
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతుండగా విజయవాడ శివారు ఎనికేపాడు వద్ద 108 అంబులెన్స్ వేగంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిని గమనించిన సీఎం తన కాన్వాయ్ని స్లో చేయించి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేయించారు. దీంతో అంబులెన్స్ వేగంగా కాన్వాయ్ని దాటి ముందుకెళ్ళింది.