‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్రంలో జంటగా నటించిన క్రాంతి, శ్రీదివ్యలు గుర్తున్నారు కదా! నూతన దర్శకుడు రామరాజు దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. మళ్లీ ఈ జంట కలిసి ‘వారధి’ అనే సినిమా చేస్తున్నారు. వీరితో పాటు హేమంత్ కూడా ఇందులో ముఖ్యపాత్రధారి. కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానందవర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ కార్తికేయ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ముక్కోణపు ప్రేమకథను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. త్వరలో పాటలను, ఫిబ్రవరి రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి.
ప్రణయ వారధి
Published Tue, Jan 20 2015 11:41 PM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM
Advertisement
Advertisement