convoy
-
రైతులు... అభిమానులే రక్షణ వలయంగా
-
వైఎస్ జగన్ కాన్వాయ్ అడ్డగింత (ఫోటోలు)
-
డిప్యూటీ సీఎం కాన్వాయ్కి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, వరంగల్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు.ఇదీ చదవండి: మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు -
మంత్రి కాన్వాయ్ చూసి భయపడుతున్న జనం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మంత్రి పదవి కూడా దక్కింది. జిల్లాలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలంటూ నిత్యం ఆమె బిజీగా ఉంటారు. రాష్ట్ర మంత్రి కావడంతో కేబినెట్ హోదాలో ఎస్కార్ట్ వాహనం, కాన్వాయ్ వంటి హంగులు, భద్రత అంతా సమకూరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ కాన్వాయ్ అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలే అందుకు కారణం. గత నెల 26న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు మంత్రి కాన్వాయ్ వల్ల పెనుప్రమాదమే తప్పింది. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలోని పీఎన్ బొడ్డవలస వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆయన వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన సమయంలో మంత్రి కాన్వాయ్ బొడ్డవలస వైపు వెళ్తోంది. బంగారమ్మపేట వద్దకు వచ్చేసరికి వేగంగా వచ్చిన మంత్రి కాన్వాయ్.. రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనం మీదుకు దూసుకొచ్చింది. ఆయన డ్రైవర్ వాహనాన్ని చాకచక్యంగా వాహనాన్ని పూర్తిగా ఎడమవైపు తిప్పాడు. అప్పటికే మంత్రి కాన్వాయ్లోని ఓ వాహనం.. రాజన్నదొర వాహనం సైడ్ మిర్రర్ను రాసుకుంటూ వెళ్లిపోయింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసంచార ప్రాంతంలో, ఇరుకు రహదారులపై అంతవేగంగా వాహన శ్రేణిని నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.సెప్టెంబరులో బూశాయవలస వద్ద ప్రమాదం..గత సెప్టెంబరు 12వ తేదీన ఉదయం రామభద్రపురం మండలంలోని బూశాయవలస–ఆరికతోట మధ్యలో జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం–ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్తోపాటు, ఆర్ఎస్సై, ముగ్గురుపోలీసులు, మినీ వ్యాన్లో ఉన్న మురో ముగ్గురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు రెండు ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ప్రజల్లో ఆందోళన..మంత్రి ప్రయాణించే కాన్వాయ్ తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రజలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి వాహన శ్రేణి కావడంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, సింగిల్ రోడ్లలో సైతం వాహన శ్రేణి అత్యంత వేగంగా వెళ్తోందని చెబుతున్నారు. మున్ముందు ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా వాహన శ్రేణి చోదకులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थीVIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం? -
ప్రధాని మోదీ కాన్వాయ్ విజువల్స్
-
AP: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
సాక్షి,ఏలూరు జిల్లా: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఆదివారం(ఆగస్టు11) ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటన తర్వాత మంత్రి అక్కడినుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. -
Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి
మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. -
నెల్లూరులో వైఎస్ జగన్ కాన్వాయ్ విజువల్స్
-
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
-
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్లోని పూంచ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ గాలిస్తున్నారు.దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. -
డిప్యూటీ సీఎం వాహనాన్ని ఆపిన సీపీ..
మహేశ్వరం: తుక్కుగూడ సభకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనమని.. సభలోకి వెళ్లేందుకు డయాస్ పాస్ ఉందని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదని తెలిసింది. పైగా డ్రైవర్ శ్రీనివాస్పై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి చేయి చేసుకున్నారని..అతడి జేబులోని ఐడీ కార్డును లా క్కుని, వాహనాన్ని నిలిపివేశారని సమాచారం. అరగంట తర్వాత తిరిగి ఆ డ్రైవర్ను పిలిపించి, చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ దృశ్యాలను చిత్రీ కరిస్తున్న వీడియోగ్రాఫర్, ఇతరుల సెల్ఫోన్లను పోలీసులు లాక్కుని, చేయిచేసుకున్నట్టు తెలిసింది. -
అంబులెన్స్ కి దారిచ్చిన సీఎం జగన్
-
కాన్వాయ్ అడ్డగింత.. కంగుతిన్న చంద్రబాబు
సాక్షి, విజయవాడ: విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెస్ట్ టికెట్ జలీల్ఖాన్కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్ను జలీల్ఖాన్ వర్గం అడ్డుకుంది. పొత్తులో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జలీల్ఖాన్ మద్దతుదారుల నిరసనతో చంద్రబాబు కంగుతిన్నారు. కాగా, తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ జలీల్ ఖాన్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ టికెట్ల చిచ్చు రగులుతూనే ఉంది. టీడీపీ శుక్రవారం.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు షాక్ తగిలింది. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని)ని ప్రకటించడంతో పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు ఖరారు చేశారని అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దేవినేని ఉమాకు షాక్.. టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని మైలవరం, పెనమలూరు టికెట్లపై సందిగ్ధత తొలగింది. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్, పెనమలూరు అభ్యర్థిగా బోడె ప్రసాద్ను ఖరారు చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 12 నియోజక వర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దేవినేని ఉమా ఆశలు ఆవిరయ్యాయి. మైలవరం నియోజక టీడీపీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఆయన్ను కాదని, ఇటీవల పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్కు టికెట్ కేటాయించడంతో దేవినేని ఉమా వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. కృష్ణప్రసాద్, దేవినేని ఉమా మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకు చంద్రబాబు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసి పని చేసే అవకాశం లేదని టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. మైలవరంలో టికెట్ ఇవ్వలేక పోతున్నాం.. పెనమలూరు టికెట్ ఇస్తామని దేవినేని ఉమాను మభ్యపెట్టారు. సర్వేల సాకు చూపి చివరకు అక్కడ మొండి చేయి చూపారు. దీంతో ఆయన రగిలిపోతున్నారు. తనకు జరిగిన అవమానం బయటికి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. పార్టీలో సీనియర్ల అడ్డు తొలగించుకోవటం, లోకేష్ నాయకత్వానికి ఇబ్బంది లేకుండా చేయడంలో భాగంగానే ఉమాకు చెక్ పెట్టినట్లు చర్చ సాగుతోంది. ఆయనకు కనీసం ఎమ్మెల్సీ హామీ కూడా ఇవ్వకపోడంతో, ఆయన రాజకీయ శకం ముగిసిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వసంతకు గట్టి బుద్ధి చెబుతామని దేవినేని వర్గీయులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఉమా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పెనమలూరులో అసంతృప్తి.. పెనమలూరు టికెట్పై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. సర్వేల పేరుతో పలుపేర్లు తెరపైకి వచ్చాయి. పెనమలూరు టికెట్ లేదని బోడె ప్రసాద్కు తొలుత చంద్రబాబు చెప్పారు. అయితే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని బాబును బోడె బ్లాక్ మెయిల్ చేశారని తెలుస్తోంది. బోడె కొంతమంది ఎన్ఆర్ఐల ద్వారా కథ నడిపారు. చినబాబుకు ముడుపులు ముట్టడంతోపాటు, నియోజకవర్గంలో అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పడంతో చివరకు ఆయనకే టికెట్ కేటాయించారనే చర్చ సాగుతోంది. చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత గ్రామాల్లో బోడెకు పోటాపోటీగా ఇప్పటి వరకు ప్రచారం చేశారు. ఆ వర్గం బోడెకు సహకరించే అవకాశం లేదు. ఉయ్యూరులో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వర్గం కలిసి పని చేసే పరిస్థితి లేదు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వర్గం నుంచి బోడె ప్రసాద్ ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. మొత్తం మీద పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ గ్రూపుల గోల బోడెను పుట్టి ముంచుతుందని పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్గా మహేష్! పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ జనసేన నియోజక వర్గ ఇన్చార్జి టికెట్ తనకే ఖరారైందని పోతిన మహేష్ ఇంటింటికీ ప్రచారం చేశారు. అయితే పొత్తులో భాగంగా వెస్ట్ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. విజయవాడ పశి్చమంలో బీజేపీకి సంబంధించి రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించినా.. అక్కడ పార్టీ కోసం కష్ట పడిన నేతలను కాదని ఎన్ఆర్ఐల వైపు చూడటాన్ని జనసేన కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. -
అయోధ్యలో నరేంద్ర మోదీ కాన్వాయ్
-
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు: సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్లోనే తన కాన్వాయ్నూ అనుమతించాలని ఆదేశించారు. ప్రజలతో పాటే తన కాన్వాయ్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్ వద్దు! కాన్వాయ్ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించాలని ఆదేశించారు. అలాగే కాన్వాయ్లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
నాగర్కర్నూల్లో కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నం
-
పాలమూరు పచ్చగా..
-
బైడెన్ డ్రైవర్ నిర్బంధం.. ఎందుకంటే..?
ఢిల్లీ: జీ20 సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కారు డ్రైవర్ను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేసినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా కారును నడిపినందుకు సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అధ్యక్షుడు బైడెన్ కాన్వాయ్లో ఓ కారు డ్రైవర్ తన కారును యూఏఈ అధ్యక్షుడు నివాసముండే తాజ్ హోటల్కు తీసుకువెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఆ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఉదయం 9:30కి బైడెన్ నివాసముండే మౌర్య హోటల్కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో లోధి ఎస్టేట్ వద్ద నుంచి ఓ బిజినెస్ మ్యాన్ను తాజ్ వద్ద దించాల్సి వచ్చిందని చెప్పాడు. తనకు ప్రోటోకాల్స్ గురించి తెలియదని చెప్పాడు. దీంతో ఆ డ్రైవర్ను వదిలేశారు. జీ20 మీటింగ్కు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీ వచ్చారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం శనివారం రాత్రి డిన్నర్ మీటింగ్కి హజరయ్యారు. ఈ రోజు ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కొద్ది క్షణాల ముందే ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఇటు నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఇదీ చదవండి: ఢిల్లీ డిక్లరేషన్ వెనక షేర్పాల కఠోర శ్రమ -
కాన్వాయ్ లోచంద్రబాబు...
-
CM Jagan Chittoor Tour : చిత్తూరులో సీఎం జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
జగనన్న కాన్వాయ్పై పూల వర్షం
-
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్తో ఇంటికి చేరింది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి సూపర్ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్ ముంబై వీధుల్లో సందడి చేసింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో ముఖేశ్, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్ పిరామల్ దంపతులకు ట్విన్స్ కృష్ణ ,ఆదియా ఉన్నారు. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పుదుచ్చేరి సీఎం
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
మంత్రి కేటీఆర్కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో మంత్రి కాన్వాయ్ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో పర్యటించేందుకువచ్చిన కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. కాగా రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అనేకచోట్ల చేతికొచ్చిన పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, కేసీఆర్పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. చదవండి: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్భవన్ క్లారిటీ.. -
సీఎం జగన్ కాన్వాయ్ చూసి నార్పల ప్రజలు కేరింతలు
-
Kerala: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో
రెండు రోజుల కేరళ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని ఆత్మహుతి దాడి చేసి చంపేస్తామని వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ లేఖ నేపథ్యంలో..మోదీ తన రోడ్షోలకు విభిన్నంగా కొచ్చిలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన కారుదిగి స్వయంగా కాలినడకన రోడ్ షో ప్రారంభించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా రోడ్ షో చేశారు. ఈ మేరకు ఆయన కేరళ సంప్రదాయ దుస్తులు, కసావు ముండు, శాలువా, కుర్తా ధరించి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భద్రత కోసం వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా మళయాళంలో కొచ్చి నివాసి రాసినట్లు వచ్చిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయం అందుకున్నారు. ఆయనే పోలీసు చీఫ్కు ఈ లేఖను అందజేసినట్లు చెప్పారు కూడా. ఐతే పోలీసుల నుంచి లీక్ అయిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ని ఘోర తప్పిదమని మండిపడ్డారు. దీన్ని కేంద్ర సహాయం మంతి మురళీధరన్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రధాని భద్రతా వివరాలు ఎలా వాట్సాప్లో లీక్ అయ్యి వైరల్ అయ్యిందనేది ముఖ్యమంత్రి వివరించాలన్నారు. దీని అర్థం హోం శాఖ కుదేలైందనే కదా అంటూ ఫైర్ అయ్యారు. కాగా, మోదీ కేరళ పర్యటలనో దాదాపు రూ. 3 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ కేరళలో బుధవారం తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలిపే ఒక రకమైన ప్రాజెక్ట్ అయిన కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. Thank you Kochi! pic.twitter.com/hbuY9FRivM — Narendra Modi (@narendramodi) April 24, 2023 (చదవండి: 'బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’) -
యాక్సిడెంట్ స్పాట్కి సీఎం చౌహాన్.. సీఎం కాన్వాయ్లోనే ఆస్పత్రికి తరలింపు
-
బండి సంజయ్ ని తరలిస్తున్న కాన్వాయ్ ని అడ్డుకున్న బీజేపీ నేతలు..
-
ప్రధాని కాన్వాయ్వైపు దూసుకొచ్చిన వ్యక్తి
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. తాజాగా కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్కు ఎదురొచ్చే యత్నం చేశాడు ఓ యువకుడు. అయితే.. అది గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునా.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో.. దావణగెరెలో ప్రధాని మోదీ ఇవాళ రోడ్షో నిర్వహించారు. అయితే ఆ సమయంలో ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ వాహనంలో ముందుకు కదిలారు. ఆ సమయంలో బారికేడ్లను దూకేసిన ఓ యువకుడు ప్రధాని ప్రయాణిస్తున్న కాన్వాయ్ వైపు అకస్మాత్తుగా దూసుకొచ్చే యత్నం చేశాడు. అది గమనించిన స్థానిక పోలీసులు, పీఎం సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిది కొప్పాల్ అని, అతడు బీజేపీ కార్యకర్తగానే గుర్తించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ పర్యటనలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇదే కర్ణాటకలో హుబ్బళి వద్ద ప్రధాని మోదీ రోడ్షోలో.. ఇలాగే ఓ వ్యక్తి దూసుకొచ్చే యత్నం చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 -
రాళ్ల దాడి.. కేంద్ర మంత్రికి నిరసన సెగ!
కోల్కతా: కేంద్ర మంత్రి కాన్వాయ్పై శనివారం పశ్చిమ బెంగాల్లో దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఆయన మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలోనే.. ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిసిత్ ప్రమాణిక్.. స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో దిన్హటాలోని బురిర్హాట్లో టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసనకు సిద్ధమయ్యారు. వాళ్లను బీజేపీ కార్యకర్తలు నిలువరించే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా.. రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ముందు అద్దం ధ్వంసమైంది. ఈ తరుణంలో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఇది టీఎంసీ మద్దతుదారుల పనేనని ఆయన ఆరోపించారు. ఒక మంత్రికే రక్షణ కరువైనప్పడు సామాన్యుల పరిస్థితి ఏంటని.. బెంగాల్లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదని దాడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై.. మంత్రి నిసిత్ హోంశాఖకు సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానికమీడియా కథనాలు ప్రచురిస్తోంది. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం తాజాగా నిసిత్ ప్రమాణిక్ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని, ఎక్కడికి వెళ్లినా నల్లజెండాలతో నిరసనలు చెబుతామని హెచ్చరించారు కూడా. Clashes broke out between #TMC & #BJP workers in Coochbehar #Bengal. This as MoSHome #NisithPramanik was on his way to a program & TMC workers had assembled to show him back flags.BJP workers challenged them & clashes erupted.Stones hit Nisith Pramanik’s car too but MoS is unhurt pic.twitter.com/ku3T66fYun — Tamal Saha (@Tamal0401) February 25, 2023 -
జేసీ బ్రదర్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
-
అంబులెన్స్కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్
సాక్షి, బొబ్బిలి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బొబ్బిలిలో శుక్రవారం ‘ఇదేంఖర్మరా బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. అదే సమ యంలో అస్వస్థతకు గురైన తెర్లాం మండలం నందిగామ గ్రామానికి చెందిన బొద్దూరు సత్యవతి అనే మహిళను కుటుంబ సభ్యులు 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్సీకి తీసుకెళ్తున్నారు. తెర్లాం మండలం నుంచి బయలుదేరిన వాహనం బొబ్బిలి చేరుకోగా, గొల్లపల్లి వద్ద వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ చోటివ్వలేదు. 108 వాహనం ఎంత హారన్ కొట్టినా కాన్వాయ్లో వాహనాలు గానీ, చంద్రబాబునాయుడు గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు కాన్వాయ్ దాటేవరకు మహిళ పరి స్థితి ఆగమ్యగోచరంగా మారింది. వైద్యుల సూచ నల మేరకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ గంటన్నర సమయం తర్వాత సీహెచ్సీకి తరలించారు. చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చోటివ్వని చంద్రబాబు... ప్రజలకు ఏమి ఉద్దరించేందుకు తిరుగుతున్నాడంటూ స్థానికులు విమర్శించారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటూ చెప్పుకుతిరుగుతున్న బాబు సామాజిక బాధ్యత ఇదేనా అంటూ మండిపడ్డారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
విజయవాడలో సీఎం జగన్ కాన్వాయ్..
-
కాన్వాయ్ ఆపి అంబులెన్సు కు దారి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
-
ఆంబులెన్స్కి దారివ్వండి.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్కు ఓ ఆంబులెన్స్ ఎదురొచ్చింది. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంతహడావుడిలోనూ ఓ ఆంబులెన్స్ రాకను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. దీంతో.. కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో ఆంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్కు నమస్కరించారు. ఇదీ చదవండి: మీ బిడ్డ.. ఈ వైఎస్ జగన్కు నిజాయితీ ఉంది -
చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
-
ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్ పై యువకుల దాడి
-
అంబులెన్స్కు దారి.. నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ, పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈక్రమంలో అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ఆయన కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. అక్కడ ప్రజలు పోగై ప్రధాని మోదీకి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంబులెన్స్కు లైన్ క్లియర్ చేసిన తర్వాత కాన్వాయ్ తిరిగి కదిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత నెలలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తుండగా ఓ అంబులెన్స్కు ఆయన కాన్వాయ్ దారి ఇచ్చింది. (చదవండి: క్షమించండి అంటూ నితిన్ సంచలన వ్యాఖ్యలు... షాక్లో బీజేపీ) కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేకి హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ స్ధానాలున్న కాంగ్రా జిల్లాలో మోదీ పర్యటించారు. చాంబీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన, స్థిరమైన డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని అన్నారు. అస్థిరత్వం, అవినీతి, స్కామ్ల మయమైన పార్టీలు ఎందుకని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. సుపరిపాలన అందించేవారికి ప్రజలెప్పుడూ పట్టం కడతారని ఆకాక్షించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ను పట్టించుకోలేదని అన్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 12న జరుగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. (చదవండి: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను) -
ఎమ్మెల్యే బాలకిషన్ కాన్వాయ్ అడ్డగింత
గన్నేరువరం: నూతనంగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ని శనివారం స్థానిక యువకులు అడ్డగించారు. గన్నేరువరం నుంచి మాదాపూర్ గ్రామానికి వెళ్లే సమయంలో మండల కేంద్రంలో అడ్డుకున్నారు. ప్రధాన రహదారి గుండ్లపల్లి నుంచి మండల కేంద్రం వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంబులెన్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ..రహ దారి విస్తరణ చేపడతామని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందుకు కదిలింది. కాగా, ఘటనకు సంబంధించి నాగ రాజు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టారు. -
నందిగామ ఘటనపై సీపీ కాంతి రాణా స్పందన..
-
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి
-
‘ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం?’.. పంజాబ్ సీఎంపై విమర్శలు!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని ఆరోపించాయి. గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ కార్లు తన కాన్వాయ్లో ఉనియోగిస్తున్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో గత ముగ్గురు సీఎంలను మించి కార్లు వినియోగిస్తున్నారని, ఇది వీఐపీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నాయి. సామాన్యుడి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా. ఆయన ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘షాకింగ్ విషయం.. 2007-17 వరకు సీఎం బాదల్ 33 వాహనాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదే కొనసాగించారు. కానీ, ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. సీఎం భగవంత్ మాన్ తన కాన్వాయ్లో 42 కార్లు ఉపయోగిస్తున్నారు.’ అని పేర్కొన్నారు పంజాబ్ అసెంబ్లీలో విపక్ష నేత ప్రతాప్ సింగ్. సెప్టెంబర్ 20, 2021 నుంచి మార్చి 16, 2022 వరకు సీఎంగా చేసిన చరణ్ జీత్ సింగ్ చన్నీ కెప్టెన్తో పోలీస్తే మరో ఆరు కార్లు ఎక్కువగా ఉనియోగించినట్లు చెప్పారు. భారీ స్థాయిలో కాన్వాయ్ని ఉపయోగించి పంజాబ్ ప్రజలకు సీఎ మాన్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును నిర్లక్ష్యంగా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కాన్వాయ్ని ఎలా ఉపయోగిస్తారు? అంటూ దుయ్యబట్టారు. అయితే.. ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీ. Shocking revelation- CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm — Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
మోదీ కాన్వాయ్ నిలిపేసి ‘అంబులెన్స్’కు దారి.. వీడియో వైరల్
గాంధీనగర్: గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే అహ్మాదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్కు దారిచూపి ఔదార్యాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ రాకను గమనించిన క్రమంలో ప్రధాని మోదీ కాన్వాయ్ని పక్కకు నిలిపేసి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేశారు. ఈ వీడియోను గుజరాత్ బీజేపీ షేర్ చేసింది. అందులో పీఎం కాన్వాయ్లో భాగమైన రెండు ఎస్యూవీ కార్లు.. నెమ్మదిగా రోడ్డు పక్కకు వెళ్తుండగా.. అంబులెన్స్ దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్లోని దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో పబ్లిక్ ర్యాలీ ముగించుకుని గాంధీనగర్లోని రాజ్భవన్కు ప్రధాని మోదీ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ‘అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తున్న క్రమంలో అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు పీఎం మోదీ కాన్వాయ్ నిలిపేశారు.’ అని గుజరాత్ బీజేపీ పేర్కొంది. గుజరాత్లో రెండో రోజు పర్యటనలో భాగంగా గాంధీనగర్- ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించారు మోదీ. అలాగే.. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలిదశ పనులను ప్రారంభించారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance pic.twitter.com/yY16G0UYjJ — ANI (@ANI) September 30, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి..
గోపాలపట్నం(విశాఖపట్నం): కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. తమను ఆదుకోవాలని కోరుతూ మృతుడి భార్య నాగమణి బ్యానర్ పట్టుకుని పిల్లలతో కలసి రోడ్డుపై నిలుచుంది. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి ఆమె నుంచి అర్జీ తెప్పించుకున్నారు. దరఖాస్తులో ఫోన్ నంబర్, చిరునామా లేనందున వివరాలు సేకరించాలని గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని జిల్లా అధికారులు ఆదేశించారు. చదవండి: ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్ -
బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ నాయకులు దాడి
-
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం.. పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్కు వెళ్తున్న సమయంలో ఓ యువకుడు రోడ్డుపై అర్జీతో కనిపించాడు. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ను ఆపి సెక్యూరిటీ సిబ్బందిని అర్జీ తీసుకోమని పురమాయించారు. వివరాల్లోకెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన మహేష్కి 2019లో యాక్సిడెంట్లో అంగ వైకల్యం కలిగింది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని తన బాధను చెప్పుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సీఎం జగన్.. ఎయిర్పోర్ట్కు వెళ్లే మార్గంలో రోడ్డుపై అర్జీతో నిల్చోవడంతో సీఎం జగన్ చూసి స్పందించారు. అయితే, అర్జీలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను ఆదుకోవాలని అర్జీలో కోరినట్లు మహేష్ తెలిపారు. చదవండి: (ఏ సమస్య వచ్చినా.. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం: సీఎం జగన్) -
మంత్రి జోగి రమేష్ కారుకు తప్పిన ప్రమాదం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు డివైడర్పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు. -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాదేశంలోకి రావద్దు!... రష్యా కాన్వాయ్కి అడ్డుగా నిలుచున్న ఉక్రెయిన్ వ్యక్తి
Block A Russian Military Convoy: రష్యా ఉక్కెయిన్పై భూ, గగన, జల మార్గాల్లో క్షిపణి దాడులతో పశ్చిమ నగరాలను స్వాధీనం చేసుకుంటూ రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఉక్రెయిన్లోని ఒక వ్యక్తి రాజధాని కైవ్లోని ప్రవేశిస్తున్న రష్యా సైనిక కాన్వాయ్ను ఆపేందుకు యత్నించాడు. అంతేకాదు రష్యన్ మిలటరీ వాహనాలకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దు అంటూ చేతులు ఊపుతూ అడ్డంగా నిలుచున్నాడు. పైగా అవి మౌంటెడ్ మెషిన్ గన్లతో కూడిన రష్యన్ మిలిటరీ వాహనాలు కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం బెదరకుండా అత్యంత తెగువను కనబర్చి వాటి ఎదురు నిలబడి ఆపేందుకు శతవిధాల ప్రయత్నించాడు. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణను ఖండిస్తూ..యునైటెడ్ నేషన్స్ నేతృత్వంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా శుక్రవారం వీటో చేసిన సంగతి తెలిసిందే. అయితే రష్యా బలగాలు వైమానిక దాడులతో నగరాలను స్వాధీనం చేసుకుంటూ కైవ్లోకి ప్రవేశించడంతో తూర్పు యూరోపియన్ దేశంలోని అధికారులు రాజధాని నగరమైన కైవ్ను రక్షించాలని పౌరులను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ ఉక్రెయిన్ పౌరుడు ఆ రష్యన్ మిలటరీ కాన్వాయ్కి ఎదురు నిలుచుని ఆపేందుకు యత్నించాడు. ఈ ఘటన 1989లో చైనాలో తీసిన "ట్యాంక్ మ్యాన్ ఫోటోని పోలి ఉంది. చైనా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను హింసాత్మకంగా అణచివేసిన మరుసటి రోజు టియానన్మెన్ స్క్వేర్ వద్ద ట్యాంక్లను సమీపించే మార్గంలో ఒక వ్యక్తి ఉక్రెయిన్ వ్యక్తి మాదిరే అడ్డంగా నిలుచుని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన 30 నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB — НВ (@tweetsNV) February 25, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం) -
అస్సాం సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి కాన్వాయ్లో వాహనాల శ్రేణిని
దిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అస్సాంలో సీఎం, మంత్రులు ఆధ్వర్యంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. బిశ్వ శర్మ తన కాన్వాయ్ ఉండే వాహనాల శ్రేణిని ఆరుకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. రోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు, పలు అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో గౌహతిలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు శ్రేణిని ఆరుకి కుదిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఇతర ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎస్కార్ట్,పైలేట్ వాహనాల మినహ జిల్లాలలో 12 వాహనాలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది. అధికారిక సమావేశాలలో భాగంగా, ఇతర రాష్ట్రమంత్రులను సన్మానించడాన్ని కూడా నిషేధిస్తూ మంత్రి వర్గం నిర్ణయం వెలువరించింది. సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో 2 నిముషాలు ఆపవచ్చని తెలిపింది. అంబులెన్స్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. వీటితో పాటు పలు విధాన పర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
ఒడిశా సీఎం కాన్వాయ్పై కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతుండగా విజయవాడ శివారు ఎనికేపాడు వద్ద 108 అంబులెన్స్ వేగంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిని గమనించిన సీఎం తన కాన్వాయ్ని స్లో చేయించి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేయించారు. దీంతో అంబులెన్స్ వేగంగా కాన్వాయ్ని దాటి ముందుకెళ్ళింది. చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..) -
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
-
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: సౌత్జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి తాజ్ హోటల్కు పయనమైన సమయంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విజయకుమారి సీఎం కాన్వాయ్ వద్దకు వచ్చి సహాయం చేయాలని కోరింది. ఇది గమనించిన సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ను ఆపి ఓఎస్డీని పంపి ఆమె సమస్య తెలుసుకోవాలని చెప్పారు. అనారోగ్యం, వయసు భారం పెరుగుతండటంతో కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఉద్యోగం కావాలని విజయకుమారి కోరింది. -
మణిపూర్లో తీవ్రవాదుల ఘాతుకం
ఇంఫాల్/న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రం మణిపూర్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చురాచాంద్పూర్ జిల్లాలోని సెఖాన్ గ్రామం వద్ద విప్లవ్ త్రిపాఠి తన భార్య, ఆరేళ్ల కుమారుడితోపాటు కాన్వాయ్లో వస్తుండగా తీవ్రవాదులు పేలుడు పదార్థాలను(ఐఈడీ) పేల్చారు. కాల్పులు సైతం జరిపారు. దీంతో కాన్వాయ్లో ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. తీవ్రవాదుల దాడిలో కల్పల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడు, నలుగురు జవాన్లు మృతిచెందారు. గాయపడిన వారిని అధికారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన కల్నల్ విప్లవ్ త్రిపాఠి గతంలో మిజోరాంలో పనిచేశారు. 2021 జూలైలో బదిలీపై మణిపూర్కు వచ్చారు. మిజోరాంలో ఉన్నప్పుడు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విప్లవ్ త్రిపాఠి స్వస్థలం ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్. (చదవండి: అద్భుతం: తల్లి దీవెనలు.. తమ్ముడూ నీ బుర్రకు హ్యాట్సాఫ్) ఏడుగురి ప్రాణ త్యాగాల్ని మర్చిపోలేం: మోదీ మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై తీవ్రవాదులు దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొనడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏడుగురి ప్రాణ త్యాగాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని శనివారం ట్వీట్ చేశారు. అది పిరికిపంద చర్య: రాజ్నాథ్ సింగ్ మణిపూర్లో తీవ్రవాదుల దాడిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తీవ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. ఐదుగురు యోధులను దేశం కోల్పోయిందని అన్నారు. చదవండి: ‘‘ఇవాళ ఉన్నాం. రేపుంటామో లేదో!’’ ఏమిటీ పీఎల్ఏ? మణిపూర్లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సంస్థను 1978 సెప్టెంబర్ 25న ఎన్.బిశ్వేశ్వర్ సింగ్ ప్రారంభించారు. మణిపూర్కు భారతదేశం నుంచి విముక్తి కలిగించి, స్వతంత్ర దేశంగా మార్చడమే తమ సంస్థ ధ్యేయమని ప్రకటించారు. మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలు, మావో ఆలోచనా విధానంపై ఆధారపడి పీఎల్ఏ పనిచేస్తోంది. పీఎల్ఏకు చైనా ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఇతర తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలతో పీఎల్ఏ చేతులు కలిపింది. ఉమ్మడి శత్రువైన భారతదేశాన్ని ఓడించడానికి ఆయా సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చాయి. పీఎల్ఏ 1989లో రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్పీఎఫ్) పేరిట ఒక రాజకీయ విభాగాన్ని ప్రారంభించింది. మణిపూర్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్లో పీఎల్ఏ భాగస్వామిగా చేరింది. -
ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఆయన కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా స్టాలిన్ పయనం సాగుతోంది. నగరాల్లో ట్రాఫిక్ రద్దీని గుర్తించిన స్టాలిన్ తన కాన్వాయ్ వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గించేశారు. ఇక ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్ను నిలపరు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్ సాగే విధంగా ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు. చదవండి: (ఖుష్బూకు ‘ప్రత్యేక’ పదవి) దివ్యాంగులకు సాయం సచివాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు సీఎం వీల్చైర్లు, స్కూటర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు. అలాగే, దివ్యాంగుల రిజర్వేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు. -
పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం
చండీగఢ్: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్ మెంట్ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్జీత్ సింగ్ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్ రోడ్డు మండి కలాన్ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్(పారట్) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి.. తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. వధువరులను సీఎం చరణ్ జీత్ సింగ్ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. అయితే, గతంలో చరణ్ జీత్ సింగ్ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్ డ్యాన్స్ వైరల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్తో హల్చల్ -
తన కాన్వాయ్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన కేటీఆర్
సిద్దిపేటకమాన్: బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఇద్దరు యువకులను మంత్రి కేటీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్ (26), యాకూబ్ (30) ద్విచక్ర వాహనంపై పట్టణం వైపు వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి బైపాస్రోడ్డు వద్ద డివైడర్ను ఢీకొట్టింది. వారిద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కేటీఆర్ జరిగిన ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్ను ఆపించారు. కాన్వాయ్లోని రెండు వాహనాల్లో క్షతగాత్రులిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్చేసి చెప్పారు. -
మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ
-
మంత్రి సబితా కాన్వాయ్ ను అడ్డుకున్న BJYM కార్యకర్తలు
-
ఏపీ: ప్రజలను చూసి.. కాన్వాయ్ ఆపి
భామిని: ప్రజల కష్టాలు గుర్తించడంలో ముఖ్యమంత్రి జగనన్న బాటలో మంత్రులు పయనిస్తున్నారు. శుక్రవారం భామిని మండలం చిన్నదిమిలి వద్ద రోడ్డుకు పక్కగా గ్రానైట్ క్వారీ బాధితులైన కాలనీవాసులు తమ సమస్య చెప్పేందుకు ఎదురు చూస్తుండగా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జనవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు తమ కాన్వాయి ఆపారు. వినతులు స్వీకరించి సమస్యలు విన్నారు. క్వారీ పేలుళ్లు, పరిహారం విషయమై కలెక్టర్కు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రులు పర్యటనను విజయవంతం చేసిన ప్రజలు, అధికారులకు పాలకొండ ఎమ్మెల్యే కళావతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి–బ్యారేజ్ నిర్మాణానికి తాము ఆటంకం కాదని చెప్పిన ఒడిశా రైతులను అభినందించారు. -
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
-
ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం
జగిత్యాల: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికేం గాయాలేం కాలేదని తెలుస్తోంది. సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమెకు ఈ ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన కల్వకుంట్ల కవిత కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రాజారాంపల్లి వద్దకు రాగానే జగిత్యాల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కారు కొద్దిగా తగిలింది. అప్రమత్తమైన కవిత కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ కార్లలోనే ఉన్నారు. అయితే వారికి గాయాలు కాలేదని.. సురక్షితంగా బయటపడ్డారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. -
సీఎం కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా
-
పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం చేటుచేసుకుంది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్కి ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు. వాహనశ్రేణికి ఎదురుగా వచ్చి ప్రధాని మోదీని కలవాలంటూ నినాదాలు చేశాడు. హఠాత్ పరిణామంతో షాక్ తిన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం రాజ్నాథ్ కాన్వాయ్ ముందుకు సాగింది. దద్దరిల్లిన లోక్సభ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై... లోక్సభ రెండోరోజూ దద్దరిల్లింది. అధిర్ క్షమాపణలకు బీజేపీ డిమాండ్ చేసింది. సభలో తమ స్థానాల్లో నిలబడి బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. అధిర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రధాని మోదీ, అమిత్ షా వలసదారులని, నిర్మలా సీతారామన్ నిర్బల సీతారామన్ అని నిన్న లోక్సభలో వ్యాఖ్యానించారు అధిర్ రంజన్ చౌధురి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ... ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిరసనకు దిగింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది. -
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
-
వైఎస్ జగన్ కాన్వాయ్
-
వైఎస్ జగన్కు భద్రత పెంపు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు పెట్టారు. కాసేపట్లో వైఎస్ జగన్తో ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన వివరించనున్నారు. జగన్కు తాత్కాలిక కాన్వాయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న వైఎస్ జగన్కు ప్రభుత్వం తాత్కాలిక కాన్వాయ్ కేటాయించింది. ఏపీ 18పీ 3418 నంబరుతో ఆరు కొత్త వాహనాలు సమకూర్చింది. జగన్కు ఆశీర్వచనం టీటీడీ పురోహితులు శుక్రవారం వైఎస్ జగన్ నివాసానికి వచ్చి ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా వీరితో పాటు ఉన్నారు. జగన్ నివాసం వద్ద సందడి వైఎస్ జగన్ను కలిసేందుకు వస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన నివాసం సందడి మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ కలిసేందుకు ఆయన నివాసానికి వస్తున్నారు. వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. -
వైఎస్ జగన్కి కొత్త కాన్వాయ్ కేటాయింపు
-
కాన్వాయ్ల తరలింపులో మార్పులు: సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో తమ బలగాల, వాహనాల తరలింపునకు ఉన్న ప్రామాణిక కార్యాచరణ విధానాల(ఎస్వోపీ)ను మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఆర్పీఎఫ్ ఆదివారం వెల్లడించింది. గత గురువారం పుల్వామాలో ఉగ్రవాద దాడి జరగడంతో బలగాలకు మరింత భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జమ్మూ కశ్మీర్లో మా కాన్వాయ్లకు మరిన్ని కొత్త సౌకర్యాలు కల్పించాలని మేం నిర్ణయించాం. బలగాల వాహన శ్రేణి వెళ్తున్న సమయంలో పౌర వాహనాలను నిలిపివేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మా వాహనాలు బయలుదేరే సమయం, మార్గం మధ్యలో ఆగే ప్రదేశాలు, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్ వంటి ఇతర భద్రతా దళాలతో సమన్వయం తదితరాల్లోనూ వ్యూహాత్మక మార్పులు చేస్తున్నాం’ అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్ పీటీఐకి చెప్పారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారుపై దాడి
-
కన్నయ్య కుమార్ వాహనం మీద దాడి
పాట్నా : జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడిన వారి గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. కొన్ని రోజుల క్రితం కన్నయ్య మీద ఎయిమ్స్ డాక్టర్, సెక్యూరిటీ గార్డ్ కేసు పెట్టారు. కన్నయ్య తమతో తప్పుగా ప్రవర్తించాడని తమ ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కన్నయ్య వచ్చే ఏడాది ఎన్నికల్లో సీపీఐ తరపున పోటి చేయనున్నారు. -
చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్న కవిటి గ్రామ ప్రజలు
-
చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకున్న గ్రామస్తులు
సాక్షి, కవిటి/శ్రీకాకుళం : టిట్లీ తుపానుతో అతలాకుతలమైన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని కవిటి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్ను కవిటి గ్రామంలోని మత్స్యకారులు శనివారం అడ్డుకున్నారు. తమ గ్రామం నుంచి వెళ్తూ తమ బాగోగులు పట్టించుకోకుండా వెళ్తున్న సీఎంపై తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్కి అడ్డుతగిలి తమ గోడును వెళ్లగక్కారు. మూడు రోజులుగా తిండీ తిప్పలు లేకుండా అంధకారంలో గడిపామనీ, ప్రభుత్వం చెప్తున్నట్టుగా తమకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. దీనిపై స్పందించిన చంద్రబాబు టిట్లీ బాధితుల సహాయార్ధం అన్ని సహాయక చర్యలు చేపట్టామనీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డుతగలడం భావ్యం కాదని అన్నారు. కాగా, తుఫాను విధులకు సక్రమంగా హాజరు కాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో కవిటి మండల అభివృద్ధి అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. -
బాలుడిని ఢీకొట్టిన డిప్యూటీ సీఎం కాన్వాయ్
కర్నూలు : కర్నూలులోని సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామంలో ఓ బాలుడిని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాన్వాయ్లోని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం గాయపడిన బాలుడిని పట్టించుకోకుండా డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చేయడంతో పోలీసులు బాలుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలుడు పొలకల్ గ్రామానికి చెందిన దిలీప్ (7)గా గుర్తించారు. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపవద్దు..!
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. -
అమిత్ షాపై దాడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతికి కొండ దిగుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. అరుపులు, కేకలు, తోపులాటలతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అమిత్ షా కారును అడ్డుకోబోయిన ఆందోళనకారుల యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై ఇరు పార్టీల నేతలు ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు అమిత్ షా కాన్వాయ్పై దాడికి పాల్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశరెడ్డి ధ్వజమెత్తగా.. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై నిరసన పేరుతో దాడి చేయడాన్ని వివిధ వర్గాల ప్రముఖులు త్రీవంగా ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అమిత్ షా.. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి తిరుపతికి ప్రయాణమయ్యారు. అమిత్ షా రాక గురించి తెలుసుకున్న టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడు దంపూరు భాస్కర్ యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్వర్మ, స్థానిక ఎమ్మెల్యే అల్లుడు బీఎల్ సంజయ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుణశేఖర్ నాయుడు తదితరులు పార్టీ కార్యకర్తలతో ఉదయం 11గంటలకు పెద్దఎత్తున అలిపిరి గరుడ సర్కిల్కు చేరుకున్నారు. అమిత్ షా కాన్వాయ్ రాగానే ‘గో బ్యాక్..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆయన క్వానాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అమిత్ షా కారు గరుడ సర్కిల్ దాటి వెళ్లిపోయింది. అలిపిరి వద్ద అమిత్షా కాన్వాయ్ను అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను అదుపుచేస్తున్న పోలీసులు కాన్వాయ్లోని ఓ కారును చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.. కారు వెనుక అద్దాలపై కట్టెలు, రాళ్లతో దాడిచేసి పగులగొట్టారు. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అడ్డుపడ్డారు. బీజేపీ నాయకులను వెళ్లమని చెప్పి టీడీపీ ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా స్వల్పంగా తోపులాట జరిగింది. ఆందోళనకారులను రోప్ పార్టీ బలంగా వెనక్కి నెట్టడంతో సింగంశెట్టి సుబ్బరామయ్య, గుణశేఖర్నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సుబ్బు, రవి, ఆనంద్గౌడ్లనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేసి అలిపిరి స్టేషన్కు తరలించారు. ఎస్పీకి పరస్పర ఫిర్యాదులు ఈ సంఘటన జరిగిన గంట తరువాత తిరుపతి బీజేపీ నాయకులు భానుప్రకాశ్రెడ్డి, సామంచి శ్రీనివాస్, చంద్రారెడ్డి, వరప్రసాద్, కోలా ఆనంద్లు ఎస్పీ అభిషేక్ మొహంతిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాన్వాయ్పై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు కూడా ఎస్పీని కలిసి తమ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడిచేశారని ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల కేసులూ నమోదు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రిదే బాధ్యత రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోంది. అమిత్ షా కాన్వాయ్పై జరిగిన దాడికి ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. సీఎం ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. రౌడీలు, గూండాల్లా వ్యవహరించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందంటే సరిపోదు.. తాడిచెట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. తులసి మొక్కకున్న పవిత్రత దానికి ఉండదు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన జాతీయ పార్టీ నేతను అవమానించడం, తెలుగు ప్రజలపై ఉన్న మంచి అభిప్రాయాన్ని దెబ్బతీయడమే. ఈ దాడికి సీఎం బాధ్యత వహించాలి. – భానుప్రకాశ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
హోంమంత్రి కాన్వాయ్లో మంటలు
సాక్షి, విశాఖ: ఏపీ హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఎస్కార్ట్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు. విశాఖ జిల్లాలోని కొండల అగ్రహారం వద్ద ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారంణంగా మంటలు చెలరేగినట్టు సిబ్బంది చెప్పారు. ప్రమాద సమయంలో చినరాజప్ప కాన్వాయ్లో లేరని తెలుస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.