నీకో పెగ్గు.. నాకో పెగ్గు..! అంబులెన్స్‌ ఆపి పేషెంట్‌తో డ్రైవర్‌ లిక్కర్‌ పార్టీ | Ambulance Driver Consuming Alcohol Sharing Peg With Patient Odisha | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కోసం రోడ్డుపై అంబులెన్స్‌ ఆపేసి.. పేషెంట్‌కూ ఓ ‘పెగ్గు’ పోసిన డ్రైవర్‌

Published Tue, Dec 20 2022 9:30 PM | Last Updated on Tue, Dec 20 2022 9:33 PM

Ambulance Driver Consuming Alcohol Sharing Peg With Patient Odisha - Sakshi

భువనేశ్వర్‌: ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అంబులెన్స్. వెంటనే ఫోన్‌ కొట్టి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. రోడ్డుపై అంబులెన్స్‌ వస్తున్నప్పుడు అంతా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు.  కానీ ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. లిక్కర్ కోసం వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు నిలిపేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అంతే కాదండోయ్‌..! అంబులెన్స్‌లోని రోగికి సైతం ఓ పెగ్గు అందించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఒడిశా జగత్సింగ్‌పూర్‌ జిల్లాలోని తిర్తోల్‌ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్‌..  లిక్కర్‌ బాటిల్‌ తీసి గ్లాసులో పోసుకొని తాగటం ప్రారంభించాడు. వాహనంలోని పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దానిని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు. దీనిని చూసిన వాహనదారులు.. అంబులెన్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. బాధితుడే మద్యం అడిగారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement