Ambulance
-
15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు. -
మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి
సాక్షి, అమరావతి: బోడి గుండుకు... మోకాలికి ముడిపెట్టినట్టు.. మనుషుల వైద్య సేవల కాంట్రాక్ట్లో పశువుల వైద్య సేవల్లో అనుభవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముడిపెట్టింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయూ), 108 అంబులెన్స్ల నిర్వహణ టెండర్లలో సంచార పశువైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు అర్హత కల్పిస్తూ వైద్యశాఖ నిబంధనలు పొందుపరిచింది. సాధారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల వైద్య శాఖలు ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలు గతంలో ఆయా విభాగాల్లో అనుభవం, సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధనలు పెడుతుంటాయి. ఏపీలో గతంలో నిర్వహించిన టెండర్లలో సైతం అవే నిబంధనలున్నాయి. కానీ, తొలిసారిగా గతానికి భిన్నంగా పశు వైద్య సేవల కల్పనలో అనుభవాన్ని ప్రస్తుత టెండర్ నిబంధనల్లో చేర్చారు. ‘భవ్య’మైన స్కెచ్లో ఇదీ భాగమేనని తెలుస్తోంది. రూ. రెండు వేల కోట్ల అంచనాలతో కూడిన ఎంఎంయూ, 108 అంబులెన్స్లు, కాల్ సెంటర్ నిర్వహణ కోసం ఐదేళ్ల కాలపరిమితికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్లకు రూ. రెండు వేల కోట్ల మేర అంచనాలున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీకి స్కెచ్ అయితే... 104, 108 అంబులెన్స్ల నిర్వహణలో అస్మదీయ సంస్థకు పెద్దగా అనుభవం లేదు. ఆ సంస్థ ఉత్తరాదితోపాటు, మధ్య భారత్లోని పలు రాష్ట్రాల్లో పశు సంచార వైద్య సేవల కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కేవలం 104, 108 నిర్వహణ అనుభవం ప్రాతిపదికన నిబంధనలు ఉన్నట్లయితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుంది. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సంబంధం లేని పశు వైద్య సేవల వాహనాల నిర్వహణ అంశాన్ని టెండర్ నిబంధనల్లో చేర్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున దోచుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యాన్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని టెండర్ నిబంధనలు చూసిన వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక్కడ మాత్రమే వింత నిబంధనలు దేశవ్యాప్తంగా అనుభవం, అవగాహన ఉన్న సంస్థలకే 108, 104 కాంట్రాక్ట్లు ఇచ్చేలా అనేక రాష్ట్రాలు అడుగులు వేస్తుంటే... చంద్రబాబు పాలనలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వింత నిబంధనలు విధిస్తోంది. గడిచిన ఐదేళ్లలో అంబులెన్స్లు/ఎంఎంయూలతో పాటు మొబైల్ వెటర్నరీ యూనిట్స్/వెటర్నరీ క్లినిక్స్ వంటి పశు వైద్య సేవల నిర్వహించిన అనుభవాన్ని నిబంధనల్లో చేర్చారు. 108, 104 కలిపి 1700 వాహనాలను నిర్వహించాల్సి ఉండగా బిడ్ వేసే నాటికి వంద వాహనాలు నిర్వహించిన అనుభవం ఉన్నా చాలనే షరతు పెట్టారు. అంతేకాకుండా అంబులెన్స్, ఎంఎంయూ వాహనాల నిర్వహణ అనుభవానికి మార్కులు కేటాయించే విధానాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని అత్యవసర వైద్య సేవల కల్పన పేరుతో కనీస అనుభవం లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెడితే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలేనని వైద్య శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇలా..» గడిచిన రెండు, మూడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 108, 104 వాహనాల నిర్వహణ కోసం పిలిచిన టెండర్ల నిబంధనలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ దోపిడీ స్కెచ్ అందరికీ అర్థం అవుతుంది. » అసోంలో గతేడాది అంబులెన్స్ల నిర్వహణ కోసం వైద్య శాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్ పిలిచిన నాటికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంబులెన్స్ సేవలు నిర్వహించి ఉండటంతో పాటు, బిడ్లు వేసిన సంస్థలకు 600లకు పైగా అంబులెన్స్లు నిర్వహించిన అనుభవం, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే షరతు ఉంది. » జమ్ము కశ్మీర్లో గతేడాది అక్టోబర్లో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 650 బేసికల్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్), 150 మేజర్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్)అంబులెన్స్లతో పాటు, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించిన అనుభవం ఉండాలనేది నిబంధన. » కేరళలో ప్రస్తుతం అంబులెన్స్ నిర్వహణకు టెండర్లు నడుస్తున్నాయి. బిడ్లు వేసే సంస్థలు కనీసం 150 అంబులెన్స్లు నడిపిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. అదే విధంగా అంబులెన్స్ నిర్వహణ అనుభవానికి కూడా మార్కులు ఇచ్చి, అత్యంత అనుభవం కలిగిన సంస్థను ఎంపిక చేస్తున్నారు. » ఇక... తెలంగాణలో 2022లో 108 టెండర్లు నిర్వహించారు. మూడేళ్ల పాటు కనీసం 200 అంబులెన్స్లను, 40 సీటింగ్ సామర్థ్యంతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే నిబంధన పెట్టారు. » ఛత్తీస్గఢ్లో ఎంఎంయూ వాహనాల నిర్వహణ కోసం గత నెలలో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలు మొబైల్ మెడికల్ వ్యాన్స్ (ఎంఎంవీ), ఎంఎంయూ, మొబైల్ హెల్త్ యూనిట్స్ నిర్వహించి ఉండాలని నిబంధన పెట్టారు. ఇక్కడ కూడా అనుభవానికి మార్కులు కేటాయించి, ఎంపిక చేస్తున్నారు. -
10 నిమిషాల్లో అంబులెన్స్.. ‘జాగ్రత్తగా వ్యవహరించాలి’
బ్లింకిట్ వంటి క్విక్కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్లో ఐదు అంబులెన్స్లను ప్రారంభించాం’ అన్నారు. -
10 నిమిషాల్లో అంబులెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్విక్ కామర్స్ రంగంలో సంచలనానికి బ్లింకిట్ తెరతీసింది. ఇప్పటి వరకు ఆహారం, లైఫ్స్టైల్ ఉత్పత్తులకు పరిమితమైన క్విక్ కామర్స్(Quick Commerce) రంగంలో ఏకంగా అంబులెన్స్ సేవలకు కంపెనీ శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాతిపదికన ఈ సేవలను మొదట గురుగ్రామ్లో ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను విస్తరించనుననట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు ఈ అంబులెన్సులో ఉంటాయి. డ్రైవర్తోపాటు పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్ సైతం ఉంటారు. ‘నగరాల్లో త్వరిత, విశ్వసనీయ అంబులెన్స్(Ambulance) సేవలను అందించే విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. గురుగ్రామ్లో తొలి ఐదు అంబులెన్స్లు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. లాభం లక్ష్యం కాదు. కస్టమర్లకు సరసమైన ధరతో ఈ సేవను నిర్వహిస్తాం. దీర్ఘకాలికంగా ఈ క్లిష్ట సమస్యను నిజంగా పరిష్కరించడంలో పెట్టుబడి పెట్టాం’ అని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా చెప్పారు. -
‘స్పీడ్ బ్రేకర్’ ప్రాణం పోసింది!
కొల్హాపూర్: వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ రోగి చనిపోయాడని చెప్పినా ఒక స్పీడ్బ్రేకర్ (Speed Breaker) కారణంగా ఆ రోగి మళ్లీ బతికొచ్చిన వైనం మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం జరిగిన ఈ వింత ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కొల్హాపూర్ జిల్లాలోని (Kolhapur District) కసాబా–బావడా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల పాండురంగ ఉల్పే అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు.అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు ఆ ఆస్పత్రిలోని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్సును సిద్ధంచేశారు. పాండురంగ పరమపదించారన్న వార్త అప్పటికే సొంతూరిలో పాకింది. వెంటనే బంధువులు, స్నేహితులు, తెల్సిన వాళ్లు ఇంటికి రావడం మొదలెట్టారు. అందరూ ఇంటి వద్ద వేచి చూస్తుండటంతో మృతదేహాన్ని త్వరగా ఇంటికి తరలించాలన్న ఆత్రుతలో అంబులెన్సుకు డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు.మార్గమధ్యంలో రహదారిపై ఉన్న ఒక పెద్ద స్పీడ్బ్రేకర్ను చూడకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. దీంతో వాహనం భారీ కుదుపులకు లోనైంది. ఈ సమయంలో పాండురంగ శరీరం అటుఇటూ కదలిపోయింది. తర్వాత శరీరాన్ని స్ట్రెచర్పైకి సవ్యంగా జరిపేటప్పుడు పాండురంగ చేతి వేళ్లు కదలడం చూసి ఆయన భార్య హుతాశురాలైంది. వెంటనే అంబులెన్సుకు ఇంటికి బదులు దగ్గర్లోని మరో ఆస్పత్రికి పోనిచ్చి పాండురంగను ఐసీయూలో చేర్పించారు. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని తేల్చిన అక్కడి వైద్యులు పాండురంగకు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. రెండు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సోమవారం ఇంటికొచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ‘‘ఆ స్పీడ్బ్రేకర్ లేకపోయి ఉంటే మా ఆయన ఇలా ఇంటికి కాకుండా నేరుగా శ్మశానానికే వెళ్లేవారు’’ అని పాండురంగ భార్య నవ్వుతూ చెప్పారు. బతికున్న రోగిని చనిపోయాడని సర్టిఫై చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని పాండురంగ కుటుంబం నిర్ణయించుకుంది. త్వరలో ఆస్పత్రికి నోటీసులు పంపి కోర్టుకీడుస్తామని పేర్కొంది. -
10 నిమిషాల్లోనే అంబులెన్స్.. బ్లింకిట్ కొత్త సర్వీస్
క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్ఫారమ్ బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్ను ప్రారంభించింది. 10 నిమిషాల అంబులెన్స్ (ambulance)సేవను గురుగ్రామ్ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాము" అని ధిండ్సా పేర్కొన్నారు. గురుగ్రామ్ నగరంలో కంపెనీ ఈరోజు (జనవరి 2) నుండి ఐదు అంబులెన్స్లను ప్రారంభించిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన కూడా ఉందని ఆయన వెల్లడించారు.“మొదటి ఐదు అంబులెన్స్లు గురుగ్రామ్లో రోడ్పైకి వస్తాయి. సర్వీస్ను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేసినప్పుడు, బ్లింకిట్ యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్ని బుక్ చేసుకునే ఎంపికను మీరు చూస్తారు" అని ధిండ్సా తన పోస్ట్లో పేర్కొన్నారు.బ్లింకిట్ అంబులెన్స్లలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED), స్ట్రెచర్, మానిటర్ వంటి పరికరాలతోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని ధిండ్సా వివరించారు. ప్రతి అంబులెన్స్లో ఒక పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇందులో తమకు లాభం ముఖ్యం కాదని, తక్కువ ధరకు ఈ సేవలు అందిస్తామని వివరించారు.Ambulance in 10 minutes.We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z— Albinder Dhindsa (@albinder) January 2, 2025 -
ఈ ఉద్యోగాలు చేస్తుంటే... మతిమరుపు రాదు!
అల్జీమర్స్. వయసుతో పాటు వచ్చే మతిమరుపు. ఇది కొందరిలో మరణానికీ దారి తీస్తుంది. అయితే కొన్ని రకాల వృత్తుల్లోని వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశమే లేదంటున్నాయి అధ్యయనాలు! ముఖ్యంగా డ్రైవింగ్లో ఉండేవాళ్లు ఆల్జీమర్స్తో మరణించే ప్రమాదం తక్కువట. అయితే బైక్ నడిపేవాళ్లు ఈ జాబితాలోకి రారు. అలాగే పైలట్లకు కూడా ఇది వర్తించదు. టాక్సీ, అంబులెన్స్ వంటివాటిని నడిపేవాళ్లకే అల్జీమర్స్ వచ్చే అవకాశం తక్కువట. అల్జీమర్స్ మెదడు వ్యాధి. జ్ఞాపకశక్తిని, ఆలోచనలను, రోజువారీ పని చేసే శక్తిని క్రమంగా తగ్గించేస్తుంది. ఇది వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపతుంది. మెదడు కణాలు దెబ్బతినడం, సరిగా పని చేయకపోవడం అల్జీమర్స్కు దారితీస్తుంది. దాంతో గందరగోళంగా మాట్లాడటం, అత్యంత సన్నిహితులను కూడా గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. 2020 నుంచి 2022 మధ్య మరణించిన 90 లక్షల మంది వైద్య చరిత్రను పరిశీలించారు. వీరిలో 443 రకాల వృత్తులకు సంబంధించిన వారున్నారు. వారిలో 3.88 శాతం మరణాలు, అంటే మూడున్నర లక్షల మంది అల్జీమర్స్తో చనిపోయారు. వారిలో ట్యాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు చాలా తక్కువ మంది ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఆ డ్రైవర్లకు ఎందుకు రాదంటే... పరిశోధన ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన మీదట ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్టు సైంటిస్టులు తెలిపారు. అవేమిటంటే... → అల్జీమర్స్ ప్రారంభంలో మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. → టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లలో రియల్ టైమ్ స్పేషియల్ థికింగ్, నావిగేషన్ ఈ హిప్పోకాంపస్కు చక్కని వ్యాయామంలా పని చేస్తున్నాయట. → ఈ నిరంతర వ్యాయామం వల్ల వారిలో అది చురుగ్గా, చైతన్యవంతంగా పని చేస్తోంది. → అదే బస్సు డ్రైవర్లు, విమానాల పైలట్లలో అంత నావిగేషన్ స్కిల్స్ ఉండటం లేదని అధ్యయన బృందం సారథి డాక్టర్ విశాల్ పటేల్ తెలిపారు. → నావిగేషన్స్ స్కిల్స్ పెంచే మానసిక వ్యాయామాలు మెదడును ప్రభావితం చేసి చురుగ్గా ఉంచుతాయని ఆయన వివరించారు. → కనుక వాటిపై దృష్టి పెడితే చాలని అధ్యయనకారులు చెబుతున్నారు. → మానసికంగా చురుగ్గా ఉంటే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తేల్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలీసు వాహనాలను ఢీకొట్టి.. అంబులెన్స్ తో పరార్
-
డయాలసిస్ బాధితులకు 108లో ఉచిత ప్రయాణానికి మంగళం
-
ప్రజారోగ్యంపై పగ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేసేశారంటూ ప్రతి వేదికపై గుండెలు బాదుకుంటున్న సీఎం చంద్రబాబే నిజానికి వాటన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. గతంలో పేదలకు మేలు చేసిన అనేక కార్యక్రమాలకు ఆయన మంగళం పాడుతూ రివర్స్ పాలన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఉన్నపళంగా నిలిపేసి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చివరికి.. వారి ప్రాణాలతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, అనుయాయులకు వాటి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం నిధులు చెల్లించకుండా 108, 104 వాహనాలను మూలనపడేయడం ఇందుకు నిదర్శనం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రోగులకు చుక్కలు చూపుతోంది. ఇందులో భాగంగా డయాలసిస్ రోగులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రవాణా సదుపాయానికి కూడా తిలోదకాలిచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డయాలసిస్కు ఆస్పత్రికి వెళ్లాల్సిన వ్యక్తి 108 అంబులెన్సుకు ఫోన్చేస్తే నిమిషాల వ్యవధిలోనే రోగి ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గత మూడు వారాలుగా ఈ సేవలకు మంగళం పాడేసింది. బాధితులు 108కు ఫోన్ చేసినా అంబులెన్స్లు రావడంలేదు. ‘కేవలం తీవ్ర అనారోగ్య సమస్యలుంటేనే అంబులెన్స్ వస్తుంది.. డయాలసిస్ కోసం రాదు’ అని కాల్సెంటర్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారని డయాలసిస్ బాధితులు వాపోతున్నారు.అవస్థలుపడుతూ ఆస్పత్రులకు.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 600 మందికి పైగా రోగులు 108 అంబులెన్సుల ద్వారా డయాలసిస్కు వెళ్లేవారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకూ 2.50 లక్షల మందికి పైగా ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 108 సేవలపై చీకట్లు కమ్ముకున్నాయి. డీజిల్కు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా అంబులెన్స్లు మూలనపడ్డాయి. ఫలితంగా డయాలసిస్తో పాటు ఇతర అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లు రాక కొందరు మరణించారు. ఉచిత రవాణా కల్పించాలని డిమాండ్.. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా డయాలసిస్ రోగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో కిడ్నీ బాధితులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. గ్రామానికి 30 నుంచి 50 కి.మీల దూరంలో ఉండే డయాలసిస్ కేంద్రాలకు ఒకసారి వెళ్లి రావాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1,500 వరకూ బాధితులు ఖర్చుచేయాల్సి వస్తోంది. కొందరికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ అవసరమవుతోంది. వారికి ఈ ఖర్చు తలకుమించిన భారమవుతోంది. దీంతో.. ప్రయాణ ఖర్చులకు భయపడి కొందరు డయాలసిస్ను నిర్లక్ష్యంచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి 108 అంబులెన్స్ల్లో ఉచిత రవాణాకు అవకాశం కల్పించాలని డయాలసిస్ రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ బస్సుల్లోనైనా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది.. కొన్నేళ్లుగా నా భర్త చిరంజీవికి డయాలసిస్ చేయిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 108 ద్వారా ఉచితంగా ఆస్పత్రికి తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు వాహనం రావడం లేదు. వారంలో మూడు రోజులు సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆటోలో వచ్చినప్పుడల్లా రూ.300 వరకు ఖర్చవుతోంది. ఆటోలో వస్తున్న సమయంలో నా భర్త ఒక్కోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది. ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మాలాంటి వారిని ఆదుకోవాలి.– లీలావతి, వడ్డిపల్లి, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు.. మా తమ్ముడు సత్యనారాయణ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి భార్య లేదు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో డయాలసిస్కు నేనే తీసుకురావాల్సి వస్తోంది. ప్రతిసారీ రూ.500 వరకు ఖర్చవుతోంది. మాలాంటి పేదలకు ప్రతిసారీ ఇలా రూ.వందలు ఖర్చు పెట్టుకోవడం చాలా భారంగా ఉంది. డయాలసిస్ చేయించుకుని తీసుకెళ్లేలోపు నా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు. – జయలక్ష్మి, ధర్మభిక్షం కాలనీ, అక్కంపల్లి, అనంతపురం జిల్లా మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి..అప్పు చేసి డయాలసిస్ కోసం తిరుగుతున్నాం. గత ప్రభుత్వం డయాలసిస్ రోగుల కోసం 108 అంబులెన్సులో ఉచిత ప్రయాణ సేవలు అందించింది. దీంతో మాకు రవాణా ఖర్చులు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి 108 సేవలను ఆపేశారు. దీంతో రవాణా చార్జీలు కష్టంగా మారాయి. మేము బంగారుపాళ్యం నుంచి ఆటోలో రావాలంటే రూ.500పైన డబ్బులు తీసుకుంటున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి. –శ్యామల, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లాఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి.. ఆంజనేయులు. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి నివాసి అయిన ఈయన గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి వారంలో మూడుసార్లు డయాలసిస్ కోసం వెళ్లాల్సి ఉంది. గత ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆంజనేయులు 108 అంబులెన్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేవాడు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఉచిత రవాణా సదుపాయాన్ని నిలిపేయడంతో కుమారుడితో కలిసి బైకుపైన అవస్థలు పడుతూ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా ఆంజనేయులు ఒక్కరే కాదు.. డయాలసిస్ రోగులకు చంద్రబాబు ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.కొండ్రు ఇసాక్, అతడి భార్య రాణమ్మ. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం విజయనగర్ కాలనీలో వీరు నివాసముంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా వీరు నెలలో 13 రోజులు 30 కిలోమీటర్లు ప్రయాణించి కనిగిరి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకువెళ్లేదని, డయాలసిస్ చేయించుకుని ఇంటికి వచ్చేవారమని ఆ దంపతులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మూడు వారాలుగా అంబులెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వెళ్తుంటే రూ.1,000 నుంచి 1,500 తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలా నెలలో 13 రోజులకు ఆటోకి రూ.19,500 అవుతోందని, ఇది కాకుండా మందులు రూ. 5,000 వరకూ అవుతున్నాయని కలత చెందుతున్నారు. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
అంబులెన్స్కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!
రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024 -
అంబులెన్స్ కు దారి ఇవ్వని కారు డ్రైవర్
-
కారు ఓనర్కి పోలీసుల షాక్.. అంబులెన్స్కి దారి ఇవ్వలేదని..
తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ.. నేరుగా ఆ కారు యాజమాని ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn— MDApp (@MDAppMDApp) November 17, 2024 -
పేలిన అంబులెన్స్.. తప్పిన పెను ప్రమాదం
-
అంబులెన్స్లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
అంపశయ్యపై అంబులెన్సులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెనుముప్పు దాపురించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు అండగా నిలవాల్సిన ‘108’ అంబులెన్సులకు పెద్దఆపద వచ్చింది. ఈ ఆపద్భాందవికి ఫోన్చేస్తే కుయ్ కుయ్మంటూ నిమిషాల్లో ఘటనా స్థలంలో వాలిపోయి బాధితులకు చేయూతనివ్వాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యంగా కారణంగా డీజిల్లేక ముందుకు కదలడంలేదు. ఇలా బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 290 అంబులెన్స్లు ఆగిపోయాయి. దీంతో.. వైద్యసాయం కోసం 108కు ఫోన్చేసిన వారికి ‘మీ దగ్గరలో అంబులెన్స్లు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆస్పత్రులకు వెళ్లండి’ అని కాల్ సెంటర్ ప్రతినిధులు బదులిచ్చారు. బిల్లులు మంజూరు చేయాలని కోరినా..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులన్నీ అస్మదీయులకు కట్టబెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను తప్పించడానికి పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల్లో ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఇలా ఏకంగా రూ.141 కోట్ల బిల్లులు నిలిచిపోవడంతో గడిచిన మూడు నెలలుగా 104, 108 సిబ్బందికి అరబిందో సంస్థ వేతనాలు చెల్లించలేదు. మరోవైపు.. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు.అయినప్పటికీ దీపావళికి ముందు 108 కాల్ సెంటర్ నిర్వహణ సంస్థకు బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం అరబిందోకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఎంఓయూ రద్దుచేసుకుని వెళ్లిపోవాలని సంస్థపై ఒత్తిడి చేస్తూనే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంటోందని ఎల్లో మీడియా లీకులిచ్చి కథనాలు రాయించింది. దీంతో కొన్ని రోజులుగా అరువుపై డీజిల్ పోసే పెట్రోల్ బంకులు సైతం రెండు మూడ్రోజులుగా చేతులెత్తేశాయి. దీంతో.. 108 సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అరబిందో సంస్థ మంగళవారం ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఐదు నెలలుగా బిల్లులు నిలిచిపోవడం, రివాల్వింగ్ ఫండ్ కూడా లేకపోవడంతో వారం, పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీజిల్లేక అంబులెన్సులు నిలిచిపోతున్నా బాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నాలుగుసార్లు ఫోన్చేసినా రాలేదు..మా అమ్మాయి తేళ్లూరు అశ్రితకు కడుపులో నొప్పి రావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు నాలుగుసార్లు ఫోన్చేసినా 108 రాలేదు. దీంతో.. ప్రైవేటు అంబులెన్స్కు డబ్బులు పెట్టే స్థోమతలేక బస్సులో విజయవాడ తీసుకెళ్లాం. – తేళ్లూరు నాగేశ్వరరావు, చాట్రాయిసాయం అందక హాహాకారాలు..నిజానికి.. 2019కు ముందు బాబు పాలనలో కునారిలి్లన 108 వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఊపిరిలూదుతూ 768 అంబులెన్సులతో బలోపేతం చేసింది. ఇందులో బ్యాకప్ పోను 731 వాహనాలు క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందిస్తుంటాయి. ఇలా సగటున రోజుకు మూడువేలకు పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అంబులెన్సులు అండగా నిలుస్తున్నాయి. అంటే.. రోజుకు నాలుగు పైగా కేసులకు ఒక్కో అంబులెన్స్ అటెండ్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో డీజిల్లేక బుధవారం ఒక్కరోజే 290 అంబులెన్సులు నిలిచిపోయాయి.500లోపు వాహనాలు అరకొరగా సేవలు కొనసాగిస్తున్నాయి. ఉదా.. ఏలూరు జిల్లాలో 108 వాహనాలు మొత్తం 29 ఉండగా మంగళవారం డీజిల్లేక 12 వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిల్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు, మండవల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెంలకు చెందిన వాహనాలున్నాయి. ఇక మంగళవారం 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన బాధితులు ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించలేక హాహాకారాలు చేస్తున్నారు.⇒ ఈ చిత్రంలోని మహిళ అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 108 వాహనం కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబీకులే రూ.500 బాడుగతో ఆటో మాట్లాడుకుని 15 కి.మీ దూరంలోని సర్వజనాస్పత్రికి ఆమెను తీసుకువచ్చారు.⇒ ఈ చిత్రంలోని మహిళ పేరు పార్వతమ్మ. స్వగ్రామం అనంతపురం జిల్లా ముద్దలాపురం. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు 108 వాహనం కోసం ఫోన్ చేయగా.. అదిగో.. ఇదిగో అంటూ మధ్యాహ్నం వరకూ గడిపారు. ఆ తర్వాత స్పందించ లేదు. దీంతో కుటుంబీకులు 32 కి.మీ దూరంలోని అనంతపురం సర్వజనాస్పత్రికి ఆటోలో తీసుకువచ్చారు. -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్లో ఈ ఏడాది ఏప్రిల్లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..
ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుడీ-మ్యాక్స్ అంబులెన్స్ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు. -
మీరు మనుషులేనా
-
‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే పెంపుడు జంతువు శునకం. కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ప్రాణాలు కూడా ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం పదండి! A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW— TaraBull (@TaraBull808) September 12, 2024అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని ఆంబెలెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని చూసి కుక్క మనసు ఆగలేదు. అంబులెన్స్ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్ డ్రైవర్కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్లో తెగ వైరలవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. అసలు ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం పరమార్థం ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు. (ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!) -
హృదయ విదారకం.. ‘బిడ్డల మృతదేహాలను భుజాన వేసుకుని’
భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి. ఈ కాలంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా మహారాష్ట్రలో హృదయ విదారక దృశ్యాలు వెలుగుచూశాయి. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో ఓ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో తీవ్రమైన జ్వరంలో బాలురు మరణించారు. దీంతో ఆసుపత్రి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి మృతదేహాలను భుజాలను మోసుకెళ్లారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలపే ఓ జంట వారి భుజాలపై మోసుకెళ్తూ బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళ్తున్న వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.‘ఇద్దరు సోదరులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే వారికి సకాలంలో చికిత్స లభించలేదు. కొన్ని గంటల్లోనే వారి పరిస్థితి క్షీణించింది. గంటల వ్యవధిలో ఇద్దరు బాలురు మరణించారు. వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్కు తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసిన బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది.’అంటూ వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.‘గడ్చిరోలి జిల్లాకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందుతుందో వాదిస్తున్నారని కాని గ్రౌండ్ లెవల్కి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ ఎలా మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం లేదు.’ అని మండిపడ్డారు.అయితే విదర్భ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోవది. సెప్టెంబరు 1న ఒక గర్భిణీ గిరిజన మహిళ తన ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. స్థానిక ఆసుపత్రికి ఆమెను సమయానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ను రాకపోవడంతో నొప్పులతో తనువు చాలించింది. -
అంబులెన్స్లో దారుణం.. పేషెంట్ భార్యనే వేధించి..
అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ దారుణానికి పాల్పడ్డారు. బ్రెయిన్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి బాధితురాలు ప్రతి ఘటించడంతో నిందితులు ఆమె భర్తకు ధరించిన ఆక్సిజన్ మాస్క్ తొలగించారు. అందిన కాడికి డబ్బుల్ని దోచుకుని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను అతని భార్య చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరుసటి రోజే అంబులెన్స్లో భర్తను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఓ అంబులెన్స్ను మాట్లాడుకుని ఇంటికి బయలు దేరారు బాధితురాలు, ఆమె తమ్ముడు. అర్ధరాత్రి కావడంతో మార్గం మధ్యలో అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. ముందు క్యాబిన్లో కూర్చోమని, ఆపై వేధించారు. వేధింపులకు పాల్పడడం గుర్తించిన బాధితురాలి తమ్ముడు అడ్డుకోగా.. చివరగా ఛవానీ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై అంబులెన్స్ను ఆపారు. భర్తకు తగలించిన ఆక్సిజన్ మాస్క్ను తొలగించారు. బాధితుణ్ని బలవంతంగా కిందకు దించారు. అనంతరం డబ్బు, నగదుతో అక్కడి పరారయ్యారు.ఆక్సిజన్ మాస్క్ తొలగించడంతో అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు -
అనగాని కోసం అంబులెన్సు ఆపిన పోలీసులు
-
AP: మంత్రి కాన్వాయ్ కోసం.. అంబులెన్స్ను ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కాన్వాయ్ కోసం అంబులెన్స్ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు అంబులెన్స్ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయించారు.టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులుమరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు. -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్తో చనిపోవడంతో డిప్రెషన్కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్డ్రైవర్గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్కి భారీ విందు..!) -
డైవింగ్ రాదు.. కానీ అంబులెన్స్ కొట్టేశాడు
-
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మీ ఆరోగ్యానికి పూచీ మాది
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది. తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. దేశంలో అగ్రస్థానంలో ఏపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 అంబులెన్స్లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్లు కాపాడాయి. పల్లె చెంతకే వైద్యులు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది. -
అంబులెన్స్ కి దారిచ్చిన సీఎం జగన్
-
గుంతలో పడిన అంబులెన్స్ : బతికొచ్చిన తాత
గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది. అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్లోని ఎన్పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు. క్రిటికల్, కానీ శ్వాస ఉంది బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు. -
గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టేందుకు గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు. ఇలా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్లోని బ్లాంకా ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు. (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!) దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు. ముందుగానే అక్కడి సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు. పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్కు బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్ పడింది. అతని ఫోటోను అన్ని రెస్టారెంట్లకు పంపి, అరెస్ట్ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
బర్డ్ అంబులెన్స్
చండీగఢ్కు చెందిన మన్జిత్సింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రాయిగ్ టీచర్. పర్యావరణ కార్యకర్త. పక్షుల ప్రేమికుడు. ఏదో పనికోసం పంజాబ్లోని ఫిరోజ్పూర్ పట్టణానికి వెళ్లిన సింగ్ అక్కడ ఒకచోట ఒక దృశ్యాన్ని చూశాడు. స్వీపర్ ఊడుస్తున్న చెత్తలో చనిపోయిన పావురం కనిపించింది. ‘ఎలా చనిపోయింది?’ అని అడిగాడు సింగ్. కరెంట్షాక్కు గురై చనిపోయినట్లు చెప్పింది ఆమె. ‘ఇలా చాలా పావురాలు చనిపోతాయి’ అని కూడా చెప్పింది. ఈ సంఘటనను సింగ్ మరిచిపోలేకపోయాడు. ఆ సమయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి...వ్యాధులు వ్యాపించకుండా చనిపోయిన పక్షులను ఖననం చేయడం, రెండు...ప్రమాదం బారిన పడిన పక్షులకు చికిత్స అందించడం. దీని కోసం తన సైకిల్ను ‘బర్డ్ అంబులెన్స్’గా మార్చి వీధులు తిరుగుతుంటాడు సింగ్. ‘మీకు సమీపంలో పక్షులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి’ అంటూ వీధుల్లో కరపత్రాలు పంచుతుంటాడు. ‘ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని నాకు అది ఇష్టం లేదు. ఏ మాత్రం సమయం దొరికినా పక్షుల బాగు కోసం ఉపయోగిస్తాను’ అంటున్నాడు మన్జిత్సింగ్. -
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్ను ఆంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మూగజీవాలకు పునర్జన్మనిచ్చే సంజీవని
-
సీఎం జగన్కి లోకేశ్ మధ్య తేడా ఇదే..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మనిషి ప్రాణం విలువ తెలిసిన నాయకుడు. అందుకే సీఎం అయ్యాక ప్రజారోగ్యానికి సైతం పెద్దపీట వేశారు. తన నాలుగేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు సీఎం జగన్. రెండేళ్ల క్రితం ఒకేసారి 1180 అంబులెన్స్లను ప్రారంభించి ప్రజారోగ్యం ఎంత ముఖ్యమో చాటి చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకానికి కూడా మరింత వన్నె తెచ్చారు సీఎం జగన్. జగన్ సీఎం కాకముందు కూడా ప్రజారోగ్యం పట్ల ఎంతో నిబద్ధతగా ఉండేవారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఓ బహిరంగ సభ జరుగుతుండగా ఒక అంబులెన్స్ జనం మధ్యలోకి వచ్చి చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆ అంబులెన్స్ను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వమని అక్కడ ఉన్న జన సమూహానికి విజ్ఞప్తి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మరి యువగళం పేరుతో ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్.. తన సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వలేదు.. కనీసం దారి ఇవ్వమని అక్కడున్న ప్రజలకు కూడా పిలుపునివ్వలేదు. ఒకరు ప్రాణం విలువ తెలిసిన నాయకుడు సీఎం జగన్ అయితే లోకేశ్ మాత్రం ప్రజల ప్రాణం అంటే లెక్కలేనితనంగా వ్యవహరించిన ‘నారా’ వారి వారసుడు. -
రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రథం..అంబులెన్స్ వచ్చినా దారివ్వని చంద్రబాబు
-
అంబులెన్స్ వచ్చినా.. దారివ్వని చంద్రబాబు!
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రథం నిలిపారు. అంబులెన్స్ వచ్చినా.. చంద్రబాబు దారివ్వలేదు. అంతేగాక 108 అంబులెన్స్ను టీడీపీ నేతలు వెనక్కి పంపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ-సర్కిల్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. టీడీపీ నేతల దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆరోగ్య దాత..అభయ ప్రదాత
సాక్షి, అమరావతి: రోడ్లపై కుయ్.. కుయ్మని సౌండ్ చేస్తూ తిరిగే 108 అంబులెన్సు.. ఆరోగ్యశ్రీ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004కి ముందు బడుగు, బలహీనవర్గాలు, పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఏవైనా పెద్ద జబ్బుల బారినపడితే ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలపైన ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని.. అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి దైన్యంతో నిండిపోయిన కుటుంబాలే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆరోగ్య దాతగా.. అభయ ప్రదాతగా నిలిచారు. పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టి ఎంతోమంది రోగులకు ఆయుష్షు పోశారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దైన్యం.. అప్పుల సుడిగుండంలో చిక్కుకోవాల్సిన బాధలు తప్పాయి. ఆపద్బంధు 108 ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్సును కేటాయించారు. అవసరమున్నవారు ఎవరైనా 108కి ఫోన్ చేస్తే నిమిషాల్లోనే వారి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడానికి 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో 18 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వివిధ పేర్లతో అమలు చేస్తుండటం విశేషం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. అదే విధంగా 108, 104 సేవలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. కొత్త ఊపిరిలూదిన సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో పడకేసిన ఆరోగ్యశ్రీ సేవలకు కొత్త ఊపిరిలూదారు. 108, 104 పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతోపాటు వీటి సంఖ్యను మరింత పెంచారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ప్రొసీజర్లను 1,059 నుంచి ఏకంగా 3,257కు పెంచారు. అంతేకాకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయానికి రోగులకు నెలకు రూ.5 వేల వరకు భృతిని కూడా అందిస్తున్నారు. వైద్య విద్య బలోపేతానికి కృషి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య విద్య బలోపేతానికి వైఎస్సార్ చేసిన కృషి అమోఘం. ఆయన సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కడప, ఒంగోలు, శ్రీకాకుళం, ఆదిలాబాద్ల్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లను ఏర్పాటు చేశారు. అలాగే కడపలో దంత వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలోపేతమైంది.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకే. ఈ క్రమంలో సీఎం జగన్ ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు వచ్చే ఏడాది, మిగిలిన ఏడు 2025–26 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. -
తల్లీబిడ్డల సంరక్షణలో రోల్మోడల్గా తెలంగాణ
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తల్లీబిడ్డల సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని, మాతాశిశు మరణాలు తక్కువగా ఉన్న మూడో రాష్ట్రంగా నమోదు కావడం గర్వంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. మాతాశిశు మరణాలను గణనీయంగా తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. తల్లి మరణాలు గతంలో ప్రతి లక్షకు 92 ఉంటే.. అవిప్పుడు 43కు తగ్గాయని, బిడ్డ మరణాలు 39 నుంచి 21కి తగ్గాయని తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.52 కోట్లతో నిర్మించిన మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కేర్ సెంటర్ను, రూ.2.70 కోట్లతో ఏర్పాటు చేసిన డైట్ క్యాంటీన్ భవనాలను, జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తో కలిసి హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై నెలలో 72.8 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 ప్రసూతి కేంద్రాల ఆధునికీకరణ చేపట్టామని తెలిపారు. హైదరాబాద్లోని గాం«దీ, పేట్లబురుజు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్ మాతాశిశు మరణాలను తగ్గించేందుకు 600 పడకలతో గాం«దీ, నిమ్స్, టిమ్స్ (ఆల్వాల్)ల్లో మూడు ఎంసీహెచ్ కేర్ సెంటర్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, ఆదివారం నుంచి గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని హరీశ్రావు వెల్లడించారు. ప్రస్థుతం గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణకు 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన 300 అమ్మవడి వాహనాలు రోజూ 4 వేల మంది గర్భిణులకు సేవలు అందిస్తున్నాయని వివరించారు. ఆధునిక సౌకర్యాలతో నియోనెటల్ అంబులెన్స్లు పుట్టిన ప్రతి శిశువును ప్రాణాలతో కాపాడుకునేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనెటల్ అంబులెన్స్ సర్విసులను అందుబాటులోకి తెచ్చామని హరీశ్రావు చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ అంబులెన్సులు అత్యవసర సమయాల్లో నవజాత శిశువులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వాణిదేవి, మీర్జా రహమత్ ఆలీబేగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జిల్లా కలెక్టర్ అనుదీప్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గాంధీ ఆస్పత్రికి ఐఎస్ఓ సర్టిఫికెట్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): తెలంగాణ వైద్య ప్రదాయినీ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప త్రి రెండు విభాగాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్లు సాధించింది. టెరిటరీ లెవెల్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ విభాగంలో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎస్ఓ 9001: 2015), ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎస్ఓ 45001: 2018)లకు క్వాలిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (క్యూఆర్ఓ) సంస్థ ఐఎస్ఓ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఈ సర్టిఫికెట్ల కాలపరిమితి 2026 వరకు ఉంటుందని, ప్రభుత్వ ఆస్పత్రు ల సెక్టార్లో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి ఆస్పత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. గాంధీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు గాంధీ వైద్యులు, సిబ్బంది, పాలనా యంత్రాంగ పనితీరును ప్రశంసించారు. సూపరింటెండెంట్ రాజారావు, గైనకాలజీ హెచ్ఓడీ సంగీత షాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందించి అభినందించారు. -
ఓర్వలేకే అనారోగ్యపు రాతలు!
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెత. అలాంటి పరిస్థితే ఈనాడు అధిపతి రామోజీరావుకు దాపురించింది. ఒకప్పుడు అస్థవ్యస్థంగా ఉన్న ప్రజారోగ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో కుదుటపడుతుంటే.. ఈ కామెర్ల రోగి కుంటి సాకులు వెతుకుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏపీ 108 సౌండ్ గురించి చర్చిస్తుంటే.. రాజగురువుకు భయమేస్తున్నట్లుంది. అందుకే ‘వైద్య సేవల మెరుగు ఉత్తదే’ అంటూ ఉత్తుత్తి కథనం అచ్చేశారు. రాష్ట్రంలో 108 వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్ క్లినిక్స్ 104లు 936, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కింద 500 వాహనాలు సేవలందిస్తున్నాయి. మొత్తం 2,204 వాహనాల ద్వారా ప్రజల ప్రాణాలను అత్యంత వేగంగా కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇదే రామోజీ కడుపుమంటకు అసలు కారణం. ఇప్పుడు మండలానికి ఒక అంబులెన్సు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సుల సంఖ్య 531. అవి కూడా నిర్వహణ సక్రమంగా లేక మూలనపడి మూలుగుతున్నాయి. 336 వాహనాలు అరకొరగా రోడ్లపై కనిపించేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందు కోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈ వాహనాలు ప్రజల ప్రాణాలు కాపాడాయి. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 108 అంబులెన్సులను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రభుత్వం ఈ ఏడాది కొనుగోలు చేసింది. దీని కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ కళ్లకు గంతలు, చెవుల్లో దూది పెట్టుకున్నరామోజీకి ఇవేవీ కనిపించడం లేదు. వినిపించడం లేదు. 108లు నాడు–నేడు.. గతంతో పోలిస్తే అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చే సమయం బాగా తగ్గింది. వీటికి తోడు ఇపుడు నియోనాటల్ అంబులెన్సులు పెట్టడంతో నవజాత శిశు మరణాల రేటు తగ్గింది. అప్పట్లో 86 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఉంటే వాటి సంఖ్య ఇప్పుడు 216కు పెరిగింది. గతంలో కొన్ని కేసులకు మాత్రమే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) సూచించేవారు. ఇప్పుడు ప్రత్యేక ఫిజీషియన్ ద్వారా ఈఆర్సీ కేసులు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. అన్ని అంబులెన్స్లలోనూ అడ్వాన్స్డ్ వెహికల్ లొకేషన్ సిస్టమ్స్ను పెట్టారు. గతంలో మొబైల్ డేటా టెర్మినల్ లేదు. ఇçప్పుడు అన్ని అంబులెన్స్ల్లో అమర్చారు. సగటున 108 అంబులెన్సులు రోజుకు 3,809 కేసుల్లో సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి 2023 జూన్ వరకు 33,35,670 మందికి అత్యవసర సేవలు అందించాయి. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్సుకు ఫోన్ చేస్తే చేరే నిర్దేశిత సమయం 15 నిమిషాలుగా ఉంది. ఈ జూలై నాటికి అది 14.17 నిమిషాలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 20 నిమిషాలు నిర్దేశిత సమయం కాగా ఇపుడు 17 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గతంలో 30 నిమిషాలుగా ఉంటే ఇపుడు అది 17–23 నిమిషాలకు తగ్గింది. తల్లీబిడ్డలు క్షేమంగా! గతంలో కేవలం 279 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లు ఉంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పేరిట గతంలో ఓమ్ని వాహనాలను వినియోగించేవారు. ఒకే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక వాహనంలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలలో మొత్తం 3,47,245 ప్రసవాలు జరగగా, అందులో 2,89,307 మంది బాలింతలను (83.3శాతం) ప్రసవానంతరం సురక్షితంగా వారి ఇళ్ళకు తరలించారు. ఇందుకు ఒక్కో మహిళకు రూ.895 చొప్పున మొత్తం రూ.24,32,35,045లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మారిన 104ల స్వరూపం ప్రస్తుత ప్రభుత్వంలో 104 సర్వీసులు పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 వాహనాలను (104లను) సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవలకోసం కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయడానికి వీలుగా అదనంగా 260 వాహనాలను (104లను) ప్రవేశపెట్టారు. మొత్తంగా 910 మొబైల్ క్లినిక్ యూనిట్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా జూలై 2022 నుంచి మే 2023 వరకూ 2,84,81,484 మంది రోగులు సేవలందుకున్నారు. ప్రతి రోజూ ఒక వాహనం ద్వారా గత ఏడాది 42 మంది సగటున సేవలు అందుకుంటే.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం వల్ల ఆ సంఖ్య 75 మందికి పెరిగింది. ప్రభుత్వ వైద్యులు 15,50,783 కుటుంబాల దగ్గరకు వెళ్లి ఈ మొబైల్ యూనిట్ల ద్వారా సేవలందించారు. 12,39, 984 మంది గిరిజనులు ఈ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఆరోగ్య సేవలు అందుకున్నారు. ఏడాదికి 108, 104 నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.334.72 కోట్లు వెచ్చిస్తోంది. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం ► వైద్యారోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వం దాదాపు 50వేల పోస్టులను భర్తీ చేసింది. ► నాడు – నేడు ద్వారా సుమారు రూ. 16,800 కోట్లు ఖర్చు చేస్తోంది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్యకళాశాలల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది. ► కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, మూడు క్యాన్సర్, ఒక కిడ్నీ ఆస్పత్రి, ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మిస్తోంది. ► ప్రతి సచివాలయంలో విలేజ్ అర్బన్ క్లినిక్ ను పెట్టింది. ► మంచి ప్రమాణాలున్న మందులనే అందిస్తోంది. ► 2019 నాటికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు వేయి ఉంటే వాటిని 3,255కి పెంచింది. ► చికిత్స తర్వాత రోగి కోలుకునేంత వరకూ అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిస్తోంది. దేశంలో అగ్రస్థానంలో ఏపీ 25 కోట్లకుపైగా జనం ఉన్న ఉత్తరప్రదేశ్లో 988 అంబులెన్సులు సేవలందిస్తుండగా అంతకంటే ఐదు రెట్లు తక్కువ జనాభా కలిగిన ఏపీలో 768 అంబులెన్సులు సేవల్లో ఉన్నాయి. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో చాలా తక్కువ సంఖ్యలో అంబులెన్సులు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్సు ఉంది. తెలంగాణలో 75, 524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒక అంబులెన్సు మాత్రమే ఉండటం గమనార్హం. -
వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్నే ఇల్లుగా..!
ఇంగ్లండ్కు చెందిన క్రిష్, మిషెల్ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంబులెన్స్ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్ కేబినెట్ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్ వాటర్ టబ్ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురుకి లండన్లో ఉద్యోగం) -
ఎమర్జెన్సీ సేవలు మరింత పటిష్టం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466 అంబులెన్స్, అమ్మ ఒడి, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్లు (108), 228 అమ్మఒడి, 34 హర్సె వాహనాలు ఉన్నాయి. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన సభలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఆశ కార్యకర్తలకు సెల్ ఫోన్ బిల్లు: హరీశ్రావు తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్సులు 316 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455కు పెరిగిందని హరీశ్రావు తెలిపారు. గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచి్చందన్నారు. గతంలో అంబులెన్స్ చేరుకునే సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడది 15 నిమిషాలకు తగ్గిందని తెలిపారు. 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నామని చెప్పారు. అమ్మ ఒడి వాహనం ద్వారా రోజుకు 4 వేల మంది గర్భిణులకు, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని, కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని అన్నారు. ఆ ఒక్క శాతం లోపంతో చెడ్డపేరు వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది 99 శాతం బాగా పనిచేస్తున్నప్పటికీ, ఒక్క శాతం లోపం వల్ల కూడా చెడ్డపేరు వస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కూడా లోపాలు మాత్రమే కాకుండా చేస్తున్న మంచిని కూడా చూపాలని కోరారు.బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయని చెప్పారు.ఆ పార్టీ రాష్ట్రాల్లో కొట్లాటలు, అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని హరీశ్రావు విమర్శించారు. -
అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
‘అంబులెన్స్లో డీజిల్ లేదు...రూ. 800 ఇస్తేనే తీసుకెళ్తా’.. రోగి మృతి
సాక్షి, నిజామాబాద్: మెరుగైన చికిత్స కోసం ఓ రోగిని బాన్సువాడ నుంచి నిజామాబాద్కు తరలించారు. అయితే డీజిల్కు డబ్బులు ఇవ్వలేదని అంబులెన్స్ డ్రైవర్ రోగిని తీసుకెళ్లలేదు. దీంతో పరిస్థితి విషమించి ఆ రోగి మృతి చెందిన ఘటన బాన్సువాడ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన సాయిలు (40) వాంతులు, విరోచనాలతో మూడురోజుల క్రితం బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. సోమవారం తెల్లవారుజామున సాయిలుకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విధుల్లో ఉన్న వైద్యుడు పరిస్థితి గమనించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని సాయిలు కుమారుడికి సూచించారు. వైద్య సిబ్బంది ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్కు ఫోన్ చేసి పిలిపించారు. అయితే డ్రైవర్ అంబులెన్స్లో డీజిల్ లేదని...రూ.800 ఇవ్వాలని సాయిలు కుమారుడికి చెప్పాడు. తన వద్ద రూ.50 ఉన్నాయని, ఎలాగైనా తన తండ్రిని నిజామాబాద్కు తీసుకెళ్లాలని అంబులెన్స్ డ్రైవర్ను ప్రాధేయపడ్డాడు. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పి అంబులెన్స్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా, కొద్దిసేపటి తర్వాత సాయిలు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. సాయిలు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై, అంబులెన్స్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో కొత్తకొండ భాస్కర్, కాసుల బాల్రాజ్, గుడుగుట్ల శ్రీనివాస్, ఖలేక్, హన్మాండ్లు, మంత్రి గణేశ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. ప్రేమికురాలితో ఫోన్లో మాట్లాడుతూనే -
అత్యవసర వైద్యసేవలకు 466 వాహనాలు
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని వచ్చేనెల 1వ తేదీన ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. 108, 102 అనే హెల్ప్లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు. సీ ఎం కేసీఆర్ ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామ నే విషయాన్ని తెలిపేవిధంగా ఉచితసేవ అని ముద్రించారు. అంబులెన్స్లు ఇలా... ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేస్తుండగా, మిగిలిన 29 అంబులెన్సులను అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. కొత్తగా వచ్చే 204 వాహనాలను కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరుగుతుంది. అమ్మ ఒడి వాహనాలు ఆకర్షణీయంగా గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి(102) వాహనాలు రాష్ట్రంలో 300 ఉన్నాయి. అయితే ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లాయి. వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాలను రీప్లేస్ చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాహనం వెనుకభాగంలో అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో అనే ట్యాగ్లైన్తో పాటు, సీఎం కేసీఆర్ ఓ బాలింతకు కేసీఆర్ కిట్ అందిస్తున్న ఫొటో ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్తలుక్ సంతరించుకున్నాయి. పార్థివ వాహనాలు ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో మరణించినవారి పార్థివదేహాలను స్వస్థలాలకు తరలించడం కుటుంబసభ్యులకు ఖర్చు తో కూడుకున్న పని. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొ ని ప్రభుత్వం ఉచితంగా హర్సే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సే వాహనాలు 50 ఉన్నాయి. ఇందు లో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను కొనుగోలు చేసి రిప్లేస్ చేస్తున్నది. వైద్యసేవలు మరింత పటిష్టం – మంత్రి హరీశ్రావు అత్యవసర సమయాల్లో సేవలు అందించే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వీటి రాకతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుంది. ప్రజలకు అవసరమైన ఆరోగ్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్యరంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందుతుండటం సంతోషకరం. -
అంబులెన్స్ డ్రైవర్ మృతి.. తిరిగి అదే అంబులెన్స్లో..
జగిత్యాల: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో యువకు డు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైన సంఘటన కోరుట్ల శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోరుట్లలోని హాజీపురాలో నివాసముండే అంబులెన్స్ డ్రైవర్ ఇమ్రాన్ (22), జమ్మూ (24), వాజిద్ (31), ఇమ్రాన్ (22), అబీద్ (23), మోసిన్ (23), ఫాజిల్ (22) మేడిపల్లి మండలం పోరుమల్లలో జరిగే పీరీలను చూసేందుకు జమ్మూలో ఆటోలో బయలుదేరారు. కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకోగానే జగిత్యాల నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇమ్రాన్, వాజిద్, జమ్మూకు తీవ్రగాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కరీంనగర్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. జమ్మూ, వాజిద్ జగిత్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి సోదరుడు ఆదిల్ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసునమోదు చేశారు. లారీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. అదే అంబులెన్స్లో ఇంటికి.. ఆపద సమయాల్లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడటంలో ముందున్న ఇమ్రాన్ను చివరికి అదే అంబులెన్స్లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత అదే అంబులెన్స్లో ఇమ్రాన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం కలచివేసింది. కోరుట్లలో అంబులెన్స్ నిర్వాహకులు ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. -
హైదరాబాద్: ఆంబులెన్స్ పేలుడు.. డ్రైవర్ మృతి
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. హస్తినాపురం వద్ద ఓ ప్రైవేట్ ఆంబులెన్స్ ప్రమాదానికి గురికాగా.. ఆంబులెన్స్ మంటల్లో దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆంబులెన్స్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మలక్పేటకు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆంబులెన్స్.. బీఎన్రెడ్డి హస్తినాపురం వద్ద డివైడర్ ఢీకొని బోల్తాపడింది. ప్రమాదం గమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్ను బయటకు తీశారు. అయితే.. తీవ్ర గాయల పాలైన అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఆంబులెన్స్ను తొలగించే ప్రయత్నం చేయగా.. అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి పేషెంట్స్ ను ఇబ్రహీంపట్నంలో దింపేసి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
డా.వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్లో సౌకర్యాలు..
-
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్లో ఉట్నూర్కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
108కు దారి కష్టాలు!
ఆదిలాబాద్: జిల్లాలోని పలు రహదారులు చినుకుపడితే చిత్తడిగా మారుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు కూడా వెళ్లలేని స్థితికి చేరుతున్నాయి. వైద్యసేవలు అవసరమైనపుడు అంబులెన్స్లు గ్రామానికి రాక పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా నిండు గర్భిణులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.. గురువారం జిల్లాలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలే ఇందుకు నిదర్శనం.. బురదలో చిక్కుకున్న 108 అంబులెన్స్ నేరడిగొండ మండలంలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన పూజకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 వాహనం పూజను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై బురదలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన యువకులు బురదలోంచి అంబులెన్స్ను తోసి రోడ్డుపైకి చేర్చారు. వెంటనే నిర్మల్ ఆస్పత్రికి పూజను తరలించారు. అర కిలోమీటర్ నడిచిన నిండు గర్భిణి మండలంలోని అంకాపూర్ పంచాయతీ పరిధి చిన్న మారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రీబాయికి గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో 108 వాహనం ఊరిలోకి రాని పరిస్థతి. పైగా ఓ వైపు వర్షం కురుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిండు గర్భిణిని ఆమె కుటుంబీకులు 500 మీటర్ల బురదరోడ్డు, పంట చేన్ల మీదుగా నడిపించుకుంటూ బీటీ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్లో ఆమెను ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
అంబులెన్స్కు దారివ్వని నారా లోకేశ్..
ఒంగోలు: అలవలపాడులో ముఖాముఖి అనంతరం లోకేష్ పాదయాత్ర జరుగుతుండగా అలవలపాడు, హాజీస్పురం రోడ్డు మధ్యలో అంబులెన్స్ రోగులతో వస్తుండగా దానికి దారి ఇవ్వలేదు. పాదయాత్రలో లోకేష్తో నాయకులు ఉగ్ర నరసింహారెడ్డి, గొట్టిపాటి రవి, ముత్తుముల అశోక్రెడ్డి తదితర నాయకులు ఉన్నా కూడా అంబులెన్స్కు దారిద్దామని కానీ..రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ప్రయత్నం చేయకపోవడం టీడీపీ కార్యకర్తలను కూడా ఒకింత విస్మయానికి గురిచేసింది. యాత్రలో మద్యం ఏరులై పారింది. అలవలపాడు, రామాపురం, బండ్లపురం, హజీస్పురం వద్దకు రాగా 2001 కి.మీ పాదయాత్ర జరిగినందుకు గుర్తుగా శిలాఫలకం వేశారు. ఇదిలా ఉండగా తక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎక్కువ మందిని తీసుకు రావడంతో వాగ్వాదాలు జరగడం కొసమెరుపు. -
రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
తిరువనంతపురం: మంత్రి కాన్వాయ్లోని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో పేషెంట్ను తీసుకుని వెళ్తోన్న అంబులెన్స్ తిరగబడింది. అందులో ఉన్న పేషెంట్కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరువనంతపురం పోలీసులు. కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్కు దారిచ్చేందుకు ట్రాఫిక్స్ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ సరైన దారిలోనే వచ్చింది. కానీ రోడ్డు మధ్యలో ఒక బైకు ఆగి ఉండడంతో దానిని తప్పించుకుని వెళ్ళింది. అది గమనించని మినిస్టర్ కాన్వాయ్ వాహనం అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టింది. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కాన్వాయ్ వాహనం తర్వాత మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దీంతో వారు కూడా ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కానీ అంబులెన్స్లోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అక్కడి పోలీసులు. మంత్రి కాన్వాయ్ వాహనాన్నినడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. The convoy of Kerala Education Minister V. Sivankutty hit an ambulance and bike, but a case has been registered against the ambulance driver as well. VIP culture and a sense of Entitlement aren't going anywhere. That's lip-service. pic.twitter.com/NYLjhiRjMI — BALA (@erbmjha) July 14, 2023 ఇది కూడా చదవండి: కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే! -
బజ్జీల కోసం సైరన్ మోగిస్తూ.. అంబులెన్స్ డ్రైవర్ అత్యుత్సాహం.. షాక్!
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్: కుయ్ కుయ్ కుయ్ మంటూ సైరన్ మోగిస్తూ వచ్చిన అంబులెన్స్ను చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ హుటాహుటిన స్పందించారు. ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనానికి దారి ఇచ్చారు.. అంతే.. అంబులెన్స్ సిగ్నల్ దాటాక మిర్చిబజ్జీల దుకాణం ముందు ఆగింది. సెంచురీ ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకమిది. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ మార్గంలో బంజారాహిల్స్ సెంచురీ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ వస్తోంది. ఓల్డ్ సీపీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి ట్రాఫిక్ కనిపించడంతో డ్రైవర్ సైరన్ మోగించాడు. దీంతో అక్కడున్న నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు రషీద్ హుటాహుటిన ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్రాఫిక్ నుంచి క్షణాల్లో బయటపడ్డ ఆ డ్రైవర్ కాస్త ముందుకెళ్లాక తాపీగా మిర్చి బజ్జీలు తినడం చూసిన కానిస్టేబుల్ బిత్తరపోయారు. అంబులెన్స్లో రోగులు లేరని, ఆసుపత్రి సిబ్బంది మాత్రమే ఉన్నారని గ్రహించారు. ఈ ఉదంతం అంతా వీడియో తీసిన కానిస్టేబుల్ దాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన డీజీపీ అంజనీకుమార్.. అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో సదరు అంబులెన్స్ డ్రైవర్, ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు.. ఇకపై ఇలాంటి దురి్వనియోగాలను సహించబోమని హెచ్చరించారు. ఈ ట్వీట్ చూసిన తర్వాత నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు ఆ అంబులెన్స్కు రూ.1000 జరిమానా విధించారు. బుధవారం తనిఖీల కోసం ఆర్టీఏను పంపిస్తున్నట్లు తెలిసింది. డీజీపీ ట్వీట్పై సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం సైతం స్పందించింది, రోగులు లేకుండా అకారణంగా సైరన్ వేసిన డ్రైవర్ను విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 -
అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే.. మీ ఇష్టమున్నట్టు కాదు..
హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం -
కరీంనగర్: రైల్వే గేట్ పడటంతో ఆగిపోయిన అంబులెన్స్.. వ్యక్తి మృతి
-
Live: 108 అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
146 కొత్త అంబులెన్స్ లను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
-
మణిపూర్లో హింసకు మరో ముగ్గురు బలి
కోల్కతా: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్ మరో ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలితీసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో చిన్నారిని తరలిస్తున్న ఒక అంబులెన్సుకు అల్లరిమూక నిప్పుపెట్టింది. దీంతో అంబులెన్సులో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి, మరో బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగుచూశాయి. సంబంధిత వివరాలను అధికారులు వెల్లడించారు. కాంగ్చుప్ ప్రాంతంలోని అస్సాం రైఫిల్స్ బలగాల శిబిరం వద్ద మెయిటీ వర్గానికి చెందిన ఒకావిడ తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం క్యాంప్పైకి కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో బాలుడి తలకు బుల్లెట్ గాయమైంది. దీంతో బాలుడిని హుటాహుటిన అంబులెన్సులో తల్లి, ఆమె బంధువు తరలిస్తున్నారు. కొంతదూరం వీరికి రక్షణగా వచ్చిన అస్సాం రైఫిల్స్ బలగాలు తర్వాత ఆ బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పజెప్పి వెనుతిరిగారు. కాంగ్పోకీ జిల్లా సరిహద్దుకు రాగానే ఐసోసెంబా ప్రాంతంలో అంబులెన్సును ఓ అల్లరిమూక అడ్డుకుని తగలబెట్టింది. దీంతో మంటల్లో చిక్కుకుని బాలుడు, అతని తల్లి, బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ప్రాంతంలో కుకీ గిరిజనుల గ్రామాలు ఎక్కువ. మృతులు మెయిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య హింస, ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. షా ఇంటివద్ద కుకీ వర్గీయుల నిరసన ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసం వద్ద మణిపూర్ కుకీ వర్గీయులు నిరసనకు దిగారు. ‘కుకీల ప్రాణాలు కాపాడండి’ అంటూ నినాదాలు ఇచ్చారు. నలుగురు కుకీ ప్రతినిధులను షా ఇంట్లోకి సమావేశం కోసం అనుమతించామని మిగతా వారిని జంతర్మంతర్కు తరలించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య మొదలైన జాతి వైరం హింసాత్మకంగా మారి నెలరోజుల వ్యవధిలో 98 మంది ప్రాణాలు బలిగొంది. -
Odisha Train Accident: ఆ తండ్రి నమ్మకమే కొడుకుని బతికించింది!
ఒడిస్సా బాలాసోర్లో వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఎందరికో తీరని విషాదాన్ని మిగిల్చింది. కొందరూ మాత్రం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొని మృత్యుంజయులై ప్రాణలతో బయటపడిన వారు కూడా ఉన్నారు. అంతటి భయానక విషాదంలోని తన వాళ్లు బతికే ఉండాలన్న ఆరాటం, ఆశతో గాలించిన కొందరి ఆశలు, ప్రయత్నాలు సఫలమయ్యాయి. వారి ప్రేమ, తపనే ఆయా వ్యక్తులకు ఊపిరి పోసి మృత్యుజయులుగా తిరిగొచ్చేలా చేసిందా!.. అన్నట్లుగా జరిగిందో ఓ ఉదంతం. ఆ తండ్రి నమ్మకమే విధే చిన్నబోయేలా గెలచింది. కొడుకు ప్రాణాలను కాపాడుకోగలిగే చేసింది ఆ తండ్రి ఆశ. అసలేం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్లోన హౌరాకు చెందిన హేలరామ్ అనే దుకాణదారుడు తన 24 ఏళ్ల కొడుకు బిస్వజిత్ మాలిక్ని కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కించేందుకు శుక్రవారం షాలిమార్ స్టేష్న్కు వచ్చాడు. కొడుకుని కోరమండల్ రైలు ఎక్కించి వీడ్కోలు పలికి వెనుదిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రైలు ప్రమాదం గురించి విని షాక్ అయ్యాడు. వెంటనే కొడుకుకి ఫోన్ చేస్తే తాను చాలా గాయాలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హేలరామ్ ఓ అంబులెన్స్ డ్రైవర్ పలాష్ పండిట్ను ఏర్పాటు చేసుకుని.. తన బావ దీపక్ దాస్తో కలిసి ఒడిశాకు బయలుదేరాడు. సుమారు 230 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రాత్రికల్లా చేరుకున్నారు. ఆ రాత్రే ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్న ప్రతి ఆస్పత్రిని సందర్శించిన ఏం ప్రయోజనం లేకపోయింది ఆ తండ్రికి . కొడుకు ఎక్కడ ఉన్నాడన్నది కానరాలేదు. అయితే అధికారులు హేలారామ్ని మృతదేహాలను ఉంచిన తాత్కాలిక మార్చరీ(బహనాగా హైస్కూల్) వద్దకు వెళ్లమని సూచించారు. నిజానికి సాధారణ పౌరులు ఎవర్నీ అక్కడకు వెళ్లనివ్వడం లేదు. బాధితుల బంధువులకు మాత్రమే అనుమతి. సరిగ్గా అక్కడకు హేలారామ్ చేరుకునేసరికి..ఇంతలో ఆ శవాల మధ్యలోంచి ఓ చేయి కదలడం ప్రారంభించింది. దీంతో అక్కడి వాతావరణం కాస్త గందరగోళంగా మారిపోయింది. అదృష్టవశాత్తు ఆ చేయి కదిలిన వ్యక్తే హేలరామ్ కొడుకు బిస్వజిత్గా తేలింది. ప్రమాదం జరిగిన రెండో రోజుకి తన కొడుకు ఆచూకిని కనిపెట్టగలిగాడు హేలారామ్. దీంతో ఆ తండ్రి తాను తీసుకొచ్చిన అంబులెన్స్లో బాలాసోర్ ఆస్పత్రికి కొడుకుని తీసుకుకెళ్లగా.. వారు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి.. కటక్ మెడికల్ కాలేజికి తీసుకెళ్లమని రిఫర్ చేశారు. హుటాహుటినా అతడిని ఆ అంబులెన్స్లోనే కోల్కతాలోని సదరు ఆస్పత్రికి తరలించారు. అతని కాలికి అయ్యిన గాయాలకు శస్త్ర చికిత్సలు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని గాయాలతో బాధపడుతున్నట్లు అతడి తండ్రి చెప్పుకొచ్చాడు. నాన్ మెడికల్ సహయక బృందం అతను అపాస్మారక స్థితిలో ఉండటంతో.. చనిపోయాడని తప్పుగా భావించి శవాలు ఉండే చోటే పెట్టినట్లు అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు హేలరామ్. ఎలాగైతే తన కొడుకు ప్రాణాలతో ఉంటాడన్న ఆ తండ్రి ఏకంగా అంబులెన్స్ మాట్లుడుకుని తీసుకెళ్లాడు. రెండు రోజులు శవాల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడి కొడుకుని.. ఆ తండ్రి నమ్మకమే ఊపిరి పోసి మృత్యుంజయుడై తిరిగొచ్చేలా చేసింది. (చదవండి: లిక్కర్ స్కాం కేసు: మనీష్ సిసోడియాకు చుక్కెదురు) -
మానవత్వం మరచిన అంబులెన్స్ డైవర్లు!
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో బీహార్లోని మోతిహర జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు చికనీ గ్రామానికి చెందిన భూలన్ పటేల్ పెద్ద కుమారుడు రాజా కుమార్ అని చెబుతున్నారు. మృతుడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, ఈ పనుల కోసమే వేరే ప్రాంతం వెళ్లాడని సమాచారం. ఇదే గ్రామానికి చెందిన 9మంది రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరు స్వయంగా ఫోను చేసి, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా రాజా కుమార్ మరణవార్త తెలియగానే గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లి, భార్యల రోదనలు మిన్నంటాయి. రాజా కుమార్కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రాజా కుమార్ మృతదేహం ఇంకా గ్రామానికి చేరుకోలేదు. మృతదేహాన్ని గ్రామం వరకూ తీసుకురావాలంటే అంబులెన్స్ డ్రైవర్ రూ. 45 వేలు అడుగుతున్నాడని మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజా కుమార్ తల్లి మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యత రాజానే చూసుకుంటున్నాడని తెలిపారు. కేరళలో పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. రూ. 45 వేలు చెల్లించి కుమారుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేంతటి స్థోమత తమకు లేదని ఆమె వాపోయింది. మృతుని తండ్రి భవన్ పటేల్ మాట్లాడుతూ తమ కుమారుని మృతదేహన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు గ్రామస్తులు చందాలు సేకరిస్తున్నారన్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 288కి చేరింది. 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, ఇతర శాఖల సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం. -
సహాయక చర్యల్లో పాలుపంచుకున్న ఏపీ ప్రభుత్వం
-
వార్జోన్ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్ప్రెస్లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్పూర్, కటక్లోని ఎస్సీబీ మెడికల్కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్జోన్ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. అంబులెన్సుకు చెల్లించేందుకు డబ్బులు లేక ఓ వ్యక్తి తన కుమారుడి శవంతో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగాల్లో ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర్ దినాజ్పూర్ జిల్లా కలియగంజ్ ప్రాంతం డంగిపారా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు ఆసిం దేవశర్మ. ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవలే వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు రాయ్గంజ్ మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వీరు మాత్రం సిలీగుడిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ పిల్లల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇంకా క్షీణించింది. దీంతో కవలల్లో ఒకరిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి నిర్వాహకులను అడిగాడు దేవశర్మ. అయితే రూ.8,000 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. అంబులెన్సు రోగులను తరలించేందుకే ఉచితమని, శవాలను తరలించేందుకు కాదని బదులిచ్చాడు. అనుమానం రాకుండా.. కుమారుల చికిత్స కోసం ఆరు రోజుల పాటు రూ.16,000 ఖర్చు చేయడంతో దేవశర్మ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇక గత్యంతరం కుమారుడి మృతదేహంతోనే సిలీగుడిలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాయ్గంజ్లో దిగాడు. అక్కడినుంచి కలియగంజ్ వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. మొత్తం రూ.200 కిలోమీటర్లు ప్రయాణించాడు. చిన్నారి చనిపోయాడని తెలిస్తే బస్సు నుంచి దింపేస్తారని భయంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. కలియగంజ్ చేరుకున్నాక తెలిసిన వ్యక్తి ఒకరు అంబులెన్సు ఏర్పాటు చేయడంతో దేవశర్మ అందులోనే ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. This poor person has to carry the dead body of his child in the bag. He didn’t find any Ambulence. This is the condition of the health facility in West Bengal. This case is from Uttar Dinajpur district . Sad but this is the reality across all districts in West Bengal. pic.twitter.com/gOziExkCVF — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) May 14, 2023 రాజకీయ దుమారం.. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తింది. టీఎంసీ నేతలు ఈ విమర్శలను తిప్పికొట్టారు. చిన్నారి మరణం దురదృష్టకరమని , దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. చదవండి: రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్..రూ.1.65 కోట్ల నగదు స్వాధీనం -
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
Ambulance: అత్యవసరమైతేనే సైరన్ వాడండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్ల కారణంగా సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్నవి మాత్రమే సైరన్ వినియోగించేలా ఆదేశాలు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్లో అంబులెన్స్ అసోసియేషన్లు, ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర పేషెంట్లను తీసుకువెళ్లే అంబులెన్స్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక ఫోన్ నంబర్తో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో(టీసీసీసీ) స్పెషల్ సెల్ అందుబాటులోకి తెచ్చినట్లు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సైరన్లు వేసుకుని ఇష్టానుసారం దూసుకుపోతున్న అంబులెన్స్ల వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనికోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసరం కాని వాహనాలు, ఖాళీగా వెళ్తున్న అంబులెన్స్లతో పాటు మృతదేహాలను తరలిస్తున్న సమయంలోనూ కొన్ని అంబులెన్స్ లైట్లు, సైరన్లతో హడావుడి చేస్తూ ఇతర వాహనచోదకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తేల్చారు. అనేక అంబులెన్స్లకు సరైన పత్రాలు, అనుమతులు లేవని, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో ఉంటున్నారని వెలుగులోకి వచ్చింది. దీంతో సిటీలో సంచరిస్తున్న అంబులెన్స్లకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంపై ఓ విధానానికి రూపకల్పన చేశారు. ఆ అంశాలను రాహుల్ హెగ్డే ఈ సమావేశంలో ఆయా ప్రతినిధులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్న పేషెంట్లను తరలించడానికి ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పని చేసే దీనికోసం ప్రత్యేక సెల్ఫోన్ నంబర్ 8712660600 కేటాయించారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్తో పాటు ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ ఫోన్: 9010203626కు అందించాలని కోరారు. ఆస్పత్రుల నుంచి అందే వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ దాని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడనున్నారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎస్.రంగారావు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం కోసం ప్రత్యేక నంబర్లు 87126 60600, 90102 03626 -
వైద్య విద్య హబ్గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు హబ్గా మారిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకొని ఎంతో వృద్ధి సాధించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని, మిగతా వాటికీ త్వరలో వచ్చేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 2014–15లో 2,950 ఎంబీబీస్ సీట్లు ఉంటే, ప్రస్తుతం 7,090కు చేరాయని, పీజీ సీట్లు 1183 నుంచి 2548కు పెరిగాయని తెలిపారు. 65 మందికి కొత్తగా ప్రొఫెసర్ పదోన్నతులు ఇచ్చామని, 210 అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు త్వరలో ఇవ్వబోతున్నామని తెలిపారు. త్వరలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ పక్రియ పూర్తి అవుతుందన్నారు. 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రులకు అవసరం మేరకు కేటాయించామ తెలిపారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జిల్లాలోనే జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు. డిశ్చార్జ్ అయిన రోగులకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని, ఈ విష యం రోగులకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాత్రి వేళల్లో సైతం పోస్టుమార్టం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, అన్ని జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. 108 సేవల కోసం 200 కొత్త అంబులెన్స్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో 108 సేవల కోసం కొత్తగా 200 అంబులెన్స్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్స్ల స్థానంలో ఈ కొత్త అంబులెన్స్లు సేవలందిస్తాయని ప్రకటించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. -
మళ్లీ జీవీకే చేతికి ‘108’.. మండలానికో అంబులెన్సు..
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు అత్యవసర వైద్య సేవలందించే ‘108’వాహన టెండర్ను మళ్లీ జీవీకే సంస్థే దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జీవీకేతోపాటు మరో కంపెనీ పాల్గొంది. చివరకు జీవీకే సంస్థకే టెండర్ దక్కినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈసారి 102 అమ్మ ఒడి, 104, ప్రభుత్వ ఆసుపత్రులనుంచి పేదల శవాలను వారి సొంతూళ్లకు ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన వాహనాల బాధ్యత కూడా జీవీకేకే అప్పగించారు. ప్రస్తు తం 50 వాహనాలు పేదల శవాలను ఆసుపత్రుల నుంచి సొంతూళ్లకు ఉచితంగా తీసుకెళ్తున్నాయి. ఈ నాలుగు సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 358 వాహనాలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘108’అత్యవసర అంబులెన్స్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో అకస్మాత్తుగా వైద్యం అవసరమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ‘108’నంబర్కు ఫోన్ చేయడం ద్వారా ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. ప్రస్తుతం 358 వాహనాలు ‘108’అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో 333 రోడ్లపై అందుబాటులో ఉండగా, మిగిలిన వాటిని రిజర్వులో ఉంచారు. అప్పట్లో కొన్ని వాహనాలు చెడిపోగా, వాటి స్థానంలో కొన్ని వాహనాలను గిఫ్ట్ ఎ స్మైల్ కింద రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు ఉచితంగా ఇచ్చారు. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉందని అధికారులు చెపుతున్నారు. ఫోన్ చేసిన దాదా పు 20 నిమిషాల్లో అంబులెన్స్ బాధితుల వద్దకు చేరుకోవాలనేది నిబంధన. ఈ అంబులెన్స్ సరీ్వసులను ప్రస్తుతం కూడా జీవీకే సంస్థనే నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 108 వాహనాల నిర్వహణకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 86 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఎంతకు ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదు. పలు మార్పులకు శ్రీకారం.. ప్రస్తుతమున్న ‘108’అంబులెన్స్ సేవల్లో పలు మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు జీవీకే సంస్థ ఏర్పాట్లు చేసే అవకాశముంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాల్ సెంటర్కు రూపకల్పన చేస్తారు. దాని ద్వారా కంప్యూటర్ ఆధారంగా అంబులెన్సులను ఆటోమాటిక్గా నడిపిస్తారు. ఆటోమాటిక్ కాల్ డి్రస్టిబ్యూటర్ (ఏసీడీ) వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ టెలిఫోనీ ఇంటర్ఫేస్ (సీటీఐ), వాయిస్ లాగింగ్ కేపబిలిటీస్, జీపీఎస్ ఇంటిగ్రేషన్, హైలీ సెక్యూర్డ్ నెట్వర్క్లను రూపొందిస్తారు. ఈ వ్యవస్థ ప్రస్తుతానికే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక దీనిని విపత్తు నిర్వహణ విభాగానికి అనుసంధానం చేస్తారు. ఇది పోలీస్, ఫైర్ సరీ్వసులతోనూ అనుసంధానం అవుతుంది. అన్ని ‘108’అంబులెన్స్లకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. మండలానికో ’108’వాహనం.. ఇకపై ప్రతీ మండలానికి ఒక ‘108’ వాహనాన్ని సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా దాని పరిధిలోని సమీప గ్రామాలకు తక్కువ సమయంలో చేరుకోవడానికి వీలుకలుగుతుందని, అనేకమందిని ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చనేది ప్రభు త్వ ఆలోచన. ప్రస్తుతం లక్ష మంది జనాభాకు ఒకటి చొప్పున ‘108’వాహనం ఉండగా, మండలానికి ఒకటి కేటాయించడం ద్వారా ప్రతీ 70 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. చదవండి: ట్రాక్లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్ -
ఆరోగ్య శ్రీలో 16.47 లక్షల మందికి లబ్ధి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా గత డిసెంబర్ వరకు 16,47,782 మందికి లబ్ధి చేకూరింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,999.66 కోట్లు వ్యయం చేసింది. కోవిడ్–19 చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి.. 2,14,135 మందికి రూ.743.22 కోట్లతో ఉచిత చికిత్స అందించింది. ఈ పథకం కింద చికిత్స అనంతరం కోలుకునే సమయంలో రోగుల జీవనోపాధి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గత డిసెంబర్ ఆఖరు వరకు 17,06,023 మందికి రూ.903.90 కోట్లు సాయంగా అందజేసింది. ఈ విషయాలను 2022–23 రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. ఈ ప్రభుత్వం వచ్చాక 108 అంబులెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి, కొత్తగా 432 అంబులెన్స్లను కొనుగోలు చేసింది. 108 అంబులెన్స్ల ద్వారా 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు అత్యవసర వైద్యం అవసరమైన 27,00,942 మందిని ఆస్పత్రులకు తరలించింది. ఇందులో 2,54,609 కోవిడ్ కేసులు కాగా, మిగతా 24,46,333 నాన్ కోవిడ్ కేసులు. -
పవన్ ర్యాలీలో జనసేన కార్యకర్తల ఓవరాక్షన్..
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు మరోసారి ఓవరాక్షన్ చేశారు. ఆటోనగర్లో పవన్ కల్యాణ్ ర్యాలీలో ఆర్టీసీ బస్సుపైకెక్కి జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో గంటన్నరకు పైగా 108 అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. పవన్ కల్యాణ్ అంబులెన్స్కు కూడా దారి ఇవ్వలేదు. కాగా పవన్ ర్యాలీ, ప్రదర్శనకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: ‘మార్గదర్శిలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగాయి’ -
108 అంబులెన్స్ను ట్రాక్ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 108 అంబులెన్సుల ట్రాకింగ్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో 108 అంబులెన్స్ను కాలర్ (సాయం కోసం ఫోన్ చేసిన వారు) ట్రాక్ చేసే విధానాన్ని వైద్య శాఖ ప్రవేశపెడుతోంంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో ట్రాకింగ్సదుపాయాన్ని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనుంది. ఎస్ఎంఎస్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండె, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోశ ఇబ్బందులు, గర్భిణులకు పురిటి నొప్పులు రావడం వంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు వెంటనే 108 అంబులెన్స్ గుర్తొస్తుంది. 108కు ఫోన్ చేస్తే నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి సకాలంలో ఆస్పత్రులకు చేరుస్తుంది. ఆపద సమయంలో ఫోన్ చేసిన వారికి 108 అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో, ఇంకా ఎంత సమయం పడుతుందోనని ఆందోళన ఉంటుంది. ప్రస్తుత విధానంలో 108 కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారి ఫోన్ నంబర్ లేదా బాధితుల ఫోన్ నంబర్కు వారికి కేటాయించిన వాహనం నంబరు, సిబ్బంది ఫోన్ నంబర్ ఎస్ఎంఎస్ పంపుతున్నారు. ఈ ఫోన్ నంబర్కు కాల్ చేసి బాధితులు/సహాయకులు అంబులెన్స్ ఎంత వరకూ వచ్చిందో తెలుసుకుంటున్నారు. నూతన విధానంలో బాధితులకు పంపే ఎస్ఎంఎస్లో లింక్ను పంపుతారు. ఆ లింక్పై క్లిక్ చేస్తే అంబులెన్స్ ఎక్కడ ఉంది, ఎంత సమయంలో వస్తుందో తెలుసుకోవచ్చు. తద్వారా బాధితులకు అంబులెన్సు వస్తోందన్న భరోసా లభిస్తుంది. 748 అంబులెన్స్ల ద్వారా సేవలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘108 అంబులెన్స్’లు 748 ఉన్నాయి. ఇవి రోజుకు సగటున 3,096 ఎమర్జెన్సీ కేసులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు 7,52,302 ఎమర్జన్సీ కేసుల్లో అంబులెన్స్లు సేవలందించాయి. త్వరలోనే అందుబాటులోకి కాలర్లు అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో ట్రాక్ చేసేలా సాంకేతిక ఏర్పాట్లు చేశాం. ట్రయల్ రన్ విజయవంతం అయింది. త్వరలోనే ట్రాకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం. అంబులెన్స్ ఎంత దూరం వచ్చిందో తెలుసుకోవడంతో బాధితులు, వారి సహాయకులకు భరోసా లభిస్తుంది. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
108కు శాశ్వత కార్యాలయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆపదలో ఉన్నవారికి అపర సంజీవనిలా సేవలు అందిస్తున్న 108 వాహనానికి, సిబ్బందికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసి విజయవాడ నగరపాలకసంస్థ సముచిత గౌరవం కల్పించింది. సాధారణంగా 108 వాహనాలు, ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎటువంటి కార్యాలయాలు ఉండవు. స్థానికంగా ఉన్న అవకాశాల మేరకు షెడ్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని చెట్ల కింద అంబులెన్స్లను పెట్టుకుని సిబ్బంది అక్కడే ఉంటారు. ఆపదలో ప్రజలు ఉన్నారంటూ తమకు ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లి ప్రాణాలను కాపాడుతుంటారు. ఇదే తరహాలో విజయవాడ 18వ డివిజన్ రాణిగారితోటలోని కనకదుర్గమ్మ వారధి పక్కన వాటర్ ట్యాంక్ కింద ఆశ్రయం పొందుతున్న 108 వాహనం, సిబ్బందికి నగరపాలక సంస్థ రూ.12లక్షలతో శాశ్వత భవనం నిర్మించింది. వాటర్ ట్యాంక్ కింద 108 అంబులెన్స్ పెట్టుకుని సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ... ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు కార్పొరేషన్ అధికారులతో సంప్రదించి వారధి సమీపంలోనే 108 అంబులెన్స్కు శాశ్వత కార్యాలయం నిర్మాణానికి అనుమతులు, రూ.12లక్షల నిధులు మంజూరు చేయించారు. నిర్మాణ పనులు పూర్తయి కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యాలయంలో విద్యుత్, వాహనాల పార్కింగ్ వంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. 108 వాహనానికి శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయడంపై సిబ్బంది హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా రూ.111.62 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి. 81 రకాల మందులు.. 54 రకాల పరికరాలు ఈ అంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251ను అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవీకే–ఈఎంఆర్ఐకు అప్పగించారు. కాల్ సెంటర్కు రోజుకు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్కాల్స్ రాగా, ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలోమీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలందించాయి. 6,345 వేలకు పైగా మేజర్, 10,859 మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్యసేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇతర రాష్ట్రాల్లోనూ పశు వైద్య రథాలు
సాక్షి, అమరావతి: మూగ జీవాల ఆరోగ్య సంరక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తూ 108 అంబులెన్స్ల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ అంబులేటరీ క్లినిక్స్’ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జార్ఖండ్లో ఇప్పటికే వీటిని అందుబాటులోకి తీసుకురాఆ, ఛత్తీస్గఢ్లో ఈ నెలాఖరు నాటికి సేవలందించనున్నాయి. పంజాబ్లో టెండర్లు పిలవగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిటకు వెళ్లి మూగ జీవాలకు వైద్య సేవలందించే సంకల్పంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తొలి విడతలో 175 వైఎస్సార్ సంచార పశు వైద్యసేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంబులెన్స్ల తయారీతో పాటు రెండేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.133.13 కోట్లు ఖర్చు చేస్తోంది. గతేడాది మే 19న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీటి సేవలను ప్రారంభించి టోల్ ఫ్రీ నంబర్ 1962తో అనుసంధానించారు. ప్రత్యేకంగా రూ.7 కోట్లతో కాల్ సెంటర్ నెలకొల్పారు. మూగ జీవాలకు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పెరటి కోళ్లు, పక్షులకు చిన్నపాటి సర్జరీలు అక్కడే నిర్వహించేలా తీర్చిదిద్దారు. అంబులెన్స్లో మినీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. వెయ్యి కిలోల బరువున్న జీవాలను సునాయాసంగా తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్ లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి వాహనానికి డ్రైవర్ కమ్ అటెండర్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఒక వైద్యుడిని నియమించారు. 1.72 లక్షల మూగ జీవాలకు సేవలు ఫోన్ కాల్ వచ్చిన అరగంటలోపే మూగ జీవాలకు వైద్యసేవలు అందిస్తూ అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 3.52లక్షల ఫోన్కాల్స్ రాగా, వాహనాలు 1.20లక్షల ట్రిప్పులు తిరిగాయి. 2,127 ఆర్బీకేల పరిధిలో 1.72లక్షల మూగ, సన్నజీవాలకు గత 8 నెలలుగా సేవలందిస్తున్నాయి. రెండో విడతలో రూ.119.18 కోట్లతో మరో 165 అంబులెన్స్లను ఈ నెలాఖరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సర్వత్రా ప్రశంసలు అంబులెన్స్లలో సమకూర్చిన సౌకర్యాలు, అందిస్తున్న సేవలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అధికారుల బృందాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇదే తరహాలో సంచార పశు వైద్య సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. లక్ష పశు సంపద ఉన్న ప్రాంతానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తే ఆర్థిక చేయూతనిస్తామని ప్రకటించడంతో పలు రాష్ట్రాలు ఏపీ బాట పట్టాయి. కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్ర బృందాలు ఏపీలో పర్యటించి వీటి సేవలపై అధ్యయనం చేశాయి. మన రాష్ట్రంలో సమర్ధంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. సీఎం ఆలోచనలు స్ఫూర్తిదాయకం సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టినవే మొబైల్ అంబులేటరీ క్లినిక్స్. మూగజీవాలకు సైతం నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో తెచ్చిన వీటి సేవలను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు పోటీపడుతుండడం గర్వ కారణం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖమంత్రి పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి.. ఏపీ తరహాలో అంబులెన్స్లు ప్రవేశపెట్టి నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు పలు రాష్ట్రాలు సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మాతో కలసి పని చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి. – ఎస్.రామకృష్ణవర్మ, ఈఎంఆర్ఐ ఆపరేషన్స్ ఏపీ స్టేట్ హెడ్ -
స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్కు, వారి కుటుంబ సభ్యులకు..
దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సంచలనం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్విగ్గీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం పొందాలనుకునే డెలివరీ బాయ్స్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం లేదా ఎస్ఓఎస్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. చదవండి👉 కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు స్విగ్గీ డెలివరీ బాయ్, లేదంటే వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యం లభిస్తుందని స్విగ్గీ తెలిపింది. ఈ సౌకర్యం పొందేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, కేవలం పార్టనర్ ఐడీని చెబితే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. అంతేకాదు స్విగ్గీ అందిస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీతో మా యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ, వారి జీవిత భాగస్వాములు, ఇద్దరు పిల్లలుకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. ఖర్చులో సబ్సిడీ కల్పిస్తాం’ అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అంబులెన్స్ సౌకర్యాన్ని దేశ వ్యాప్తంగా బెంగళూరు, ఢిల్లీ,ఎన్సీఆర్,హైదరాబాద్, ముంబై,పూణే, కోల్కత ప్రాంతాల్లో యాక్టీవ్ డెలివరీ బాయ్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసలు బాటు కల్పించింది. ఇందుకోసం అంబులెన్స్ సర్వీసులు అందించే సంస్థలతో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్ -
హృదయవిదారక ఘటన ..తల్లి శవాన్ని భుజాలపై మోస్తూ..
పశ్చిమ బెంగాల్లో జల్పాయ్గురిజిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్కి సరిపడా డబ్బులు లేకపోవడంతో తండ్రి కొడుకలిద్దరు మహిళ మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లారు. ఈ ఘటన చూపురులను కంటితడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే..రామ్ ప్రసాద్ దేవాన్ అనే వ్యక్తి 72 ఏళ్ల తల్లికి శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో ఆమెను జల్పాయ్గుడి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి బుధవారం తీసుకువెళ్లారు. ఐతే ఆమె గురవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచింది. ఐతే ఆస్పత్రి వద్ద ఉన్న అంబులెన్స్ మాములుగా సుమారు రూ. 900లు వసూలు చేస్తోందని, కానీ సదరు అంబులెన్స్ ఆపరేటర్ మాత్రం దాదాపు రూ. 3000 డిమాండ్ చేసినట్లు తెలిపాడు. దీంతో తాను అంత మొత్తం చెల్లించలేక ఇలా భుజాలపై మోసుకెళ్తున్నట్లు దేవాన్ వెల్లడించాడు. వారు ఆమెను ఒక బెడ్షీట్లో చుట్టి తండ్రి కొడుకులిద్దరూ..40 కిలోమీటర్లు దూరంలో ఉన్న తమ ఇంటికి భుజాలపై తీసుకువెళ్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కళ్యాణ్ ఖాన్ స్పందించి... ఇది చాలా బాధకరమైన ఘటన అని అన్నారు. తాము ఈ విషయంలో తాము క్రమం తప్పకుండా ప్రజలకు తగిని ఏర్పాట్ల చేస్తామని, కానీ వారు మమ్మల్ని సంప్రదించలేదని అన్నారు. బహుశా వారికీ తెలియకపోవచ్చు, ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలన్నారు. ఐతే కొంతసమయానికి దేవాన్కి ఒక స్వచ్ఛంద సామాజిక సంస్థ వాహనాన్ని అందించిందని, క్రాంతిబ్లాక్లోని తన ఇంటికి ఉచితంగా తీసుకువెళ్లినట్లు సమాచారం. ఐతే స్వచ్ఛంద సామాజిక సంస్థ అదికారులు మాత్రం ఉచిత సేవలు అందించే వారిని అంబులెన్స్ ఆపరేటర్లు ఆస్పత్రి వద్దకు రానివ్వరని అన్నారు. ఇదిలా ఉండగా, జిల్లా అంబులెన్స్ అసోసియేషన్ తమ సభ్యులు రైలు, రోడ్డు ప్రమాదాలకు ఉచితంగానే అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని నొక్కి చెప్పడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. The Son of Bengal is carrying the dead body of Bengal's health system! Which Bengal is this ?@narendramodi @AmitShah @amitmalviya @sunilbansalbjp @mangalpandeybjp @RajuBistaBJP @SuvenduWB @SwarnaliM @Priyankabjym @Amrita_06_11 @BJP4Bengal @Amitava_BJP @ pic.twitter.com/Vafb5hGFfp — Dr. Shankar Ghosh (@ShankarGhoshBJP) January 5, 2023 (చదవండి: విమానంలో మూత్ర విసర్జన: వివాదం సెటిల్ అవ్వడంతో ఫిర్యాదు చేయలేదు) -
అంబులెన్స్కు చోటివ్వని చంద్రబాబు కాన్వాయ్
సాక్షి, బొబ్బిలి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బొబ్బిలిలో శుక్రవారం ‘ఇదేంఖర్మరా బాబూ’ కార్యక్రమం నిర్వహించారు. అదే సమ యంలో అస్వస్థతకు గురైన తెర్లాం మండలం నందిగామ గ్రామానికి చెందిన బొద్దూరు సత్యవతి అనే మహిళను కుటుంబ సభ్యులు 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్సీకి తీసుకెళ్తున్నారు. తెర్లాం మండలం నుంచి బయలుదేరిన వాహనం బొబ్బిలి చేరుకోగా, గొల్లపల్లి వద్ద వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ చోటివ్వలేదు. 108 వాహనం ఎంత హారన్ కొట్టినా కాన్వాయ్లో వాహనాలు గానీ, చంద్రబాబునాయుడు గానీ ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు కాన్వాయ్ దాటేవరకు మహిళ పరి స్థితి ఆగమ్యగోచరంగా మారింది. వైద్యుల సూచ నల మేరకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ గంటన్నర సమయం తర్వాత సీహెచ్సీకి తరలించారు. చావుబతుకుల మధ్య ఉన్న మనిషిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చోటివ్వని చంద్రబాబు... ప్రజలకు ఏమి ఉద్దరించేందుకు తిరుగుతున్నాడంటూ స్థానికులు విమర్శించారు. 40 ఏళ్ల ఇండ్రస్ట్రీ అంటూ చెప్పుకుతిరుగుతున్న బాబు సామాజిక బాధ్యత ఇదేనా అంటూ మండిపడ్డారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
పేషెంట్ క్రిటికల్.. సడన్గా ఆగిపోయిన అంబులెన్స్.. బైక్లతో నెట్టుతూ
న్యూఢిల్లీ: పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతడ్ని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈక్రమంలో రోడ్డు మధ్యలో అంబులెన్స్ సడన్గా ఆగిపోయింది. డ్రైవర్కు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్లపై వచ్చారు. కాళ్లతో అంబులెన్సును నెట్టుతూ బైక్లను వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇలా 12 కిలోమీటర్లు ప్రయాణించి రోగిని ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీజేపీ నేత తజీందర్ పాల్ బగ్గా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఢిల్లీ హరినగర్లోని డీడీయూ ఆస్పత్రి నుంచి ఆర్ఎంల్ ఆస్పత్రికి ఓ పేషంట్ను తరలిస్తుండగా.. అంబులెన్స్ ఆగిపోతే ఇద్దరు సిక్కు యువకులు సాయం చేశారని చెప్పుకొచ్చారు. బైక్పై కూర్చొని కాళ్లతో నెట్టుకుంటూ అంబులెన్సును ఆస్పత్రికి తీసుకెళ్లారని కొనియాడారు. While transferring a critical patient from DDU Hospital,Hari Nagar,Delhi to RML Hospital,the Ambulance broke down & was pushed by Two Sikh Motorcyclists for about 12 km at midnight. pic.twitter.com/4P5gs4eCrc — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 21, 2022 చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
నీకో పెగ్గు.. నాకో పెగ్గు..! అంబులెన్స్ ఆపి పేషెంట్తో డ్రైవర్ లిక్కర్ పార్టీ
భువనేశ్వర్: ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అంబులెన్స్. వెంటనే ఫోన్ కొట్టి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు అంతా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు. కానీ ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. లిక్కర్ కోసం వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు నిలిపేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అంతే కాదండోయ్..! అంబులెన్స్లోని రోగికి సైతం ఓ పెగ్గు అందించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒడిశా జగత్సింగ్పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్.. లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో పోసుకొని తాగటం ప్రారంభించాడు. వాహనంలోని పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దానిని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు. దీనిని చూసిన వాహనదారులు.. అంబులెన్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బాధితుడే మద్యం అడిగారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
పది లక్షల ప్రాణాలను కాపాడాయ్!
సాక్షి, అమరావతి: కుయ్.. కుయ్ అంటూ పరుగులు తీసే అంబులెన్స్లను చూస్తే గుర్తొచ్చేది నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్. గత సర్కారు హయాంలో 108 వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ప్రాణాపాయంలో ఉన్నవారు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదని, డ్రైవర్లు లేరనే సమాధానం వచ్చేది. ఒక్కోసారి అసలు స్పందించే నాథుడే ఉండడు. అలాంటి వ్యవస్థను సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే తిరిగి గాడిలో పెట్టారు. మండలానికి కచ్చితంగా ఒకటి అందుబాటులోకి తెచ్చి నిరంతరం సేవలందించేలా చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు పది లక్షలకు పైగా ప్రాణాలను 108 అంబులెన్స్లు కాపాడగలిగాయి. ఏజెన్సీలో అరగంట లోపే.. గత జనవరి నుంచి నవంబర్ 25వ తేదీ వరకు 10,10,383 ఎమర్జెన్సీ కేసులను 108 అంబులెన్స్ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. గిరిజన ప్రాంతాల్లో కాల్ చేసిన అరగంట లోపే చేరుకుంటున్నాయి. 108 అంబులెన్స్ల వ్యవస్థ పనితీరును విశ్లేషిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈమేరకు నివేదిక రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 20 నిమిషాల లోపు 108 అంబులెన్స్లు చేరుకోవాలనే నిబంధన విధించగా 18 – 19 నిమిషాల్లోనే వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల గడువు విధించగా ట్రాఫిక్ తదితర సమస్యల కారణంగా 15 నుంచి 18 నిమిషాల సమయం పడుతోంది. అత్యధికంగా 19 శాతం ఎమర్జెన్సీ కేసుల్లో గర్భిణులను 108 అంబులెన్స్లు ప్రసవం కోసం అస్పత్రులకు తరలిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 432 కొత్తగా 108 అంబులెన్స్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్లు పనిచేస్తున్నాయి. ఇందులో బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, నవజాత శిశువుల అంబులెన్స్లు తదితరాలున్నాయి. -
గుజరాత్: భారీ రోడ్షోలో ఆగిన ప్రధాని కాన్వాయ్! ఎందుకంటే..
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సరికొత్త ఫీట్ సాధించారు. దేశంలోనే అతిపెద్ద నగర రోడ్షో.. అదీ 50 కిలోమీటర్ల మేర చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో.. గురువారం సాయంత్రం అహ్మదాబాద్లో రోడ్షో జరుగుతుండగా.. ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దారిలో ఓ ఆంబులెన్స్ వస్తున్నది గమనించిన ప్రధాని సిబ్బంది.. ప్రధాని ఉన్న వాహనాన్ని పక్కకు ఆపించారు. ఆంబులెన్స్కు దారి ఇచ్చారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా అభిమానులు నిల్చున్నారు. వాళ్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రధాని మోదీ. #WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his massive roadshow in Gujarat's Ahmedabad. (Source: DD) pic.twitter.com/3GJBuCDqFN — ANI (@ANI) December 1, 2022 -
కాన్వాయ్ ఆపి అంబులెన్సు కు దారి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
-
మదనపల్లె పర్యటనలో సీఎం జగన్ ఉదారత
-
ఆంబులెన్స్కి దారివ్వండి.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్కు ఓ ఆంబులెన్స్ ఎదురొచ్చింది. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంతహడావుడిలోనూ ఓ ఆంబులెన్స్ రాకను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. దీంతో.. కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో ఆంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్కు నమస్కరించారు. ఇదీ చదవండి: మీ బిడ్డ.. ఈ వైఎస్ జగన్కు నిజాయితీ ఉంది -
కిల్లర్ సినిమా రేంజ్లో హత్య...గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్లో..
సాక్షి, హైదరాబాద్ : పనిచేసే చోట తరచూ యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. స్పానర్తో తలపై మోది హత్య చేశాడు.. పోలీసులకు తెలిస్తే ఇబ్బందులొస్తాయని యజమానులూ జాగ్రత్త పడ్డారు.. గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంతూరికి సాగనంపారు. కిల్లర్ సినిమాను తలపించే హత్య కేసును పహాడీషరీఫ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ►రాజస్థాన్ పాలి జిల్లా, రాంపుర కాలా గ్రామానికి చెందిన ఓంప్రకాశ్, సునీల్ హైదరాబాద్లో ఉంటూ మీర్పేట శ్రీరామ్కాలనీలో శ్రీసాన్వి ఇండస్ట్రీస్ను నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో పాలి జిల్లా, జైతరణ్కు చెందిన మహేంద్రజీ చౌదరి (45), ఉత్తర్ప్రదేశ్ కౌశాంబి జిల్లా చందుపురంరాయన్కు చెందిన రోహిత్ కుమార్ పని చేసేవారు. అయితే రోహిత్ సరిగ్గా పని చేయడం లేదని తరుచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు. ►మహేంద్రపై కక్ష పెంచుకున్న రోహిత్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.. పనిచేస్తున్న సమయంలో స్పానర్తో మహేంద్ర తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్రజీని కంపెనీ యజమానులు శివరాంపల్లిలోని చంద్రా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేంద్ర మృతి చెందాడు. గుండెపోటుగా చిత్రీకరించి.. అయితే హత్య విషయం బయటికి పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన యజమానులు ఓం ప్రకాశ్, సునీల్ పథకం పన్నారు. గుండె పోటుతో మహేంద్ర మరణించాడని ఆసుపత్రి నుంచే రోహిత్ చేత మహేంద్ర మామ ప్రకాశ్కు అక్టోబర్ 4న ఫోన్ చేయించారు. ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. హత్య సమాచారం పోలీసులకు అందించకుండా, మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగే వరకూ రోహిత్ను ఉత్తర్ప్రదేశ్కు పంపించేశారు. గాయాలు కనిపించకుండా పార్సిల్.. హంతకుడి సూచన మేరకు శివరాంపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన ప్రకాశ్ అంబులెన్స్లో పూర్తిగా ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం మృతదేహాన్ని సొంతూరైన బాగియాడకు తీసుకెళ్లారు. చివరి చూపు కోసం మహేంద్రజీ మృతదేహాన్ని తెరిచి చూసిన అతడి కుమారుడు పాబురాంజీ జాఖర్ మృతుడి తల, శరీరంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించాడు. దీంతో తమ తండ్రి గుండె పోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 31న రాజస్థాన్లోని జైతారామ్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్.. రాజస్థాన్ పోలీసులు కేసును పహాడీషరీఫ్ ఠాణాకు బదిలీ చేయడంతో.. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులను విచారించారు. క్రైమ్ సీన్ను రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రోహితే హంతకుడని తేల్చే కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే హత్య కేసు సద్దుమణిగిందని భావించిన రోహిత్ ఈనెల 14న యూపీ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చి యధావిధిగా పనిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం రోహిత్ను అరెస్టు చేసి, విచారించగా.. మహేంద్రజీని తలపై స్పానర్తో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఫ్యాక్టరీ యజమానులు ఓంప్రకాశ్, సునీల్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో ముగ్గురిని అరెస్టు చేసి జ్యూడిషయల్ రిమాండ్కు తరలించారు. హత్యకు ఉపయోగించిన స్పానర్ను స్వా«దీనం చేసుకున్నారు. (చదవండి: ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..) -
డోలీలకు చెక్ పెట్టేలా ‘గిరి రక్షక్’
సాక్షి, అమరావతి: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సుస్తీ చేస్తే దుప్పట్లతో డోలీ కట్టి కర్రలతో మోసుకుపోవడం.. మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రులకు తరలించే దుస్థితి తప్పనుంది. మారుమూల గిరిజన బిడ్డలకు సైతం తక్షణ వైద్య సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి రక్షక్’ ప్రాజెక్ట్కు శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్ట్ కింద 123 బైక్ అంబులెన్స్లను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 108, 104 అంబులెన్స్లతోపాటు 122 ఫీడర్ అంబులెన్స్ (మూడు చక్రాల బైక్)లు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్లు సైతం వెళ్లలేని ప్రాంతాలకు చేరుకునేలా బైక్ అబులెన్స్లను అందుబాటులోకి తెచ్చే కసరత్తు తుది దశకు చేరుకుంది. కాలిబాట ఉన్నా సరిపోతుంది నాలుగు చక్రాల అంబులెన్స్లు వెళ్లాలంటే కనీసం 6 అడుగుల దారి, మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్లు వెళ్లాలంటే మూడు అడుగుల దారి తప్పనిసరి. అదే బైక్ అంబులెన్స్ అయితే అడుగు, అడుగున్నర మార్గం ఉంటే చాలు. దీంతో ఇది మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడుతుందని గిరిజన సంక్షేమ శాఖలోని వైద్య, ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ రూపొందించిన బైక్ అంబులెన్స్ మోడల్ తరహాలో కొత్త బైక్ అంబులెన్స్లను అందుబాటులోకి తేనున్నారు. డ్రైవింగ్ సీటు వెనుక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా ఆరకిలో ఆక్సిజన్ సిలిండర్, సెలైన్ బాటిల్ పెట్టుకునే ఏర్పాటుతోపాటు ప్రాథమిక చికిత్స(ఫస్ట్ ఎయిడ్ కిట్) సామగ్రి ఉండేలా డిజైన్ చేయడం విశేషం. ప్రత్యేక యాప్తో పర్యవేక్షించేలా.. బైక్ అంబులెన్స్లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అటవీ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని 1,818 ప్రాంతాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగా ఆ ప్రాంతాల వాసులు ఎవరికైనా ప్రాణాపాయ స్థితి తలెత్తితే డోలీ, మంచాలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిచేలా బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ, ఆరోగ్య, విద్య, పోషకాహారం కార్యక్రమాన్ని అమలులోకి తేనున్నారు. ప్రతి బైక్ అంబులెన్స్కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి.. అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రధానంగా గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్ వెయిటింగ్ రూమ్లకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా శిశు మరణాలు, డోలీ మరణాలు పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. -
తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్ సేవలు
సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్ సపోర్ట్ కలిగిన ప్రత్యేక అంబులెన్స్ను అందించారు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్ గౌడ్. 24 గంటల పాటు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్ గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత -
అంబులెన్స్కు దారి.. నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ, పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈక్రమంలో అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ఆయన కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. అక్కడ ప్రజలు పోగై ప్రధాని మోదీకి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంబులెన్స్కు లైన్ క్లియర్ చేసిన తర్వాత కాన్వాయ్ తిరిగి కదిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత నెలలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తుండగా ఓ అంబులెన్స్కు ఆయన కాన్వాయ్ దారి ఇచ్చింది. (చదవండి: క్షమించండి అంటూ నితిన్ సంచలన వ్యాఖ్యలు... షాక్లో బీజేపీ) కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేకి హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక అసెంబ్లీ స్ధానాలున్న కాంగ్రా జిల్లాలో మోదీ పర్యటించారు. చాంబీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన, స్థిరమైన డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని అన్నారు. అస్థిరత్వం, అవినీతి, స్కామ్ల మయమైన పార్టీలు ఎందుకని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. సుపరిపాలన అందించేవారికి ప్రజలెప్పుడూ పట్టం కడతారని ఆకాక్షించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ను పట్టించుకోలేదని అన్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 12న జరుగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. (చదవండి: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను) -
అంబులెన్స్ సేవలు ప్రారంభించిన ఆదిత్య ఓం
'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్పై హీరోగా, విలన్గా తన మార్క్ చూపించారు. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు. పలు సేవా కార్యక్రమాలు ద్వారా ఆయన ఇప్పటికే ఎంతో మందికి పేదవాళ్లకు సహాయం చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది కి సహాయం చేసిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి తన వంతు కృషి చేశారు. అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్, దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగారు. తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది ఆదిత్య ఓం అన్నారు. -
విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..!
కోల్కతా: రోడ్డుపై బస్సు కోసం 10 ఏళ్ల పాపతో ఓ మహిళ వేచి చూస్తోంది. సమయానికి బస్సు రాకపోగా.. అంబులెన్స్ రూపంలో అబులెన్స్ దూసుకొచ్చి తల్లీకూతుళ్లను అనంతలోకాలకు చేర్చింది. ప్రాణాలు కాపాడే అంబులెన్సే ఇరువురి పాలిట మృత్యుపాశమైంది. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో శనివారం జరిగింది. నిర్లక్ష్యపూరితంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాలు పోయేందుకు అంబులెన్స్ కారణమైన క్రమంలో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో కోల్కతా-చెన్నైని కలిపే జాతీయ రహదారి 16పై సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం తెల్లవారుజామున 6.30 ప్రాంతంలో బాధితులు బస్సు కోసం వేచి చూస్తున్నారని, కోలఘాట్ వైపు వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వారిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో అంబులెన్స్లో ఎవరూ లేరని వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టటం వల్ల తల్లీకూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. హైవేపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అంబులైన్స్కు నిప్పుపెట్టారు. సుమారు 5 గంటల పాటు నిరసనలు చేపట్టటంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను మధ్యాహ్నానికి శాంతిపంజేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: వీరప్పన్ను మట్టుబెట్టిన పోలీసు అధికారి విజయ్ కుమార్ రాజీనామా -
మోదీ కాన్వాయ్ నిలిపేసి ‘అంబులెన్స్’కు దారి.. వీడియో వైరల్
గాంధీనగర్: గుజరాత్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ క్రమంలోనే అహ్మాదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తున్న సమయంలో అంబులెన్స్కు దారిచూపి ఔదార్యాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ రాకను గమనించిన క్రమంలో ప్రధాని మోదీ కాన్వాయ్ని పక్కకు నిలిపేసి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేశారు. ఈ వీడియోను గుజరాత్ బీజేపీ షేర్ చేసింది. అందులో పీఎం కాన్వాయ్లో భాగమైన రెండు ఎస్యూవీ కార్లు.. నెమ్మదిగా రోడ్డు పక్కకు వెళ్తుండగా.. అంబులెన్స్ దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్లోని దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో పబ్లిక్ ర్యాలీ ముగించుకుని గాంధీనగర్లోని రాజ్భవన్కు ప్రధాని మోదీ వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ‘అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తున్న క్రమంలో అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు పీఎం మోదీ కాన్వాయ్ నిలిపేశారు.’ అని గుజరాత్ బీజేపీ పేర్కొంది. గుజరాత్లో రెండో రోజు పర్యటనలో భాగంగా గాంధీనగర్- ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించారు మోదీ. అలాగే.. అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు తొలిదశ పనులను ప్రారంభించారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi, en route from Ahmedabad to Gandhinagar, stopped his convoy to give way to an ambulance pic.twitter.com/yY16G0UYjJ — ANI (@ANI) September 30, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
అంబులెన్స్ దొంగ అరెస్టు
రాంగోపాల్పేట్: కరీంనగర్ నుంచి రోగిని తీసుకుని వచ్చిన ఓ అంబులెన్స్ను దొంగిలించిన వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంబులెన్స్ను స్వాధీనం చేసికున్నారు. మంగళవారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డీఐ నాగేశ్వరరావులతో కలిసి డీసీపీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వావిలపల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి మండలం, కన్నాల గ్రామానికి చెందిన రాజేందర్ పురుగుల మందు తాగి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని తీసుకుని ఈ నెల 19న శ్రీనివాస్ గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. అంబులెన్స్ తాళం చెవులు అలాగే ఉంచి రోగిని తీసుకుని ఆస్పత్రి లోపలికి వెళ్లాడు. అతను బయటికి వచ్చి చూడగా అంబులెన్స్ కనిపించ లేదు. దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని బోయిగూడ ఐడీహెచ్కాలనీకి చెందిన కాకి యాదగిరి అలియాస్ యాదిగా గుర్తించారు. మంగళవారం అతడి ఇంటి వద్దకు వెళ్లగా అంబులెన్స్ కూడా అక్కడే ఉంది. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్
భోపాల్: బైక్పై వెళ్తున్న ఓ యువకుడ్ని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే 30 నిమిషాలు గడిచినా అక్కడికి అంబులెన్స్ రాలేదు. యువకుడికి మాత్రం తీవ్ర రక్తస్రావమవుతోంది. దీంతో చలించిపోయిన ఓ వ్యక్తి.. అతడ్ని బుల్జోడర్లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్లోని కట్నీలో ఈ ఘటన జరిగింది. రోడ్డుప్రమాదం తన షాపు ముందే జరిగిందని, యువకుడికి రక్తస్రావం కావడం చూసి బాధతో జేసీబీలో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నట్లు దాని యజమాని పుష్పేంద్ర తెలిపాడు. కాగా.. గాయపడిన యువకుడ్ని మహేశ్ బుర్మాగా గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు. అతని కాలికి ఫ్రాక్చర్ అయిందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేశారు. అయితే యువకుడ్ని జేసీబీలో ఆస్పత్రికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM — Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022 చదవండి: నా శాఖలో అందరూ దొంగలే.. బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్.. -
ఎమర్జెన్సీకి ఫోన్ చేసి తల్లిని కాపాడిన 4ఏళ్ల బుడతడు
నాలుగేళ్ల చిన్నారి ఎమర్జెన్సీ నెంబర్కి కాల్చేసి మరీ తన తల్లిని కాపాడుకున్నాడు. అసలేం జరిగిందంటే...తస్మానియాకి చెందిన నాలుగేళ్ల బాలుడు రెండు రోజుల క్రితమే అంబులెన్స్కి సంబంధించిన ఎమర్జెన్సీ నెంబర్ని ఎలా డయల్ చేయాలో నేర్చుకున్నాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఆమె తల్లి మూర్చతో కింద పడిపోయింది. దీంతో సదరు బాలుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ '000కి' కాల్ చేసి అమ్మ కింద పడిపోయిందని చెప్పాడు. వెంటనే పారామెడికల్స్ వచ్చి ఆ బాలుడి తల్లికి సకాలంలో వైద్యం అందించి ఆమెను రక్షించారు. అంతేకాదు సదరు అంబులెన్స్ పారామెడికల్ అధికారులు ఆ బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికేట్ని కూడా ప్రధానం చేశారు. ఆ బాలుడి తల్లి ఒక నర్సు ఆమె ఫోన్ అన్లాక్లో ఉంటే ఎలా ఓపెన్ చేయాలో, ఎమర్జెన్సీ నెంబర్కి ఎలా కాల్ చేయాలో నేర్పించినట్లు తెలిపారు. అదే ఈ రోజు తన జీవితాన్ని కాపాడుతుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తన కొడుకు ఒక చిన్న హిరో అయిపోయాడంటూ మురిసిపోయారు. ఈ ఘటనతో ఆ బాలుడు వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఈ విషయం సోషల్ మాధ్యమాలో కూడా తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ పిల్లవాడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ...చిన్న ఛాంపియన్ అని ప్రశంసిస్తున్నారు. (చదవండి: వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు) -
రోడ్డున పడిన నిండు గర్భిణి... కనికరం చూపని అంబులెన్స్ డ్రైవర్: వీడియో వైరల్
లక్నో: నడిరోడ్డుపై నిండు చూలాల్ని వదిలి వెళ్లిపోయాడు ఒక అంబులైన్స్ డ్రైవర్. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమిర్పూర్లో చోటుచేసుకుంది. ఆ గర్భిణి కుటుంబం అంబులెన్స్ డ్రైవర్ అడిగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో అమానుషంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనను జర్నలిస్ట్ రాజేష్ సాహు వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేస్తూ.... ఉత్తరప్రదేశ్లోని అంబులెన్స్ కంపెనీలకు వారి డ్రైవర్ల వైఖరి గురించి తెలియదు అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టాడు. సదరు మహిళ హమీర్పూర్లోని పండరి గ్రామానికి చెందిన మహిళ అని, ఆమె కుటుంబాన్ని రూ 1000 ఇవ్వాల్సిందిగా అంబులైన్స్ డ్రైవర్ డిమాండ్ చేశాడని వివరించాడు. బాధిత మహిళ కుటుంబం ఇవ్వలేక పోవడంతోనే గర్భిణి రోడ్డున పడిందని ట్విట్టర్లో తెలిపాడు. దీంతో నెటిజన్లు సదరు అంబులెన్స్ డ్రైవర్ని శిక్షించాలని ఒకరు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుని సదరు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ మరొకరు కామెంట్లు చేస్తూ... ట్వీట్ చేశారు. यूपी में एंबुलेस कंपनी और उनके ड्राइवरों की बदमाशी कौन नहीं जानता। ये वीडियो हमीरपुर के पंधरी गांव का है। परिवार के पास देने के लिए 1000 नहीं थे इसलिए गर्भवती महिला को सड़क पर ही छोड़ दिया। इतने निर्मम लोगों हैं कि क्या ही कहा जाए। pic.twitter.com/So8OKthLsP — Rajesh Sahu (@askrajeshsahu) September 6, 2022 (చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్) -
తోపుడు బండిపై ఆసుపత్రికి గర్భిణి.. తీరా వెళ్లాక ట్విస్ట్!
భోపాల్: తన గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఓ వ్యక్తి. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేరు. కనీసం నర్సులు సైతం లేకపోవటంతో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాస్ అహిర్వార్ అనే వ్యక్తి భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్.. అంబులెన్స్కు కాల్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్రాలేదు. దీంతో చేసేదేం లేక తోపుడు బండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్ అందుబాటులో లేరు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. అక్కడే ఉన్న కొందరు అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రాగా హాటా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. చివరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్ఆఫీసర్ఆర్పీ కోరి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. Husband of a pregnant woman carried her to hospital on a push-cart for want of ambulance in Damoh, Kailash Ahirwal reached the local government-run Arogya Kendra after 2 kms journey, there was no doctor or nurse there, he alleged @ndtv @ndtvindia pic.twitter.com/cXj94L5oX5 — Anurag Dwary (@Anurag_Dwary) August 31, 2022 ఇదీ చదవండి: ఇదెక్కడి న్యాయం.. ఆ వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ యాక్ట్ కింద కేసులా? -
టైంకి ఆస్పత్రికి తరలించారు.. కానీ అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాలేదు
కేరళ: ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాలు అంతకంతకు ఎక్కువైపోతున్నాయి. వాహనదారులు ఎంత జాగ్రత్తగా ఉన్న మృత్తువు ఏదో ఒక రూపంలో కబళిస్తోంది. ఒకవేళ ప్రమాదాలు జరిగినా సమయానికి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తే ఎంతో కొంతప్రమాదాన్ని నివారించగలుగుతాం. ఐతే ఇక్కడొక వ్యక్తిని అంబులెన్స్లో సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినా అక్కడ అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.... కేరళలోని ఫెరోక్కు చెందిన 66 ఏళ్ల కోయమోన్ అనే వ్యక్తికి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వ్యక్తి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. వెనువెంటనే అంబులెన్స్ వచ్చి నిర్ణీత సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్కి తీసుకువచ్చింది కూడా. ఐతే క్షతగాత్రుడిని చికిత్స వార్డుకి తరలిద్దాం అనుకుంటే అంబులెన్స్ డోర్లు ఎంతకి ఓపెన్ కాలేదు. ఆఖరికి ఆస్పత్రి సిబ్బంది మొత్తం ప్రయత్నించినప్పటికీ... సుమారు అరగంట వరకు వ్యాన్ డోర్లు ఓపెన్ గాక చాలా ఇబ్బందిపడ్డారు. చివరికి డోర్కు ఉండే అద్దాలు పగలుగొట్టి లోపలి నుంచి డోర్లు ఓపెన్ చేశారు. ఈ ఆలస్యం కారణంగా సదరు క్షతగాత్రుడు మృతి చెందాడు. అయితే అంబులెన్స్ డోర్లు తెరుచుకోకపోవడమే ఆ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. (చదవండి: ఆగ్రహంతో ప్రభుత్వాధికారిని స్థంభానికి కట్టేసిన రైతులు: వీడియో వైరల్) -
కర్ణాటకలో అంబులెన్స్ బీభత్సం.. భయంకర దృశ్యాలు వైరల్
బెంగళూరు: కర్ణాటలో ఓ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి టోల్బూత్ను ఢీకొట్టింది. ఉడిపి జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. కుందాపురం నుంచి రోగిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికే వర్షం పడుతుండటంతో టోల్ గేట్ వద్ద సిబ్బంది బారికేడ్లను అడ్డంగా పెట్టారు. అయితే ఇంతలో అంబులెన్స్ అటుగా రావడాన్ని గమనించిన సిబ్బంది టోల్ ప్లాజా ముందు ఉన్న రెండు బారికేడ్లను వేగంగా తొలగించారు. అంబులెన్స్ టోల్గేట్కు దగ్గరగా రావడంతో చివర ఉన్న మూడో బారికేడ్ను తొలగించేందుకు ఓ సిబ్బంది ప్రయత్నించాడు. అప్పటికే అతి వేగంతో వస్తున్న అంబులెన్స్ వర్షం పడి తడిగా ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా వాహనం టైర్లు టర్న్ అవ్వడంతో టోల్బూత్ క్యాబిన్ వైపు దూసుకెళ్లి బొల్తా కొట్టింది. అంబులెన్స్లోని పరికరాలు అన్ని చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి. చదవండి: వావ్ వాట్ ఏ టాలెంట్.. మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన కార్మికుడు ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న ఒక రోగి, ఇద్దరు సహాయకులతోపాటు రోడ్డుపై ఉన్న టోల్గేట్ సిబ్బంది మరణించారు. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ టోల్ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ప్రమాద తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. #Karnataka Tragic Video of Ambulance Hitting Toll Plaza in Karnataka's Udupi Emerges, 4 Dead (Viewer discretion advised) pic.twitter.com/LfOOP5sRAm — India.com (@indiacom) July 20, 2022 #WATCH | Karnataka: Four people were injured after a speeding ambulance toppled at a toll gate, near Byndoor. The Ambulance was carrying a patient to Honnavara. Further details are awaited. (Source: CCTV) pic.twitter.com/M3isDaX7Eg — ANI (@ANI) July 20, 2022 -
చమురు సంక్షోభం తెచ్చిన తంటా... అంబులెన్స్ సేవలు బంద్!
కొలంబో: శ్రీలంక ఆర్థిక, రాజీకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న సంగతి తెలసిందే. మరోవైపు నిరసకారుల్లో ఆగ్రహోజ్వల కట్టల తెంచుకుని వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలు చేపట్టేలా చేసింది. ఈ నేపథ్యంలోనే లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని వీడిపోవాల్సి వచ్చింది కూడా. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజు రోజుకి దిగజారిపోతుందనే చెప్పాలి. మొన్నటి వరకు ఇంధన సంక్షోభం కారణంగా విక్రమసింఘే అధ్యక్షతన కొత్త ప్రభుత్వం అనవసరమైన ప్రయాణాలను మానుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మళ్లీ ఇప్పుడు తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అత్సవసర అంబులెన్స్ సేవలను కూడా నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పలు ప్రాంతల్లో అత్యవతసర అంబులెన్స్ సేవలను నిలిసేస్తున్నట్లుగా వెల్లడించింది. అంతేగాదు ఇంధన సంక్షోభం కారణంగా అంబులెన్స్ సేవలను నిలిపేస్తున్నామని, అందువల్ల ప్రజలను అంబులెన్స్ సేవల కోసం 1990కి కాల్ చేయొద్దు అని కూడా చెప్పింది. ఐతే మరోవైపు ప్రస్తుతం 3,700 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్తో కూడిన ఓడ ఆదివారం శ్రీలంకకు చేరుకుందని, అలాగే 3,740 మెట్రిక్ టన్నుల గ్యాస్తో కూడిన మరో ఓడ కూడా ఈరోజు లంకకు చేరుకుంటుందని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ పేర్కొంది. అంతేగాదు మంగళవారం నుంచి గ్యాస్ పంపిణీ సక్రమంగా క్రమపద్ధతిలో ఉంటుందని, ఈ నెలాఖరు కల్లా దేశీయ ఎల్పి గ్యాస్ డిమాండ్కు సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుందని లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ ముదిత పీరిస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంగా దీన్ని పేర్కొనవచ్చు. (చదవండి: శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో సుమారు రూ. 39 లక్షల నగదు..) -
కలిచివేసే ఘటన: తమ్ముడి మృతదేహాంతో ఎనిమిదేళ్ల చిన్నారి...
పేదవాళ్ల కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా చాలా చోట్ల వారు దారుణమైన నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నారు. కనీసం సాటి మనుషులుగా వారికి సాయం చేసేవాళ్లు కూడా ముందుకు రాకపోవడం అత్యంత బాధకరం. కన్న బిడ్డ చనిపోయిన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేని దుస్థితిలో చాలామంది పేదవాళ్లు ఉన్నారు. గత్యంతరం లేని స్థితిలో వారిని అనాథ శవాలుగా వదిలి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్లో అంబాహ్లోని బద్ ఫ్రా గ్రామ నివాసి పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల రాజా అనే కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఐతే ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం భోపాల్లోని మోరెనా జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో పూజారామ్ స్థానిక ఆస్పత్రి ఇచ్చిన అంబులెన్స్ సాయంతో తన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆ చిన్నారి రక్తహీనత, అసిటిస్తో బాధపడుతూ చికిత్స సమయంలోనే మరణించాడు. దీంతో పూజరామ్ జాతవ్ తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు. ఆస్పత్రిలో వాహనం లేదని బయట వాహనం మాట్లాడుకుని వెళ్లమంటూ ఉచిత సలహ ఇచ్చి పంపేశారు. దీంతో చేసేదేమీ లేక తన పెద్ద కొడుకు గుల్షన్ ఒడిలో తన కొడుకు మృతదేహాన్ని ఉంచి వాహనం తీసుకువస్తాని చెప్పి వారిని మోరీనా నెహ్రూ పార్క్ వద్ద ఉంచి వెళ్లాడు. ఐతే పూజారామ్కి ఎంత ప్రయత్నించిన ఏ వాహనం దొరకలేదు. దీంతో అతను తన పెద్ద కుమారుడు గుల్షన్ని చనిపోయిన రాజాని అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాపం ఆ చిన్నారి చనిపోయిన తన తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక పక్క ఈగలు వాలుతూ ఉంటే వాటిని కొడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు ఆ చిన్నారి. ఐతే స్థానిక జనం అధికారులుకు సమాచారం ఇవ్వడంతో...పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ అసలు విషయం తెలుసుకని పూజారామ్కి సదరు స్థానిక ఆస్పత్రి నుంచే అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించారు. (చదవండి: రెస్టారెంట్పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
మేమింతే.. ఆంబులెన్స్కు కూడా దారి ఇవ్వని టీడీపీ నాయకులు
సాక్షి,చిలమత్తూరు(శ్రీ సత్యసాయి ): ఆపద సమయంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఎవరైనా సహకరిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. బీమా సొమ్ము పడలేదంటూ చిలమత్తూరులో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వెడల్పునా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగారు. అదే సమయంలో ఆపదలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తూ 108 అంబులెన్స్ అటుగా వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తున్నా.. తమకేమీ పట్టనట్లు కనీసం దారి కూడా ఇవ్వకుండా టీడీపీ నాయకులు వ్యవరించారు. దీన్ని చూసిన స్థానికులు టీడీపీ నాయకుల తీరును ఏవగించుకున్నారు. చదవండి: లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్ వదలండి! -
ఆడుకున్న తండ్రి భుజాల మీదే శవంగా..
భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన. మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్వాహా హెల్త్ సెంటర్కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది. బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు. A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp — Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022 ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది. అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. -
అంబులెన్స్లోనే పరీక్ష
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి అంబులెన్స్లోనే పదో తరగతి పరీక్ష రాశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బకల్వాడీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన గౌతమ్.. మిర్యాలగూడలోని రవీంద్రభారతి పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గౌతమ్ తీవ్రంగా గాయపడటంతో కాలుకు సర్జరీ జరిగింది. పరీక్షలు రాస్తానని గౌతమ్ పట్టుపట్టడంతో.. తల్లిదండ్రులు వైద్యుల పర్యవేక్షణలో అంబులెన్స్లో పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. అంబులెన్స్లోనే పరీక్ష రాసేం దుకు అధికారులు అనుమతి ఇచ్చారు. -
ఏపీలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
-
జీవాలకు సంజీవని.. పశువుల చెంతకే వైద్యం
108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. రోజూ ఎంతోమంది ప్రాణాలు నిలుపుతోంది. ఇదే తరహాలో ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి ప్రత్యేక వాహనం అందుబాటులోకి రానుంది. మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు) పేరిట పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేసింది. సాక్షి, అమరావతి బ్యూరో: పశువుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలందించడానికి మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొబైల్ వాహనాన్ని కేటాయించింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 వాహనాలను మంజూరు చేసింది. జిల్లాల పునర్విభజనతో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో విలీనం కావడంతో 14 వాహనాలు సమకూరాయి. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాల పాలైన ఈ మూగజీవాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సంచార శాలల్లో పశువైద్యులు, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ ఉంటుంది. ఒక్కో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారా వెట్ సిబ్బంది ఒకరు, డ్రైవరు ఉంటారు. సేవలు పొందడం ఇలా.. సంచార పశువైద్య సేవలు పొందడానికి 1962 టోల్ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ పశువుకు వైద్య చేయించాలనుకున్న వారు ఈ నంబరుకు ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న సంచార పశువైద్య వాహన సిబ్బందికి సమాచారం ఇస్తారు. సత్వరమే ఆ వాహనంలో ఉన్న పశువైద్యుడు, సిబ్బంది పశువున్న చోటకు (గరిష్టంగా 90 నిమిషాల లోపు) వెళ్లి వైద్యం అందిస్తారు. ఈ మొబైల్ వాహనంలోనే ల్యాబ్ కూడా ఉంటుంది. అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. మరింత మెరుగైన వైద్యం అవసరమైతే టెలి మెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి చికిత్స చేస్తారు. పశువును మరో ఆస్పత్రికి తరలించడానికి వీలుగా హైడ్రాలిక్ క్రేన్ (2 వేల కిలోల బరువును ఎత్తే సామర్థ్యం) కూడా వ్యాన్లో ఉంటుంది. మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిలో పశువుకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తారు. పశువులకు వైద్యంతో పాటు మందులనూ ప్రభుత్వం ఉచితంగానే సమకూరుస్తుంది. కాగా మొబైల్ అంబులేటరీలో వైద్య సేవలందించడానికి జీవీకే సంస్థ పశువైద్యులను నియమించింది. ఇప్పటికే మొదలైన కాల్స్.. ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని పశువైద్యాధికారులు వివిధ గ్రామాల్లో తెలియజేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల రైతులు అప్పుడే పశు వైద్యం కోసం ఫోన్ల ద్వారా వాకబు చేస్తున్నారు. త్వరలోనే వీటి సేవలు ప్రారంభమవుతాయని వారికి సమాధానం చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. ఇన్నాళ్లూ పశు వైద్యం కోసం ఇతర గ్రామాలకు పశువులను తీసుకెళ్లడానికి రైతులకు కష్టతరమవుతోంది. అన్ని పనులు మానుకుని వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటోంది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. 1962 టోల్ఫ్రీకి ఫోన్ చేస్తే సంచార వాహనంలో వైద్యులే అక్కడకు వెళ్లి ఉచిత వైద్యమందిస్తారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సంచార పశువైద్య సేవల గురించి కొన్నాళ్లుగా గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – కె.విద్యాసాగర్, జేడీ, పశుసంవర్ధకశాఖ -
తీరిన మూగవేదన
కడప అగ్రికల్చర్: నాడు అత్యవసర వైద్య సేవ లకు కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 108 అంబులెన్స్ను అందుబాటులోకి తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నోరు లేని మూగజీవాల వైద్య సేవల కోసం 1962 వాహనాన్ని తెచ్చి చరిత్రపుటల కెక్కనున్నారు. పశువులు వ్యాధుల బారిన పడితే 1962కు కాల్ చేస్తే ఎక్కడ వైద్య సేవలవసరమో అక్కడికే వాహనం రానుంది. ఈ అంబులెన్స్లో పశుసంవర్ధశాఖకు సంబంధించిన పశుౖవైద్యుడు, వెటర్నరీ అసిస్టెంట్, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారు. రైతు సమాచారం అందించగానే వారు సంఘటన స్థలానికి వెళ్లి వైద్య సేవలు అందించేలా రూపకల్పన చేశారు. అలాంటి వాహనాలు జిల్లాకు 7 అందుబాటులోకి రానున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నియోజక వర్గానికి ఒకటి చొప్పున.. జిల్లాకు సంబంధించి వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద ఏడు వాహనాలు రానున్నాయి. వీటి ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రంలోని పశుసంవర్థశాఖ ఏడీ పర్యవేక్షణలో సేవలు అందనున్నాయి. మూగజీవాల ఆరోగ్యానికి భరోసా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవ ద్వారా గ్రామాల్లోనే పశువులకు మెరుగైన వైద్యాన్ని అందించనున్నారు. అన్నదాతలను అదుకోవడమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 1962 వాహనాలను ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3.99 లక్షల గేదెలు ఉండగా అందులో 2.50 లక్షలు పాడిపశువులు, 13.56 లక్షల గొర్రెలు ఉన్నాయి. 11 లక్షలు కోళ్లు కూడా ఉన్నట్లు పశువైద్య అధికారులు తెలిపారు. ఈ మొబైల్ వాహనంతో మూగ జీవాల ఆరోగ్యానికి మరింత భరసా లభించనుంది. వైద్య సేవలు పొందేదిలా.. 108 తరహాలో 1962 నంబర్కు ఫోన్ చేయగానే పశువైద్యశాఖకు సంబంధించిన ప్రధాన కేంద్రానికి వెళుతుంది. అక్కడి నుంచి వారు రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు బాగాలేని పశువు, గెదె, మేక వంటి వాటి గురించి ఆరా తీసి సంబంధింత సమాచారాన్ని దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి చేరవేస్తారు.అక్కడ ఉన్న వైద్య సిబ్బంది వెళ్లి ప్రాథమికంగా పశువును పరీక్షించి వైద్య సేవలందిస్తారు. అత్యవసరమైతే అక్కడికి అంబులెన్స్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని పెద్దాసుపత్రికి తరలిస్తారు. మే రెండవ వారంలో... జిల్లాలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద మే రెండో వారంలో సేవలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించగానే జిల్లాకు వాహనాలు వస్తాయి. అప్పటి నుంచి జిల్లాలో కూడా సేవలు ప్రారంభిస్తాం. మూగ జీవాలకు ఆరోగ్యం సరిగా లేదని సమాచారం రాగానే వాహనం అక్కడికి వెళ్లి అక్కడికక్కడే సేవలు అందిచి అన్నదాతను ఆదుకుంటుంది. – తెలుగు. వెంకట రమణయ్య, జిల్లా పశు వైద్యాధికారి,వైఎస్సార్జిల్లా సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ అసుపత్రి: 01 వెటర్నరీ పాలిక్లినిక్: 01 ఏరియా వెటర్నీరీ హాస్పిటల్స్: 17 వెటర్నరీ డిస్షెన్సరీస్: 79 రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు: 78 డివిజనల్ ఆఫీసర్లు: 03 పశు వైద్యులు: 117 వెటర్నరీ అసిస్టెంట్లు: 108 జిల్లాలో ఆర్బీకేలు : 414 -
తిరుపతి రుయా అంబులెన్స్ దందాపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: తిరుపతి రుయా అంబులెన్స్ దందాపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే సీఎస్ఆర్ఎంవో సరస్వతీ దేవిని ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. రుయా సూపరిండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరో వైపు అంబులెన్స్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆర్డీఓ, డీఎంహెచ్వో, డీఎస్పీ బృందంతో కమిటీ వేసింది. అంబులెన్స్ అడ్డుకున్న నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా.. ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా బయటి అంబులెన్స్లను మరో మాఫియా రానివ్వడంలేదు. సిండికేట్గా మారి డెడ్బాడీ తరలించకుండా మాఫియా అడ్డుకుంది. ఈ ఘటన మొత్తాన్ని ప్రైవేట్ అంబులెన్స్కు చెందిన నందకిషోర్ వీడియో తీశాడు. ప్రైవేట్ అంబులెన్స్ల ఆగడాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే వీడియో తీశానని తెలిపాడు. తక్కువ ధరకు అంబులెన్స్ సర్వీసు ఇస్తున్నా.. తమను రాన్విడం లేదని మండిపడుతున్నాడు. తమకు 10 అంబులెన్స్లు ఉన్నాయి. మా అంబులెన్స్లను ఆసుపత్రి లోపలకి రానివ్వడంలేదని ఆయన అన్నారు. మృతదేహాన్ని తరలించాలంటే రూ.20వేలు డిమాండ్ చేస్తున్నారని, వీళ్ల ఆగడాలు తెలియాలనే వీడియో తీశానన్నాడు. ఇందులో ఎటువంటి దురుద్దేశ్యం లేదన్నారు. దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని నంద కిషోర్ మండిపడ్డాడు. -
రుయా ఆసుపత్రి ఘటనపై స్పందించిన మంత్రి రజిని
సాక్షి, గుంటూరు: తిరుపతిలోని రూయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? ఆస్పత్రి సిబ్బందే బెదిరింపులకు పాల్పడ్డారా.. అనే కోణంలో విచారణ చేపట్టాలని ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. చదవండి👉: తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా.. మహాప్రస్థానం అంబులెన్స్లు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రీపెయిడ్ ట్యాక్సుల విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాలను వీలైనంత వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటామని, అత్యవసర పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. -
తిరుపతి రుయాలో దారుణం.. రెచ్చిపోతున్న అంబులెన్స్ దందా..
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో జెసవ మృతదేహాన్ని తలించెందుకు రాజంపేట నుంచి ఉచిత అంబులెన్స్ పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దీంతో ద్విచక్ర వాహనంపై జెసవ మృతదేహాన్ని తరలించారు. సిండికేట్గా మారిన అంబులెన్స్ మాఫియా.. బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వార్త కూడా చదవండి: AP: రేపే టెన్త్ పరీక్షలు -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన అంబులెన్స్ ఇదే!! 2.8సెకన్లలో 100కిలోమీటర్ల వేగంతో
దుబాయ్ రోడ్లలో ఇకపై ప్రపంచంలోనో అత్యంత ఖరీదైన లైకాన్ హైపర్ స్పోర్ట్స్ అంబులెన్స్లు దూసుకెళ్లనున్నాయి. ఇటీవల దుబాయ్ కార్పొరేషన్ ఆఫ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటీవల దుబాయ్ ఎక్స్పోలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్, ఖరీదైన అంబులెన్స్ను ప్రదర్శించింది.ఈ అంబులెన్స్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్కి చెందిన డబ్ల్యూ మోటార్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఏడవ లైకాన్ హైపర్ స్పోర్ట్స్ కారును తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లైకాన్ హైపర్స్పోర్ట్ కారు 6యూనిట్లు మాత్రమే ఉండగా.. డబ్ల్యూ మోటార్స్ 7వ కారును తయారు చేసింది. ఇక దీని ధర అక్షరాల రూ.26కోట్లు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారును 440 వజ్రాల సెట్తో డిజైన్ చేశారు. కారు లోపలి టాప్ భాగం బంగారు పూత మనకు దర్శనమిస్తుంది. లైకాన్ హైపర్స్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ హోలోగ్రాఫిక్, హోలోగ్రాఫిక్ మిడ్-ఎయిర్ డిస్ప్లేతో వస్తుంది. డ్రైవర్ ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. కారు మొత్తం బరువును తగ్గించడానికి పూర్తిగా కార్బన్ ఫైబర్ను ఉపయోగించారు. -
ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్
-
లవ్ యూ అంబులెన్స్!
‘అంబులెన్స్ డ్రైవర్ కావాలనేది నా కల’ అని ఎవరైనా అంటే ఆశ్చర్యంగా చూస్తారు. నాన్సీ కట్నారియా (22) విషయంలోనూ ఇదే జరిగింది. ఎట్టకేలకు నాన్సీ తన కలను నెరవేర్చుకుంది. ఒకప్పుడు ఆమె పేరు పక్కన ఎలాంటి విశేషణాలు లేవు. ఇప్పుడు రెండు చేరాయి. అవి: హిమాచల్ప్రదేశ్ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్, మనదేశంలో రెండో మహిళా అంబులెన్స్ డ్రైవర్. ఒకరికి ఒక వృత్తి మీద ఎందుకు ఇష్టం ఏర్పడుతుందంటే బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. నాన్సీ అంబులెన్స్ డ్రైవర్ కావాలనుకోవడానికి ఒక కారణం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం... దగ్గరి బంధువు ఒకరికి తన కళ్లముందే యాక్సిడెంట్ అయింది. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. దేవుడు పంపిన వాహనంలా మెరుపువేగంతో దూసుకువచ్చి బాధితుడిని హాస్పిటల్లో చేర్పించింది అంబులెన్స్. ‘గోల్డెన్ టైమ్లో తీసుకువచ్చారు. ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు దక్కేవి కావు’ అన్నారు వైద్యులు. తన బంధువు బతికి ఉన్నాడంటే కారణం... అంబులెన్స్. అప్పటి నుంచి ఆమెలో అంబులెన్స్ అంటే ఒక ఆరాధన లాంటిది ఏర్పడింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసి) స్కూల్లో డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న నాన్సీ నర్పూర్ సివిల్ హాస్పిటల్ 102 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ డ్రైవర్గా విధుల్లో చేరింది. ‘నేను చేస్తున్నది ఉద్యోగం మాత్రమే కాదు సేవ కూడా’ అంటోంది నాన్సీ. -
అస్సాం సీఎం కీలక నిర్ణయం.. ఇక నుంచి కాన్వాయ్లో వాహనాల శ్రేణిని
దిస్పూర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి సీఎం పర్యటనలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అస్సాంలో సీఎం, మంత్రులు ఆధ్వర్యంలో గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. బిశ్వ శర్మ తన కాన్వాయ్ ఉండే వాహనాల శ్రేణిని ఆరుకు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్లో 22 వాహనాలు ఉండేవి. రోడ్డుపై సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు, పలు అంబులెన్స్ వాహనాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సీఎం దృష్టికి వచ్చింది. దీంతో గౌహతిలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు శ్రేణిని ఆరుకి కుదిస్తు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఇతర ప్రాంతాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎస్కార్ట్,పైలేట్ వాహనాల మినహ జిల్లాలలో 12 వాహనాలకు పరిమితం చేస్తు నిర్ణయం తీసుకుంది. అధికారిక సమావేశాలలో భాగంగా, ఇతర రాష్ట్రమంత్రులను సన్మానించడాన్ని కూడా నిషేధిస్తూ మంత్రి వర్గం నిర్ణయం వెలువరించింది. సీఎం కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర సమయంలో 2 నిముషాలు ఆపవచ్చని తెలిపింది. అంబులెన్స్ వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. వీటితో పాటు పలు విధాన పర నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
అలలపై ఆంబులెన్స్.. ఐడియా అదిరింది
మల్కన్గిరి( భువనేశ్వర్): జిల్లాలోని చిత్రకొండ సమితి, స్వాభిమాన్ ఏరియా, జాన్బాయి గ్రామం వద్ద ఉన్న చిత్రకొండ జలాశయం దగ్గర బోటు అంబులెన్స్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్కుమార్ సింగ్ హాజరై, బోటు అంబులెన్స్ ఆరంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. ఉదయం బీఎస్ఎఫ్ క్యాంపు ఆవరణలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమం అనంతరం ఇక్కడి ప్రజలకు తమ వంతు సహాయంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్ను వినియోగంలోకి తీసుకురావడం విశేషం. ఇప్పటివరకు జలాశయం మధ్య భూభాగంలోని పనాస్పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలాశయం మధ్య గుండా పడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారి జరిగిన పడవ బోల్తా దుర్ఘటనల్లో పలువురు మృత్యువాత పడడం విచారకరం. ఇదంతా గమనించిన బీఎస్ఎఫ్ జవానులు వారి కష్టాలు తీర్చాలని యోచించారు. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ బోటు అంబులెన్స్ను ప్రస్తుతం ప్రజా వినియోగంలోకి తీసుకురావడం గమనార్హం. చదవండి: రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే! -
Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ బాంద్రాలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంత మంతా భయానకంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బెహ్రం నగర్ ప్రాంతానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్లో చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. పోలీసులు, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు కూడా సహయక చర్యలను చేపట్టారు. అధికారులు.. ముందు జాగ్రత్తగా ఆరు అంబులెన్స్లను, ఐదు ఫైరింజన్లను ఘటన స్థలం వద్ద ఏర్పాటు చేశారు. At least five persons are feared trapped after a 5-storey building collapsed in Behram Nagar locality of Bandra (East), Mumbai. Five fire engines, one rescue van, and 6 ambulances have been rushed to the site: BMC — ANI (@ANI) January 26, 2022 చదవండి: రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం.. -
ఎనిమిది నిమిషాల్లో!!.. ప్రాణాలు నిలబెట్టేందుకు ఉరుకులు
పోటీ ప్రపంచంలో కాలంతో పాటు పరుగులు తీయాల్సిందే. ఎంత త్వరగా సేవలు అందితే.. అంత త్వరగా ఎదగవచ్చనే అంచనాకి వచ్చేస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలో ఫుడ్, గ్రాసరీ స్టార్టప్లు.. 2021లో ‘పది నిమిషాల’ మార్క్తో నయా ట్రెండ్ను ఫాలో అయ్యాయి. అయితే ఇప్పుడు హెల్త్ సర్వీసులు.. అది మనిషి ప్రాణం నిలబెట్టగలిగే ఆంబులెన్స్ సర్వీసులకు పాకింది. ఈ విషయంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది స్టాన్ఫ్లస్. పైగా ఇది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కావడం మరో విశేషం. స్టాన్ఫ్లస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్.. ఎమర్జెన్సీ మెడికల్ రెస్సాన్స్ స్టార్టప్. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సేవల కోసం ఈ స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా ఈ స్టార్టప్ 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.148 కోట్లపైనే) ఫండింగ్ దాటేసింది. ఢిల్లీ కేంద్రంగా హెల్త్క్వాడ్, కలారీక్యాపిటల్(బెంగళూరు), హెల్త్ఎక్స్ సింగపూర్(సింగపూర్) వరుసగా ఫండింగ్కు వెళ్లడంతో ఈ ఘనత సాధించింది స్టాన్ఫ్లస్. ఈ హుషారులో నగరంలో 500 ఆస్పత్రులకు తమ సేవలకు విస్తరించేందుకు స్టాన్ఫ్లస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు తమ సేవల నిడివి సమయాన్ని 15 నిమిషాల నుంచి 8 నిమిషాల మధ్య ఫిక్స్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే కేవలం 8 నిమిషాల్లో మనిషి ప్రాణం నిలబెట్టేందుకు శాయశక్తుల కృషి చేయబోతుందన్నమాట. 2016లో మొదలైన ఈ స్టార్టప్.. ప్రస్తుతం ఈ నెట్వర్క్లో 3 వేల ఆంబులెన్స్లు ఉండగా.. అందులో స్టాన్ఫ్లస్కు 200 సొంత ఆంబులెన్స్లు ఉన్నాయి. ఎనిమిదే ఎందుకు? ప్రస్తుతం గ్రాసరీ డెలివరీ కోసం 10 నిమిషాలు మార్క్ను ప్రకటించుకున్నాయి స్టార్టప్లు. అయితే ఆంబులెన్స్ సేవలను అందించే వియషంలో ఆ సమయం మరీ ఎక్కువగా(45 నిమిషాల దాకా) ఉంటోంది. అందుకే మనిషి ప్రాణాలు నిలబెట్టగలిగే ఈ విషయంపై ఫోకస్ చేసినట్లు స్టాన్ఫ్లస్ సీఈవో ప్రభ్దీప్ సింగ్ చెప్తున్నారు. ‘ఫస్ట్ మినిట్.. లాస్ట్ మైల్’ హెల్త్కేర్ పేరుతో గరిష్ఠంగా 15 నిమిషాలు.. కనిష్ఠంగా 8 నిమిషాల ఆంబులెన్స్ సేవల్ని అందించే ప్రయత్నం చేయబోతున్నారు. ఎఫెక్ట్.. దేశంలో ఫుడ్, గ్రాసరీ యాప్ల తరహాలో.. త్వరగతిన ఆంబులెన్స్ సర్వీసులను అందించేందుకు మరికొన్ని స్టార్టప్లు ఉన్నాయి. ముంబైకి చెందిన డయల్4242, హైదరాబాద్కి చెందిన ఫస్ట్ కన్సల్ట్ టెక్నాలజీస్ ‘అంబీ’ ద్వారా సేవల్ని అందిస్తున్నాయి. అలాగే స్టాన్ఫ్లస్ ఎఫెక్ట్తో 8 నిమిషాల లిమిట్ను పరిగణనలోకి తీసుకుని మరికొన్ని స్టార్టప్లు తక్కువ కాలపరిమితి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘8 నిమిషాల’ మీదే ఇప్పుడు మిగతా స్టార్టప్ల దృష్టి కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విమర్శకుల స్పందన ఫుడ్ డెలివరీ యాప్ల విషయంలో 10 నిమిషాల గడువు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బిజీ టైంలో ప్రమాదాలకు కారణమవుతుందని కొన్ని అభ్యంతరాలను సైతం లేవనెత్తారు. అయితే ప్రస్తుతం ఆంబులెన్స్ల విషయంలో మాత్రం విమర్శకులు.. వేరే గళం వినిపిస్తున్నారు. కరోనాలాంటి సంక్షోభాల నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి హెల్త్కేర్ సర్వీసుల అవసరం అవసరం ఉందనే చెప్తున్నారు. చదవండి: ఫ్లిప్కార్ట్ మాజీల స్టార్టప్ అట్టర్ ఫ్లాప్.. రూ. 66 కోట్ల పెట్టుబడి వెనక్కి -
భారీ వర్షంలో 4 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్కు దారి
సాక్షి, చెన్నై: చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్ని వర్షపు నీరుతో పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం అన్నా సలైలో ఓ వైపు భారీ వర్షం, మరోవైపు వందలాది వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ట్రాఫిక్ జామ్లో ఓ అంబులెన్స్ ఇరుక్కుపోయింది. అంబులెన్స్లో ఉన్న పేషెంట్ పరిస్థితి విషయంగా ఉంది. ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయిన అంబులెన్స్ను గమనించిన జిన్నా అనే ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తన బైక్ను పక్కన పెట్టేసి.. వర్షంలో సుమారు 4 కిలోమీటర్లు నడుస్తూ ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్కు దారిచూపాడు. అతని సాయంతో అంబులెన్స్ సరైన సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. మానవత్వంతో ఆయన చేసిన పనికి అంబులెన్స్ డ్రైవర్.. జిన్నాతో సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టుదలతో 4 కిలో మీటర్లు నడిచి అంబులెన్స్ దారి చూపడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
హెలికాప్టర్ ప్రమాదం: పార్థివ దేహాలను తరలిస్తున్న అంబులెన్స్కు యాక్సిడెంట్
చెన్నై: తమిళనాడులోని కున్నూరులో బుధవారం జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో 13 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటన పార్థివ దేహాలను తరలిస్తుండగా అంబులెన్సుకు ప్రమాదం జరిగింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఢిల్లీకి తరలించేందుకు గురువారం కున్నూర్ నుంచి సూలూరు ఎయిర్బేస్కు అంబులెన్సుల్లో తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు వద్ద ఓ అంబులెన్సు ముందుగా వెళ్తున్న మరో అంబులెన్సును అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కొందరు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రమాదానికి గురైన అంబులెన్సులోని పార్థివ దేహాలను మరో అంబులెన్సులోకి ఎక్కించారు. శుక్రవారం ఢిల్లీలో బిపిన్ రావత్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
బైక్కు అడ్డంగా చిన్నారులు.. వారిని తప్పించే ప్రయత్నంలో..
సాక్షి, విశాఖపట్నం: చిన్నారులను కాపాడబోయి.. బైక్ ప్రమాదానికి గురైన 108 అంబులెన్స్ పైలెట్ టి.సింహాచలం మృతి చెందాడు. అంబులెన్స్ డ్రైవర్గా పలు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చిన సింహాచలం అదే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం రేగులపాడుకు చెందిన సింహాచలం పాడేరులో భార్య,ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఆయన 108 అంబులెన్స్ పైలెట్గా 12 ఏళ్ల క్రితం చేరాడు. అప్పటి నుంచి సుమారు నాలగు వేల కేసుల్లో రోగులకు సేవలు అందించాడు. ప్రస్తుతం పాడేరు నియోనాటర్ 108 అంబులెన్స్ పైలెట్గా విధులు నిర్వహిస్తున్నాడు. 23వ తేదీన ఉద్యోగానికి సెలవు పెట్టి, సొంత గ్రామమైన రేగులపాడుకు బయలుదేరాడు. ఇంటి దగ్గర రెండు రోజులుండి 25న బైక్పై తిరుగు ప్రయాణమయ్యాడు. బైక్కు అడ్డంగా చిన్నారులు రావడంతో వారిని తప్పించడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి అదే రోజున విశాఖ కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషదఛాయలు అలుముకున్నాయి. సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: నాకన్నా మీకు చెల్లి అంటేనే ఇష్టం కదా.. నేనేం తప్పు చేశానమ్మా! -
వీడు మామూలోడు కాదు.. అంబులెన్స్ను ఫ్రీ ట్యాక్సీలా వాడేశాడు!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, హఠాత్తుగా ఎవరైనా అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే అంబులెన్స్కు కాల్ చేస్తాం. అయితే చాలా వరకు మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అంబులెన్స్ సేవలను ఉపయోగించుకుంటాం. అయితే ఓ వ్యక్తి ఏడాదిలో సుమారు 39 సార్లు స్థానికంగా ఉన్న ఆస్పత్రి అంబులెన్స్ను ఫోన్ చేసి.. సేవలను వినియోగించుకున్నాడు. అయితే ఏడాదికి 39 సార్లు ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తైవాన్కు చెందని ఓ యువకుడు సూపర్ మార్కెట్లకు వెళ్లిన ప్రతిసారి తిరుగు ప్రయాణంలో అంబులెస్స్కు ఫోన్ చేశాడు. అలా చాలా సార్లు మెడికల్ ఎమెర్జెన్సీ అని కాల్ చేయడంతో అంబులెన్స్ సిబ్బంది స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. చదవండి: సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది అంబులెన్స్కు ఫోన్ చేసి ఆస్పత్రిలో చేరినవారు చికిత్స తీసుకుంటారు. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ కనిపించకుండా వెళ్లిపోవడాన్ని ఆస్పత్రి సిబ్బంది గమనించారు. మరోసారి ఇలా జరిగినప్పుడు అతన్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఆస్పత్రి అంబులెన్స్కు పదేపదే కాల్ చేయడానికి కారణం ఏంటని అడగ్గా.. సూపర్ మార్కెట్ నుంచి తన ఇంటికి వెళ్లడానికి అంబులెన్స్ను టాక్సీలా వాడుకుంటున్నాని తెలపడంతో ఆశ్చర్యపోవటం ఆస్పత్రి సిబ్బంది వంతైంది. చదవండి: డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..: విదేశాంగ మంత్రి అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి అంబులెన్స్ సేవలను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానా కూడా విధిస్తామని పోలీసులు సదరు యువకుడిని హెచ్చరించారు. అయితే అతని ఇల్లు పక్కనే ఆస్పత్రి ఉండటంతోపాటు, సూపర్ మార్కెట్ కూడా కేవలం 200 మీటర్లు దూరంలో ఉండటంపై సోషల్ మీడియాలో ఆ యువకుడి చేసిన పనికి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన సీఎం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి నివాసానికి వెళుతుండగా విజయవాడ శివారు ఎనికేపాడు వద్ద 108 అంబులెన్స్ వేగంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిని గమనించిన సీఎం తన కాన్వాయ్ని స్లో చేయించి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేయించారు. దీంతో అంబులెన్స్ వేగంగా కాన్వాయ్ని దాటి ముందుకెళ్ళింది. చదవండి: (ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..) -
ఉత్తరప్రదేశ్లో గోవులకు అంబులెన్స్
మధుర: దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అనారో గ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి ఆదివారం చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే ఇది తొలిసారి అని తెలిపారు. 515 అంబులెన్స్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్ ‘112’కు ఫోన్ చేసి, అంబులెన్స్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతి అంబులెన్స్లో ఒక వెటర్నరీ డాక్టర్, ఇద్దరు సహాయకులు ఉంటారు. ఫోన్ చేస్తే దాదాపు 20 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంటుందని చౌదరి వివరించారు. గోవులకు అంబులెన్స్ సేవల పథకాన్ని డిసెంబర్లో ప్రారంభిస్తామన్నారు. -
AP: చిన్నారి ప్రాణం నిలబెట్టిన నియోనాటాల్ అంబులెన్స్
సాక్షి, బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన అత్యాధునిక నియోనాటాల్ అంబులెన్స్తో ఓ నవజాత శిశువు ప్రాణం నిలబడింది. నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ఓ పసికందును అంబులెన్స్ సిబ్బంది వైద్యం అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన అంజలి కాన్పు కోసం ఆదివారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా శిశువుకు శ్యాస సంబంధిత సమస్యతో ఊపిరి తీసుకోవటం కష్టంగా మారింది. వాహనంలో చికిత్స పొందుతున్న పసికందు అక్కడి వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీదనే తరలించాల్సి రావడంతో నియోనాటాల్ అంబులెన్స్ వాహనంలో తీసుకెళ్లారు. వాహనంలోని వెంటిలేటర్, ఇన్ఫూసియన్ పంప్, సిరంజ్ పంప్ల సహకారంతో ఈఎంటీలు మహేష్, రియాజ్ పసికందుకు చికిత్స అందిస్తూ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యాధునిక వసతులు ఉన్న అంబులెన్స్ ద్వారా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టారని తల్లి అంజలి సంతోషం వ్యక్తం చేసింది. AP: క్యార్మనగానే..కేర్ -
రోడ్డుపై సీఎం స్టాలిన్ చేసిన పనికి ఎవరైనా శభాష్ అనాల్సిందే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మానవత్వాన్ని ప్రదర్శించి నెటిజన్లతో పాటు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. సోమవారం కోయంబత్తూరు-వెలచెరి రూట్లో ఓ కార్యక్రమం కోసం సీఎం స్టాలిన్ వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ అంబులెన్స్ సైరన్ వినిపించింది. అది గమనించిన స్టాలిన్ తన కాన్వాయ్ ఆపి నెమ్మదిగా వెళ్లమని ఆదేశించి ఎడమ వైపు కాన్వాయ్ను ఆపి అంబులెన్స్కు దారి ఇచ్చారు. మార్గమధ్యంలో కాన్వాయ్ను నిలిపివేసి.. అంబులెన్స్కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక మంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. ఇటీవల సీఎం స్టాలిన్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజాహితమైన నిర్ణయాల తీసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనాల సంఖ్యను తగ్గించారు. ఆయన నిర్ణయాలకు ప్రతిపక్షాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. #WATCH | Tamil Nadu Chief Minister MK Stalin's convoy gives way to ambulance while enroute to Koyambedu from Velachery today. pic.twitter.com/IK03SkhyoK — ANI (@ANI) November 1, 2021 చదవండి: అనుకుంది.. సాధించింది -
రబ్బరు ష్యూస్ వల్లే బ్రతికాను
క్వీన్స్ల్యాండ్: అనుకోని విధంగా అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల్లో చాలా మటుకు బయటపడటం కష్టం. ఒకవేళ బయటపడితే చాలా అదృష్టవంతులుగా భావింస్తాం జౌనా. అచ్చం అలాంటి భయంకరమైన ప్రమాదం ఆస్ట్రేలియాలో సంభవించింది. వివరాల్లోకెళ్లితే ఆస్ట్రేలియాకు చెందిన టాలిన్ రోస్ అనే బాలుడు తన తండ్రితో కలిసి కారులో సమీపంలోని తన పాఠశాలకు వస్తాడు. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) ఆ తర్వాత కారు దిగి నెమ్మదిగా తన పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాడు. అంతే ఒక్కసారిగి ఆ యువకుడి పిడుగుపాటుకి గురవుతాడు. ఈ మేరకు శక్తివంతమైన మెరుపు ఒక మెటల్ స్తంభం నుండి ఆ యువకుడి శరీరంలోకి చొచ్చుకుపోయి కాల్చి అతని చేతి గుండా బయటకు వస్తుంది. దీంతో ఆ యువకుడు పాఠశాల వెలుపల నేలపైకి విసిరిపడతాడు. అంతేకాదు అతని కండరాలు బిగుసుకుపోయి, పూర్తిగా మొద్దుబారిపోతాయి. అయితే అదృష్టవశాత్తు అతని తండ్రి కారులోంచి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అప్రమత్తమై అంబులెన్స్కి సమాచారం ఇస్తాడు. కానీ టాలిన్ మాత్రం షాక్కి గురై ఏమి వినలేని స్థితిలో ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటూ షాక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఆసుపత్రికి తరలిస్తారు. ఈ మేరకు డాక్టర్లు టాలిన్ ధరించిన రబ్బరు ష్యూస్ ఆ శక్తివంతమైన విద్యుదావేశాన్ని శోషించుకోవటంతో సులభంగా బయటపడగలిగాడని చెప్పారు. పిడుగుపాటు జరిగినపుడు ఇలా సజీవంగా ఉండటం జరగదని టాలిన్ చాలా అదృష్టవంతుడంటూ ఆస్ట్రేయిన్ న్యూస్ ఏజెన్సీ డైలీమెయిల్ పేర్కొంది. అంతేకాదు ఆ మెరుపు దాడి చేసినప్పుడు ఏర్పడిన కాలిన మచ్చలు పాదాలపై భుజాలపై ఉన్నాయి. (చదవండి: 'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే) -
AP: క్యార్మనగానే..కేర్
కాకినాడ సిటీ: నవజాత శిశువుల ప్రాణరక్షణలో 108 అంబులెన్స్ ఆపద్బాంధవిగా నిలుస్తోంది. అత్యవసర వేళ అపర సంజీవనిలా ప్రత్యక్షమవుతోంది. నిలబెడుతోంది. అనార్యోగంతో ఉన్న పసికందును ఆగమేఘాలపై ఆస్పత్రికి చేరుస్తోంది. ప్రాణాపాయం తప్పించి తల్లితండ్రులకు ఆనందాన్ని పంచుతోంది. ఆస్పత్రి పడక నుంచి ఆరోగ్యంతో అమ్మ పొత్తిళ్లకు చేరి హాయిగా నిద్రపోతోంది. సకల వైద్య సౌకర్యాలతో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు ఆరోగ్య రథాలు (108 అంబులెన్స్) జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి. చిన్నారుల మరణాల కట్టడిలో కీలక భూమిక పోషిస్తున్నాయి. మారుమూల పల్లెలకు సైతం దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేలకు పైబడి శిశువుల ప్రాణాలను ఈ వాహనాల ద్వారా కాపాడగలిగాయి. జగన్ సర్కారు చొరవ పసిబిడ్డల ఆరోగ్యరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పుట్టిన తర్వాత ఏర్పడే అనారోగ్య సమస్యలు ఎక్కువ మంది పసిపిల్లలకు ప్రాణసంకటంగా పరిణమిస్తుంటాయి. సకాలంలో వైద్యమందించకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఈ పరిస్థితులకు పరిష్కారం గుర్తిస్తూ నవజాత శిశువుల ప్రాణరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా అంబులెన్స్లోనే సకల వైద్య సదుపాయాలను కల్పించింది. కార్పొరేట్స్థాయి వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచి్చంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో దేశంలోనే మొదటి సారిగా అంబులెన్స్ వైద్య సేవలు ప్రవేశపెట్టారు. ఇవి సత్పలితాలను ఇస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రెండు నియోనేటల్ అంబులెన్స్లు సేవలందిస్తున్నాయి. నవజాత శిశువులను సంరక్షించేందుకు అన్ని వసతులు 108లోనే ఉంచిన దృశ్యం ఆధునాతన సేవలతో.. నియోనేటల్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్స్లు కాకినాడ కేంద్రంగా ఒకటి, రంపచోడవరం కేంద్రంగా మరొకటి అందుబాటులో ఉన్నాయి. బేబీ వార్మర్స్, పీడియాట్రిక్ వెంటిలేటర్, ఇంక్యుబేటర్, నిరంతర ఆక్సిజన్ సరఫరా వంటి అత్యవసరమైన అన్ని రకాల పరికరాలు వాహనంలో ఉన్నాయి. నియోనేటల్ ఇంటెన్సివ్కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో లభించే అన్ని సదుపాయాలూ ఉండటం ఈ వాహన ప్రత్యేకత. అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు అంబులెన్స్లోనే ప్రాథమికంగా చర్యలు చేపడుతున్నారు. ఆసుపత్రులతో అనుసంధానం జిల్లాలో అత్యధిక ప్రసవాలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రులు 9 ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలకు కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రుల్లో స్పెషల్ నియోనేటల్ ఇంటెన్సీవ్కేర్యూనిట్లు (ఎస్ఎన్సీయూ)లు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు పని చేసే ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక కేంద్రాల్లో కాన్పు అనంతరం పుట్టిన బిడ్డకు సమస్య వస్తే కాకినాడ లేదా రాజమహేంద్రవరం తరలిస్తున్నారు. దీనివల్ల గతంలో కాలహరణంతో మార్గ మధ్యలో చిన్నారులు మరణిస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఎస్ఎన్సీయూ ఉన్న ఆసుపత్రులు, ఎస్ఎన్సీయూ లేకుండా కాన్పులు జరిగే ఆసుపత్రులతో 108 అంబులెన్స్లు అనుసంధానంగా సేవలందిస్తున్నాయి. వాహనంలోనే కొంత వైద్యం ప్రారంభిస్తూ ఊపిరిపోస్తున్నాయి. సేవలను వినియోగించుకోవాలి పేద పిల్లల అత్యవసర వైద్య సేవలకు ప్రభుత్వం కల్పించిన 108 అంబులెన్స్ సదుపాయాన్ని అవసరమైన వారు వినియోగించుకోవచ్చు. మెరుగైన వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించేలోగా అన్ని రకాల అత్యవసర సేవలను అందజేస్తున్నాం. అత్యాధునిక వైద్య పరికరాలు అంబులెన్స్లో ఉన్నాయి. పసి బిడ్డల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంబులెన్సులను ప్రవేశపెట్టారు. – సిహెచ్ అవినాష్, 108 జిల్లా మేనేజర్ -
స్ట్రెచర్పై రోగిని మోసుకొచ్చి...
సిరికొండ (బోథ్): ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు, వంతెన సౌకర్యాలు లేవు. కన్నాపూర్ తండాకు చెందిన బాలుడు రాహుల్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది గ్రామ శివారు వరకు వచ్చినా, సమీపంలో ఉన్న వాగుపై వంతెన లేకపోవడంతో వాహనం గ్రామం లోపలికి వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో ఈఎంటీ కాశీనాథ్, పైలట్ గోపీనాథ్ స్ట్రెచర్ తీసుకుని బాలుడి ఇంటికి వెళ్లారు. బాధితుడిని స్ట్రెచర్పై మోసుకొచ్చి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. -
గర్భిణి ప్రసవ వేదన
వేమనపల్లి (బెల్లంపల్లి): సుఖ ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి. ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్ కమిటీ అంబులెన్స్లో వేమనపల్లి పీహెచ్సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్ వర్కర్ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు. దీంతో అంబులెన్స్లో ఉన్న గర్భిణిని డ్రైవర్ నరేష్, మరో డ్రైవర్ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున శిరీష ఆడశిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సిబ్బంది లేకపోవడంతోనే ఆమె పరిస్థితిని చూసి అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించామని వైద్యాధికారి కృష్ణ తెలిపారు. -
ఏజెన్సీలో ఎడ్లబండి అంబులెన్స్..
సాక్షి,నార్నూర్(గాదిగూడ): ఏజెన్సీ పరిధిలో రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక అంబులెన్స్ వెళ్లలేని గ్రామాలకు వెళ్లి బాధితులను ఆస్పత్రికి తీసుకువచ్చేలా ఐటీడీఏ ఎడ్లబండి అంబులెన్స్ ఏర్పాటు చేసింది. గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనిని అందుబాటులో ఉంచారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైతే ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఎడ్లబండి అంబెలెన్స్ ఏర్పాటు చేసినట్లు ఏజెన్సీ అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా ఎడ్లబండిపై బాధితులను ఆస్పత్రికి తీసుకొస్తే వారికి రూ.1,300 రవాణా చార్జీ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. గిరిజనులు ఎడ్లబండి అంబులెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదవండి: రూ.10 కోసం గొడవ.. ఇంటికొచ్చి మరీ కాల్చి చంపిన దుండగులు -
ప్రొద్దుటూరు: ప్రైవేట్ అంబులెన్స్లో పేలుడు
-
ప్రొద్దుటూరు: ప్రైవేట్ అంబులెన్స్లో పేలుడు
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్లో గ్యాస్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ క్రమంలో స్థానికులు.. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. -
పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళ.. కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా..
లక్నో: ఒక మహిళా కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచి, తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాలాబాద్కు చెందిన 30 ఏళ్ల రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది. కాగా, గర్భవతి అయినా రేఖ కొన్ని రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన తల్లితో కలిసి గత సోమవారం (జులై 26)న బస్సులో షాహజాన్పూర్కి బయలుదేరింది. బస్సులోని కుదుపుల కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే, ఆమెకు నొప్పులు మరీ ఎక్కువకావడంతో బాధను తాళలేక విలవిల్లాడింది. ఈ క్రమంలో బింటూ పుష్కర్ అనే మహిళ కానిస్టేబుల్ అదే బస్సులో ప్రయాణిస్తుంది. అంబూలెన్స్ మాత్రం సమయానికి రాకపోవడంతో ఆమె రేఖ, ఆమె తల్లి ఆందోళనకు లోనయ్యారు. దీంతో బింటూ పుష్కర్ వారిద్దరికి ధైర్యం చెప్పింది. అంతటితో ఆగకుండా, రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకు సపర్యలు చేసింది. కాసేపటి తర్వాత రేఖకు ఒక బాలిక జన్మించింది. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో.. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబూలెన్స్లో తల్లిబిడ్డలను దగ్గర్లోని ఒక మెడికల్ కాలేజీకి తరలించారు. ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో పుష్కర్, బస్సులోని మిగతా ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టకాలంలో మహిళకు అండగా నిలిచినందుకు కానిస్టేబుల్ బింటూ పుష్కర్పై నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
-
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
కరీంనగర్: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్కు అంబులెన్స్లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమంత్రి సీరియస్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్లో తెలంగాణ డీజీపీ ప్రోటోకాల్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు బ్లాక్ చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు అంబులెన్స్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. అందులో ఎమర్జెన్సీ కేసులూ ఉన్నాయి. అంబులెన్స్ సైరన్ మోగుతున్న తమకేం పట్టన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించారు. ఈ ట్రాఫిక్లో రెండు అంబులెన్స్లు దాదాపు గంటకు పైగా చిక్కుకున్నాయి. ఎంత సేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి అంబులెన్స్లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే దారివ్వాలని కోరారు. అయితే దానికి ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా మాసబ్ ట్యాంక్ పోలీసుల నిర్లక్ష్యంపై హోంమంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఘటనపై హైదరాబాద్ సీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. అయితే మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని సీపీ హోంమంత్రికి తెలియజేశారు. -
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమత్రి సీరియస్
-
షాకింగ్: ‘ఎమ్ఆర్ఐ నన్ను లోపలికి లాక్కుంది..’
ముంబై : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్లో ఇరుక్కుపోయాడు. ప్రాణాపాయం తప్పి, వేలు విరగొట్టుకుని బయటపడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన విక్రమ్ అబ్నవే అనే అంబులెన్స్ డ్రైవర్ శుక్రవారం ఓ రోగిని ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసమని ‘ప్రతామ్ ఎమ్ఆర్ఐ అండ్ సీటీ స్కాన్ సెంటర్’కు తీసుకుని వచ్చాడు. పేషంట్ పరిస్థితి బాగోలేకపోవటంతో అతడికి ఆక్సిజన్పై ఉంచారు. రోగిని ఎమ్ఆర్ఐ సెంటర్లోకి తీసుకువెళుతున్నపుడు విక్రమ్ సిలిండర్ను చేతిలో పట్టుకుని లోపలికి వెళ్లాడు. ఎమ్ఆర్ఐ దగ్గరకు రాగానే.. షాక్ కొట్టిన భావనతో అది విక్రమ్ను తనలోకి లాక్కుంది. దీంతో అతడు ఎమ్ఆర్ఐ మిషిన్లో ఇరుక్కున్నాడు. అప్పుడు విక్రమ్ చేతిలో ఆక్సిజన్ సిలిండర్ ఉంది. అతడి అరచేయి మొత్తం ఎమ్ఆర్ఐలోకి వెళ్లిపోయింది. అతడు తన చేతిని గట్టిగా వెనక్కులాక్కున్నాడు. ఆ వెంటనే ఎమ్ఆర్ఐ రూములోనుంచి బయటకు వచ్చాడు. దీనిపై విక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ గదిలోనుంచి బయటకు రాగానే నా అర చెయ్యి మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది. బాగా నొప్పి వేసింది. అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఆ మిషిన్ నన్ను అలా లాక్కుంటుందని నేను అనుకోలేదు. నా చిటికెన వేలు విరిగిపోయింది. నేను గట్టిగా అరవటంతో సెంటర్ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి నా వేలులో రాడ్డు వేశారు. చనిపోవాల్సిన ప్రమాదంలో గాయంతో బయటపడ్డానని సెంటర్ సిబ్బంది అన్నారు. విరిగిపోయిన వేలితో నేను ఏ పనిచేయలేకపోతున్నాను. పేదవాడిని.. నా కుటుంబాన్ని ఎలా పోషించగలను’’ అని వాపోయాడు. -
నిండు గర్భిణిని మంచంపై మోసుకుంటూ.!
రాయగడ: తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ఓ గర్భిణిని ఆంబులెన్స్ ఎక్కించేందుకు గ్రామస్తులు మూడు కిలోమీటర్లు మంచంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కాసీపూర్ సమితిలోని బొడొఫసా గ్రామంలో చోటుచేసుకుంది. బొడొఫసా గ్రామానికి చెందిన బిబిన్ మజ్జి భార్య థాసాయికి ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. భార్య ప్రసవవేదన పడుతుండటం గమనించిన భర్త బిబిన్ ఆంబులెన్స్కు సమాచారం అందించాడు. గ్రామానికి వస్తున్న ఆంబులెన్స్ సరైన దారిలేకపోవడంతో మూడు కిలోమాటర్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో గ్రామస్తుల సాయంతో గర్భిణిని మంచంపైనే మోస్తూ ఆంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో థాసాయి..పండంటి బిడ్డకి జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. -
ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..
సాక్షి, భువనేశ్వర్: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణిని స్థానికులు మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆపై ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాసీపూర్ సమితి కీరాఅంబొ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కీరాఅంబొ గ్రామానికి చెందిన కొసేయి మజ్జి భార్య బాసంతికి పురిటి నొప్పులు రావడంతో.. అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే, సరైన రహదారి లేకపోవడంతో ఆంబులెన్స్ను మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. దీంతో గర్భిణిని గ్రామస్తులు మోసుకుంటూ ఆంబులెన్స్ వద్దకు చేర్చారు. టకిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, బాసంతి ఆడశిశువుకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామీణ రహదారులను మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: డెల్టా ప్లస్ డేంజర్ కాదు -
బంపర్ ఆఫర్ : భారీగా తగ్గిన అంబులెన్స్ వాహనాల ధర
ముంబై: మారుతీ సుజుకీ తన అంబులెన్స్ వెర్షన్ ‘‘వ్యాన్ ఎకో’’ వాహన ధరలను రూ.88 వేలు తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.6.16 లక్షలుగా ఉంది. ఆంబులెన్స్లపై విధించే జీఎస్టీ రేటును 28% నుంచి 12 శాతానికి తగ్గిస్తూ గతవారంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబులెన్స్ మోడళ్ల ధరలపై కోత విధించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తగ్గింపు ధరలు జూన్ 14 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. చదవండి: పబ్జీ లవర్స్కు మరో షాక్, ఊపందుకున్నబ్యాన్ డిమాండ్ -
ఆపదలో ఆదుకునే అంబులెన్స్.. వారి పాలిట మృత్యు శకటమైంది..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): ఆపదలో ఆదుకునే అంబులెన్స్ మృత్యు శకటమైంది. స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి చిత్రదుర్గ పట్టణానికి సమీపంలో జరిగింది. హొళల్కెరె రోడ్డు తిరుమల డాబా వద్ద హొళెల్కెరె నుంచి కాంతరాజు (22), శ్రీకాంత(20), నంజుండ(20) అనే యువకుడు స్కూటీపై చిత్రదుర్గకు వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన అంబులెన్స్ వారిని వేగంగా ఢీకొనడంతో దూరంగా ఎగిరిపడి చనిపోయారు. అంబులెన్స్ చెట్టును ఢీకొని నిలిచిపోగా డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంబులెన్స్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. చదవండి: డీజే బంద్ చేయమన్నందుకు పోలీసులపైనే దాడి.. -
అమ్మ కాకుండానే.. అనంతలోకాలకు..!
మాతృత్వాన్ని మృత్యువు మింగేసింది.. తల్లికావాలనే.. ఆమె కల.. కలగానే మిగిలిపోయింది. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్న చందంగా.. తొలికాన్పులో బిడ్డను పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలు.. రెండో కాన్పులోనైనా.. అమ్మకావాలని ఆరాటపడింది. పురిటినొప్పులు పడుతూనే.. కోటి ఆశలతో అంబులెన్స్లో ఆస్పత్రికి బయలుదేరింది. అయితే అతివేగం ఆమె ఆశల్ని చిదిమేసింది..దయలేని దేవుడు అమ్మకాకుండానే ఆమెను.. అనంతలోకాలకు తీసుకెళ్లిపోయాడు. సాక్షి, చెన్నై: పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళను సకాలంలో ఆస్పత్రిలో చేర్చేందుకు అతివేగంగా వెళ్లిన అంబులెన్స్ గురువారం వేకువ జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గర్భిణితో సహా ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురం సమీపంలోని పుదుపట్టు గ్రామానికి చెందిన కన్నన్ భార్య జయలక్ష్మికి వేకువజామున పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్లో ఉదయం 4 గంటల సమయంలో కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్లో జయలక్ష్మి(26), ఆమె అత్త సెల్వి(55), అడపడుచు అంబిక(30)తో పాటుగా వైద్యసాయం నిమిత్తం నర్సు మీనా, అంబులెన్స్ అస్టిసెంట్ తేన్మొళి బయలుదేరారు. సకాలంలో ఆ గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించాలన్న కాంక్షతో డ్రైవర్ కళియమూర్తి అంబులెన్స్ను వేగంగా నడిపాడు. అయితే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆలత్తూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా అంబులెన్స్ టైర్ పేలడంతో వాహనాన్ని నియంత్రించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో అతి వేగంగా అంబులెన్స్ చింతచెట్టును ఢీకొంది. రెండోసారి ప్రసవం కోసం.. అంబులెన్స్ చెట్టుని పెద్దశబ్ధంతో ఢీకొని ఆగడంతో అటుగా వెళ్తున్న వారు, స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సెల్వి, అంబిక అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న గర్భిణి జయలక్ష్మి, నర్సు మీనా, అస్టిసెంట్ తేన్మొళి, డ్రైవర్ కళియమూర్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో పరిస్థితి విషమించి జయలక్ష్మి మరణించింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ సైతం మృతి చెంద డంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. తొలికాన్పు సమయంలో బిడ్డను జయలక్ష్మి కోల్పో గా, రెండో కాన్పు సమయంలో ఏకంగా ఆమెతో పాటుగా కడుపులోని బిడ్డ, అత్త, ఆడ పడుచులు మృత్యువు ఒడిలోకి చేరడం చూపరులను కలిచివేసింది. మిగిలిన ముగ్గురు వైద్య సిబ్బంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్లో కదిలిన డొంక! -
ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..
చెన్నె: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్ ప్రమాదానికి గురయ్యింది. చెట్టును ఢీకొట్టడంతో తొమ్మిది నెలల నిండు గర్భిణితో పాటు ఆమె అత్తి, వదిన దుర్మరణం పాలయ్యారు. పురుటినొప్పులతో బాధపడుతుండడంతో తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కొన్ని గంటల్లో మరో ప్రాణానికి జన్మనిచ్చే మహిళ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ఒకేసారి ముగ్గురిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో జరిగింది. సొరపట్టు గ్రామానికి చెందిన సెల్వీ తన కోడలు జయలక్ష్మికి తొమ్మిది నెలలు నిండడంతో బుధవారం తెల్లవారుజామున నొప్పులు వచ్చాయి. వెంటనే కుమార్తె అంబికతో కలిసి అంబులెన్స్ తీసుకుని ఆస్ప్రతకి బయల్దేరారు. అయితే తెల్లవారుజామున 4.45 గంటలకు మార్గమధ్యలో అంబులెన్స్ టైర్ పేలి వాహనం అదుపు తప్పింది. వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో వాహనంలోని అత్తాకోడళ్లతోపాటు ఆమె కుమార్తె తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజాము కావడంతో ఈ ప్రమాదం వార్త ఎవరికీ తెలియలేదు. దీంతో కొన ప్రాణం మీద ఉన్నవారిని ఎవరూ కాపాడలేకపోయారు. గాయాలతో బాధపడుతూ అక్కడికక్కడే మృతి చెందారు. కొన్ని గంటల తర్వాత అటుగా వెళ్లేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అంబులెన్స్ డ్రైవర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. జయలక్ష్మి కుటుంబానికి రూ.5 లక్షలు, సెల్వీ, అంబిక కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బీమా పరిహారం వెంటనే కుటుంబాలకు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. చదవండి: పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
Tarun Kappala: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్గా..
సాక్షి, హైదరాబాద్: అవును అతడు రెక్కలు కట్టుకొని వచ్చాడు. తన వాళ్ల కోసమే కాదు. తన తల్లి లాంటి ఎంతో మంది తల్లుల కోసం. మరెందరో తన చెల్లెల్లాంటి తోబుట్టువుల కోసం అమెరికా నుంచి వచ్చేశాడు. డెల్లాయిట్కు చెందిన ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా, ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న తరుణ్ కప్పల ఇప్పుడు ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా. కోవిడ్ మహమ్మారిపైన అలుపెరుగని యుద్ధం చేస్తున్న వందలాది మంది సైనికుల్లో అతడు సైతం ఒక సైనికుడిగా నిలిచాడు. కోవిడ్ బాధితులు ఎక్కడుంటే అక్కడ ఠకీమని వాలిపోతాడు. స్వయంగా అంబులెన్సులో తీసుకెళ్లి ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. కోవిడ్ పేషెంట్లు వార్డుల్లో ఉన్నా. ఐసీయూల్లో ఉన్నా వెళ్లి పలకరిస్తాడు. ‘నేనున్నానంటూ భరోసానిస్తాడు. మీకేం కాదంటూ ’మాటలతో ధైర్యాన్ని నూరిపోస్తాడు. తరుణ్ అంబులెన్స్ రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్లో ఏ మారుమూల ప్రాంతంలో కోవిడ్ బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా వెంటనే వెళ్లిపోతాడు. ‘సకాలంలో ఆస్పత్రికి చేర్చినప్పుడు, పేషెంట్లు కోలుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పడు గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఈ జీవితానికి అది చాలు అనిపిస్తుంది.’ అంటూ వినయంగా చెబుతాడు తరుణ్. సేవే దైవంగా... శ్రీనగర్ కాలనీకి చెందిన తరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ వర్సిటీలో చదువుకున్నాడు. డెల్లాయిట్లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో చేరాడు. గతేడాది కోవిడ్ మహమ్మారి బారిన పడిన ప్రపంచం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాకు వచ్చే విద్యార్ధులకు అండగా నిలిచాడు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరించాడు. ‘ఆ సమయంలోనే మా అమ్మ హైదరాబాద్లో ఇంట్లో జారిపడింది. వెన్నెముక దెబ్బతిన్నది. సర్జరీ చేయవలసి వచ్చింది. ఇక నేను హైదరాబాద్కు వచ్చాను. మధ్యలో అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో అమెరికాకు తిరిగి వెళ్లిపోవచ్చుననుకుంటున్న సమయంలో సెకెండ్ వేవ్ ఉధృతి మొదలైంది. చాలా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులే నా బాధ్యతను కూడా గుర్తు చేశాయి’ అంటారు తరుణ్. ‘ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అంబులెన్సులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. అమెరికాలోనే ఉంటున్న తన స్నేహితుడి చెల్లెల్ని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రూ.15 వేలు ఖర్చు చేయవలసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న నా స్నేహితుల సహాయంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ఎథ్నె అనే ఓ స్వచ్చంద సహకారంతో మారుతీ ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసి ఆక్సిజన్ సదుపాయం ఉన్న అంబులెన్సుగా మార్చాను. ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా తిరిగాను. వందలాది మందిని ఆస్పత్రుల్లో చేర్చాను. దురదృష్టవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లాను’ అని చెప్పారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
ప్రజల సొమ్మె కదా ఏంచక్కా నొక్కేద్దాం !
పట్నా: ప్రజల సొమ్మంటే పట్టింపే లేదు ప్రభుత్వ అధికారులకు. పైపెచ్చు ఆ సొమ్ముతో కమిషన్లు కొట్టేయడమంటే మహా ‘ఇది’. ఆఖరికి కరోనా కల్లోల సమయంలోనూ చేతి వాటం ప్రదర్శించడానికి తటపటాయించడం లేదు. ఈ అవినీతి వ్యవహరం అంతా ముఖ్యమంత్రి ప్రాంతీయ అభివృద్ధి ఫండ్తో పేరుతోనే జరిగినా ... అక్కడ సీఎంవోకి చీమకుట్టినట్టైనా లేదు. మూడు రెట్లు ఎక్కువ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ప్రజలను ఆస్పత్రులకు చేర్చేందుకు అంబులెన్సులు కొనుగోలు చేయాలని బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అంబులెన్సుల కొనుగోలు నిర్ణయానికి పచ్చజెండా ఊపారు. అనుమతులు రావడం తరువాయి రూ. 7 లక్షలు విలువ చేసే అంబులెన్సుకు ఏకంగా రూ.21 లక్షలు చెల్లించి మరీ కొన్నారు. చిన్న మార్పులకే వాహనాన్ని అంబులెన్సుగా మార్చేందుకు అనువుగా పార్టిషన్ చేయడం, అందులో వెంటిలేటర్ ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ పేరుతో అడ్డగోలుగా బిల్లులు చెల్లించారు. రూ.60,000 విలువ చేసే వెంటిలేటర్కి రూ.3.41 లక్షలు, రూ.8,500 విలువ చేసే సక్షన్ మిషన్కి రూ.21,000లు చెల్లించినట్టుగా బిల్లులలో పేర్కొన్నారు. అంబులెన్సులో సీట్ల పార్టిషన్ చేసినందుకు ఏకంగా రూ.1.24 లక్షలు చెల్లించారు. ఇలా ఇష్టారీతిగా బిల్లులు చెల్లిస్తూ రూ.7 లక్షలు విలువ చేసే అంబులెన్సుకు మూడింతలు అధికంగా చెల్లిస్తూ రూ.21 లక్షలకు కొనుగోలు చేశారు. ఏడాదిగా నిరుపయోగంగా సాధారణంగా రూ.5 లక్షలు దాటి ఏదైనా కొనుగోలు చేయాల్సి వస్తే గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధను అతిక్రమించారు అధికారులు. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రాంతీయ అభివృద్ధి నిధుల నుంచి అత్యవసర పనుల పేరిట అంబులెన్సులు కొనుగోలు చేశారు. ఇలా కొన్న ఏడు అంబులెన్సుల్లో ఐదింటిని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఇవి షెడ్డుకే పరిమితమయ్యాయి. విచారణకు ఆదేశం అడ్డగోలు ధరలకు అంబులెన్సులు కొనడంతో పాటు వాటిని నిరుపయోగంగా ఉంచడంపై సీఎం నితీశ్కుమార్కు మాజీమంత్రి విక్రమ్ కున్వార్ లేఖ రాయడంతో ఈ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బీహార్ మీడియా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దుమ్మెత్తిపోస్తు కథనాలు రాశాయి. ప్రతిపక్షాలు గోలగోల చేయడంతో సివాన్ జిల్లా కలెక్టర్ అమిత్ పాండే విచారణకు ఆదేశించారు. -
కరోనా మృతదేహం, కనికరం లేకుండా బయటకు పడేశారు
సాక్షి, భువనేశ్వర్(జయపురం): కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ సిబ్బంది బయట పడేసిన సంఘటన స్థానిక పట్టణ సమీపంలోని డొంగాగుడ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ మృతదేహాన్ని చూసి, స్థానికులు భయపడుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం పీపీఈ కిట్లతో మృతదేహాన్ని డెప్పిగుడ సమీపంలోని చంపాకుపిలి శ్మశానవాటికకు తరలించి, దహనపరిచారు. డొంగాగుడ దగ్గరి కెనాల్ వద్ద బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులు అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని సిబ్బంది పారవేస్తుండగా చూసినట్లు సమాచారం. చదవండి: గొప్ప మనసు; పెళ్లి మండపం నుంచి రక్తదాన శిబిరానికి.. -
అడిగినంత ఇవ్వకపోతే మధ్యలోనే మృతదేహాల్ని వదిలేస్తున్నారు!
బెంగళూరు: అంబులెన్స్ డ్రైవర్లు. రోగులను సమయానికి ఆస్పత్రులకు తరలించడం వారి విధి. అంతేకాదు తప్పనిసరి పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాల్ని కాపాడతారనే మంచి పేరుంది. కానీ ఈ కరోనా కష్టకాలంలో పలువురు అంబులెన్స్ డ్రైవర్లు సంపాదనే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదనే కారణంతో కరోనా పేషెంట్లను, వారి డెడ్ బాడీలను మార్గం మద్యలో వదిలేసి పారిపోతున్నారు. బెంగళూరులోని తుమకూరుకు చెందిన శరత్(26) అంబులెన్స్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కరోనా విలయ తాండవాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కరోనా పేషెంట్లను, డెడ్ బాడీలను స్మశాన వాటికి తరలిస్తుండే వాడు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ డ్రైవర్ శరత్ కరోనాతో మరణించిన బాధితుడి డెడ్ బాడీని హెబ్బాల్ సమీపంలోని ఓ ఫుట్ పాత్పై వదిలేసి పారిపోయాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అమృత హళ్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో శరత్ కరోనా బాధితులను, డెడ్ బాడీలను ఇలాగే గతంలో మార్గం మద్యలోనే వదిలేసినట్లు తేలింది. ఇక హెబ్బాల్ సమీపంలో కరోనాతో మరణించిన బాధితుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించేందుకు అతని కుటుంబ సభ్యులతో రూ.3వేలకు మాట్లాడుకున్నాడు. కానీ హెబ్బాల్ సమీపంలోకి రాగానే శరత్కు దుర్బుద్ధి పుట్టింది. బాధితుల రోధనల్ని క్యాష్ చేసుకునేందుకు కుట్రకు పాల్పడ్డాడు. డెడ్ బాడీని తరలించాలంటే రూ.3వేలు కాదు ఇంకో 18వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.దీంతో ఆందోళనకు గురైన మృతుడి భార్య తాను అంత ఇవ్వలేనని, ముందుగా మాట్లాడుకున్నంత ఇస్తానని వేడుకుంది. అయినా సరే డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. పాపం చివరికి అడిగినంత డబ్బులు ఇవ్వులేదని కారణం చూపుతూ మృతుడి డెడ్ బాడీని పుట్ పాత్ పై వదిలేసి పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
విషాదం: డ్రైవింగ్ సీట్లో తండ్రి.. పక్క సీట్లో కూతురికి పాడే
జైపూర్: కరోనా విలయంలో ఎన్నో ఘోరాలు.. మరెన్నో దారుణాలు.. చోటు చేసుకుంటున్నాయి. పేగుబంధం కోసం మోయలేని కష్టాన్ని పంటి బిగివున భరిస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాంటి సందర్భమే ఎదురైంది రాజస్థాన్లో ఓ తండ్రికి. అడినంత ఇచ్చుకోలేక రాజస్థాన్లో జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆ గ్రామానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటాలో ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. దాదాపు నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన ఆ యువతి చివరకు కన్నుమూసింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తండ్రి అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదిస్తే రూ. 35,000 ఇస్తే తప్ప రామన్నారు. పాడేగా మారిన పక్క సీటు అంబులెన్సు డ్రైవర్లు అడిగినంత డబ్బు ఇచ్చుకోలేని ఆ తండ్రి, తన కారులోనే కూతురి మృతదేహాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాడు. డ్రైవర్సీటు పక్క సీటునే పాడేగా మార్చాడు. కూతురు శవాన్ని ఆ సీట్లో కూర్చోబెట్టి, సీట్బెల్టుతో మృతదేహన్ని కదలకుండా గట్టిగా కట్టాడు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఒక్కడే ఈ పనంతా చేశాడు. ఆ తర్వాత 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. విచారణకు ఆదేశం ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఒక్క రాజస్థాన్లోనే కాదు చాలా చోట్ల ప్రభుత్వ నిబంధనలు అమలు కాకపోవడంతో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు.