కాన్వాయ్‌ల తరలింపులో మార్పులు: సీఆర్పీఎఫ్‌ | After Pulwama Attack, CRPF New Convoy Plan | Sakshi
Sakshi News home page

కాన్వాయ్‌ల తరలింపులో మార్పులు: సీఆర్పీఎఫ్‌

Published Mon, Feb 18 2019 8:40 AM | Last Updated on Mon, Feb 18 2019 11:08 AM

After Pulwama Attack, CRPF New Convoy Plan - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో తమ బలగాల, వాహనాల తరలింపునకు ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానాల(ఎస్‌వోపీ)ను మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ ఆదివారం వెల్లడించింది. గత గురువారం పుల్వామాలో ఉగ్రవాద దాడి జరగడంతో బలగాలకు మరింత భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

‘జమ్మూ కశ్మీర్‌లో మా కాన్వాయ్‌లకు మరిన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని మేం నిర్ణయించాం. బలగాల వాహన శ్రేణి వెళ్తున్న సమయంలో పౌర వాహనాలను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మా వాహనాలు బయలుదేరే సమయం, మార్గం మధ్యలో ఆగే ప్రదేశాలు, ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ వంటి ఇతర భద్రతా దళాలతో సమన్వయం తదితరాల్లోనూ వ్యూహాత్మక మార్పులు చేస్తున్నాం’ అని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ ఆర్‌ భట్నాగర్‌ పీటీఐకి చెప్పారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement