Liquor
-
కొత్తగా 37 మద్యం బ్రాండ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లిక్కర్ మార్కెట్లోకి అతిత్వరలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 37 మద్యం బ్రాండ్లు ఇందుకోసం ముందుకొచ్చాయి. మద్యం సరఫరా కోసం గతనెల 23న బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త సరఫరాదారుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తయారయ్యే మద్యం బ్రాండ్లలో 95 శాతం కార్పొరేషన్తో రిజిస్టర్ అయిన నేపథ్యంలో 10లోపు బ్రాండ్లు ముందుకొస్తాయని ఎక్సైజ్ వర్గాలు భావించాయి.అయితే ఊహించని స్పందన లభించింది. గడువు ముగిసే సమయానికి ఏకంగా 37 బ్రాండ్లు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 15 విదేశీ మద్యం బ్రాండ్లు కాగా, మరో 15 దేశీయ మద్యం, ఏడు దరఖాస్తులు బీర్ల సరఫరాకు వచ్చినట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ లేకుండానే కొత్త బ్రాండ్ల సరఫరా కోసం అనుమతినిచ్చారంటూ వివాదాస్పద జాబితాలోకెక్కిన సోం డిస్టలరీస్ కూడా ఈ జాబితాలో ఉందని, బీర్తోపాటు లిక్కర్ సరఫరా కోసం ఈ సంస్థ దరఖాస్తు పెట్టిందని సమాచారం. ఆచితూచి.. అన్నీ సరిచూసి.. వచ్చిన దరఖాస్తులను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే మద్యం సరఫరాకు అంగీకార ఒప్పందం కుదుర్చుకుంటామని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా సంస్థల ట్రాక్ రికార్డును పరిశీలించడంతోపాటు ఎంత ధరకు కోట్ చేసింది? ఆ బ్రాండు మద్యానికి ఇతర రాష్ట్రాలు ఎంత చెల్లిస్తున్నాయి? ఏ కేటగిరీలో ఆ బ్రాండు ఉంది? ఆ కేటగిరీకి మన రాష్ట్రంలో చెల్లిస్తున్న ధర ఎంత? ఒకవేళ సంస్థ కోట్ చేసిన ధరకు, ప్రభుత్వ ధరకు తేడా ఉంటే ఏం చేయాలి? ధరల నిర్ధారణ కమిటీకి ప్రతిపాదించాలా లేదా? అనే అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు.ఆ ధర పెంచితే.. మద్యం ధర పెంపు?కొత్త బ్రాండ్ల సరఫరాకు ఒప్పందాలు చేసుకునే సమయంలోనే మద్యం బేసిక్ ధరలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ∙ ఇప్పటికే బీర్ల బేసిక్ ధరను పెంచిన విషయం తెలిసిందే. అయితే లిక్కర్ బేసిక్ ధరలను మాత్రం సవరించలేదు. ప్రస్తుతం లిక్కర్ కేస్ బేసిక్ ధర ఐదు స్లాబుల్లో (రూ.565, 700, 1000, 2000, 2000 కంటే ఎక్కువ చొప్పున) ఉంది. ఈ బేసిక్ ధరను కూడా కేస్కు రూ.85 చొప్పున పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ∙ బీర్ల బేసిక్ ధర పెంచే సమయంలో బహిరంగ మార్కెట్లో బీర్ల ధరలను కూడా ఎక్సైజ్ శాఖ సవరించింది. అదే క్రమంలో లిక్కర్ బేసిక్ ధరలను పెంచాల్సి వస్తే మద్యం ధరలు కూడా పెరగొచ్చు. అయితే, లిక్కర్ ధరలు పెంచాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలను బట్టి ఉండొచ్చు. ప్రస్తుత బడ్జెట్లో ఎౖMð్సజ్ శాఖ ద్వారా రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేయగా, వచ్చే బడ్జెట్లో రూ.30 వేల కోట్ల వరకు వెళితే మాత్రం లిక్కర్ ధరలు పెంచక తప్పదనే అభిప్రాయం ఎౖMð్సజ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.Many Tamil Nadu BJP leaders have been arrested by Tamil Nadu Police for organizing a protest against TASMAC scam worth 1000 cr by DMK gang.This is the same scam they want to cover up by diverting attention to the language issue.This is what real dictatorship looks like!! pic.twitter.com/L14GjJE54f— Mr Sinha (@MrSinha_) March 17, 2025రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.Unlawful arrest by Dictator CM @mkstalin! You looted Tamil Nadu, and now you want to silence BJP. We will not back down!We have been arrested along with Sr Leader Thiru @PonnaarrBJP anna.DMK Liquor Scam 😡 1000 Crores Corruption. @annamalai_k @blsanthosh pic.twitter.com/INhAFM5Vsh— Amar Prasad Reddy (@amarprasadreddy) March 17, 2025ఇది కూడా చదవండి: పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం -
ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల నష్టం.. ఢిల్లీ మద్యం పాలసీపై కాగ్ రిపోర్ట్
ఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.2002 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తాజా కాగ్ నివేదికతో కోర్టు విచారణ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.కాగా, నవంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు నూతన మద్యం విధానం కొనసాగింది. కుంభకోణం వెలుగు చూడడంతో నూతన మద్యం విధానం రద్దయ్యింది. ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ , మనీష్ సిసోడియా, కవిత సహా పలువురు కీలక నేతలు జైలు శిక్షను అనుభవించారు. -
మద్యంలో మరిన్ని బ్రాండ్లు
సాక్షి, హైదరాబాద్: విదేశాలతో పాటు దేశీయంగా తయారయ్యే కొత్త మద్యం బ్రాండ్ల(New liquor brands)ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వనిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ (టీజీబీసీఎల్)కు కొత్త బ్రాండ్లను సరఫరా చేసేందుకు కంపెనీలను ఆహ్వనిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో మద్యం (బీర్, లిక్కర్) సరఫరా చేస్తున్న కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 15వ తేదీ వరకు గడువు ఉంది. విదేశాల్లో, దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్లను సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇప్పటికే టీజీబీసీఎల్కు మద్యాన్నిసరఫరా చేస్తున్న కంపెనీలు ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొత్త కంపెనీలు మాత్రం దరఖాస్తుతో పాటు ఇతర రాష్ట్రాల్లో లేదంటే మరే ప్రాంతంలోనైనా మద్యాన్ని సరఫరా చేసే క్రమంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా జరుపుతున్నట్టు నిర్ధారించే పత్రాలను జత చేయాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో కొత్త బ్రాండ్ల సరఫరా కోసం వచ్చే దరఖాస్తులను పది రోజుల పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, ఈ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను విచారించిన అనంతరం టీజీబీసీఎల్కు మద్యం సరఫరా చేసే అనుమతి ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. కొత్త బ్రాండ్లకు అనుమతినివ్వాలని సీఎం రేవంత్ సమక్షంలో ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో.. గతంలో మద్యం సరఫరాకు అనుమతులిచ్చి ఆరోపణల నేపథ్యంలో వెనక్కు తీసుకున్న డిస్టలరీలు కూడా ఈసారి కొత్త బ్రాండ్ల పేరుతో మళ్లీ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం లభించింది. -
దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు
-
ఆంధ్రప్రదేశ్లో ‘మద్యం మార్జిన్’ మాటున మహా దోపిడీ. ఇక మద్యం ధరలు భారీగా పెంపు. 3 కేటగిరీల మీద 10-20 శాతం ధరల పెంచుతూ ఉత్తర్వులు
-
మందు బాబులకు చంద్రబాబు షాక్
విజయవాడ: ఎన్నికలకు ముందు మద్యం ధరలు(Liquor Prices) తగ్గిస్తానంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ప్రభుత్వం ఏర్పాడ్డాక షాక్లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా భారీగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్వార్టర్ కు రూ. 20 వరకు ధర పెంచాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లుపైనా మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. కాస్ట్ లీ బ్రాండ్లపైనా ధరలు పెంచాలని నిర్ణయించింది.మద్యం షాపులకి మార్జిన్ పెంచి మందు బాబులకు నెత్తిన పెంపు పిడుగు పడేసింది. దీనిపై మందుబాబులను చంద్రబాబు ప్రభుత్వం మోసంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మద్యం ధరల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్
హైదరాబాద్: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్లో ఫుట్పాత్పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి (Serilingampally) సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100 (Dial 100), గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు.చదవండి: ఆ అవయవాన్ని పునః సృష్టించారు..! -
కుట్ర బెడిసికొట్టింది
-
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్పై చినబాబు ఆగ్రహం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్బాబును సిట్ చీఫ్గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
అబద్ధపు వాంగ్మూలాలకు ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్కు అప్పగించినట్టు సమాచారం.నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్లను తీవ్రంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం. నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం. -
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో అపచారం
-
తెలంగాణలో సంక్రాంతి తర్వాత మద్యం ధరలు పెంచనున్న ప్రభుత్వం
-
