 ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారని వ్యాఖ్యానించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆరోజు యాక్టింగ్ను వదిలేస్తా : హీరో సిద్దార్థ్
లవర్ బాయ్ ఇమేజ్తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్. చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్సిరీస్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'ఈ సిరీస్లో నాది రెగ్యులర్ రోల్ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్కు తిరిగొస్తా. ఢిపరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా' అని సిద్దార్థ్ పేర్కొన్నాడు. -
ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar: టాలీవుడ్లో లవర్ బాయ్గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు. ఈ హీరో తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్తో సందడి చేయనున్నాడు. ఈ వెబ్ సిరీస్కు సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ డిస్లీ ప్లస్ హాట్స్టార్లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 'పోటీ చేస్తున్న అమ్మాయిలకు వజ్రాలు బెస్ట్ ఫ్రెండ్స్. మరీ ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు ?' అని ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్, డైరెక్టర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ 'కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్పై పని చేస్తున్నాను. తివారితో కలిసి పనిచేయడం నటుడిగా అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ప్రేరణ పొందాను. తివారితో స్క్రిప్ట్, పాత్రల అభివృద్ధి గురించి జరిపిన చర్చలు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. నేను ఏం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను. ఆయన ఆశించిన దానికి నేను ఇంకా ఏం ఇవ్వాలి అని నేను అనుకునేవాన్ని. నేను అనుకున్నదంతా చేయగలనని తివారి నన్ను నమ్మారు.' అని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఒక యాప్లో నిర్వహించే పోటీ ఆధారంగా తెరకెక్కించిన కల్పిత కథ అని సమాచారం. చదవండి: భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా ! Diamonds are a g̶i̶r̶l̶'̶s̶ contestant's best friend! 💎💎 Who do you think will win?#HotstarSpecials #EscaypeLive all episodes streaming from May 20. Created and directed by Siddharth Kumar Tewary @sktorigins pic.twitter.com/vC2JZsuS88 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పాన్ ఇండియా అన్నది నాన్సెన్స్ : హీరో సిద్దార్థ్
ఈమధ్య కాలంలో చిత్ర పరిశ్రలో పాన్ ఇండియా అన్న పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పాన్ ఇండియా పదంతో అటు నార్త్ వర్సెస్ సౌత్ హీరోలకు మాటల యుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై హీరో సిద్దార్థ్ స్పందించాడు. పాన్ ఇండియా అన్నది అగౌరవకరమైనది, అదో నాన్సెన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారు? 15ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. రీసెంట్గా నా స్నేహితులు కేజీఎఫ్ సినిమా తీశారు. వాళ్లను చూసి గర్వపడుతున్నాను. సినిమాను నచ్చిన భాషలో చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుంది. అందుకే పాన్ ఇండియా అన్న పదం తీసేసి ఇండియన్ సినిమా అని పేరు పెట్టాలి. లేదా ఏ భాషలో తీస్తే ఆ భాషతోనే పిలవాలి. ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా,ఏ భాషలో అయినా హిట్ అవుతుంది.దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు' అంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం సిద్దార్థ్ చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. -
నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేసిన హీరో సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ చిన్న గ్యాప్ తర్వాత రీచార్జ్ అవుతున్నారు. బహుభాషా నటుడైన ఈయన ఇటకీ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇంతకుముందు కాదల్ సొదప్పువదు ఎప్పడీ, జిల్ జంగ్ జక్, అవళ్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ నిర్మిస్తున్న 4వ చిత్రం ఇది. ఎస్యూ అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈయన ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా పన్నైయూరుమ్ పద్మినియుమ్, సేతుపతి మంత్రి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా పేరు నిర్ణయించలేదు ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లు సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ అద్భుతమైన క్లాసికల్ కథ కుదిరిందని, చిత్రం షూటింగ్ తమిళనాడులోని పళనిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
2022లో ప్రకటనల వ్యయాలు...
ముంబై: ప్రకటనల వ్యయాల విషయంలో 2022 భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించనుందని గ్రూప్ఎమ్ ఇండియా ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రైసింగ్) సిద్ధార్థ్ పరాశర్ పేర్కొన్నారు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2022లో భారత్ మొత్తం ప్రకటనల వ్యయం 22 శాతం వృద్ధితో రూ.1,07,987 కోట్లకు చేరుతుందని పేర్కొంటూ అంతర్జాతీయ ప్రముఖ మీడియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గ్రూప్ఎమ్ తన ‘ దిస్ ఇయర్, నెక్ట్స్ ఇయర్’ 2022 (టీవైఎన్వై) ప్రకటనల వ్యయ (యాడెక్స్) అంచనాల నివేదికను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టెలివిజన్ను అధిగమించి డిజిటల్ విభాగం అతిపెద్ద మాధ్యమంగా అవతరించనుందని కూడా నివేదిక పేర్కొంది. ఆయా అంశాలపై సిద్ధార్థ్ పరాశర్ వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ రంగం పురోగమిస్తున్నప్పటికీ, కరోనా కష్టకాలం తర్వాత ఓఓహెచ్ (అవుట్ ఆఫ్ హోమ్) అడ్వర్టైజింగ్, సినిమా విభాగాలు కూడా పురోగమిస్తాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇ–కామర్స్పై ప్రకటనలు, ఓటీటీ, షార్ట్ ఫార్మేట్ వీడియోల రంగాల్లో 2021లో చోటుచేసుకున్న వృద్ధి 2022లో కూడా కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బ్రాండ్స్ విషయంలో వినియోగదారు దృష్టి సారించే విధానాలపై మహమ్మారి పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. బ్రాండ్స్ తమ మార్కెట్ నమూనాలను ఆధునికీరించుకోడానికి ఆయా అంశాలు దోహదపడుతున్నట్లు తెలిపారు. దీనితోపాటు వివిధ మాధ్యమాలు పలు ఉత్పత్తులకు విస్తృత వినియోగ మార్కెట్ను సృష్టిస్తున్నట్లు విశ్లేషించారు. -
ట్వీట్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో సిద్ధార్ధ్
-
హీరో సిద్ధార్థ్పై కేసు నమోదు..
భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సైనా నెహ్వాల్కు క్షమాపణలు చెబుతూ సిద్ధార్థ్ రాసిన బహిరంగ లేఖలో 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా. నువ్ నాకు ఎప్పుడూ ఛాంపియన్గా ఉంటావు సైనా' అని రాసుకొచ్చాడు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, దూమరం రేపుతోన్న సిద్ధార్థ్ ట్వీట్ -
Saina Nehwal: సిద్దార్థ క్షమాపణపై స్పందించిన సైనా.. ఎందుకు వైరల్ అవుతుందో..
సినీ నటుడు సిద్దార్థ తనకు క్షమాపణ చెప్పడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ స్పందించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమని, అయితే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఏదేమైనా సిద్దార్థను ఆ దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మన దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయగా తీవ్ర దుమారం రేగింది. జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సైనా తండ్రి హర్వీర్ సింగ్, భర్త పారుపల్లి కశ్యప్ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. ఈ నేపథ్యంలో సైనా పేరు ట్విటర్లో మారుమోగిపోయింది. సిద్ధార్థ వ్యవహార శైలిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన అతడు... సైనాను క్షమాపణ కోరుతూ సుదీర్ఘ లేఖ రాశాడు. ‘‘నువ్వు ఎల్లప్పటికీ నా చాంపియన్వే’’ అని ట్వీట్ చేశాడు. తాజాగా ఈ లేఖపై స్పందించిన సైనా.. టైమ్స్ నౌతో మాట్లాడుతూ... ‘‘మంచిది.. ఇప్పటికైనా అతడు క్షమాపణ కోరాడు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. నిజానికి నా పేరు ట్విటర్లో ట్రెండ్ అవడం చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే అతడు నా గురించి ఏం రాశాడో తెలిసింది. అతడితో నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడింది లేదు. ఏదేమైనా ఆ దేవుడి ఆశీసులు అతడికి ఉండాలి’’ అని హుందాతనాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో.. ఈ వివాదం ఇప్పటికైనా ముగిసిపోతుందా లేదా అన్న అంశం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కాగా పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సైనాను భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించిన విషయం విదితమే. చదవండి: SA vs IND: జస్ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్! Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
సైనా నెహ్వాల్కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ
Siddharth Apologises To Saina Nehwal For Rude Joke In Open Letter: భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు వస్తుండటంతో సిద్ధార్థ్ తప్పు తెలుసుకున్నాడు. సైనా నెహ్వాల్కు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశాడు. 'డియర్ సైనా.. నా ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్కి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని కించపరిచాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. మిమ్మల్ని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదు. నేను ఒక జోక్ వేశాను. అది తప్పుగా చేరింది. ఆ విషయంలో సారీ. నా ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారు. మహిళలు అంటే నాకు ఎంతో గౌరవం. నా ట్వీట్లో జెండర్కు సంబంధించిన విషయాలేవీ లేవు. నా క్షమాపణలు అంగీకరిస్తావని కోరుకుంటున్నా' అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు నువ్వు ఎప్పుడూ నా చాంపియన్గా ఉంటావు సైనా.. అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై.. 'దేశ ప్రధానికే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిణామాల్ని ఖండిస్తున్నా' అంటూ సైనా ట్వీట్ చేయగా.. దీనిపై హీరో సిద్ధార్థ్ వ్యంగంగా బదులిస్తూ..'ఓ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్' అంటూ సైనాపై అభ్యంతరకర రీతిలో సిద్ధార్థ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY — Siddharth (@Actor_Siddharth) January 11, 2022 -
హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన సైనా భర్త కశ్యప్
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనాను ఉద్దేశిస్తూ సిద్దార్థ్ చేసిన ట్వీట్పై సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ని పంజాబ్లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండిస్తూ ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ఈ ఘటనను తాను ఖండిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ ఆమె ట్వీట్పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్… థాంక్ గాడ్ వి హ్యావ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ #Rihanna’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్ రచ్చకు దారి తీసింది. ఇప్పటికే సిద్ధార్థ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వెంటనే అతడి ట్వీట్ తొలిగించాలంటూ జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. సైనా తండ్రి కూడా సిద్ధార్థ్ ట్వీట్పై స్పందిస్తూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా సైనా భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సోమవారం ట్విట్టర్లో సిద్ధార్థ్ ట్వీట్పై అసహనం వ్యక్తం చేశాడు. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful @Actor_Siddharth — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 చదవండి: Salmana Khan-Samantha Lockwood: సల్మాన్తో సీక్రెట్ డేటింగ్పై నటి సమంత క్లారిటీ సిద్ధార్థ్ను ట్యాగ్ చేస్తూ ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. కానీ కాస్తా మంచి పదాలు ఎంచుకోండి. ఈ రితీలో మీ అభిప్రాయాన్ని చెప్పడం చాలా హర్టింగ్గా అనిపించింది. మీరు ఇవి కూల్ వర్డ్స్ అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు’ అంటూ సిద్ధార్థ్కు కశ్యప్ చురకలు అంటించాడు. అలాగే సైనా నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఓ మీడియా ఇంటర్య్వూలో స్పందిస్తూ.. ‘అతడు ఏం చెప్పాడో ఖచ్చితంగా నాకు తెలియదు. నేను ఒక నటుడిగా అతడిని ఇష్టపడతాను. కానీ ఇది మంచిది కాదు. ఆయన మంచి పదాలతో తన భావాలను వ్యక్తపరుస్తాడని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. This is upsetting for us … express ur opinion but choose better words man . I guess u thought it was cool to say it this way . #notcool #disgraceful — Parupalli Kashyap (@parupallik) January 10, 2022 -
Saina Nehwal: హీరో సిద్ధార్థపై సైనా తండ్రి సంచలన వ్యాఖ్యలు...
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ హీరో సిద్దార్థకు కౌంటర్ ఇచ్చారు. తన కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచిందని.. అతడు ఏం చేశాడని ప్రశ్నించారు. కాగా పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ‘‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం సేఫ్గా ఉన్నామని ఎలా చెప్పుకోగలం. ఆటంకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన సిద్ధార్థ చిన్న కాక్తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే అంటూ అభ్యంతరకర రీతిలో కామెంట్ చేశాడు. ఇందుకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌతో మాట్లాడిన సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్... ‘‘నా కూతురిని ఉద్దేశించి అతడు అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది’’ అని సిద్ధార్థ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారత సమాజం గొప్ప విలువలు కలిగినది. జర్నలిస్టులు, క్రీడా ప్రముఖులు సైనాకు మద్దతుగా నిలిచారు. తను ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో వాళ్లకు తెలుసు కాబట్టే.. తన విలువను గుర్తించారు’’ అని హర్వీర్ భావోద్వేగానికి గురయ్యారు. జాతీయ మహిళా కమిషన్ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒలింపియన్పైన ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. కాగా పలు ప్రతిష్టాత్మక టోర్నీలతో పాటు 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. Subtle cock champion of the world... Thank God we have protectors of India. 🙏🏽 Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz — Siddharth (@Actor_Siddharth) January 6, 2022 -
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి, ఇది మూర్ఖత్వమంటూ తీవ్ర వ్యాఖ్యలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అంతేగాక సిద్ధార్థ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ తీవ్ర రచ్చకు దారి తీసింది. తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్ వ్యాఖ్యలను తప్పబట్టింది. చదవండి: సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, నటుడిపై మహిళా కమిషన్ ఫైర్ ‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామంటూ చిన్మయి పిలుపునిచ్చింది. -
మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ
NCW Writes to DGP Maharashtra to Take Action Against Actor Siddharth: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్ను డిమాండ్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ని పంజాబ్లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండించింది. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ప్రధానిపైనే దాడి యత్నం జరిగితే ఆ దేశం భద్రంగా ఉన్నట్టు ఎలా భావించగలం’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్... దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి. సిద్ధార్థ్ ట్వీట్ సైనాను అవమానించే రీతిలో ఉందంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఓ స్త్రీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, స్త్రీద్వేషంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని పేర్కొంది. నటుడు సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరిస్తున్నామని కమిషన్ వెల్లడించింది. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించారని ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఓ మహిళపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడం పట్ల సిద్ధార్థ్ను కఠినంగా శిక్షించాలని కోరింది. చదవండి: ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై చైర్మన్ రేఖా శర్మ ట్విట్టర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికి కూడా లేఖ రాసినట్టు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. సైనా నెహ్వాల్పై సిద్ధార్థ్ చేసిన ట్వీట్ను నిలిపివేయాలని, అంతేగాక అతడి ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సింది ఆమె కోరినట్టు కమిషన్ వెల్లడించింది. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలను వేరే అర్థంలో తీసుకుని తప్పుగా భావిస్తున్నారంటూ సిద్ధార్థ్ మరో ట్వీట్లో వివరణ ఇచ్చాడు. 'కాక్ అండ్ బుల్' అని కూడా పేర్కొంటుంటామని, అయితే దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం అని తెలిపాడు. ఎవరినీ అవమానపర్చాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. Subtle cock champion of the world... Thank God we have protectors of India. 🙏🏽 Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz — Siddharth (@Actor_Siddharth) January 6, 2022 -
నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సామాన్య ప్రజలందరికీ వినోదం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమా టికెట్ల రేట్లను పరిశీలించేందుకు హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిందని వెల్లడించారు. ఈ కమిటీ త్వరలో సమావేశమై అందరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని టికెట్ రేట్లను నిర్ణయిస్తుందన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో సినిమా పంపిణీదారుల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. రెండు నెలల క్రితం సినీ పరిశ్రమ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలతో జరిగిన సమావేశంలో థియేటర్ల లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ పొందాలని సూచించినప్పటికీ అలసత్వం వహించారన్నారు. ఇప్పడు థియేటర్లలో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది జిల్లాల్లో 83 థియేటర్లను సీజ్ చేయగా, 25 సినిమా హాళ్లకు జరిమానా విధించినట్టు చెప్పారు. మరో 22 థియేటర్లకు లైసెన్సులు లేకపోవడంతో యజమానులే వాటిని మూసివేశారన్నారు. చదవండి: (ఏం మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతలకు సిగ్గుందా?) సినిమాల మధ్య వ్యత్యాసం చూడం ‘ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకుంటుంది. వ్యక్తులను బట్టి వ్యత్యాసం చూపించదు. గతంలో అయితే చారిత్రాత్మక సినిమా అంటూ బామ్మర్ది తీసిన సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. చిరంజీవి అడిగితే ఇవ్వలేదు’ అంటూ పెద్ద సినిమాలకు మినహాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాని సమాధానమిచ్చారు. హైకోర్టు సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ల ద్వారా అవసరం అయితే టికెట్ రేట్లను పెంచుకుంటారన్నారు. ‘సినీ నటుడు నాని ఏ థియేటర్ పక్కన కిరాణా షాపు కౌంటర్ను లెక్కించారో నాకు తెలీదు. హీరో సిద్ధార్థ తమిళనాడులో ఉంటూ అక్కడే ట్యాక్సు కడుతున్నారు. బహుశ ఆయన స్టాలిన్ ప్రభుత్వంలోని మంత్రుల విలాసాల గురించి మాట్లాడి ఉంటారు’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలోని సినిమా పంపిణీదారుల సంఘాల ప్రతినిధులు కార్పొరేషన్ పరిధిలోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.150, లోయర్ రూ.50, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, ఇతర ప్రాంతాల్లోని ఏసీ థియేటర్లలో హయర్ రూ.100, లోయర్ రూ.40, నాన్ ఏసీ థియేటర్లలో హయర్ రూ.80, లోయర్ రూ.30గా టికెట్ రేట్లు పెట్టాలని కోరారు. దీంతోపాటు థియేటర్ల లైసెన్సుల రెన్యువల్కు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్రెడ్డి, రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.విజయమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (వివక్ష లేదు.. లంచాలకు తావులేదు: సీఎం జగన్) -
నిజాయితీ లేని పాన్ ఇండియా..: సిద్దార్థ్ అసహనం
Siddharth: పాన్ ఇండియా సినిమాల కలెక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు హీరో సిద్దార్థ్. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ మండిపడ్డాడు. నిర్మాతలు కొన్నాళ్లుగా వసూళ్ల విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడ్, మీడియా కూడా ఈ అబద్ధపు లెక్కలనే అధికారికంగా ప్రకటిస్తోంది. అన్ని చలనచిత్ర పరిశ్రమల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఇంతకీ ఇలా అబద్ధపు రిపోర్టులు ఇవ్వడానికి ఎంత కమీషన్ తీసుకుంటున్నారేంటి? అని ట్విటర్లో మండిపడ్డాడు. పాన్ ఇండియా సినిమాలకు నిజాయితీ లేకుండా పోయిందంటూ దుమ్మెత్తిపోశాడు. ఎంత ఇష్టమైన సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూసేంత ఓపిక తనకు లేదన్న సిద్దార్థ్ దర్శకులు కొత్త కథల్ని తెరకెక్కించాలని కోరారు. ఇంతకీ ఈయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా సిద్దార్థ్ తెలుగులో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, ఆట, బొమ్మరిల్లు, ఓ మై ఫ్రెండ్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. చాలాకాలం విరామం తర్వాత మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. How much is the going commission or rate these days for fudging collection reports of films? Producers have been lying about BO figures for ages... Now the "trade" and "media" have started their "official" figures... All languages, all industries...same. Pan India dishonesty🤦🏾 — Siddharth (@Actor_Siddharth) December 22, 2021 -
ఫ్యాన్స్ కూడా కాటేస్తారు.. సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్, కారణం సమంత?
'Stop Paying For Love And Hate' Is Siddharth Tweet About Samantha? నాగచైతన్యతో విడాకుల తర్వాత ప్రతి రోజు ఏదో ఒకరకంగా సమంత వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి టాపిక్ ఇప్పటి ట్రెండింగ్లో ఉంటుంది. వీరి విడిపోయి రెండు నెలలు గడుస్తున్నా.. జనాల్లో మాత్రం ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది. సోషల్ మీడియాలో సమంత ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. దానిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేయడం, తను ఏ పోస్ట్ పెట్టినా.. విడాకులతో లింక్ పెడుతూ.. ట్రోల్ చేయడంతో చై-సామ్ల టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. ఇక ఇటీవల సమంత విడాకులపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తన భవిష్యత్తుపై తనకు ఆశలు లేవని చెప్పుకొచ్చింది. అలాగే నెటిజన్స్ ట్రోలింగ్పై స్పందిస్తూ... ‘ సోషల్ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గరగా చేస్తుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వారు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వారందరినీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. అని సామ్ అభ్యర్థిచింది. ఇదిలా ఉంటే.. సమంత కామెంట్పై సిద్దార్థ్ పరోక్షంగా కౌంటర్ వేసినట్లు తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. ‘నేటి విషపూరిత సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడం కోసం, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ దానంతట అదే జరిగే అవకాశం లేదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవాలి. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతను ఉద్దేశించే ఈ ట్వీట్ చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సమంత, చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించినప్పుడు కూడా సిద్దార్థ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.‘మోసం చేసిన వారు ఎప్పటికీ బాగు పడలేరు.. స్కూల్లో టీచర్లు నేర్పిన పాఠం అదే’ అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. -
ఓటీటీలోకి ‘మహా సముద్రం’
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. చాలా గ్యాప్ తర్వాత ‘మహా సముద్రం’ చిత్రంతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్కు తండ్రి నుంచి విముక్తి దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడంతో, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్నో ఆశలతో థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులను ఈ మూవీ కాస్తా నిరాశ పరిచిందన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లీక్స్లో మహా సముంద్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రావు రమేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. -
11 ఏళ్లకే గడ్డం ఇవ్వమని రోజు దేవుడికి మొక్కుకునే వాడిని: సిద్ధార్థ్
Hero Siddharth About Sharwandh: శర్వానంద్ గడ్డం చూసినప్పుడల్లా అసూయగా ఉంటుందంటూ హీరో సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరు నటించిన మహా సముంద్రం మూవీ విడుదలైన అనంతరం శర్వానంద్తో కలిసి సిద్ధార్థ్ సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నాడు. ఈ సందర్భంగా తను తన తండ్రి పోలికా అని ఆయనలాగే చాలా ఏళ్లకు గాని తనకు గడ్డం రాలేదన్నారు. చదవండి: ‘నా బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్జెండర్.. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను’ ఢిల్లీలో చదువుతున్నపుడు తనకు 11 ఏళ్లని, అప్పుడే తన స్నేహితులకు పెద్ద పెద్ద గడ్డం ఉండేదని చెప్పాడు. దీంతో తనకు కూడా గడ్డం ఇవ్వమని రోజు దేవుడికి మొక్కుకునే వాడినంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటికీ తనకు అంత గడ్డం పెరగలేదంటూ సిద్ధార్థ్ విచారన వ్యక్తం చేశాడు. అందుకే శర్వానంద్ గడ్డం చూపినప్పుడల్లా తను జలస్ అవుతుంటానని పేర్కొన్నాడు. అలాగే శర్వా నటన అంటే ఇష్టమని, ముఖ్యంగా తన గొంతు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. పరిశ్రమలో వారిద్దరూ మంచి స్నేహితులమన్నాడు. ఇక మహా సముంద్రం మూవీతో వారి మధ్య సన్నిహితం మరింత పెరిగిందని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. చదవండి: బోల్డ్ సీన్స్పై ప్రశ్నించిన రిపోర్టర్, పెళ్లి తర్వాత మీరేం చేస్తారన్న హీరోయిన్ -
‘మహా సముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్ : మహా సముద్రం జానర్ : యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, జగపతిబాబు, రామ చంద్ర రాజు తదితరుల నిర్మాణ సంస్థ : ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సుంకర రామబ్రహ్మం దర్శకత్వం : అజయ్ భూపతి సంగీతం : చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రాజ్ తోట ఎడిటింగ్: ప్రవీణ్ విడుదల తేది : అక్టోబర్ 14, 2021 ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతోఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే వైజాగ్ నగరానికి చెందిన అర్జున్(శర్వానంద్), విజయ్(సిద్ధార్థ్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అర్జున్ ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి ప్రయత్నించగా, విజయ్ మాత్రం పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్ లైఫ్లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్ స్మిత(అను ఇమ్మాన్యుయేల్). కట్ చేస్తే.. వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్ వైజాగ్ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతని ఆచూకీ కోసం అర్జున్ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్ తిరిగి మళ్లీ వైజాగ్కు వస్తాడు. అప్పటికీ అర్జున్ డ్రగ్స్ మాఫియా డాన్గా ఎదుగుతాడు. అసలు విజయ్ వైజాగ్ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్ చేయాలనుకునే అర్జున్ స్మగ్లింగ్, డ్రగ్స్ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్, విజయ్ శత్రువులుగా ఎలా మారారు? విజయ్ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్ ఎలా తోడుగా నిలిచాడు?అనేదే మిగిలి కథ. ఎవరెలా చేశారంటే... అర్జున్గా శర్వానంద్, విజయ్గా సిద్ధార్థ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శర్వానంద్ కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నిజాయితీగా ఉన్న వ్యక్తి అనుకోకుండా అక్రమ వ్యాపారాలు చెయ్యడం, స్నేహితుడి ప్రియురాలిని సొంత మనిషిలా చూసుకోవడం. అతని కూతురి ఆలనా పాలనా చూడడం. చివరకు తన ప్రేమను కూడా వదులుకోవడం.. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న విజయ్గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.చాలా రోజుల తర్వాత కొత్త సిద్దార్థ్ను చూస్తున్నామన్న ఫీల్ కలిగించాడు. ఇక ఈ మూవీలో చాలా ప్రాధాన్యత ఉన్న మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. లా స్టూడెంట్గా అను ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపించింది. శర్వా, సిద్ధూల తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్రలు.. జగపతి బాబు, రావు రమేశ్లవి. చుంచూ మామ పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్లో రావు రమేశ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్ ధనుంజయ్గా రామచంద్ర రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. రెండో సినిమాకే భారీ కథను, అందుకు తగ్గట్లు హెవీ స్టార్ కాస్టింగ్ను సెలెక్ట్ చేసుకున్నాడు. క్యారెక్టర్స్ తో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. ఫస్టాఫ్లో ఎక్కువగా పాత్రల పరిచయానికే సమయం కేటాయించాడు. గూని బాబ్జీగా రావు రమేశ్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు తీసుస్తుంది. ఫస్టాఫ్ అంత సోసోగా నడిపించిన డైరెక్టర్.. ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైంకి తీసుకొచ్చి, ఓ ఫైట్ సీన్తో సెకండాఫ్పై అంచనాలు పెరిగేలా చేశాడు. కానీ సెకండాఫ్ ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది. అలా అని మరీ బోర్ ఏమి కొట్టదు కానీ ఇంటర్వెల్ వరకు ఉన్న కిక్ మాత్రం తగ్గుతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఎమోషన్స్ తెరపై అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ తో యాక్షన్స్ సీన్స్కి ప్రాణం పోశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్గా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
మహా సముద్రం ట్విటర్ రివ్యూ
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. ఈ మూవీ ఫస్టాఫ్ బాగానే ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అజయ్ భూపతి చెప్పినట్లుగానే చేతన్ భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ యాక్షన్, రొమాన్స్ లు కనిపించాయి. అలాగే మెయిన్ లీడ్ నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా బాగుందని చెబుతున్నారు. #MahaSamudram Decent 1st Half 👍 Starts slow but picks up towards interval. Interval BGM 👌🔥 — Venky Reviews (@venkyreviews) October 14, 2021 సినిమా స్లోగా ప్రారంభమైనప్పటికీ... ఇంటర్వెల్ వచ్చేసరికి మంచి జోష్తో పికప్ అయింది. ఇంటర్వెల్ సీన్ మూవీకి హైలెట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Average 1st Half !! With good Interval Plot Music & Bgm 👌 #MahaSamudram https://t.co/AfwmBpIaS2 — InsideTalkz (@InsideTallkz) October 14, 2021 Best part of #MahaSamudram is the interval break time! Much needed break from movie 1st half, gearing up for second half🔥🔥🔥 — Aneesh (@aneesh2303) October 14, 2021 #MahaSamudram meru iche publicity ki a content ki aslu sambandam unda …first half 🤦♂️ Interval fight 👍 — vijay (@movie_devotee) October 14, 2021 #MahaSamudram has spellbound performances from almost all the characters but with slow paced screenplay. May end up with commercial HIT status pic.twitter.com/VKtohEUwa1 — ₳ ₭ (@itsmeGAK) October 14, 2021 Welcome back @Actor_Siddharth annayya😁😍❤️#MahaSamudram pic.twitter.com/7D7acKUvtR — _Nen_inthe_ (@GowriSh82126401) October 14, 2021 JB and Rao Ramesh giving great performances 👌 #MahaSamudram — Venky Reviews (@venkyreviews) October 14, 2021 -
Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు
‘‘సినిమాలు విడదలైనప్పుడు యాక్టర్స్కు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా? అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో నాకో కొత్త ఇమేజ్ని క్రియేట్ చేశాడు’’ అన్నారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో అతిదీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘అర్జున్ పాత్రలో శర్వా, విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వా జ్వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ‘మహాసముద్రం’ ఒక అద్భుతమైన సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా’’ అని అన్నారు. ‘‘కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు. కథే హీరోలను వెతుక్కుంటుందంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్ల దగ్గర ఆగింది. మన స్నేహితుడు మంచోడైనా, చెడ్డోడైనా వదలొద్దన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఫీమెల్ సెంట్రిక్ కథల్లో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’’ అన్నారు అదితీరావ్ హైదరీ. ‘‘ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అజయ్ భూపతికి ఉన్న నమ్మకం ఇప్పుడు మా అందరిలోనూ ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. -
లవర్బాయ్గా ఆది పినిశెట్టి, అది భ్రమ అంటున్న అనుపమ
► నన్ను ఎప్పుడైన దగ్గరగా చూడాలనుకుంటున్నారా? అంటూ క్లోజ్ ఫొటో షేర్ చేసిన అషురెడ్డి ► కర్తవ్యాన్ని పూర్తి చేసింది అంటూ సెల్ఫీ ఫొటో షేర్ చేసిన పూనమ్ కౌర్ ► శర్వానంద్, ఆదిత్య రాయ్లతో కలిసి ఫొటో దిగిన సిద్ధార్థ్, మహా సముంద్రం టీం కలిసినప్పుడు అంతే అంటున్నా హీరో ► లవర్ బాయ్గా సర్టిఫై అయ్యానంటున్న ఆది పినిశెట్టి ► పెర్ఫెక్ట్గా ఉండమంటే ఒక భ్రమే అంటున్నా అనుపమా పరమేశ్వరన్ ► చీరకట్టులో మైమరిపిస్తున్న శ్రద్ధదాస్ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Aadhi (@aadhiofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
‘‘నాకు చాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్లా సెట్కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్ వర్కింగ్.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్ ప్రాక్టీస్ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్–బృందా మాస్టర్తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు. -
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్ను థియేటర్స్కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్గారు. సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాధపడితే నాకేం సంబంధం?.. ‘చీటర్స్’ ట్వీట్పై సిద్ధార్థ్ స్పందన
నాగ చైతన్య-సమంత విడాకులు ప్రకటించిన రోజు హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న చై-సామ్ విడాకులు తీసుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వెంటనే...‘మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే…. మరి మీరేం నేర్చుకున్నారు’అని నెటిజన్లను ప్రశ్నిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు ఆయన సమంత గురించే అన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. (చదవండి: సమంత తల్లి కావాలనుకుంది కానీ.. సంచలన నిజాలు వెల్లడించిన నీలిమ) One of the first lessons I learnt from a teacher in school... "Cheaters never prosper." What's yours? — Siddharth (@Actor_Siddharth) October 2, 2021 తాజాగా ఆ ట్వీట్పై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తనకు ‘మహాసముద్రం’ దర్శకుడు అజయ్ భూపతికి మాటల మధ్యలో వచ్చిన అంశంపై తన చిన్నప్పుడు నేర్చుకున్న లెసన్ని జోడిస్తూ ట్వీట్ చేశానని సిద్ధార్థ్ చెప్పాడు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనన్నారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం అని సిద్ధార్థ్ ప్రశ్నించారు. నా లైఫ్ గురించి నేను మాట్లాడుతానని, వేరే వాళ్లతో సంబంధమే లేదని సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. -
అది చిన్న గాయమే, సర్జరీలాంటిదేమీ లేదు: హీరో సిద్దార్థ్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో సిద్దార్థ్ మీడియాతో ముచ్చటించారు. సిద్దార్థ్ ఏమన్నాడో ఆయన మాటల్లోనే.. ► మహా సముద్రం క్లైమాక్స్ షూట్లో చిన్న గాయమైంది. దానికే అజయ్ భూపతి సర్జరీ అని చెప్పేశాడు. దీంతో మా అమ్మానాన్నలు తెగ కంగారు పడిపోయి.. ఫోన్లు చేశారు. ఆ వెంటనే అజయ్ భూపతికి ఫోన్ చేసి అలా చెప్పావ్ ఏంటి? అని అడిగాను. మీరే కదా ట్రీట్మెంట్ అని చెప్పారు అని అన్నాడు. ట్రీట్మెంట్కు, సర్జరీకి చాలా తేడా ఉందని అన్నాను. అది చిన్న గాయం మాత్రమే సర్జరీలాంటిదేమీ జరగలేదు. ► అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. ఎంత పర్ఫెక్షన్తో తీశాడో.. రామ్ గోపాల్ వర్మ శిష్యుడనిపించుకున్నాడు. అతడు మహాసముద్రం కథ చెబితుంటే.. రెండో సినిమా దర్శకుడిలా అనిపించలేదు. వెంటనే ఓకే చెప్పాను. ఇది ట్రెండ్ సెట్టర్ సినిమా. శర్వానంద్ అద్భుతమైన నటుడు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నామంటే ఎవరికి తగిన కారణాలు వారికి ఉంటాయి. నేను, శర్వాతో ఒక్కసారి చర్చలు కూడా పెట్టుకోలేదు. మాకు స్క్రిప్ట్ మీద అంత నమ్మకం ఉంది. అజయ్ భూపతి ట్రైలర్ను అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్ బాగుంది కానీ కథ ఏంటి అర్థం కావడం లేదు అని చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. అదే మా సక్సెస్. ► ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు సిద్దు అంటే చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనే ఇమేజ్ ఇచ్చారు. కానీ ఈ సినిమాతో కొత్త రకమైన ఇమేజ్ వస్తుంది. 2003లో బాయ్స్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. మధ్యలో వచ్చింది బ్రేక్లాంటిది కాదు. కానీ నాలో నేను వెతుక్కునే క్రమంలో బ్రేక్ వచ్చింది. నన్ను స్టార్ను చేసింది తెలుగు వాళ్లే. అయితే ప్రతీ భాషల్లో నాకు ఓ ఐకానిక్ చిత్రం ఉంది. తమిళంలో బాయ్స్, హిందీలో రంగ్ దే బసంతి ఇలా ఉన్నాయి. అయితే నేను ప్రతీ చోటా తెలుగు నటుడిని అని చెప్పుకునేవాడిని. దాంతో అక్కడి వారు హర్ట్ అయ్యేవారు. కానీ నేను తెలుగు స్టార్ని, ఇండియన్ నటుడిని. అందుకే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాను. ఇకపై తెలుగు ప్రేక్షకులను వదిలిపెట్టి వెళ్లను. ► నేను బయటి నుంచి వచ్చాను. అలా బయటి నుంచి వచ్చిన వారి కోసం నేను ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. కొత్త వారిని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. తెలుగులో కూడా కొంత మంది యంగ్ దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాను. ఎంబీఏ చదివి మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను. శంకర్ గారి సినిమాతో హీరో అయ్యాను. అయితే నేను సంపాదించిన వాటిల్లోంచి నిర్మించాను. నేను నిర్మించిన ప్రతీ ఒక్కటి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. అలా ప్రాఫిట్ రాకపోతే మా నాన్న కూడా ఊరుకోరు. ► నేను ‘మా’లో లైఫ్ టైం మెంబర్ను. ఆహూతి గారు ఉన్న సమయంలోనే మెంబర్షిప్ తీసుకున్నాను. ‘మా’ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తున్నాను. అన్నీ కూడా ఫాలో అవుతున్నాను. నేను కచ్చితంగా అందరి మాటలు విని.. నా మనసులో ఏమనిపిస్తుందో.. వారికే ఓటు వేస్తాను. ఎప్పుడూ నిజం మాట్లాడాలి. నిజాయితీగా ఉండాలని అనుకుంటాను. దాని వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవాలి. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. రాజకీయాల్లోకి రాను అని చెప్పను. కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. -
‘మహాసముద్రం’లోని ట్విస్ట్లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్
ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. వివరాలిలా.. ► ఎంతో ఇన్టెన్సిటీ ఉన్న ఎమోషనల్ లవ్స్టోరీ ‘మహా సముద్రం’. ఈ చిత్రం చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్లారు. చివరి 40 నిమిషాలు సినిమా ఎంతో ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. ► అమాయకంగా ఉండే మనుషుల జీవితాల్లో వచ్చే మార్పుల సమాహారమే ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఛాలెంజింగ్గా అనిపించింది. అందరి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది. ► మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. ► ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్లు మహాసముద్రంలో ఉంటాయి. అంటే దాదాపు ఐదారు ఉంటాయి. అవి ప్రేక్షకుల అంచనాలకు అందవు. ఒక అతీంద్రియ శక్తితో పాటు.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతున్నాం. ► ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా మ్యూజిక్ అందించాను. కచ్చితంగా ఇందులోని అన్ని పాటలు ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ► మహా అనే క్యారెక్టర్లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఆమె జీవితంలో జరిగే సంఘటనలు చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేది కథ. ► కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్గా చేయాల్సి ఉంటుంది. మూవీలో ఆ పర్టిక్యులర్ సీన్లో వచ్చే పాట ఆడియెన్స్కు కనెక్ట్ అయితే.. ఆ పాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్ 100 సినిమాకి అదే మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. ► దర్శకుడు కథను ఎంతో క్లియర్గా, డీటైల్డ్గా నాకు చెప్పారు. లైవ్ బేస్డ్ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. ► ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టంగా అనిపించినా.. ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ► చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్ను ముందుకు తీసుకెళ్లలా వారి పాటలు ఉన్నాయి. ► బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100 లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. ► పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి. పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. చదవండి: ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్ -
టాలీవుడ్కు ఏమైంది, యంగ్ హీరోలకు ఎందుకిలా అవుతోంది..
తెలుగు సినీ పరిశ్రమలో అనుహ్య సంఘటనలు చేసుకుంటాయి. కొద్ది రోజులుగా టాలీవుడ్ చెందిన యంగ్ హీరోలు ఒక్కొక్కరిగా ఆస్పత్రి పాలు అవుతున్నారు. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయ పండగ రోజున కెబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళుతున్న సాయి తేజ్ బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ సంఘటనలో సాయి గాయపడటంతో అపోలో ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఇటీవల వస్తున్నానంటూ ట్వీట్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. సాయి కంటే ముందు మరో హీరో అడవి శేషు కూడా ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. డెంగ్యూ జ్వరం కారణంగా ప్లేట్ లేట్స్ పడిపోవడంతో రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇటీవల తాను కోలుకుని ఇంటికి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదిలా ఉండగా హీరో సిద్దార్థ్ మహా సముంద్ర షూటింగ్లో గాయపడ్డాడు. అతడి వెన్నుముకకు గాయమవడంతో సర్జరీ కోసం లండన్ వెళ్లి కొద్ది రోజుల కిందటే ఇండియాకు వచ్చాడు. తాజాగా హీరో రామ్ మెడకు గాయమైన సంగతి తెలిసిందే. అతడి తాజా చిత్రం రాపో 19వ సినిమా కోసం జిమ్లో వీపరితంగా గసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. సిక్స్ ప్యాక్ తీవ్రంగా కృషి చేస్తున్న రామ్ గాయపడ్డాడు. దీంతో వైద్యులు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దీంతో కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి మీ ముందుకు వస్తానంటూ రామ్ ట్వీట్ చేశాడు. ఇలా వేరు వేరు కారణాలతో వరుసగా యువ హీరోలంతా ఆస్పత్రి పాలవడం అభిమానుల్లో ఆందోళ కలిగిస్తోంది. -
ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ ప్రస్తుతం కోలుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మహా సముంద్రం’ మూవీ షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా సిద్దార్థ్ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దర్శకడు అజయ్ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫైట్ సన్నివేశాల చిత్రీకరిస్తుండగా సిద్ధార్థ్ స్పైన్(వెన్నుముక)కు గాయమైంది. దీంతో సర్జరీ కోసం లండన్ వెళ్లిన సిద్దార్థ్ ఇటీవల తిరగి ఇండియా వచ్చాడట. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అంతేగాక ప్రస్తుతం హైదరాబాద్లో ‘మహా సముంద్రం’ సినిమాలో తన డబ్బింగ్ చెబుతున్నానని పేర్కొన్నాడు. చదవండి: లండన్లో హీరో సిద్ధార్థ్కు సర్జరీ! ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నన్నాడు. ఇక తన స్పైన్ సర్జరీ బాగా జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపాడు. అలాగే తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఈ సందర్భంగా సిద్దార్థ్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత ‘మహా సముంద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: 'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే... View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
'మహా సముద్రం' నుంచి రొమాంటిక్ మెలోడి సాంగ్
ప్రేమలో పడ్డప్పుడు కుదురుగా ఉండనివ్వని ఆలోచనలతో తికమకపడిపోతుంటారు ప్రేమికులు. అది ఆనందం తాలూకు తికమక. ‘మహాసముద్రం’ సినిమాలో రెండు జంటలు అలాంటి ఫీలింగ్తోనే ఓ పాట పాడుకున్నాయి. ఓ జంట శర్వానంద్, అనూ ఇమ్మాన్యుయేల్, మరో జంట సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ. ఈ రెండు జంటలూ ‘తికమక..’ అంటూ పాడుకునే లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు వరప్రసాద్ సాహిత్యం అందించగా హరిచరణ్, నూతన్ మోహన్ పాడారు. అజయ్ భూపతి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. -
లండన్లో హీరో సిద్ధార్థ్కు సర్జరీ!
Hero Siddharth Got Surgery In London: హీరో సిద్ధార్థ్కు లండన్లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్బస్టర్ హిట్ను అందించిన సిద్ధార్థ్కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్ అనూ ఇమ్మాన్యయేల్తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్ వెళ్లిన సిద్ధార్థ్కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్తో పాటు శర్వానంద్ కూడా హీరో నటిస్తున్నాడు. -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా: ‘మహా సముద్రం’ ట్రైలర్
Maha Samudram Trailer Out: శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ సాగే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'నవ్వుతూ కనిపిస్తున్నట్లున్నంత మాత్రానా బాగున్నట్లు కాదు', 'మీరు చేస్తే నీతి..నేను చేస్తే బూతా' వంటి డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
‘మహా సముద్రం’ ట్రైలర్ రీలీజ్ ఎప్పుడంటే..?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ నెల 23న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ రావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా.. జగపతిబాబు, రావు రమేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా దసరా కానుకగా అక్టోబర్ 14న సినిమా విడుదల కానుంది. చదవండి: 'మహాసముద్రం' నుంచి మరో లిరికల్ సాంగ్ Setting up our 1st Sail⛵ in the Tale of #ImmeasurableLove❤️#MahaSamudram Voyage Begins on 23rd Sep with an Engrossing Trailer❤️🔥@Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @chaitanmusic @AKentsOfficial#MahaSamudramonOct14th pic.twitter.com/WhgaleB5oZ — Sharwanand (@ImSharwanand) September 20, 2021 -
'మహాసముద్రం' నుంచి మరో లిరికల్ సాంగ్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ''హే రంభ'' పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. "చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు.. అంటూ సాగే ఈ సాంగ్ను హీరోయిన్ రష్మిక విడుదల చేసింది. చైతన్ భరద్వాజ్ సంగీతంలో వచ్చిన ఈ మెలోడి సాంగ్ ఆకట్టుకుంటుంది. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.చాలాకాలం తరువాత సిద్ధార్థ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. Such a sweet song. All the best you guys! 🌸😙 Happy to launch #CheppakeCheppake 😁 @ImSharwanand 🌸 also showed me the trailer-cut and got to say @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel you guys look amaaaazing!! ❤️ Loads of love.. 🌸#MahaSamudram 🌊 pic.twitter.com/LWuouS0j1m — Rashmika Mandanna (@iamRashmika) September 6, 2021 చదవండి: టెన్నిస్ స్టార్తో రిలేషన్.. కన్ఫర్మ్ చేసిన ‘ఖడ్గం’ భామ! ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి -
సిద్ధార్థ్ శుక్లాకు బదులుగా హీరో సిద్ధార్థ్కు నివాళులు, స్పందించిన హీరో
హీరో సిద్ధార్థ్కు మరోసారి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఉద్దేశపూర్వకంగానే తనని ఎవరో టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారంటూ సిద్ధార్థ్ స్పందించాడు. కాగా ఇటీవల యుక్త వయసులో మరణించిన నటీనటులు వీల్లే అంటూ హీరోయిన్స్ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు హీరో సిద్దార్థ్ ఫొటోను చేర్చి ఫేక్ వీడియో వదిలిన సంగతి తెలిసిందే. దీనిపై అతడు స్పందిస్తూ నెటిజన్లను హెచ్చరించాడు. అయినా సిద్ధార్థ్పై తప్పడు ప్రచారం ఆగడం లేదు. చదవండి: శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు నిన్న(సెప్టెంబర్ 2) బాలీవుడ్ టీవీ నటుడు, బిగ్బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి చెందడంతో భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దీంతో అతడి మృతికి విచారం వ్యక్తం చేస్తూ నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో కొందరూ ఆకతాయిలు సిద్ధార్థ్ శుక్లా ఫొటో బదులుగా సౌత్ హీరో సిద్ధార్థ్ ఫొటోను షేర్ చేస్తూ ‘రిప్ సిద్దార్థ్’ అని జత చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఈ పోస్ట్ సిద్దార్థ్ దృష్టికి వెళ్లడంతో అతడు నెటిజన్లపై అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: సిద్ధార్థ్ శుక్లా చివరి క్షణాలు ఇవేనంటూ వీడియో వైరల్.. నిజం ఏంటంటే? ఈ ట్వీట్ను తిరిగి షేర్ చేస్తూ.. ‘కావాలనే కొందరూ నన్ను ఇలా వేధిస్తూ, ద్వేషిస్తన్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గతంలో తనకు హత్య, అత్యాచారం బెదరింపుల వస్తున్నాయంటూ సిద్ధార్థ్ ఇప్పటికే పలుమార్లు తన బాధని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలం బతికున్న సెలబ్రెటీలను సోషల్ మీడియాలో చంపేస్తూ పోస్టులు వైరల్ చేస్తున్నారు కొందరూ నెటిజన్లు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు, సింగర్ చనిపోయారంటూ పోస్టులు దర్శమివ్వడంతో వారు స్పందిస్తూ తాము బతికే ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేస్తున్నప్పటికి ఇలాంటి ఫేక్ న్యూస్లు మాత్రం ఆగడం లేదు. Targetted hate and harassment. What have we been reduced to? pic.twitter.com/61rgN88khF — Siddharth (@Actor_Siddharth) September 2, 2021 -
‘మహాసముద్రం’ వచ్చేది అప్పుడే!
‘మహాసముద్రం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబరు 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించి, కొత్త పోస్టర్ను విడుదల చేసింది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన చిత్రం ఇది. (చదవండి: ప్యాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: పృథ్వీ) ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితీరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, జగపతిబాబు, ‘కేజీఎఫ్’ఫేమ్ రామచంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిశోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. -
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్తో పట్టుబడ్డ సిద్ధార్థ్ను వివరణ ఇవ్వాల్సిందిగా ఎయిర్పోర్టు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్కు బ్యాగులో దొరికిన బులెట్కు వ్యత్యాసం ఉంది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్కు లైసెన్స్ పొందిన సిద్ధార్థ్ బ్యాగులో.. 5.56 క్యాలిబర్ బుల్లెట్ లభ్యం అయ్యింది. (చదవండి: పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?) అయితే సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్స్ బుల్లెట్ గుర్తించారు పోలీసులు. ఈ బుల్లెట్ సిద్ధార్థ్కు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అనంతపూర్కు చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్తో పరిటాల కుటుంబానికి పరిచయాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పరిటాల సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కుమారుడు సిద్ధార్థ్ వద్ద అక్రమ ఆయుధం ఉందా? తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. గతంలో అతను లైసెన్స్ తీసుకున్న ఆయుధానికి, బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో అతని బ్యాగేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న బుల్లెట్కు పొంతన లేకపోవడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లోనే ఆయుధం సరెండర్... పరిటాల సిద్ధార్థ్ వ్యక్తిగత కారణాల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అనంతపురం కలెక్టర్ నుంచి ఆయుధ లైసెన్స్ తీసుకొని .32 క్యాలిబర్ పిస్టల్ కొన్నారు. దాని కాలపరిమితి 2019తో ముగియడం, అదే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఎన్నికలకు ముందే తన ఆయుధాన్ని రామగిరి పోలీసుస్టేషన్లో డిపాజిట్ చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన బ్యాగేజ్లో లభించినవి 5.56 క్యాలిబర్ తూటాలు. ఇవి కేవలం సాయుధ బలగాలు మాత్రమే వాడే ఇన్సాస్ రైఫిల్స్కు సంబంధించినవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ వద్ద 5.56 క్యాలిబర్కు చెందిన అక్రమ ఆయుధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో శంషాబాద్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరి స్తున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా నిషేధిత తుపాకీ తూటాలు కలిగి ఉన్న వ్యక్తులను పోలీసులు నిందితులను విడిచిపెట్టరు. అయితే సిద్ధార్థ్ను మాత్రం వివరణ కోరుతూ సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేసి వదిలేయడం గమనార్హం. ఆ కానిస్టేబుల్తో లింకులు ఉన్నాయా..? సిద్ధార్థ్ వద్ద లభించిన తూటాకు, ఈ ఏడాది ఏప్రిల్లో అస్సాంలోని బాగ్డోగ్రా విమానా శ్రయంలో ఓ ఐటీబీపీ కానిస్టేబుల్ వద్ద లభిం చిన తూటాలకు లింకులున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి. అస్సాంలో పని చేసే అనంతపురం జిల్లా ములకనూరుకు చెందిన ఓ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు కానిస్టేబుల్ ఏప్రిల్ 17న బెంగళూరు వెళ్లేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి రాగా ఆయన బ్యాగేజ్లో 5.56 క్యాలిబర్కు చెందిన 100 పేల్చని తూటాలు లభ్యమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఐటీబీపీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీనికితోడు ఆ కానిస్టేబుల్కు పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
Siddharth: ‘ఒరేయ్ బామ్మర్ది’ మూవీ రివ్యూ
టైటిల్ : ఒరేయ్ బామ్మర్ది నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ తదితరులు నిర్మాణ సంస్థ : అభిషేక్ ఫిలిమ్స్ నిర్మాతలు : రమేష్ పి పిళ్లై తెలుగు రిలీజ్ : శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ - ఏ.ఎన్ బాలాజీ దర్శకత్వం: శశి సంగీతం : సిద్ధూ కుమార్ సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్ ఎడిటింగ్: సాన్ లోకేష్ విడుదల తేది : ఆగస్ట్ 13,2021 ‘బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా 'ఒరేయ్ బామ్మర్ది' అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్, టీజర్,ట్రైలర్కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై పాజిటివ్ బజ్ని క్రియేట్ చేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఆగస్ట్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా సిద్దార్థ్ను హిట్ ట్రాక్ ఎక్కించిందా? ‘ఒరేయ్ బామ్మర్ది’ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ రాజ శేఖర్ అలియాస్ రాజ్(సిద్దార్థ్) ఓ సిన్సియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ ట్రాఫిక్ పోలీసు అవుతాడు. అతను రాజేశ్వరి అలియాస్ రాజీ (లిజోమోల్ జోస్)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఈ పెళ్లి రాజీ తమ్ముడు, బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన మదన్(జీవీ ప్రకాశ్ జీవీ)కి ఇష్టం ఉండదు. గతంలో రాజ్కి, మదన్కి మధ్య జరిగిన ఓ గొడవనే దీనికి కారణం. అయితే రాజ్ మాత్రం రాజీని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఏలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి రాజీని రాజ్ పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఇంతకి మదన్కి రాజ్పైన ఎందుకు కోపం? వారి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి? తను అంటేనే కోపంగా చూసే మదన్తో రాజ్ ఏవిధంగా ‘బావ’అని పిలిపించుకున్నాడు? అనేదే మిగతా కథ నటీ నటులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాత్రలో సిద్దార్ధ్ ఒదిగిపోయాడు. మంచి భర్తగా, బావమరిదిని దారికి తీసుకొచ్చే బావగా చక్కగా నటించాడు. బైక్ రేసులంటూ తిరిగే యువకుడు మదన్ పాత్రలో జీవీ ప్రకాశ్ పరకాయ ప్రవేశం చేశాడు. తనదైన ఎమోషనల్ యాక్టింగ్తో దరగొట్టేశాడు. హీరోయిన్లు కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్తో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ భావోద్వేగ కథలతో సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు దర్శకుడు శశి. ఆయన తెరకెక్కించిన శీను, రోజాపూలు, బిచ్చగాడు లాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఎమోషనల్ ఫీల్ పంచాయి. బిచ్చగాడులో తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తే.. ఒరేయ్ బామ్మర్దిలో బావ, బామ్మర్ది మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. దర్శకుడు ఢిపరెంట్ స్టోరీ లైన్ తీసుకున్నప్పటీ.. సినిమాలో బలమైన సీన్స్ రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభంలోనే అన్ని పాత్రలను పరిచయం చేసి, కథ ఎలా ఉండబోతుందో ముందే చెప్పేశాడు. ఫస్టాఫ్లో అక్కా,తమ్ముడి మధ్యల వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నప్పటీకీ.. ఒక్క సంఘటనతో తల్లిలా ప్రేమించే అక్కతో విడిపోవడానికి సిద్దపడే తమ్ముడి పాత్రలో సీరియస్ నెస్ లేదనిపిస్తుంది. విలన్ పాత్ర కూడా అతికించినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్లో కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్గా ఉంటుంది. కథలో ఎలాంటి ట్విస్ట్లు లేకుండా చివరి వరకు ఒకే ఎమోషన్తో నడిపించడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు మామలుగా ఉన్నప్పటీకీ.. నేపథ్య సంగీతం మాత్రం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ సాన్ లోకేష్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫ్లస్ పాయింట్స్ సిద్దార్థ్, జీవీ ప్రకాశ్ నటన సంగీతం లవ్ ట్రాక్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ వర్కౌట్ కానీ ఎమోషనల్ డ్రామా సెకండాఫ్లో కొన్ని సాగదీత సీన్స్ స్క్రీన్ప్లే సింపుల్ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్