ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీని రూ. 2 వేల కోట్లు పెంచారు.
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో ఎరువుల సబ్సిడీని రూ. 2 వేల కోట్లు పెంచారు. దీంతో మొత్తం ఎరువుల సబ్సిడీ రూ.72,968 కోట్లకు చేరుకుంది. రూ.38,200 కోట్లు దేశీయంగా ఉత్పత్తి చేసే యూరియాకు కేటాయించారు. రూ. 12, 300కోట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాకు కేటాయించారు. రూ. 22,468 కోట్లు నియంత్రణ లేని పాస్ఫరస్, పొటాషియం ఎరువుల కోసం కేటాయించారు.