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్కు బీర్ల సప్లై నిలిపివేత
-
మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్ డాన్స్లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్కిస్లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్ మీడియాల్ యమ ట్రెండింగ్గా మారింది. -
తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం..!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలను అక్రమ కేసులతో వేధించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది! అందుకోసం సీఐడీ విభాగాన్ని టీడీపీ అనుబంధ సంస్థగా మార్చే పన్నాగానికి పదును పెట్టింది! వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నుతోంది.ప్రభుత్వ ‘ముఖ్య’ నేత ఆదేశాలతో స్వయంగా సీఐడీ ఉన్నతాధికారి తన వృత్తి ధర్మానికి విరుద్ధంగా అధికారిక దాదాగిరీకి తెగబడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ క్రమంలో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు తార్కాణం.సాయిరెడ్డి, మిథున్రెడ్డి పేర్లు చెబుతావా... లేదా?రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టిన మొదటి అక్రమ కేసు మద్యం కేసే! జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా... వైఎస్సార్సీపీ హయాంలో బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం అక్రమాలకు పాల్పడ్డారంటూ జూన్ 24న సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు.అయితే ఆయనపై మరిన్ని అక్రమ కేసులు పెట్టేందుకు సీఐడీ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో సీఐడీ ఉన్నతాధికారి ఒకరు వాసుదేవరెడ్డికి ఫోన్ చేశారు. తన కింది స్థాయి అధికారి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ చేసి బెదిరింపులకు దిగారు. ‘మీకు ఓ కేసులో బెయిల్ వస్తే... మరో కేసు బనాయించి మరీ అరెస్ట్ చేస్తాం...! మీ సంగతి తేలుస్తాం..!’ అని బెదిరించారు. అనంతరం అసలు విషయాన్ని చెప్పేశారు! ‘మీరు ఈ కేసులో అప్రూవర్గా మారిపోవాలి.మద్యం వ్యవహారం అంతా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి చేశారని వాంగ్మూలం ఇవ్వాలి. వాళ్లిద్దరూ చెప్పినట్టే చేశానని 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలంలో పేర్కొనాలి..’ అని ఆదేశించారు. అలా కాదంటే లెక్కలేనన్ని కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తామన్నారు. వాస్తవాలతో పని లేదు.. చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాలి!సీఐడీ ఉన్నతాధికారి వేధింపులతో వాసుదేవరెడ్డి ఓ వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు. అయితే పారదర్శకంగా వాస్తవ విషయాలను ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను అందులో ప్రస్తావించ లేదు. దాంతో సీఐడీ ఉన్నతాధికారి తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కారు. ‘వాస్తవాలు ఎవరు అడిగారు...? నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డే అంతా చేశారు...! వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వాలి.అది వాస్తవమా... అవాస్తవమా అన్నది నాకు అనవసరం. నేను చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలి. లేకపోతే మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతాం’ అని బెదిరించారు. అంతేకాదు... వాసుదేవరెడ్డి సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘నేను చెప్పినట్టు తప్పుడు వాంగ్మూలం ఇస్తే... ఆమె చికిత్స వ్యవహారాలను ప్రశాంతంగా పర్యవేక్షించుకోవచ్చు. లేకపోతే ఇబ్బందులు పడతావ్’ అని బెదిరించడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.డీజీపీ పోస్టు ఎర.. అందుకే అంత బరితెగింపా...!వైఎస్సార్సీపీ ఎంపీలను అక్రమ కేసులతో వేధించేందుకు ‘ముఖ్య’ నేత బరితెగించి వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్టుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ఎర వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డీజీ స్థాయి అధికారులు తదుపరి డీజీపీ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. అయితే అంతకంటే ఒక మెట్టు తక్కువ స్థాయిలో ఉన్న సీఐడీ ఉన్నతాధికారికి డీజీపీ పోస్టు ఆశ చూపించడం గమనార్హం.ప్రస్తుత డీజీపీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఆ పోస్టును ఆశిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా కూడా వచ్చే ఏడాది ