Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Palnadu Rentapalla Visit Updates1
Updates: రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పల్నాడు పర్యటనకు వైఎస్‌ జగన్‌.. అప్‌డేట్స్‌కాసేపట్లో సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వైఎస్‌ జగన్‌పోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణలో పాల్గొనున్న జగన్‌విగ్రహం వద్ద కంటతడి పెట్టిన నాగమల్లేశ్వరరావు తల్లిపరామర్శకు అనుమతి ఉందంటూ.. పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రిజనసంద్రం నడుమ నెమ్మదిగా..కార్యకర్తలతో కిటకిటలాడుతున్న గుంటూరు రోడ్లుఅడుగడుగునా ఉప్పొంగుతున్న అభిమాన సంద్రంచుట్టుగుంట సెంటర్‌లో జగన్‌కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరులోకి ఎంటరై గంటన్నర అవుతున్నా ముందుకు సాగని వైఎస్‌ జగన్‌ కాన్వాయ్వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్‌పురం రోడ్డు మీదుగా చుట్టుగుంట సెంటర్ కి చేరుకున్న జగన్మహిళలు, పార్టీ కేడర్‌తో రోడ్లన్నీ ఫుల్రెంటపాళ్లకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులుపల్నాడులో పోలీసుల దౌర్జన్యకాండజగన్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఆంక్షలువైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నంఅయినా రెంటపాళ్లకు భారీగా చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులుపోలీసుల ఆంక్షల వలయాలను దాటుకుని రెంటపాళ్లకు చేరుకున్న అభిమానులు, కార్యకర్తలుజగన్‌ వెంటే జనం అని మరోసారి రుజువుచంద్రబాబుగారూ.. ఇది కరెక్ట్‌కాదు: ఆర్కే రోజాజగన్‌ పర్యటనలో ఆంక్షలపై మాజీ మంత్రి రోజా స్పందనసీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నగతంలో మీ కార్యకర్తల కుటుంబాలను ప్రశ్నించలేదా?ఆంక్ష‌లు పెట్టి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిని అడ్డుకోవాల‌ని చూడ‌డం ఏ మాత్రం క‌రెక్టు కాదు మీ ప్ర‌భుత్వ వేధింపులు భ‌రించ‌లేక‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే, ఆయ‌న కుటుంబాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్య‌ర్త‌లు చ‌నిపోయిన‌ప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాల‌ను ప‌రామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసుల ఓవరాక్షన్‌సత్తెనపల్లిలో భారీగా చెక్ పోస్టుల ఏర్పాటు జగన్‌ కాన్వాయ్‌ వెంట భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులుబైకులను అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులుపోలీసులతో పార్టీ కేడర్‌ వాగ్వాదంగుంటూరులో జగన్‌కు ఘన స్వాగతంగుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఘన స్వాగతంభారీగా బైక్ ర్యాలీతో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలుజై జగన్ నినాదాలతో జన సందోహంగా మారిన లాల్‌పురం రోడ్డుఅడుగడుగునా ఆంక్షలు, అయినా..సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పోలీసుల అతిజగన్‌ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆంక్షలునరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలు వెళ్లనీయకుండా టాటంకాలురెంటపాళ్ల ఊరిలోకి స్థానికేతరులను రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులుఆధార్‌ కార్డు చూపిస్తేనే అనుమతిస్తున్న వైనంగ్రామస్తులకు సైతం ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసిన పోలీసులుఅయినా రెంటపాళ్ల వైపు అడుగులేస్తున్న అభిమానంజగన్‌ కోసం పోటెత్తుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులుకాలినడకన అయినా సరే రెంటపాళ్లకు చేరుకోవాలనే ప్రయత్నంప్రజాభిమానం నడుమ ముందుకు సాగుతూ..గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న వైఎస్ జగన్పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో జగన్‌కు భారీ స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ కేడర్సత్తెనపల్లి రెంటపాళ్ల వైపు నెమ్మదిగా సాగుతున్న కాన్వాయ్‌దారిపొడవునా ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులుమధ్యలో బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తున్న జననేతదారిపొడవునా అభిమానమే.. వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనగుంటూరు వై జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్అడుగడుగునా అపూర్వ స్వాగంపార్టీ అధినేతకు స్వాగతం పలికిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీభారీగా తరలివచ్చిన కార్యకర్తలుదారిపొడవునా జై జగన్‌.. జైజై జగన్‌ నినాదాలుఏ రోడ్డు చూసినా జగన్‌కు ఉప్పొంగిన అభిమానందారిపొడవునా.. ఇరువైపులా బారులు తీరిన జనంమార్గమధ్యలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్‌మరికాసేపట్లో పల్నాడు రెంటపాళ్లకు వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటనపోలీసులు, టీడీపీ నేతల వేధింపులతో బలన్మరణానికి పాల్పడ్డ వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావునాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగన్‌జగన్‌ పర్యటనపై పచ్చ కుట్రలుపర్యటనను ఎలాగైనా అడ్డుకునేందుకు ఆంక్షల పేరుతో పోలీసు యంత్రాంగ ప్రయోగం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపోలీసుల వైఖరి సరికాదు: నాగమల్లేశ్వరరావు తండ్రి పోలీసుల వైఖరిని తప్పు బట్టిన నాగమల్లేశ్వరరావు తండ్రి కొర్లకుంట వెంకటేశ్వరరావుమా బంధువులను కూడా అడ్డుకుంటున్నారుపరామర్శకు అనుమతి తీసుకున్నారుమీ కాళ్లు పట్టుకుంటా.. కనీసం మా వాళ్లనైనా అనుమతించండిఆంక్షలను లెక్కచేయకుంలడా.. జగన్‌ కోసం జనంపల్నాడు రెంటపాళ్ల పర్యటనకు భారీగా కదిలి వస్తున్న పార్టీ శ్రేణులు, అభిమానులుపోలీస్‌ ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకు సాగుతున్న వైనంపొలాల గుండా రెంటపాళ్లకు బయల్దేరిన కార్యకర్తలు, అభిమానులు బైకుల మీద, నడుచుకుంటూ రెంటపాళ్ల వైపుఆధార్‌ కార్డులు చూపించాలంటూ రెంటపాళ్ల గ్రామస్తులపైనా పోలీసుల ఒత్తిడిరెంటపాళ్ల చుట్టూ.. 20 చెక్‌పోస్టులు పెట్టారు. ప్రతీ రెండు కిలోమీటర్‌కు ఓ చెక్‌పోస్టుపోలీసుల వైఖరిని గ్రామస్తుల ఆగ్రహం తాడేపల్లి నివాసం నుంచి రెంటపాళ్లకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌జగన్‌ వెంట బైకులు, కార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వెంటే.. భారీ సంఖ్యలో ముందుకు కదిలిన వైనం పోలీస్‌మయంగా మారిపోయిన పల్నాడుపల్నాడులో ఇవాళ వైఎస్‌ జగన్‌ పర్యటనసత్తెనపల్లి రెంటపాళ్లకు వైఎస్సార్‌సీపీ అధినేత పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నేత నాగమల్లేశ్వరరావుబాధిత కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శజగన్‌ పల్నాడు పర్యటనకు పోలీసుల ఆంక్షలుపోలీసు మయంగా మారిన పల్నాడు జిల్లాసత్తెనపల్లిలో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఆంక్షలుజగన్‌ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు.. పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలుజగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు

PM Modi Tells Trump On Phone Over Pak India Mediation2
మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్‌ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్‌ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్‌ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మోదీ ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాల సమయంలో భారత్‌-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్‌పాక్‌ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్‌ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్‌ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్‌ ఉగ్రవాదంపై భారత్‌ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్‌-మోదీ మధ్య ఫోన్‌ కాల్‌ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్‌ కాల్‌ ద్వారా ట్రంప్‌ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్‌ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్‌ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్‌లో జరిగే క్వాడ్‌ తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్‌ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్‌ చేశాయి కూడా.

AP Police Restrictions On YS Jagan Palnadu Tour3
వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు.. పల్నాడులో టెన్షన్‌!

సాక్షి, పల్నాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాదరణ చూసి కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెర లేపింది. ఆయన పర్యటనలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొత్త ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. వైఎస్‌ జగన్‌ నేడు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా.. ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనపై పోలీసులు సాయంతో కూటమి సర్కార్‌ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది.వైఎస్‌ జగన్‌ నేడు పల్నాడు జిల్లా రెంటళ్లపాడు పర్యటన సందర్బంగా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు కేవలం వంద మంది మాత్రమే రావాలంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, నిరసన, ధర్నా కాకపోయినా ఇలా.. పోలీసుల ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే స్వేచ్చ క​ూడా లేదా అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ద్వారా వైఎస్‌ జగన్‌ పర్యటనను కూటమి సర్కార్‌ నియంత్రించే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక, వైఎస్‌ జగన్‌ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతి కోసం ఇప్పటికే ఏడు సార్లు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఇలా ఆంక్షలు విధించడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ ఆదేశాల మేరకే వైఎస్‌ పర్యటనలను నియంత్రించేందుకు పోలీసులు ఇలా ఆదేశాలు జారీ చేశారని అటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. మరోవైపు.. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొన వద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు పంపించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లా నేతలందరికీ నోటీసులు అందించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇక, ఇప్పటికే రెంటపాళ్లకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.

MLC 2025: Glenn Maxwell Smashed Blasting Century With 13 Sixes Against LAKR4
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత

ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 ఎడిషన్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. ఇవాళ (జూన్‌ 18) లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో) విరుచకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదాడు. ALL THE 13 SIXES & 2 FOURS BY MAXWELL IN HIS 106*(49) KNOCK IN MLC 🤯 pic.twitter.com/ZjBVw4KKqh— Johns. (@CricCrazyJohns) June 18, 2025జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. మొత్తంగా మ్యాక్సీ ఈ ఇన్నింగ్స్‌లో 49 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు (వాషింగ్టన్‌ ఫ్రీడం) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్సీది వన్‌మ్యాన్‌ షో నడిచింది. అతను మినహా మిచెల్‌ ఓవెన్‌ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. ఒబస్‌ పియెనార్‌ను (15 బంతుల్లో 11 నాటౌట్‌) మరో ఎండ్‌లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌ రవీంద్ర 8, ఆండ్రియస్‌ గౌస్‌ 12, మార్క్‌ చాప్‌మన్‌ 17, జాక్‌ ఎడ్వర్డ్స్‌ 11 పరుగులు చేశాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్‌ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్‌ హోల్డర్‌ ఓ వికెట్‌ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌ ఘోర పతనం​ దిశగా సాగుతుంది. ఆ జట్టు తొలి ముగ్గురు బ్యాటర్లు (అలెక్స్‌ హేల్స్‌, సునీల్‌ నరైన్‌, ఉన్ముక్త్‌ చంద్‌) డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన రోవ్‌మన్‌ పావెల్‌ (4), మాథ్యూ ట్రంప్‌ (2) కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే టపా కట్టేశాడు. ఫలితంగా నైట్‌రైడర్స్‌ 10 ఓవర్ల తర్వాత 5 వికెట్లు నష్టపోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. సైఫ్‌ బదార్‌ (32 నాటౌట్‌), జేసన్‌ హోల్డర్‌ (21 నాటౌట్‌) పోరాడుతున్నారు. వాషింగ్టన్‌ బౌలర్లలో జాక్‌ ఎడ్వర్డ్స్‌ 2, మిచెల్‌ ఓవెన్‌, మార్క్‌ అడైర్‌, సౌరభ్‌ నేత్రావల్కర్‌ తలో వికెట్‌ తీశారు.

Shubhanshu Shuklas Axiom 4 Mission Postponed5
శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర ‘ఆక్సియం-4 మిషన్’ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం జూలై 19న జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ‘ఆక్సియం-4 మిషన్’ను జూన్ 22న నిర్వహించనున్నట్లు ‘నాసా’ పేర్కొంది. భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వస్తోంది.దీనికి ముందు ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్ కారణంగా వాయిదా అనివార్యమయ్యింది. ఈ విషయాన్ని స్పేస్‌ ఎక్స్‌ నాడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో తెలియజేసింది. పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్‌ఓ ఎక్స్‌ లీక్‌ను రిపేర్ చేసేందుకు స్పేస్‌ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానున్నదని తెలిపింది. మరమ్మతు పూర్తయిన తర్వాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్‌ఎక్స్ పేర్కొంది. అంతకుముందు ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాల​కు ఒక మైలురాయిగా ఈ మిషన్‌ నిలవనుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్‌ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. ఇది కూడా చదవండి: అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ

Rashmika And Vijay Devarakonda Leaves Mumbai Airport In Same Car6
కారులో జంటగా.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా?

రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్‌గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్‌పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్‌టైనర్)కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్‌ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J— Lilly ✨ (@therwdygirl) June 18, 2025

Attack on Every Indian's Soul: PM Modi7
అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయయడం తగదని సూచించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనను భారతదేశంపైన, మానవత్వంపైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తున్నదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ప్రపంచమంతా స్పష్టమైన విధానంతో ముందుకు కదలాలని, అలాకాదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ ఆసియా దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో తల్లడిల్లిపోతున్నాయిని, ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువులు,ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్‌ తన బాధ్యతగా భావిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో ట్రంప్‌ భేటీ

Donald Trump Plans joining Israeli strikes on Iranian nuclear sites8
‘ఇరాన్‌’ పని ఖతం.. ట్రంప్‌ సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కూడా ఇరాన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్‌పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్‌ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్‌లోని న్యూక్లియర్‌ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్‌.. ఇజ్రాయెల్‌ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్‌ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్‌కు ట్రంప్‌ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్‌తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్‌ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్‌ సైన్యం ఇరాన్‌పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ‌ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్‌ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్‌కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్‌ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్‌ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్‌ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్‌ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు.

SEBI approved IPOs for several companies9
ఐపీఓలకు సెబీ లైన్‌ క్లియర్‌

కొత్త ఏడాదిలో తిరిగి జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. ఈ ప్రభావంతో తాజాగా మూడు కంపెనీలు లిస్టింగ్‌ బాట పట్టాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిపొందాయి. జాబితాలో సన్‌షైన్‌ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..విపుల్‌ షా సంస్థటీవీ, సినిమాల నిర్మాత, దర్శకుడు విపుల్‌ షా కంపెనీ సన్‌షైన్‌ పిక్చర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. వెరసి ఐపీవోలో 83.75 లక్షల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో ప్రధానంగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా 23.69 లక్షల షేర్లు, షెఫాలీ విపుల్‌ షా 10 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనుంది. వీటితోపాటు రూ. 94 కోట్లు భవిష్యత్‌ వృద్ధి, కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించనుంది.ఈపీసీ కంపెనీప్రధానంగా ఈపీసీ కార్యకలాపాలు నిర్వహించే కోల్‌కతా కంపెనీ లూమినో ఇండస్ట్రీస్‌ ఐపీవో బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రూ. 15 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.పీఈబీ సేవలు ప్రీఇంజినీర్డ్‌ బిల్డింగ్స్‌(పీఈబీ)తోపాటు సెల్ఫ్‌సపోర్టెడ్‌ రూఫింగ్‌ సర్వీసులందించే ఎంఅండ్‌బీ ఇంజినీరింగ్‌ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గుజరాత్‌ కంపెనీ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 328 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఐపీవో ద్వారా రూ. 653 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచి్చంచనుంది. రూ. 60 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 110 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు కేటాయించయనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.గ్లోబ్‌ ప్రాజెక్ట్స్‌ @ రూ. 67–71మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీ గ్లోబ్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 67–71 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 1,67,60,560 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 119 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 75 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 14 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 2024 డిసెంబర్‌ 31తో ముగిసిన 9 నెలల కాలానికి దాదాపు రూ. 255 కోట్ల ఆదాయం, రూ. 18 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 మార్చి31కల్లా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 669 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్‌ఎల్‌...’ ధర రూ.10,99,990స్టార్‌బిగ్‌బ్లాక్‌ ఐపీవో బాటస్టార్‌బిగ్‌బ్లాక్‌ బిల్డింగ్‌ మెటీరియల్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు వాటాదారులు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌కు పూర్తి అనుబంధ సంస్థఇది. ఐపీవో ద్వారా సంస్థకు సరైన విలువను వెలికితీయడం, విస్తరణకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ తదితరాలకు వీలుంటుందని మాతృ సంస్థ బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ పేర్కొంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతులు, క్యాపిటల్‌ మార్కెట్‌ పరిస్థితులు, ఇతర క్లియరెన్స్‌లపై ఆధారపడి ఐపీవో చేపట్టనున్నట్లు వివరించింది. 2015లో ఏర్పాటైన బిగ్‌బ్లాక్‌ కన్‌స్ట్రక్షన్‌ దేశీయంగా ఏఏసీ బ్లాకు తయారీలో ఏకైక లిస్టెడ్‌ కంపెనీగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలోగల ప్లాంట్ల ద్వారా వార్షికంగా 1.3 మిలియన్‌ ఘనపు మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 225 కోట్ల ఆదాయం సాధించింది.

ప్రతీకాత్మక చిత్రం10
పెళ్లైన 20 ఏళ్లకు.. మా ఆవిడ బెదిరిస్తోంది : కేసు అవుతుందా?

నాకు పెళ్లయి 20 ఏళ్లవుతోంది. ఒక పాప..16 ఏళ్లు. బాబు..14 ఏళ్లు. పెళ్లి నాటికి నాకు ఇరవై ఏళ్లు. నా భార్యకు పదహారేళ్లు. గత కొన్నేళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేర రాసివ్వాలని, లేకపోతే తన మైనార్టీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకుని, బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు? – శ్రీహరి, కర్నూలుబాల్యవివాహాల నిరోధక చట్టం, 2006 ప్రకారం ఒక మేజర్‌ పురుషుడు ఒక మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న పురుషుడికి అలాగే ఆ పెళ్లి జరిపించిన పెద్దలకు, ఆ పెళ్లి జరగాలని ్ర΄ోత్సహించిన వారికి కూడా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష. లక్ష రూ΄ాయల వరకు జరిమానా ఉంది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి పురుషులకైతే చట్టబద్ధమైన వయసు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ వివాహ చట్టం ప్రకారమైనా, బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారమైనా.. బాల్య వివాహం జరిగితే సదరు అమ్మాయి తనకు ఇరవై ఏళ్లు నిండేలోపు కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడు కూడా ఒక ప్రతినిధి ద్వారా, మిత్రుల సహాయంతో, బాల్యవివాహాల నిరోధక అధికారి ద్వారా కూడా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Today Tips యోగాతో లాభాలెన్నో.. ఈ చిట్కాలు తెలుసా? 20 ఏళ్లు నిండిన తర్వాత వివాహ రద్దుకు ప్రస్తుత చట్టం అంగీకరించదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వైవాహిక సంబంధం కొనసాగించిందని చట్టం భావిస్తుంది. ఇరవై ఏళ్ల వైవాహిక బంధం, సంతానం కూడా కలిగిన తర్వాత మీపై పోక్సో కేసు వేసే ఆస్కారం లేదు! వివాహం కాకుండా ఉండి ఉంటే అది వేరే సంగతి! బలవంతపు పెళ్లి చేశారనే ఆస్కారం కూడా లేదిప్పుడు. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 12 (2) ప్రకారం కూడా బలవంతపు పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో వైవాహిక సంబంధం కొనసాగిస్తే ఆ బలవంతం/మోసపూరితమైన అంగీకారం అనే కారణాలపై వివాహాన్ని రద్దు చేయడం కుదరదు. మీరిద్దరూ కలిసి ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్‌ని కలవండి. సమస్యలు పరిష్కారం కాకపోతే సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయండి. లాయర్‌ను సంప్రదించి మీకున్న అవకాశాలు, హక్కులను తెలుసుకోవడం కూడా మంచిదే! – శ్రీకాంత్‌ చింతల,హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement