కల్తీ మద్యానికి 17 మంది బలి | 17 die after consuming spurious liquor in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యానికి 17 మంది బలి

Published Sun, Jul 17 2016 10:04 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

కల్తీ మద్యానికి 17 మంది బలి

కల్తీ మద్యానికి 17 మంది బలి

ఇటా: ఉత్తరప్రదేశ్ లో కల్తీ మద్యం 17 మందిని బలితీసుకుంది. మరో 12 మంది పరిస్థితి విషమంగా మార్చింది. ఇందులో ఆరుగురు తమ చూపును కోల్పోయారు. శనివారం ఉత్తరప్రదేశ్ లోని ఇటా జిల్లాలోని అలీగంజ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై  సీఎం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. మృతులకు రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు జిల్లా మేజిస్టేట్ అజయ్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడైన శ్రీపల్ ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement