పంజాబ్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 9 మంది మృతి | 9 Killed, 15 Injured In Punjab Road Accident | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 9 మంది మృతి

Published Thu, Dec 31 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

9 Killed, 15 Injured In Punjab Road Accident

పంజాబ్‌:  పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో గురువారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కార్మికులను ఎక్కించుకుని వస్తున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది దుర్మరణం చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అమృత్‌సర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీస్‌ అధికారి జాశ్‌దీప్‌ సింగ్‌ శైనీ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement