Movie Director
-
కార్తీ చిత్ర దర్శకుడు కన్నుమూత.. మూవీ ప్రమోషన్కు వెళ్తూ ఘటన
ప్రముఖుల మరణాలు కోలీవుడ్లో దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. గురువారం ఉదయం ఫైట్ మాస్టర్ నటుడు కోదండరామన్ అనారోగ్యంతో మృతిచెందారు. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్దయాళ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 2012లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్గా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత తాజాగా శంకర్దయాళ్ కుళందైగళ్ మున్నేట్ర కళగం పేరుతో చిత్రం చేశారు. హాస్యనటుడు సెంథిల్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రా న్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోభాగంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారులో బయలుదేరిన దర్శకుడు శంకర్దయాళ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే యూనిట్ వర్గాలు స్థానిక కొళత్తూర్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శంకర్దయాళ్ను పరిక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. దర్శకుడు శంకర్దయాళ్ మరణం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
సినీ దర్శకుడు ఆత్మహత్య
సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్హిట్ పాటను రాశారు. కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
ఇండస్ట్రీని వదిలేసిన ప్రముఖ దర్శకుడు.. కారణం ఆ జబ్బు!?
సినిమా అనేది వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు. కొందరు డైరెక్టర్స్ అయితే కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తుంటారు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ కారణమేంటో తెలుసా? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం జనరేషన్కి ఈ భాషా చిత్రాలు పరిచయమైంది 'ప్రేమమ్'తోనే. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ.. 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది. దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్.. 2013లో 'నేరమ్' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ప్రేమమ్'తో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అవియల్ (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) సినిమాలు తీశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) కొన్నాళ్ల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే దర్శకుడి కెరీర్కి పుల్స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 'నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను. అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది' అని అల్ఫోన్ రాసుకొచ్చాడు. కానీ ఈ పోస్ట్ కాసేపటికే డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
Lokesh Kanagaraj Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లియో డైరెక్టర్ (ఫోటోలు)
-
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
ఆ రోజు కీడా కోలా
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్ -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ‘డీ 51’
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్. -
సినీ దర్శకుడు కిడ్నాప్
కర్ణాటక: సినిమాలలో దర్శకుడు ఎన్నో కిడ్నాప్ ఘటనలను చిత్రీకరించి ఉంటాడు. కానీ తనే కిడ్నాప్కు గురవుతానని ఊహించి ఉండడు. నిజజీవితంలో అదే జరిగింది. సినిమా చాన్సిస్తానని డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన సినిమా డైరెక్టర్ను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన క్రిష్ణగిరి పట్టణంలో చోటుచేసుకొంది. వివరాల మేరకు కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెందిన క్రిష్ణ ప్రకాష్ (36), తమిళం, మలయాళం సినిమా రంగంలో దర్శకునిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి ప్రాంతంలో సినిమాను చిత్రీకరించేందుకు స్థల పరిశీలన కోసం వచ్చాడు. క్రిష్ణగిరి కొత్తబస్టాండులోని ఓ లాడ్జిలో బసచేశాడు. సోమవారం ఉదయం క్రిష్ణగిరి బస్టాండు వద్ద ఉన్న క్రిష్ణప్రకాష్తో కారులో వచ్చిన నలురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగి అతన్ని కారులో కిడ్నాప్ చేశారు. ఈరోడ్లో పట్టివేత గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేశారు. ఈరోడ్ జిల్లా సత్యమంగలం పోలీసులు కారును అడ్డుకుని అందరినీ క్రిష్ణగిరి పోలీసులకు అప్పగించారు. గత ఏడాది క్రితం సత్యమంగలం ప్రాంతంలో కరికాలన్, కార్తికేయన్, శివశక్తి అనేవారి నుంచి సినిమాలలో అవకాశమిస్తానని రూ. 2.50 లక్షల నగదును తీసుకొన్నాడు. కానీ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని కిడ్నాప్ చేశామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
రాజమౌళితో మహేశ్ సినిమా.. ఆ టెస్ట్ పాసవ్వాల్సిందేనా!
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుకున్నది సాధించాడు...ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీపైనే ఫోకస్ పెట్టాడు. రాజమౌళి సినిమా ఏదైనా సెట్స్ పైకి వెళ్లే ముందే పక్కా ప్లానింగ్తో రెడీ అవుతాడు. ఓ సినిమా అనుకున్న తర్వాత ఏ స్టేజ్లో కూడా కాంప్రమైజ్ కాడు. రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఏ స్టార్ హీరో అయినా, ఏ స్టార్ టెక్నిషీయన్ అయినా రాజమౌళి మాట వినాల్సిందే. ఇక రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్కు అందరూ హాజరు కావాల్సిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తెరకెక్కించబోయే తన నెక్ట్స్ మూవీకి వర్క్ షాప్ ప్లాన్ రెడీ చేశాడు. రాజమౌళితో సినిమా చేయడం హీరోలకు ఓ సవాల్ అనే చెప్పాలి. తన కథకు తగినట్లు హీరో ఉండే విధంగా రాజమౌళి శిక్షణ ఇప్పిస్తాడు. హీరో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పాత్రను అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్లోకి హీరో పరకాయ ప్రవేశం చేసేలా రాజమౌళి ట్రైనింగ్ ఉంటుంది. సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా వర్క్ షాప్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే రాజమౌళి కొన్ని నెలల పాటు వర్క్ షాష్ నిర్వహిస్తాడు. అంతే కాదు ఈ వర్క్ షాప్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తాడు. ఇక ప్రిన్స్తో తెరకెక్కించబోయే #ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టనున్నాడట జక్కన్న. రాజమౌళి మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు వర్క్ షాప్ నిర్వహించాడు. తన ఊహలో ఆలోచనల్ని రాజమౌళి ముందుగా తన టీమ్కు చెబుతాడు. అలాగే వారు ఇచ్చే ఇన్ పుట్స్ కూడా తీసుకుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి విభాగానికి తాను తీయబోయే సినిమాకి సంబంధించి అన్ని విషయాలు వివరిస్తాడు. తను ఏ సీన్ ఏలా తీయాలనుకుంటున్నది. అందుకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నాడో వివరిస్తాడు. అలాగే మహేశ్ బాబుతో తీయబోయే సినిమా కోసం రాజమౌళి ఓ భారీ వర్క్ షాప్ ప్లాన్ చేశాడనే మాట టీ టౌన్లో వినిపిస్తోంది. గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వేంచర్ జోనర్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎక్కడ అవసరం అవుతాయి.. ఏ సీన్స్కు గ్రీన్ మ్యాట్ వాడాలి. ఇక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ ఈ వర్క్ షాప్లో ఉండనుందని సమాచారం. బాహుబలి, బాహుబలి- 2 సినిమాల కోసం రాజమౌళి కొన్ని నెలల పాటు ప్రభాస్ - రానా, అనుష్క, నాజర్, సత్యప్రకాశ్లకు వర్క్ షాపులు నిర్వహించాడు. ఇక ప్రభాస్, రానాలో రాజరికం ఉట్టిపడేలా వాళ్లిద్దర్నీ ఆయన తీర్చిదిద్దారు. అలాగే మేకోవర్ విషయంలో ప్రభాస్ - రానా ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అంతే కాదు ఓ రేంజ్లో రానా, ప్రభాస్ జిమ్లో కసరత్తులు చేసి కండలు పెంచారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ను కూడా వదిలిపెట్టలేదు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోయే మహేశ్ బాబు సినిమా కోసం... ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ మూవీ నెక్ట్స్ సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్లో సాగుతోంది. ఈ వర్క్ షాప్లో మహేష్ బాబుతో సహా మిగిలిన యాక్టర్స్ అందరికీ ట్రైయినింగ్ ఉంటుందట. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 28 ఆగస్టు 11న విడుదల కానుంది. -
కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతి ముత్యం, ఓ శుభసంకల్పం.. తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్గా ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్య కాలంలో పలుమార్లు ఆస్పత్రిలో చేరినా కోలుకుని తిరిగి వచ్చారు. అయితే రెండురోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆశించారు. కానీ ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో విశ్వనాథ్ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ కన్ను మూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వాహినీ పిక్చర్స్ జీఎంగా మొదలుపెట్టి.. కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె. విశ్వనాథ్ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్లో విజయవాడ బ్రాంచ్కి జనరల్ మేనేజర్గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా కెరీర్ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్ళు’ సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ (1965) సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ (2016) వరకూ విశ్వనాథ్ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్ పర్ఫెక్ట్ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించేవరకూ షూటింగ్కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్ అలవాటు. తనను తాను కారి్మకుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వాటిలో సరగమ్ (సిరిసిరిమువ్వ), సుర్సంగమ్ (శంకరాభరణం), కామ్చోర్ (శుభోదయం), శుభ్కామ్నా (శుభలేఖ), సమ్జోగ్ (జీవనజ్యోతి) ఉన్నాయి. ఐదు జాతీయ అవార్డులు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ‘మనసానమః’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన యువ దర్శకుడు దీపక్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ లఘు చిత్రం దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకోవడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తనను కలిసిన దీపక్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్ ఫిల్మ్కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు. చదవండి: చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ -
సినీ అవకాశాల పేరుతో యువతులకు వల..దర్శకుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్ క్షత్రియన్. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జననీ (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో తాను పని చేసే సినిమా కంపెనీలో వీరప్పన్ పాలమూరుకు చెందిన దర్శకుడు వేల్ క్షత్రియన్. అతని సహాయకురాలు రాజపాళ్యంకు చెందిన జయజ్యోతి సినిమా అవకాశాల పేరుతో అనేక మంది యువతులను సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటితో బెదిరించి వారి జీవితాలను పాడు చేస్తున్నారని పేర్కొంది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్ క్షత్రియన్ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్ డిస్క్లు, ల్యాప్ట్యాప్, పెన్డ్రైవ్లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్డిస్క్లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: వైరల్గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! -
‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రైటర్గా గుర్తింపు.. విశాఖ జిల్లా కుర్రాడు.. ఊరమాస్
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్కు స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్లో స్క్రిప్ట్ రైటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య అంతే కాకుండా కథ, స్క్రీన్ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. -
‘మెగా ఫోన్’ పట్టుకున్న టెక్నీషియన్లు.. హిట్ పడేనా?
Technicians Turned Into Directors: విలన్ ముఖం మీద హీరో పంచ్లు ఇస్తుంటే.. ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకుంటే... ఫ్యాన్స్ స్టెప్స్ వేస్తారు. విదేశీ అందాలు తెర మీద కనబడితే అదో ఐ ఫీస్ట్. ఎక్కువ అయిందనుకున్నప్పుడు సీన్ పూర్తయితే అదో రిలీఫ్. ప్రేక్షకులకు ఈ అనుభూతులన్నీ కలగాలంటే తెర వెనక ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో ఈ టెక్నీషియన్లకు సినిమా డైరెక్షన్ మీద ఓ అవగాహన వచ్చేస్తుంది. అందుకే కొందరు డైరెక్టర్లుగా మారతారు. ప్రస్తుతం ‘మెగా ఫోన్’ పట్టుకుని దర్శకులుగా స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. కట్ చెబుతున్న టెక్నీషియన్ల గురించి తెలుసుకుందాం. ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డుతో పాటు తమిళనాడు, కేరళ ప్రభుత్వ అవార్డులూ గెలుచుకున్నారు బృందా మాస్టర్. ఆమె దర్శకురాలిగా మారారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హే సినామిక’. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక యశ్ ‘కేజీఎఫ్’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని స్టంట్స్ని అన్బు, అరివు ద్వయం సమకూర్చారు. ఈ చిత్రానికి బెస్ట్ స్టంట్ మాస్టర్స్గా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఫైట్మాస్టర్స్ రామ్–లక్ష్మణ్లానే ఈ ఇద్దరు కూడా కవలలే. ఇప్పుడు ఈ ఇద్దరి దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే చిత్రం రూపొందనుంది. ఇక కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి లారెన్స్ విజయాలు చవి చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లారెన్స్తో అన్బు, అరివు మరోవైపు ‘సీతారాముడు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బుర్రకథ’ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి సినిమాలకు వర్క్ చేసిన కెమెరామేన్ అంజి కూడా రీసెంట్గా దర్శకుడిగా మారారు. శ్రీరామ్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాకు అంజి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు, రవితేజ మన్యం ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్, ధన్రాజ్ హీరోలుగా రిలీజ్కు రెడీ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బుజ్జీ.. ఇలారా’కి కూడా అంజియే దర్శకుడు. నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక 2016లో వచ్చిన ‘క్షణం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు గ్యారీ. 2018లో వచ్చిన ‘గూఢచారి’తో గ్యారీ ఎడిటర్గా మారారు. ఆ తర్వాత ‘ఎవరు’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’ ఇటీవల ‘ఇచట వాహ నములు నిలుపరాదు’ .. ఇలా దాదాపు 20కి పైగా సినిమాలకు ఎడిటర్గా చేసిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. నిఖిల్ హీరోగా దేశభక్తి నేపథ్యంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీని గ్యారీ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రాజశేఖర రెడ్డి నిర్మించనున్నారు. మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా తమలోని దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి ఎంత మంచి గుర్తింపు ఉందో తెలిసిందే. కెమెరామేన్గా నాలుగు జాతీయ అవార్డులు సాధించిన ఆయన డైరెక్టర్గాను (ది టెర్రరిస్టు, మల్లి, నవరస చిత్రాలకు) జాతీయ అవార్డులు సాధించారు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ముంబైకర్’. విజయ్ సేతుపతి, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రధారులు. తమిళ హిట్ మూవీ ‘మానగరం’కు హిందీ రీమేక్గా ‘ముంబైకర్’ రూపొందుతోందని టాక్. ‘దిల్ చాహ్ తా హై’, ‘కోయీ మిల్ గయా’, ‘ఫనా’, ‘గజిని’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామ్యాన్గా చేసిన రవి కె. చంద్రన్ ప్రస్తుతం ‘తామర’ అనే ఇండో–ఫ్రెంచ్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే.. 1992 నుంచి కెమెరామేన్గా కొనసాగుతున్న రవి. కె. చంద్రన్ పాతికేళ్లకు తెలుగు సినిమా చేయడం విశేషం. 2018లో మహేశ్బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ ఛాయాగ్రాహకుడిగా రవి కె. చంద్రన్కు తెలుగులో తొలి సినిమా. అలాగే తెలుగు నిర్మాణ సంస్థలో దర్శకుడిగా ‘తామర’ రవికి తొలి చిత్రం అయినప్పటికీ తమిళంలో ‘యాన్’ (2014), మలయాళంలో ‘భ్రమమ్’ (2021) చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు.. చివరికి సాధించాడు!
అనగనగా ఒక పిల్లాడు ఉంటాడు. కుటుంబ పరిస్థితి బాగలేక బాలకార్మికుడిగా మారి ఎన్నో కష్టాలు పడతాడు. పొట్ట నింపుకోవడం కోసం, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం తిరగని పట్టణం లేదు. చేయని పనిలేదు. ఈ కష్టాల పిల్లాడికి సినిమా అంటే ఇష్టం. ‘సినిమా డైరెక్టర్ అవుతాను’ అనే అతని ఆశయం ఎన్నో అవహేళనలకు గురైంది. కాని అతడు మాత్రం ‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు. చివరికి సాధించాడు. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు....ఇది సినిమా కథ కాదు. ‘కూళంగళ్’ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్న మదురై కుర్రాడు పీయస్ వినోద్రాజ్ నిజజీవితకథ.... వినోద్రాజ్ లో బడ్జెట్ డెబ్యూ మూవీ ‘కూళంగళ్’ (గులకరాళ్లు) ఆస్కార్–ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. కథ ఐడియాలు ఎలా వస్తాయి? విదేశాల్లో ఫైస్టార్ హోటల్లో కూర్చుంటే రావచ్చు. విదేశీ చిత్రాలు చూస్తే రావచ్చు. కొందరికి మాత్రం విదేశాలు అక్కర్లేదు. విదేశీ చిత్రాలు అక్కర్లేదు. ఏ జీవితం నుంచి అయితే తాము నడిచొచ్చారో ఆ జీవితమే వారికి నిజమైన కథలు ఇస్తుంది. వినోద్రాజ్... ఈ కోవకు చెందిన డైరెక్టర్. తాను పుట్టి పెరిగిన జీవితాన్నే కథగా మలుచుకున్నాడు వినోద్. అదే ‘కూళంగళ్’ సినిమా! వినోద్రాజ్ తండ్రి తాగుబోతు. తాగి ఎప్పుడు ఏ రోడ్డు మీద పడి ఉంటాడో తెలియదు. నాన్న చనిపోయిన తరువాత కష్టాలు పెరిగాయి. కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం పూలు అమ్మడం నుంచి టెక్ట్స్టైల్ కంపెనీలో పనిచేయడం వరకు ఎంతో కష్టపడ్డాడు. టెక్ట్స్ టైల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల కష్టాలతో అర్ధాంతరంగా జీవితాన్ని చాలేసిన ఎంతోమందిని అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. ఈ కన్నీటి కథలు, తన కుటుంబ కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కడుపులో దుఃఖసముద్రాలు ఘోషించేవి. ఆ అనంతమైన దుఃఖం బయటికి వెళ్లే మార్గం, మాధ్యమంగా అతడికి సినిమా కనిపించింది. (చదవండి: బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!) సినిమా డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి? చెప్పుకోదగ్గ చదువు కావాలి. ఈ ఆలోచనలతోనే ‘మళ్లీ చదువుకుందాం’ అని నిర్ణయించుకున్నాడు. కానీ ‘ఈ వయసులో చదువేమిటి!’ అనే వెక్కిరింపులు క్యూ కట్టాయి. ఇక లాభం లేదనుకొని చెన్నై వెళ్లి ఒక డీవిడి స్టోర్లో పనికి కుదిరాడు. అక్కడ ప్రతి సినిమా తనకొక పాఠం నేర్పింది. ఆ ధైర్యంతోనే కొన్ని షార్ట్ఫిల్మ్స్కు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలతీరానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు డైరెక్టర్ అయ్యాడు. ‘కూళంగళ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరికి తప్ప ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాని ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొటెర్డామ్ టైగర్ అవార్డ్(న్యూజిలాండ్) గెలుచుకుంది. ‘సింపుల్ అండ్ హంబుల్’ అని ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ పరిసరాల్లోకి వెళ్లింది. (చదవండి: ఐటెం సాంగ్ లిరిక్స్పై తొలిసారిగా స్పందించిన బన్నీ) ‘ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. పెద్దగా చదువుకోలేదు. జీవితం అనే బడి ఎన్నో పాఠాలు నేర్పింది’ అంటున్న వినోద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి? సింపుల్ అండ్ హంబుల్ ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలా! -
‘పుష్పక విమానం’ డైరెక్టర్ దామోదర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి. లఘు చిత్రాల నుంచి.. సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్ఫిలిం కూడా సృజన్కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గోవర్దనరావు ప్రోత్సాహంతోనే.. ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు. -
టాలీవుడ్ దర్శకుడు, నటుడు గిరిధర్ కన్నుమూత
టాలీవుడ్దర్శకుడు,నటుడు ఇరుగు గిరిధర్(64)కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించాడు. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా గిరిధర్ పనిచేశారు. గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అలాగే, ఎక్స్ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వెండితెరపై... విజువల్ పొయట్
పదచిత్రాలతో దృశ్యాన్ని బొమ్మకట్టించే ఓ కవి... వెండితెరపై దృశ్యాలను కవిత్వీకరిస్తే ఏమవుతుంది? కవికి ఉండే సహజమైన సున్నితత్వంతో సమాజాన్నీ, మనుషుల్నీ తెరపై చూపెడితే ఆ కళాసృజనలు ఎలా ఉంటాయి? తెలియాలంటే... భారతీయ సినిమా జెండాను అంతర్జాతీయంగా ఎగరేసిన ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్గుప్తా సినిమాలు చూడాలి. జూన్ 10న తన 77వ ఏట బుద్ధదేవ్ దాస్గుప్తా కన్నుమూశారనగానే, ఒక్క బెంగాలీలే కాదు... భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగింది అందుకే! వెండితెరపై ఆయనది విజువల్ పొయిట్రీ. దర్శకుడి కన్నా ముందు పేరున్న కవి అయిన బుద్ధదేవ్ ఏకంగా తొమ్మిది కవితా సంపుటాలు, 4 నవలలు రాయడం విశేషం. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా ఆయన తీసినవి అతికొద్ది ఫీచర్ ఫిల్మ్లే. అన్నీ ఆణిముత్యాలే. అవార్డు విన్నర్లే! దిగ్దర్శక త్రయం సత్యజిత్ రే, మృణాల్ సేన్, ఋత్విక్ ఘటక్ తరువాత బెంగాలీ చలనచిత్ర చయనికను, ఆ మాటకొస్తే భారతీయ సినిమాను అంతర్జాతీయంగా దీప్తిమంతం చేసిన దర్శకతార బుద్ధదేవ్. అయితే, ఆయన మాత్రం ఆ దర్శక త్రిమూర్తులతో తనను పోల్చవద్దనేవారు. సమకాలికులైన జి. అరవిందన్, అదూర్ గోపాలకృష్ణన్, శ్యామ్ బెనెగల్ల తరానికి చెందినవాడినని వినయంగా చెప్పుకొనేవారు. చిన్నతనంలో రవీంద్రనాథ్ టాగూర్ ప్రభావంతో కవిగా కలం పట్టిన బుద్ధదేవ్కు కోల్కతా అంటే ప్రాణం. బెంగాల్లోని పురూలియా ప్రాంతంలో 1944లో జన్మించిన బుద్ధదేవ్ కోల్కతాలోనే చదువుకున్నారు. ఆ నగరాన్ని ఆయన తెరపై చూపించిన తీరు గురించి ఇవాళ్టికీ సినీజనం చెప్పుకుంటారంటే, దాని వెనుక ఉన్న ఆయన ప్రేమే అందుకు కారణం. కోల్కతాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన మొదలైంది ఎకనామిక్స్ లెక్చరర్గా! కానీ, చెబుతున్న ఆర్థిక సిద్ధాంతానికీ, చూస్తున్న సామాజిక–రాజకీయ వాస్తవికతకూ మధ్య ఉన్న తేడాతో ఆయన మబ్బులు విడిపోయాయి. లెక్కల కన్నా కళల మీద మక్కువే జయించింది. అలా బెంగాల్లోని సాంస్కృతిక, కళా జీవితంతో పాటు నక్సల్బరీ ఉద్యమం ఆయనను ప్రభావితం చేసింది. బుద్ధదేవ్ సెల్యులాయిడ్ బాంధవ్యం 1960ల చివరలో డాక్యుమెంటరీలతో మొదలైంది. ఆ తరువాత పదేళ్ళకు ఫీచర్ ఫిల్మ్ల స్థాయికి ఎదిగింది. దేశంలో 21 నెలల అంతర్గత ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత బెంగాల్లో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం వచ్చింది. రాజకీయ కార్యకర్తల్ని బేషరతుగా వదిలేయమంటున్న రోజులు. అంతటా రాజకీయ, సాంస్కృతిక సమరోత్సాహం నెలకొన్న సమయం. సరిగ్గా అప్పుడు ముప్పయ్యో పడిలోని బుద్ధదేవ్ తన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘దూరత్వ’ (1978)తో జనం ముందుకు వచ్చారు. సాక్షాత్తూ సత్యజిత్ రే కవితాత్మకంగా ఉందంటూ ఆ చిత్రాన్ని ప్రశంసించారు. ఆ తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించిన బుద్ధదేవ్ ఆ వెంటనే ‘నీమ్ అన్నపూర్ణ’తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. కార్లోవీ వారీ, లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఆ చిత్రానికి అవార్డులు రావడం అందుకు దోహదమైంది. ఆయన ఇక వెనుతిరిగి చూసింది లేదు. బుద్ధదేవ్ సినీ ప్రయాణమంతా సామాన్యులపట్ల అక్కర, కవితా దృష్టి – సంగమమే. అందుకే, ఆయన ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసూ గెలిచారు. వెండితెరను కవితాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధదేవ్ దర్శకత్వంలో ‘బాగ్ బహదూర్’, ‘చరాచర్’, ‘లాల్ దర్జా’, ‘కాల్పురుష్’, ‘మోండో మేయేర్ ఉపాఖ్యాన్’, మిథున్ చక్రవర్తి నటించిన ‘తహదేర్ కథ’ (1992) ఎంతో పేరొం దాయి. రియలిజమ్ను దాటి, మ్యాజికల్ రియలిజమ్, సర్రియలిజమ్ వైపు ప్రేక్షకులను ఆయన తన సినిమాతో తీసుకువెళ్ళారు. మ్యాజికల్ రియలిజమ్నూ, కవితాత్మనూ కలగలిపి, తెరపై చూపారు. నిజానికి, ‘సినిమాలో కథ కన్నా కీలకమైనది మనం కళ్ళకు కట్టించే బొమ్మ’ అని ఆయన అభిప్రాయపడేవారు. చివరి దాకా ఆ పద్ధతే అనుసరించారు. ఫీచర్ ఫిల్మ్స్ చేస్తూనే వాటి రూపకల్పనకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం కోసం అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలు తీయడమూ కొనసాగించారు. సంగీతం సినిమాల్లో అంతర్భాగమని నమ్మిన బుద్ధదేవ్ భారతీయ, పాశ్చాత్య శైలుల్ని మేళవిస్తూ, తరచూ తానే స్వయంగా సంగీతం సమకూర్చుకొనడం మరో విశేషం. రవీంద్రనాథ్ టాగూర్ పెయింటింగ్స్ వల్ల చిత్రకళ మీద ప్రేమ పెంచుకున్న బుద్ధదేవ్కు జానపద కళలన్నా, కళారూపాలన్నా అమితమైన ఇష్టం. అందుకు తగ్గట్టే ఆయన తన ‘బాగ్ బహదూర్’ (1989) చిత్రాన్ని మన తెలుగునాట ప్రసిద్ధమైన జానపద కళారూపం పులివేషాల నేపథ్యంలో తీర్చిదిద్దడం గమనార్హం. తెలుగమ్మాయి అర్చన నటించిన ఆ సినిమా ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రం. చిన్నప్పుడు నేతాజీని ఆరాధించి, యౌవనంలో నక్సలిజమ్ వైపు మొగ్గిన ఈ బెంగాలీబాబు తరువాత ఆ ప్రభావం నుంచి బయటపడ్డారు. ‘దూరత్వ’, ‘గృహజుద్ధ’, ‘అంధీగలీ’ (1984) చిత్రాల్లో ఆనాటి సంక్షుభిత సమయాలపై తనదైన సినీ వ్యాఖ్యానం చేశారు. ఆయన చిత్రాల్లో 5 నేషనల్ ఫిల్మ్ అవార్డులు సాధిస్తే, ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మరో 2 సార్లు (‘ఉత్తర’, ‘స్వప్నేర్ దిన్’) జాతీయ అవార్డులు దక్కాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు అన్నీ లెక్క తీస్తే బుద్ధదేవ్ ఖాతాలో ఏకంగా 32 నేషనల్ అవార్డులు చేరడం ఓ రికార్డు ఫీట్! సత్యజిత్ రే మరణానంతరం భారతీయ సినిమాను మళ్ళీ అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత కూడా బుద్ధదేవ్దే!! టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ సినిమా’ విభాగంలో ఏకంగా 8 సార్లు చోటు దక్కించుకున్నారు. ఆయన సృజనాత్మక కృషికి గుర్తింపుగా, 2008లో స్పెయిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జీవన సాఫల్య పురస్కారం దక్కింది. యౌవనంలో బుద్ధదేవ్ను మలిచి, సినిమా వైపు మళ్ళించింది కలకత్తా ఫిల్మ్ సొసైటీ. అక్కడ చూసిన చార్లీ చాప్లిన్, అకిరా కురసావా, విటోరియో డెసికా, రొసెల్లినీ లాంటి ప్రసిద్ధుల చిత్రాలు. అంత బలమైన ముద్ర వేసిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో బుద్ధదేవ్ చివరి దాకా సన్నిహితంగా మెలిగారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినా, చివరి వరకు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో సిన్సియర్ యాక్టివిస్ట్గానే పనిచేశారు. దేశంలోని ఏ మారుమూల, ఏ ఫిల్మ్ సొసైటీ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా, ఆయన స్వయంగా వెళ్ళేవారు. బుద్ధదేవ్ సతీమణి సోహిణీ దాస్గుప్తా కూడా దర్శకురాలే. ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చిన వారిది అన్యోన్య దాంపత్యం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, కిడ్నీ సమస్యతో కన్నుమూసే వరకు బుద్ధదేవ్ కవిత్వాన్నీ, సినిమానూ శ్వాసిస్తూ వచ్చారు. ఒక్క మాటలో– బుద్ధదేవ్ ఓ అద్భుతమైన దర్శకుడు. అపూర్వమైన కవి. అమోఘమైన టీచర్. అన్నిటికీ మించి మనసున్న మంచి మనిషి. ఆ వ్యక్తిత్వం పరిమళించిన ఆయన సృజనాత్మక కృషి ఎప్పటికీ వసివాడని జ్ఞాపకం. – రెంటాల జయదేవ -
ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్’
మహా నియంత హిట్లర్పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్ ఆఫ్ ది విల్ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్స్టాల్ రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా(అనధికారికంగా)తో పాటు, ఫ్రేమ్ టు ఫ్రేమ్లో హిట్లర్ హస్తం ఉందట. ఈ సినిమా నటబృందంలో హిట్లర్ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్ ట్రయంప్ ఆఫ్ ది విల్ స్పీచ్’గా ఇది బాగా పాప్లర్ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్ కెమెరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ, లాంగ్–ఫోకస్ లెన్స్.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్... మొదలైన దేశాల్లో అవార్డ్లు గెలుచుకుంది. l -
చార్లీ చాప్లిన్ తొలి సినిమాకు వందేళ్ళు!
చార్లీ చాప్లిన్ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిల్మ్ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్ చిత్రాల రిస్టోరేషన్ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్ రష్’ ‘సిటీ లైట్స్’ ‘ది సర్కస్’ ‘మోడ్రన్ టైమ్స్’ ‘ది గ్రేట్ డిక్టేటర్’ చిత్రాలను 4కె రిస్టోరేషన్ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్ స్టార్డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్మిడ్జ్. ఆధునీకరించిన చాప్లిన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. -
మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!
‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు.. ► నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుకుమార్గారు నా లెక్కల మాస్టర్. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్బీఏ చదువుకుంటూ సుకుమార్గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలు చేశాను. ► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్స్టోరీ బ్యాక్డ్రాప్కు కమర్షియల్ ఎలిమెంట్స్తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ. ► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ (వైష్ణవ్తేజ్) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్ తేజ్తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం. ► క్యాస్ట్ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్లో డైరెక్టర్ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్ అన్నారు. సుకుమార్గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్గా కన్నా కూడా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ్ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్ ఎడిటర్గా పని చేసిన ఆయన ఆ తర్వాత కన్నడ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘గాంధడ గుడి’, ‘నా నిన్న బిదాలారే’, ‘రంగమహాల్ రహస్య’, ‘శ్రీనివాస కళ్యాణ’, ‘సనాడి అప్పన్న’, ‘కర్ణాటక సుపుత్ర’ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ 1996లో నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని సూపర్ హిట్గా నిలిచింది. (చదవండి: అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను: నయన్) -
దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శోభన్బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’ చిత్రాలను తెరకెక్కించారు చక్రవర్తి. ఇంకా ‘నిప్పులాంటి మనిషి’, ‘కాష్మోరా’ వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారాయన. 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రం మంచి విజయం సాధించింది. ‘‘చక్రవర్తిగారు చాలా సినిమాలకు కో డైరెక్టర్గా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు. మూసాపేటలోని తన నివాసంలో నిద్రలోనే హార్ట్ ఎటాక్తో చక్రవర్తిగారు మృతి చెందారు. శుక్రవారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. జూనియర్స్కి కూడా ఎన్బీగారు ఎంతో సపోర్ట్గా ఉండేవారు. ఎవర్నీ హర్ట్ చేయకుండా మాట్లాడే మంచి గుణం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుగు చలన చిత్రదర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ తెలిపారు. చక్రవర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ఎవరిని వదిలి పెట్టడం లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల దర్మక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తేజ పాల్గొన్నారు. అనంతరం షూటింగ్ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోగా తేజకు పాజిటివ్గా తేలింది. (కరోనా నుంచి కోలుకున్న బిగ్ బి) కాగా ఈ విషయంపై తేజ స్పందిస్తూ.. ‘అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే నేను షూటింగ్కు వెళ్లి కరోనా తెచ్చకున్నా. మా షూటింగ్లో సభ్యులకు గానీ, మా కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదు. నా ఒక్కడికే కరోనా పాజిటివ్, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నా’ అని తెలిపారు. మరోవైపు తేజకు కరోనా సోకిన విషయం తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ తేజ నెల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన తేజ.. ఇప్పుడు ఆ మహమ్మారి బారిన పడటం గమనార్హం. (దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్) Director @tejagaru about spreading #CoronavirusIndia. #StaySafe pic.twitter.com/lD9R1ZtPtM — Vamsi Shekar (@UrsVamsiShekar) June 12, 2020 -
సీసీసీకి టాలీవుడ్ డైరెక్టర్ విరాళం..
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంపత్ నంది కోరారు. -
కరోనా వైరస్ గురించి అతనికి ముందే తెలుసా?
కరోనా వైరస్ ... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు ఇది. 135 దేశాలకుపైగా వ్యాపించిన ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మరిగా ప్రకటించింది. అనేక దేశాలు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తాజాగా హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘కంటాజియన్ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది. ఇప్పుడంతా ఆ సినిమాను డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ సినిమాలో కూడా చైనా నుంచి ఓ అంటువ్యాధి ప్రబలి... అన్ని దేశాలకు విస్తరిస్తుంది. దీంతో ఆ డైరెక్టర్కు ముందే ఈ వైరస్ గురించి ఎలా తెలుసు అనే చర్చ జరుగుతోంది. ఇది యాదృశ్చికమా? లేక ముందుగానే ఆ దర్శకుడికి ఈ అంటువ్యాధి గురించి తెలుసా? అని సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు ఆ సినిమాలు ఈ వైరస్ గురించి ఏం చెప్పారో ఒకసారి పరిశీలిద్దాం. 2011లో స్టీవెన్ సోడెన్ బర్గ్ దర్శకత్వలో మాట్ డామన్, జూడ్లా, గ్వినేత్ పాల్ట్రో నటించిన హాలీవుడ్ చిత్రం కంటాజియన్ ( అంటువ్యాధి). ఈ సినిమాలో కూడా చైనాలోని హుబెయ్ ఫ్రావిన్స్లో కరోనా లాంటి ఒక కొత్త వైరస్ పుట్టినట్టు ఒక వైరస్ పుడుతుంది. ఈ వైరస్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్వోతూ ఉంటారు. ఈ వైరస్ కూడా ఒకరి నుంచి మరొకరికి దగ్గు తుంపరులు ద్వారా, తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే ఈ వైరస్ మూల కారణం ఏంటో శాస్త్ర్రవేత్తలకు కూడా అంతు చిక్కదు. అయితే ఈ సినిమా చివరిలో వైరస్ వ్యాప్తికి గబ్బిలాలు కారణమని తెలుస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్కు కూడా అవే లక్షణాలు ఉండటం. కరోనా కూడా ఆ సినిమాలో చూపించిన విధంగా వ్యాప్తి చెందుతుండటంలో ఈ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. -
ఇప్పుడు జరుగుతుంది 2011లోనే ఎలా తెలిసింది?
-
పునాదిరాళ్లు డైరెక్టర్ రాజ్కుమార్ కన్నుమూత
-
'అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు'
న్యూయార్క్ : 25 ఏళ్ల క్రితం మూవీ డైరెక్టర్ హార్వే వెయిన్స్టీన్ తనను అతి దారుణంగా రేప్ చేశాడంటూ హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా గురువారం కోర్టు హాలులో భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు హాలులో జడ్జి జోన్ లూజీ ఓర్బన్ ఎదుట తన వాదనను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. నటి అన్నాబెల్లాను దారుణంగా రేప్ చేశాడన్న ఆరోపణలతో అప్పట్లోనే వెయిన్స్టీన్పై కేసు నమోదైంది. కానీ ఇంతవరకు ఈ కేసులో సరైన నిజాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి వాదనకు వచ్చిన కేసులో అన్నా తన వాదనలు వినిపించారు. '1994లో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో డైరెక్టర్ హార్వే తన కారులో దింపుతానని నన్ను ఎక్కించుకున్నాడు. న్యూయార్క్లోని మహట్టన్ అపార్ట్మెంట్ దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. తర్వాత నేను పడుకోవడానికి సిద్దమవుతుండగా డోర్ తలుపును ఎవరో కొట్టినట్లు అనిపించింది. డోర్ తెలిచి చూడగానే డైరెక్టర్ హార్వే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని ప్రవర్తన నాకు ఏదో అనుమానంగా కనిపించింది. ఆ సమయంలో నా శరీరం మొత్తం వణుకు పుట్టింది. అయినా దైర్యం తెచ్చుకొని ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేలోపే హార్వే నన్ను బలవంతం చేయబోయారు. నేను వద్దని వారించినా వినకుండా బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నా చేతులను మంచానికి కట్టేసి దారుణంగా రేప్ చేశారు. నిజంగా ఆ రాత్రి నాకు కాళరాత్రిగా మిగిలిపోయింది. వెయిన్స్టీన చేసిన పని నా జీవితంలో ఒక చేదు ఘటనగా మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా ఆ రాత్రి జరిగిన ఘటన ఇప్పటికి గుర్తుందంటూ' 59 ఏళ్ల అన్నాబెల్లా సియోరా చెప్పుకొచ్చారు. అయితే అన్నా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హార్వే వెయిన్స్టీన్ కోర్టు హాలులోనే ఉండడం గమనార్హం. ఆ సమయంలో హార్వే మొహం ఎలాంటి ఆందోళన కనిపించలేదు. దీంతో పాటు వెయిన్స్టీన్ 80 మందిని లైంగికంగా వేదించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.అందులో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ పేరు కూడా ఉండడం విశేషం. కాగా అన్నా వాదనల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తేల్చడానికి శుక్రవారం సైకియాట్రిస్ట్ డాక్టర్ను రప్పించాలని కోర్టు ఆదేశించింది. -
బీజేపీలోకి నమిత, రాధారవి
సాక్షి, చెన్నై: సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. శనివారం చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు కాషాయం కండువా కప్పుకున్నారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్ అభినందనలు తెలియజేశారు. అయితే సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. -
భాగ్యరాజ్ చూపిన స్త్రీలు
కె.భాగ్యరాజ్ తన గురువు కె.భారతీరాజా తీసిన ‘ఎర్రగులాబీలు’ సినిమాకు కథ అందించాడు. ఆ సినిమా సూపర్హిట్ అయ్యింది. స్త్రీల వంచన వల్ల మోసపోయిన మగవారు ఆ స్త్రీల మీద పగ తీర్చుకోవడానికి ‘సైకో’లుగా మారే కథ ఇది. తమిళనాడులో 1960ల నాటి సైకో కిల్లర్ రమణ్ రాఘవ్ను ఈ కథకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎర్రగులాబీలలో ఒక సవతి తల్లి, కాలేజీ అమ్మాయి, గృహిణి మగవారిని వంచించడం కనిపిస్తుంది. భాగ్యరాజ్ తీసిన మరో ముఖ్యమైన సినిమా ‘అంద ఏళు నాట్కల్’ (ఆ ఏడు రోజులు) స్త్రీ హృదయానికి, సంప్రదాయానికీ మధ్య జరిగే సంఘర్షణను చూపిస్తుంది. ఈ సినిమాలో తను ప్రేమించిన అబ్బాయిని చేసుకునే వీలు లేక అంబిక మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి నుంచి బయటపడాలనుందని తన ప్రియుణ్ని పెళ్లి చేసుకోవాలని ఉందని శోభనం నాడే భర్తకు చెబుతుంది. ఆ భర్త ఆ ప్రియుణ్ణి వెతుకుతాడు. కానీ ఆ ప్రియుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించడు. ఆమె పట్ల తనకు చాలా ప్రేమ ఉన్నా భారతీయ సంప్రదాయంలో తాళికి చాలా విలువ ఉందని, ఒకసారి తాళి కట్టించుకున్న స్త్రీ మరొకరి సొంతం కాజాలదని చెప్పి వెళ్లిపోతాడు. ఈ సినిమా తెలుగులో ‘రాధా కల్యాణం’గా రీమేక్ అయ్యింది. ఈ సినిమాయే ఆ తర్వాత ‘మౌనరాగం’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలకు ఆధారం అయ్యింది. ‘చిన్నవీడ్’ సినిమా ‘స్త్రీ సహనాన్ని’ చూపిస్తుంది. ఇందులో హీరోగా వేసిన భాగ్యరాజ్ పెళ్లయిన తర్వాత తన భార్య స్థూలకాయంతో ఉందని మరొకరితో సంబంధం పెట్టుకుంటాడు. ఈ సంగతి భార్యకు తెలుస్తుంది. అయితే ఆమె అతనితో ఘర్షణకు దిగకుండా, అతనితో వేరు పడకుండా ఎంతో ఓపికగా ఉండి మనసు మార్చుకుంటుంది. ఈ సినిమాయే కమలహాసన్ ‘సతీ లీలావతి’గా, నిన్న మొన్న అల్లరి నరేశ్ ‘కితకితలు’గా వచ్చింది. భాగ్యరాజ్ తీసిన ‘ముందానై ముడిచ్చు’ సినిమా తెలుగులో ‘మూడుముళ్లు’గా వచ్చింది. ఇందులో భార్య చనిపోయి ఒక బిడ్డకు తండ్రిగా ఉన్న చంద్రమోహన్ ఒక పల్లెటూళ్లో స్కూల్ టీచర్గా పని చేస్తుంటాడు. రెండో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన భార్య సవతి తల్లిగా తన బిడ్డను ఏ బాధలు పెడుతుందోనని పెళ్లే చేసుకోనంటాడు. కానీ అతని మీద ప్రేమ పెంచుకున్న ఆ ఊరి అమ్మాయి రాధిక అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చివరకు అతని కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడానికి కూడా సిద్ధమైపోతుంది. ఆమెను హాస్పిటల్లో నిస్సహాయ స్థితిలో చూసిగానీ ఆమె ప్రేమను నమ్మడు చంద్రమోహన్. ‘చిన్నరాజా’ సినిమాలో సవతితల్లి ఆస్తి కోసం భర్త నడుములు విరిగేలా చేస్తుంది. సవతి కొడుకును ఉత్త వెంగళాయిగా పెంచుతుంది. చివరకు పాలలో విషం కలిపి అతడి వారసుణ్నే చంపాలనుకుంటుంది. ఆ సంగతి తెలిసినా సవతి తల్లి మీద నమ్మకంతో ఆమె కళ్లెదుటే ఆ పాలు తాగుతాడు భాగ్యరాజ్. అతను చావుబతుకుల్లోకి వెళితే తప్ప ఆ సవతి తల్లిలో పరివర్తన రాదు. ఈ సినిమా తెలుగులో ‘అబ్బాయిగారు’గా వచ్చింది. ‘సుందరకాండ’ సినిమాలో కేన్సర్ ఉన్న అమ్మాయి సుమంగళిగా చనిపోవాలని అనుకుంటుంది. వివాహితుడైనప్పటికీ లెక్చరర్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆమె చనిపోతుందని తెలిసి ఆ లెక్చరర్ భార్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని భర్తతో చెబుతుంది. అయితే ఈలోపే ఆ అమ్మాయి మరణిస్తుంది. భాగ్యరాజ్ సినిమాలలో హీరోను హీరోయిన్లు యథాతథంగా స్వీకరించాల్సిన స్థితి ఉంటుంది. అతడి ‘డార్లింగ్ డార్లింగ్’లో హీరోయిన్ శ్రీమంతురాలు, హీరో వాచ్మన్ కొడుకు. ఆమెకు అతని మీద ఏ అభిప్రాయమూ లేకపోయినా చిన్నప్పటి నుంచి ఆమెను ఆరాధిస్తున్న హీరో తన ఆరాధనను తెలిసేలా చేసి పెళ్లి చేసుకుంటాడు. ‘రాసకుట్టి’ సినిమాలో హీరో పల్లెల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ డాక్టర్ గెటప్లో, లాయర్ గెటప్లో ఫొటోలు దిగి కాలక్షేపం చేస్తుంటాడు. అతడు విద్యాధికుడు అని నమ్మిన హీరోయిన్ చివరకు ఆ మోసం తెలిసి నిరాకరిస్తుంది. కానీ హీరో ఇలాంటి షోకిల్లారాయుడైనా హీరోయిన్ చివరకు అతణ్ణే పెళ్లి చేసుకోక తప్పని విధంగా హీరో క్యారెక్టర్ ఆ తర్వాత తీర్చిదిద్ద బడుతుంది. ఈ సినిమా హిందీలో ‘రాజాబాబు’గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.మొత్తంగా చూస్తే భాగ్యరాజ్ పితృస్వామ్య సంస్కృతిలో సగటు పురుషుడు స్త్రీని ఎలా చూస్తాడో చూడాలనుకుంటాడో అలా చూపడానికే ఎక్కువ ఇష్టపడ్డాడని అనిపిస్తుంది. అదే భావజాలం స్త్రీలకూ నూరిపోయబడ్డది కాబట్టి అతని సినిమాలన్నీ హిట్ అయ్యాయి. -
నా చిత్రం కంటే కూడా..
తమిళ సినిమా : నటుడు విక్రమ్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. అవును ఇది ఆయన సంతోషంలో మునిగిపోతున్నారు. ఇందుకు కారణం విక్రమ్ వారసుడు దృవ్విక్రమ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆదిత్యవర్మ’. గత 22వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్రెడ్డి చిత్రానికి రీమేక్ అదిత్యవర్మ. దృవ్విక్రమ్ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా బవిటసందు అనే బాలీవుడ్ నటి హీరోయిన్గా పరిచయమయ్యింది. అర్జున్రెడ్డికు కో–డైరెక్టర్గా పనిచేసిన గిరీసాయి ఆదిత్యవర్మ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ముఖేశ్మెహ్తా నిర్మించిన చిత్రం ఆదిత్యవర్మ. కాగా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ కృతజ్ఞతలు చెప్పడానికి ఆదివారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో మీడియాతో సమావేశమయ్యారు. చిత్ర దర్శకుడు గిరీసాయి మాట్లాడుతూ ఈ చిత్రానికి నటుడు విక్రమ్ సహకారం ఎంతో ఉందన్నారు. ఆయన లేకుంటే ఆదిత్యవర్య లేదన్నారు. దృవ్విక్రమ్ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆదిత్య పాత్రకు దృవ్ ప్రాణం పోశారని అన్నారు. భవష్యత్లో ఆయన పెద్దస్టార్ హీరో అవుతారని అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశం కలి్పంచిన చిత్ర నిర్మాతలకు, నటుడు విక్రమ్కు దన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఆదిత్యవర్మ చిత్రం కోసం తనకుంటే ఎక్కువగా తన తండ్రి విక్రమ్ శ్రమించారని చెప్పారు. ఆయన ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారించేవారని అన్నారు. తన తండ్రి ఈ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమించినట్లు తెలిపారు. నాన్న లేకపోతే తాను లేనన్నారు. నాన్నకు తాను పెద్ద అబిమానిని చెప్పారు. ఆయన కోసం ఒక కథను తయారు చేసి తానే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. ఆదిత్యవర్మ చిత్రం సమష్టి కృషి అని, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. సంగీత దర్శకుడు రతన్ తనతో ఈ చిత్రంలో ఒక పాటను కూడా పాడించారని తెలిపారు. నటుడు విక్రమ్ మాట్లాడుతూ ఇప్పుడు తాను చెప్పేదేమీ లేదని, ఆదిత్యవర్మ చిత్రం గురించి ప్రేక్షకులే చెబుతున్నారని అన్నారు. తాను నటించిన చిత్రం విడుదల కంటే తన కొడుకు నటించిన చిత్రం విడుదలే పెద్ద విషయంగా ఉందన్నారు. చాలాసంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్రెడ్డి దర్శకుడు సందీప్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అదేవిధంగా తన కొడుకును కథానాయకుడిగా పరిచయం చేసిన నిర్మాత ముఖేశ్ మెహ్తా, చిత్ర దర్శకుడు గిరిసాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని విక్రమ్ పేర్కొన్నారు. -
దర్శకులుగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
డాక్టర్ను కాబోయి యాక్టర్నయ్యానని చాలా మంది నటులు చెబుతుంటారు. అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లం కాబోయి డైరెక్టర్లమయ్యామంటున్నారు నేటితరం దర్శకులు. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల మొదలుకుని నిన్నటి క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్ పంగులూరి వరకు పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఐటీ రంగం నుంచి ఎందరో ప్రతిభాశాలురు దర్శకులుగా పరిచయమవుతున్నారు. శేఖర్ కమ్ముల స్ఫూర్తిగా చాలా మంది యువ దర్శకులు సాఫ్ట్వేర్ కొలువులను పక్కనబెట్టి దర్శకత్వంలో రాణిస్తున్నారు. హిట్ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఇప్పుడంతా ఐటీ రంగం నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల హవా కొనసాగుతోంది. – బంజారాహిల్స్ సాక్షి, హైదరాబాద్ : ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా, గౌతం (జెర్సీ), తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) వెన్నెల కిశోర్ (జఫ్పా), ప్రవీణ్ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత), సందీప్ (అర్జున్రెడ్డి), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), నీలకంఠ (మిస్సమ్మ).. ఇలా చెబుతూపోతే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్ సత్తారు సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు. అర్జున్రెడ్డి సినిమాతో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ సందీప్ చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. వెన్నెల కిశోర్ సాఫ్ట్వేర్ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మొదట్లో దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది. సీన్ వివరిస్తున్న శేఖర్ కమ్ముల సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే.. మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని. హైటెక్ సిటీలో 14 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. భావోద్వేగాలతో మనసుల్ని రంజింపజేసి మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామన్న నమ్మకం నాకు ఉంది. దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే ఈ సినిమా రూపొందించాను. – అనిల్ పంగులూరి, ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు దర్శకుడు సందీప్, అనిల్ పంగులూరి సినిమాలపై మోజుతో.. మాది విజయవాడ. ఎంటెక్ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని. ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఫిలింనగర్లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమా. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. – శ్రీహర్ష మందా, ‘రామచక్కని సీత’ దర్శకుడు -
థియేటర్ల బ్లాక్బస్టర్
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : తమకు ఇష్టమైన నటుడి సినిమాను విడుదల రోజు మొదటి ఆట (బెనిఫిట్ షో) చూసేందుకు అభిమానులు చాలా ఉత్సాహం చూపుతుంటారు. అభిమానుల ఆత్రుతను ఆసరా చేసుకుంటున్న థియేటర్ల నిర్వాహకులు అభిమానులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్ వాస్తవ ధర కన్నా.. కొన్ని రెట్లు ఎక్కువ వసూలు చేస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. ఈ నెల 30న ఓ ప్రముఖ తెలుగు హీరో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాశాయి. బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీకి ఒకరోజు ముందు అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అడ్డం పెట్టుకుని థియేటర్ల యజమానులు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో సినిమా టికెట్ల ధరలు తరగతులను బట్టి రూ.40, రూ.70, రూ.120, రూ. 150గా ఉంటాయి. పెద్ద హీరోలు, ఎక్కువ బడ్జెట్తో నిర్మించిన సినిమాలు వచ్చినప్పుడు చిత్ర నిర్మాణ సంస్థలు సినిమా విడుదలైన మొదటి వారం, పదిరోజుల పాటు సాధారణ రోజుల్లో ధరల కంటే అదనంగా విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకుంటాయి. ఈనెల 30న విడుదల కాబోయే సినిమాకు కూడా అనుమతులు తీసుకున్నారు. అనుమతులకు అనుగుణంగా తరగతుల వారీగా రూ.50, రూ.100, రూ.200 కు టికెట్లను విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఈ రేట్లకు ఏమాత్రం సంబంధం లేకుండా టికెట్ల ధరలను థియేటర్ల యాజమాన్యాలు భారీగా పెంచేశాయి. అనుమతులు తీసుకున్న దానికన్నా.. ఎక్కువ ధరలకు విక్రయించేందుకు సినిమా డిస్ట్రిబ్యూటర్లు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఏలూరులో రూ.50కి విక్రయించాల్సిన టికెట్ను రూ.300కు, రూ.100కి విక్రయించాల్సిన టిక్కెట్ను రూ.400కు, రూ.200కు విక్రయించాల్సిన టిక్కెట్ను రూ.1000కు అమ్ముతున్నట్టు సమాచారం. భీమవరంలో రూ.200కు అమ్మాల్సిన టిక్కెట్ను రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకూ అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభిమాన సంఘాల నాయకుల ఆందోళన సాధారణంగా బెనిఫిట్ షో టికెట్లను అభిమాన సంఘాల నాయకులు తీసుకుంటుంటారు. ఈ సినిమా టిక్కెట్లనూ తీసుకునేందుకు అభిమాన సంఘ నేతలు డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా తాము నిర్ణయించిన ధరలను చెల్లించి టికెట్లను తీసుకోవాలని చెప్పినట్టు అభిమాన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో చేసేది లేక ఆ ధరలకే టికెట్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ విక్రయాలు స్టాప్ ప్రతి సినిమా విడుదల తేదీ ముందు నుంచే ఆయా షోల టికెట్లను థియేటర్ల నిర్వాహకులు ఆన్లైన్లో విక్రయాలకు ఉంచుతుంటారు. కానీ పెద్ద హీరోల సినిమా టికెట్లను మొదటి రెండు, మూడు రోజుల పాటు ఆన్లైన్లో పెట్టకుండా అదనపు ధరలకు విక్రయిస్తూ ప్రేక్షకుల జేబులను కొల్లగొడుతున్నారు. టికెట్ల ధరలను మొదటి వారం రోజులపాటు పెంచి విక్రయించుకొనేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ విక్రయించే ధరలను థియేటర్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ థియేటర్ల నిర్వాహకులు ఆ విధంగా చేయడం లేదు. ఇలా చేయకపోవడం కూడా చట్ట విరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. పోలీసుల పాత్రపై అనుమానాలు సినిమా టికెట్ల ధరలను నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ బెనిపిట్ షోల టికెట్లను అదనపు ధరలకు విక్రయించుకునేందుకు పోలీసు శాఖ అధికారులూ సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పోలీసు అధికారులు ఇలాగే అనుమతులు ఇవ్వడం, దీనిపై సాక్షిలో కథనాలు రావడంతో విచారణ జరిపి గతంలో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కనీస సదుపాయాల్లేవు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో సాధారణ ధరల కంటే ఎక్కువకు విక్రయించుకునేందుకు అనుమతులను తీసుకువస్తున్నారు. దీంతో పాటు బెనిఫిట్ షో టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనిలో చూపిస్తున్న శ్రద్ధ థియేటర్లలో ప్రేక్షకులకు వసతులు కల్పించడంలో చూపడం లేదు. దీనిపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. – జి.శివకుమార్. డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం కొత్త సినిమాల విడుదల సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు టికెట్లు అమ్మితే ఊరుకోం. బుధవారం సినిమా థియేటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతాను. నిబంధనలు ఏం చెబుతున్నాయో, దానికి అనుగుణంగా టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటాం. – దిలీప్కిరణ్, ఏలూరు డీఎస్పీ -
మోసం కేసులో దర్శకుడు అరెస్ట్
పెరంబూరు: నగదు మోసం కేసులో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్ట్ చేసి పుళళ్ జైలుకు తరలించారు. కమరకట్టు అనే చిత్ర దర్శకుడు రాంకీ రామకృష్ణన్. ఈయన నర్తకి చిత్ర దర్శకురాలు విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్లతో కలిసి ఇదయం తిరైయరంగం అనే చిత్ర నిర్మాణం చేపట్టారు. అందుకుగానూ షావుకార్పేటకు చెందిన అశోక్ అనే ఫైనాన్షియర్ వద్ద రుణం తీసుకున్నారు. అందుకు బుదులుగా ఆస్తుల పట్టాలను కుదవ పెట్టారు. అయితే చెప్పిన తేదీకి తీసుకున్న నగదు రూ.4.60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు రాంకీ రామకృష్ణన్, విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్లను బుధవారం అరెస్ట్ చేసి పుళళ్ జైలుకు తరలించారు. -
మురుగదాస్కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: సర్కార్ మూవీ తమిళనాట పలు వివాదాలకు కేంద్రబిందువవుతోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని పాలక ఏఐఏడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈనెల 27 వరకూ సర్కార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ను అరెస్ట్ చేయవద్దని మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐఏడీఎంకే నేతలు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు తలొగ్గిన చిత్ర మేకర్లు వివాదాస్పద సంభాషణలను తొలగించేందుకు అంగీకరించారు. చిత్ర దర్శకుడు మురుగదాస్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించారు. ఏ ఒక్కరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని మురుగదాస్ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా మురుగదాస్ను అరెస్ట్ చేసేందుకు చెన్నై పోలీసులు సిద్ధమయ్యారని గురువారం రాత్రి చిత్ర నిర్మాతలు సన్ పిక్చర్స్ ట్వీట్ చేయగా, పోలీసు అధికారులు దీన్ని తోసిపుచ్చారు. రొటీన్ గస్తీలో భాగంగా ఆ ప్రాంతంలో పోలీస్ బృందం పహారాలో ఉందని వివరణ ఇచ్చారు. మరోవైపు గత రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తన తలుపు తట్టారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో వారు వెనుదిరిగారని, ప్రస్తుతం తన ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తనకు తెలిసిందని దర్శకుడు మురుగదాస్ ఆ తర్వాత ట్వీట్ చేశారు. సర్కార్ మూవీకి నిరసనల సెగతో రజనీకాంత్, కమల్హాసన్ చిత్ర బృందానికి బాసటగా నిలిచారు. ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి చర్యలను ఎంచుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కాగా సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు.విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజులకే రూ 100 కోట్ల క్లబ్లో చేరింది. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్గా, డిఫరెంట్గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
అలరిస్తున్న అల్లుడు
-
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్డే టైమ్లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
‘యువసామ్రాట్’ వద్దన్నా
‘‘సక్సెస్ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో, డైరెక్టర్దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఎస్. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఫుల్గా ఈగో ఫీల్ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్ బ్రేక్ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్కు మరింత చేరువ అవుతాను. ► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్ చేయడం కాస్త నెర్వస్గా అనిపించింది. ► ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చడం కరెక్ట్ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో ఏది సక్సెస్ కావాలంటే.. రెండూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ► యువసామ్రాట్ ట్యాగ్ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్ను పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చదువుతాను. నెగటివ్ కామెంట్స్ను పాజిటివ్గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా. ► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్లో రిలీజ్ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్లో చేయబోతున్న సినిమా అక్టోబర్ ఫస్ట్ వీక్లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్ రవీంద్రన్ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్ మీడియా వైపు మా బ్యానర్ ఫోకస్ పెట్టింది. కొన్ని వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నాం. ► కొత్త డైరెక్టర్స్ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్’కు బాగా కనెక్ట్ అయ్యాను. ► పెళ్లి తర్వాత లైఫ్ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్ సూపర్గా సాగడం హ్యాపీగా ఉంది. ► కెరీర్ పరంగా యాక్టర్స్ అందరికీ థ్రెట్ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. -
లంచ్ ఆల్సో.. వర్క్ ఆల్సో...
ఇక్కడ ఇన్సెట్లో ఉన్న ఫొటోలో కంగనా రనౌత్ను చూశారుగా! కంగనా ముఖం మీద కనిపించే రక్తం అంతా తనది కాదు. కొంచెం శత్రువులది కూడా. అవును.. కంగనా రనౌత్ ప్రస్తుతం యాక్షన్ మోడ్లో ఉన్నారు. ఆమె టైటిల్ రోల్లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ప్యాచ్ వర్క్ నిమిత్తం ఈ సినిమాకు తాత్కాలిక దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు కంగనా రనౌత్. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ ఈ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో కత్తి పట్టి శత్రువులు అంతు చూస్తున్నారట కంగనా. అలాగే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సోనూ సూద్ ప్లేస్లో మహ్మాద్ జీషన్ అయూబ్ రీప్లేస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ టాక్. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో కబడ్డీ నేపథ్యంలో రూపొందనున్న ‘పంగ’ సినిమా పనులు కూడా మొదలయ్యాయి. రీసెంట్గా ఈ టీమ్ అంతా కంగనా ఇంట్లో లంచ్ చేశారు. ఓన్లీ లంచ్ మాత్రమే కాదు వర్క్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో..’లా ‘లంచ్ ఆల్సో.. వర్క్ ఆల్సో’ అన్నమాట. -
కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్
‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్ (హీరో క్యారెక్టర్కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం. ► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ పర్సన్. ► ఫస్ట్ యూత్ఫుల్ స్టోరీ (‘ఈ రోజుల్లో’), హారర్ కామెడీ (ప్రేమకథా చిత్రమ్), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ (‘భలే భలే మగాడివోయ్’) తీశాం. ఇప్పుడు ఫుల్లెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ టచ్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం. ► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు. రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను. ► అనూ ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, ప్రసాద్గార్లు రిచ్గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా రిచ్గా ఉంటుంది. ► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్ వర్క్ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్ చేయడం గ్రేట్. కొత్తవాళ్ల పోస్టర్స్తో ఆడియన్స్ను థియేటర్కి తీసుకురావడం గ్రేట్. -
లవ్ ఇన్ యూరప్
‘సాహో’ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు ముహూర్తం పెట్టేశారు హీరో ప్రభాస్. పూర్తి లవ్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈ సినిమాకు గురువారం కొబ్బరికాయ కొట్టారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్లో జరిగింది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బిల్లా’ తర్వాత ప్రభాస్ హీరోగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ఇది కావడం విశేషం. ఈ పీరియాడికల్ లవ్స్టోరీలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం యూరప్లో జరగనుంది. ‘‘నా నెక్ట్స్ సినిమా లాంచ్ ఇవాళ జరిగింది. ఈ ప్రాజెక్ట్పై చాలా ఎగై్జటెడ్గా ఉన్నాను. గోపీకృష్ణ మూవీస్, యూవీ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది’’ అని ప్రభాస్ పేర్కొన్నారు. ఈ చిత్రం 2020లో రిలీజ్ కానుంది. ఈనెల 20న షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్ రిలీజ్
నాగచైతన్య. మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ ట్రైలర్లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ మారుతి గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులకు ఫుల్ కామెడీ అందించడానికి సిద్దమయ్యాడు. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్ డైలాగ్స్, ట్విస్ట్లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్లోనూ తన మార్క్ కనిపంచేలా చేశాడు. వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ పంచ్లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. -
హరి అన్న మొండితనం ఉన్న మంచి మనిషి
1977లో చేసిన ‘దాన వీర శూర కర్ణ’ తర్వాత హరికృష్ణ మళ్లీ స్క్రీన్ పై కనిపించింది 1998లో ‘శ్రీరాములయ్య’ చిత్రంలోనే. ఎన్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హరికృష్ణ కామ్రేడ్ సత్యం క్యారెక్టర్ చేశారు. హరికృష్ణ మృతిపట్ల శంకర్ స్పందిస్తూ – ‘‘మంచి మనసున్న వ్యక్తి హరికృష్ణగారు. అలాంటి కల్లాకపటం, కల్మషం లేని వ్యక్తి ఇక మన మధ్య లేరని తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా గ్యాప్ తర్వాత ‘శ్రీరాములయ్య’ సినిమాలో సత్యం అనే విప్లవ వీరుడి క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా నటించి అఖండ ప్రేక్షకాదరణ పొందారు. ఈ సినిమా కోసం ‘పీపుల్స్ వార్ ఫౌండర్’ సత్యమూర్తిగారు రాసిన ‘విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ... నీకిస్తా తమ్ముడా.. నీకిస్తా తమ్ముడా’ అనే సాంగ్లో హరికృష్ణగారి అభినయం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా ఉంటుంది. ఆయన ఎంత మొండివాడంటే ఈ సాంగ్ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు ఆయన ఒక బరువైన చెట్టు మొదలుని భుజం మీద పెట్టుకుని పాడాలి. ఆ టైమ్లో మేము హైదరాబాద్ నుంచి డమ్మీ తెప్పించాలనుకున్నాం. కానీ ఆ ప్రాసెస్ డిలే అయ్యింది. షూటింగ్ రేపు పెట్టుకుందామని అన్నాం. అక్కర్లేదు. ఇక్కడున్న ఓ మొద్దుతో కానివ్వండి అన్నారు. ఇద్దురు వ్యక్తులు ఓ బరువైన మొద్దును ఎత్తి ఆయన భుజంపై పెట్టారు. ఆయన ఒక్కరే మోసారు. దీంతో అక్కడున్న మేమందరం షాక్ అయ్యాం. ఆ వయసులో కూడా ఆయనకు అంత సాహసం, మొండితనం ఉండేవి. ఆ కుటుంబానికే సినిమా అంటే అంత కమిట్మెంట్ ఉందనిపించింది. మంచితనం, మొండితనం ఉన్న మంచి వ్యక్తి హరి అన్న. నందమూరి కుటుంబ సభ్యులు తెల్లవారు జాము నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. ‘శ్రీరాములయ్య’ షూటింగ్ అప్పుడు నా గది, హరికృష్ణగారి గది పక్క పక్కనే ఉండేవి. నేనేమో నిద్ర పోతుంటే ఆయన నాలుగున్నరకే నిద్ర లేచి, రెడీ అయ్యి నన్ను లేపేవారు. ఆ క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయాను. హరి అన్న ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పైకి గంభీరంగా కనిపించే హరి అన్న నిజానికి చాలా సరదా మనిషి. ‘మీ బుగ్గలు బాగున్నాయి’ అంటూ నన్ను సరదాగా ఆటపట్టించేవారు. లొకేషన్లో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవారు. ఆయన్ని దగ్గరగా చూసినవాళ్ళకే హరి అన్న ఎంత మంచి మనిషో అర్థం అవుతుంది’’ అన్నారు. -
అరుదైన ఫొటోను షేర్ చేసిన క్రిష్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం యావత్తు తెలుగు ప్రజలను కలిచివేస్తోంది. హరికృష్ణ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.. సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. దివంగత నేత `ఎన్టీఆర్` బయోపిక్ను రూపొందిస్తున్న డైరెక్టర్ క్రిష్ కూడా హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్న వయసులో తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ ఫొటోను ట్విట్ చేశారు. దీనికి క్యాప్షన్గా `మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథ్యం.. చిన్న నాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం.. 1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ` అంటూ పేర్కొన్నారు. (చదవండి: కలవాలి తమ్ముడు అన్నారు కానీ..) మార్పుకోసం రామ రధ చక్రాలు నడిపిన చైతన్యరధసారధ్యం చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడచిన వారసత్వం#NandamuriHarikrishna garu leading NTR garu during the National Defence Fund activity in 1962.. pic.twitter.com/8LXvDP8Dzw — Krish Jagarlamudi (@DirKrish) August 29, 2018 హీరో ప్రభాస్ సైతం ఫేస్బుక్ పేజిలో హరికృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ‘హరికృష్ణ గారి మరణం బాధ కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని ప్రభాస్ ఫేస్బుక్ పోస్ట్ చేశాడు. చదవండి: ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! హరికృష్ణ మరణం : సమంతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
కొంత లాభం ఊరి కోసం!
పంపిణీరంగంలో ఉన్నవారు నిర్మాతలుగానూ మారుతుంటారు. ఉదాహరణకు ‘దిల్’ రాజు ఒకరు. ఇప్పుడు పంపిణీ రంగం నుంచి సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మాతలగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఈ ఇద్దరూ ఓ బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. బ్యానర్ లోగోను నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, అశోక్ రెడ్డిలతో పాటు ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. ఈ బ్యానర్లో చిన్నికృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుందన్న విషయాన్ని ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ, ‘ఈ మాయ పేరేమిటో’ హీరో రాహుల్ విజయ్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘సురేశ్, అహితేజలు బ్యానర్ పెడుతున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యా. వీళ్లు పెద్ద ప్రొడ్యూసర్స్ కావాలి. ఈ బ్యానర్లో మంచి మంచి సినిమాలు రావాలి’’అన్నారు. ‘‘టీజర్, ట్రైలర్ చూడగానే సురేశ్, అహితేజలు ఆ సినిమా స్కేల్ను అంచనా వేయగలరు. వీళ్లకు ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ లైఫ్ ఉండాలి’’అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘వీరిద్దరిలో ఒకరు బాధ్యతను గుర్తు చేస్తే, మరొకరు ధైర్యాన్ని ఇస్తారు. ఇటువంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం అన్నారు’’ చిన్నికృష్ణ. ‘‘వీళ్లు తప్పకుండా సక్సెస్ కావాలి’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడి వరకు రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సురేశ్ వర్మ. ‘‘నాకు సినిమా అంటే చిరంజీవిగారే. ఈ వేదిక మీద మా అన్నయ్య ప్రవీణ్ను మిస్ అవుతున్నాను. మా మొదటి సినిమా నుంచే మాకు వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగు కోసం ఖర్చుపెడతాం’’ అన్నారు అహితేజ. -
మాలీవుడ్ కాలింగ్
సన్నీ లియోన్.. నేషనల్ వైడ్గా ఫాలోయింగ్ ఉన్న హాట్ స్టార్. బాలీవుడ్ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్తో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ‘వీర మహాదేవి’లో హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ సన్నీకి స్వాగతం పలికిందట. ‘ఒరు అడార్ లవ్’ రూపొందించిన ఒమర్ లులూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను కొట్టి నేషనల్ పాపులారిటీ వచ్చేసింది ‘ఒరు అడార్ లవ్’ సినిమాకే. రంజాన్ పండుగకే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనుకోని కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఒమర్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్ర చేయనున్నారట సన్నీ. జయరామ్, హనీ రోస్ ముఖ్య తారలు. -
అఫీషియల్: ఎన్టీఆర్లో రానా
నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ ఆయన తనయుడు బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంపార్టెంట్ అప్డేట్ అందింది. యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టులో భాగంగా కానున్నట్లు అఫీషియల్గా ప్రకటించాడు. ‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ బాలయ్య, క్రిష్లతో ఓ సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానా.. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడి పాత్రలోనే కనిపించబోతున్నాడంటూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. నందమూరి బాలకృష్ణతోపాటు విష్ణు వర్ధన్, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కైకాల సత్యనారాయణ, ప్రకాశ్ రాజ్, విద్యాబాలన్, సీనియర్ నటుడు నరేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఎన్టీఆర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. #BreakingNews: Rana Daggubati to play Andhra Pradesh CM and NTR’s son-in-law N Chandra Babu Naidu in #NTR biopic... Stars Balakrishna [as NTR] and Vidya Balan [as NTR’s wife Basavatarakam]... Directed by Krish... Produced by Balakrishna, Vishnu Vardhan Induri and Sai Korrapati. pic.twitter.com/vl31OqmodQ — taran adarsh (@taran_adarsh) 3 August 2018 -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
మారుతిగారి జోక్యం లేదు
‘‘డైరెక్టర్ మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథ రెడీ చేసి వేరే డైరెక్టర్తో చేయాలనుకుంటున్న టైమ్లో నిర్మాతలు ‘బన్ని’ వాసు, ఎస్.కె.ఎన్, ఎడిటర్ ఉద్భవ్ నా గురించి చెప్పారు. మారుతిగారు కథ చెప్పారు. బాగా నచ్చింది. డైరెక్షన్ చేస్తానని చెప్పా’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... ► నా తొలి చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ నిరాశపరచింది. అయితే సినిమా చూసినవారు సూపర్ అన్నారు. కానీ ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించలేకపోయాం. దెయ్యం కథ కావడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మహిళా ప్రేక్షకులు, పిల్లలు సినిమాకి రాలేదు. ► మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథని చక్కగా వండి నా చేతుల్లో పెట్టి వడ్డించమన్నారు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు నా బ్రదర్ చనిపోవడంతో వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ ఆగకూడదని మారుతిగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓ సీన్ డైరెక్ట్ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్స్ పిచ్చి ఉంటుంది. దాన్నే వెటకారంగా, వినోదాత్మకంగా చూపించాం. ► ఇప్పటి హీరోయిన్లు కథ, పాత్ర గురించి కాకుండా హీరో ఎవరు? బ్యానర్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈషా నా పాత్ర ఏంటి? అన్నారు. తనను చూస్తుంటే సావిత్రి, సౌందర్యగార్లను చూసినట్టు అనిపించింది. ► ‘బ్రాండ్ బాబు’ డైరెక్షన్ విషయంలో మారుతిగారు జోక్యం చేసుకోలేదు. మనం మరో సినిమా చేద్దామని మారుతిగారు అన్నారు. జ్ఞానవేల్ రాజాగారు ఓ చిత్రం చేద్దామన్నారు. ఆరేడు సెంటిమెంట్ కథలు రెడీ చేశా. నటుడిగానూ కొనసాగుతా. -
‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మంచి ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ స్పీడులోనే చకచకా ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్లో మరో సినిమాను ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు టీజర్ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్తో ఇది వరకే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కథకు మారుతి తనదైన టేకింగ్ను జోడించి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’ అనే డైలాగ్తో సినిమా థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. గోపి సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. లుక్స్ పరంగా నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకున్నారు. కీలకపాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా టీజర్ను కట్ చేశారు. ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. -
ఆందోళన అక్కర్లేదు
దర్శకుడు మణిరత్నంకు గురువారం గుండెపోటు వచ్చింది. చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు మణిరత్నం. ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శింబు, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన ఆఫీస్లో ఉండగా గుండెపోటుకు లోనయ్యారు. తక్షణం అక్కడి సిబ్బంది, కుటుంబీకులు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆçస్పత్రికి తర లించారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు చేస్తున్నారు. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. -
మారుతి కామెడీ టైమింగ్ కనిపించింది
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని. -
ఏదైనా ‘బ్రాండ్’ కావాల్సిందే...!
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రాండ్ బాబు’ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్ సమకూర్చాడు. కాగా, ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక వీక్నెస్ పెట్టే మారుతి.. ఈ చిత్రంలో హీరోకు బ్రాండ్ అనే జాడ్యాన్ని అంటగట్టాడు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని డైమండ్.. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించటం, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పటం, వాళ్లను ఎదిరించి తన ప్రేమను ఎలా గెలిపించుకోగలిగాడు. తదితర కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్ సరసన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ రిలీజ్
-
అల్లుడి సందడి
ఒక్క సాంగ్ మినహాయించి పని మొత్తాన్ని పూర్తి చేశారు శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రీసెంట్గా గుడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అనుకున్న టైమ్కి షూటింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఇంతకీ అల్లుడు థియేటర్లో సందడి చేసేది ఎప్పుడు అంటే.. వచ్చే ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
అందుకే తప్పుకున్నా
దర్శకుడు కేవీ ఆనంద్, హీరో సూర్య కాంబినేషన్లో రూపొందనున్న ఓ చిత్రంలో అల్లు శిరీష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం పేర్కొంది. ఈ పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశానని ఆ మధ్య శిరీష్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అల్లు శిరీష్ తప్పుకున్నారు. ‘‘ సూర్య, కేవీ ఆనంద్గారి సినిమాకు, ‘ఏబీసిడీ’ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ విషయంలో క్లాష్ వచ్చింది. రెండు సినిమాల గురించి ఆలోచించి నా అంతట నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కేవీ ఆనంద్గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నా నిర్ణయాన్ని గౌరవించారు. ఈ సినిమాలో భాగం కావాలని ఎంతో అనుకున్నాను. కానీ కుదర్లేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన కేవీ ఆనంద్గారికి, సూర్యగారికి, లైకా ప్రొడక్షన్స్కు కృతజ్ఞతలు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ టీమ్తో కలసి వర్క్ చేయాలనుకుంటున్నాను’’ అని శిరీష్ అసలు కారణం చెప్పారు. -
‘పరిచయం’ ఫస్ట్ డే చూస్తా
‘‘పరిచయం’ టైటిల్ బాగుంది. టీమ్ వర్క్తో సినిమాను కంప్లీట్ చేశారు. పృథ్వీ(పెళ్లి ఫేమ్)ఎనర్జిటిక్ ఆర్టిస్ట్. ఈ సినిమాను ఫస్ట్డే చూస్తా. ఫీల్ గుడ్ లవ్స్టోరీతో రానున్న ఈ సినిమా విజయం సాధించాలి. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదల కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ– ‘‘లవ్, ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన చిత్రమిది. స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని, శర్వానంద్, సాయిపల్లవి, హరీష్ శంకర్, మారుతిగార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘దాదాపు 8ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నేరవేరింది. తొలి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్. ‘‘ఏడేళ్ల తర్వాత నేను తెలుగులో నటించిన సినిమా ఇది’’ అన్నారు పృథ్వీ. ‘‘మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహకారం మరవలేనిది’’ అన్నారు రియాజ్. -
ఫస్ట్లుక్ 10th July 2018
-
‘బ్రాండ్ బాబు’ టీజర్
-
‘బ్రాండ్ బాబు’ టీజర్ విడుదల
భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాగా ‘బ్రాండ్ బాబు’ రాబోతోంది. డైరెక్టర్ మారుతి అందించిన ఈ కథను ప్రభాకర్ తెరకెక్కించారు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని మనస్తత్వం ఉన్న హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈరోజు (జూలై 9) విడుదల చేశారు. బ్రాండ్ వస్తువులు వాడే వ్యక్తి ఓ పేదింటి అమ్మాయి అయిన ఈషా రెబ్బతో ప్రేమలో పడటం... తన ప్రేమను గెలిపించుకోవడంలో ఏం చేశాడు, హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్గా నిలవనున్నాయి. సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి జేబీ సంగీతం అందిస్తున్నారు. -
ఫస్ట్ లుక్: అల్లుడు-కూతురితో శైలజారెడ్డి
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో నాగచైతన్య డిఫరెంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి యత్నిస్తున్నాడు. మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. The first look of #ShailajaReddyAlludu as promised by @DirectorMaruthi who entertains me off screen as much as he is going to entertain you all onscreen .. always a pleasure working with @SitharaEnts , Anu Emmanuel .. Ramya Garu’s role is going to be something to watch out for! pic.twitter.com/r36FttKx9Z — chaitanya akkineni (@chay_akkineni) 9 July 2018 -
రీ-షూట్ కోసం ఐదు కోట్ల ఖర్చు...!
టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకటి బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కాగా, మరొకటి వీరనారి రాణీ లక్ష్మీ భాయ్ జీవితగాథ మణికర్ణిక. కంగనా రనౌత్ లీడ్ రోల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక ప్రస్తుతం రీషూట్ జరుపుకుంటోంది. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రీ షూట్ జరుపుకుంటుండగా, ఈ కారణంగా బడ్జెట్ మరో ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, మణికర్ణికకు సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చిన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరిపి మణికర్ణికను ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది కూడా. -
మారుతి స్టైల్లో ‘బ్రాండ్ బాబు’
డైరెక్టర్ మారుతి నుంచి మరో సినిమా రాబోతోంది. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. తాను అందించిన కథతో తెరకెక్కుతున్న బ్రాండ్ బాబు సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పోస్టర్లోనే ఇది మారుతి మార్క్ సినిమాగా కనిపిస్తోంది. బ్రాండ్ బాబు-పనిమనిషి ప్రేమ అన్నట్టు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్రాండ్ బాబుగా సుమంత్ శైలేంద్ర నటించగా, పనిమనిషిగా ఈషా రెబ్బ నటిస్తోంది. బ్రాండ్ బాబు తండ్రిగా మురళీ శర్మ నటిస్తోన్నట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేబి సంగీతాన్ని అందించగా, శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. Here it is first look of #BrandBabu @ParkyPrabhakar @vennelakishore @sumanth9111 @YoursEesha @UrsVamsiShekar @SKNonline pic.twitter.com/056tUBIHP5 — Maruthi dasari (@DirectorMaruthi) July 8, 2018 -
మా మదిలో వైఎస్సార్ - కోడి రామకృష్ణ
-
వాట్సాప్కు కేంద్రం గట్టి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్ ద్వారా విస్తరిస్తున్న ఫేక్ మెసేజ్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం మంగళవారం వాట్సాప్కు తక్షణమే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది."బాధ్యతారహితమైన, తీవ్ర సందేశాలు" విస్తరించకుండా నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం వాట్సాప్ను ఆదేశించింది. హింసాకాండను ప్రేరేపిస్తున్న వాట్సాప్ మెసేజ్ల వ్యాప్తిపై ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. రెచ్చగొట్టే కంటెంట్, సందేశాలు పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ మెసేజ్లను నివారించడానికి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించామని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు జవాబుదారీతనం, బాధ్యతలను తప్పించుకోలేదని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వాట్సాప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఫేక్ సందేశాలు, ఉద్దేశపూర్వంగా సృష్టించిన మెసేజ్లు సర్క్యులేట్ అవుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో అసోం, మహారాష్ట్ర, కర్నాటక, త్రిపుర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో "దురదృష్టకర హత్యలు" చోటుచేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. హింసాకాండను ప్రేరేపిస్తున్న వాట్సాప్ మెసేజ్లపై ఇప్పటికే పదేపదే వాట్సాప్ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సాప్ సీనియర్ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని చెప్పింది. కాగా ఇటీవలి కాలంలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వారితో జాగ్రత్త పేరుతో వాట్సాప్లో విపరీతంగా మెసేజ్లు షేర్ అయ్యాయి. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఇంతటి దారుణాలు చాలా నమోదవుతున్నాయి. 28 మంది అమాయకులు బలైపోయిన సంగతి తెలిసిందే. -
ఫుల్ థ్రిల్
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజకిరణ్ తాజాగా ‘విశ్వామిత్ర’ పేరుతో మరో లేడీ ఓరియంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత లీడ్ రోల్ చేస్తున్నారు. మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలు. దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్ మెయింటైన్ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తున్నారు. పది రోజులుగా హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. నందిత ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్స్టేషన్ సీన్లను నటుడు ప్రసన్నపై చిత్రీకరించాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి. -
నిజం చూపిస్తారా ?
-
ఈ కథకు వాల్మీకి ఎవరో తెలిసింది
నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు హీరో బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తూ ఎన్.బి.కె ఫిలింస్ పతాకంపై వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ సినిమా ప్రారంభోత్సవం మార్చిలో జరిగింది. తొలుత ఈ సినిమాకు దర్శకునిగా ఎంపికైన తేజ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ఇప్పుడీ సినిమా దర్శకత్వ బాధ్యతలను క్రిష్ (జాగర్లమూడి రాధా కృష్ణ) స్వీకరించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇదివరకు బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం రూపొందింది. ‘‘ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి’, ఈ చరిత్రకు చిత్రరూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను. మరో అఖండ విజయానికి అంకురార్పణం. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది’’ అన్నారు బాలకృష్ణ. ‘‘నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకు అప్పగించిన బాలకృష్ణగారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగు వాళ్లందరి ఆత్మాభిమానానికి అద్దం పట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. -
సూర్య విత్ క్రిష్
-
మాలీవుడ్కి హలో!
అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ ద్వారా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి కథానాయికగా పరిచయమయ్యారు. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించనున్న ఓ సినిమా ద్వారా నాగార్జున మలయాళ తెరకు హలో చెప్పనున్నారని టాక్. కాగా, మలయాళంలో నాగ్కి ఇది ఫస్ట్ మూవీ అయినా ప్రియదర్శన్తో మాత్రం సెకండ్ మూవీ. 1991లో వచ్చిన నాగార్జున ‘నిర్ణయం’ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు అనే విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ప్రియదర్శన్ చేయనున్న ‘మరాక్కర్’ అనే మలయాళ సినిమాలో పాత్ర నచ్చడంతో నాగ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారట. -
ఫారిన్లో లవ్
ప్రేమించడానికి దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ ప్రభాస్ ప్రిపేర్ అవుతున్నారట. అది కూడా ఇండియాలో కాదు. యూరప్లో. లవ్ కోసం ప్రభాస్ ప్రిపేర్ అవ్వడం ఏంటీ అంటే... సినిమాలో క్యారెక్టర్ కోసం తప్పదుగా. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా జూన్లో లాంఛనంగా ప్రారంభం అవుతుందట. జూలై ఫస్ట్ వీక్లో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని టాక్. ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు డైరెక్టర్ రాధాకృష్ణ. ‘‘దర్శక–నిర్మాతలు హీరోయిన్ రోల్ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు ప్రభాస్ హీరో అని నాకు తెలుసు. చాలా ఎగై్జట్ అయ్యాను. గుడ్ ఎంటర్టైనింగ్ లవ్స్టోరీ మూవీ ఇది. సినిమాలో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు. 1980 బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అంటే.. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రేమలు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట. ఈ లవ్స్టోరీ తొలకరిలో స్టార్ట్ కానుందట. ‘సాహో’ షూటింగ్ కోసం ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
అన్ని భాషల్లో మహేష్
భరత్ అనే నేను చిత్రంపై ప్రేక్షకుల నుంచే కాదు.. ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కలెక్షన్లు సునామీ కొనసాగుతున్న వేళ ఈ చిత్రం రీమేక్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘సమకాలీన రాజకీయాలు, సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన మొదటి నుంచే లేదు. మిగతా భాషల్లో కూడా దీనిని డబ్ చేసి వదలబోతున్నాం. పొలిటికల్ నేపథ్యం కారణంగా ప్రతీ పౌరుడు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని కొరటాల పేర్కొన్నారు. -
రామ్గోపాల్ వర్మ ఫొటోలు దహనం
అనంతపురం కల్చరల్ : మహిళలను కించపరుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని దర్శకుడు రామ్గోపాల్వర్మకు బలిజ సంఘం నాయకులు మునిరత్నం శ్రీనివాసులు హితవు పలికారు. పవన్కల్యాణ్ తల్లిని నిందిస్తూ చేసిన వ్యాఖ్యాలు, అందుకు వివిధ రకాలుగా ప్రేరేపించిన రామ్గోపాల్ వర్మ చేసిన చర్యలను ఖండిస్తూ శనివారం బలిజ సంఘం నాయకులు స్థానిక శ్రీనివాసనగర్లోని బాలాజీ కల్యాణ మంటపం ఎదుట రామ్గోపాల్ వర్మ ఫొటోలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మునిరత్నం శ్రీనివాసులతో పాటు పగడాల మల్లికార్జున, మాసూలు శ్రీనివాసులు, భవానీ రవికుమార్, గల్లా హర్ష, పత్తి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. సిద్ధాంతాల ప్రకారం విమర్శలుండాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో మోహన్, లక్ష్మీప్రసాద్, గొంది శ్రీనివాస్ పాల్గొన్నారు.