వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్‌ ముప్పు | Aadhaar linking problematic: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్‌ ముప్పు

Published Tue, Nov 21 2017 2:57 PM | Last Updated on Tue, Nov 21 2017 2:57 PM

 Aadhaar linking problematic: Mamata Banerjee - Sakshi

సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆధార్‌ అనుసంధానాన్ని మరోసారి తప్పుపట్టారు. ఆధార్‌ వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్‌ లింకేజ్‌ సమస్యాత్మకం..ఆధార్‌ కార్డు పేరుతో 210 ప్రభుత్వ వెబ్‌సైట్లలో వివరాలు ఉంచుతున్నారు..ఇది వ్యకిగత స్వేచ్ఛకు, సమాజానికి, దేశానికి పెను ముపు’ అని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు తప్పులు చేస్తూ కూడా సంతోషంగా ఉన్నారని కేంద్ర పెద్దలకు చురకలు వేశారు.

ఆధార్‌పై గతంలోనూ మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.తన మొబైల్‌ కనెక్షన్‌ కట్‌ చేసినా తాను మాత్రం ఆధార్‌ను మొబైల్‌ పోన్‌కు లింక్‌ చేయనని మమతా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement