
రాంకీ రామకృష్ణన్
నగదు మోసం కేసులో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్ట్ చేసి పుళళ్ జైలుకు తరలించారు.
పెరంబూరు: నగదు మోసం కేసులో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీ సులు అరెస్ట్ చేసి పుళళ్ జైలుకు తరలించారు. కమరకట్టు అనే చిత్ర దర్శకుడు రాంకీ రామకృష్ణన్. ఈయన నర్తకి చిత్ర దర్శకురాలు విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్లతో కలిసి ఇదయం తిరైయరంగం అనే చిత్ర నిర్మాణం చేపట్టారు. అందుకుగానూ షావుకార్పేటకు చెందిన అశోక్ అనే ఫైనాన్షియర్ వద్ద రుణం తీసుకున్నారు.
అందుకు బుదులుగా ఆస్తుల పట్టాలను కుదవ పెట్టారు. అయితే చెప్పిన తేదీకి తీసుకున్న నగదు రూ.4.60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ అశోక్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శకుడు రాంకీ రామకృష్ణన్, విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్లను బుధవారం అరెస్ట్ చేసి పుళళ్ జైలుకు తరలించారు.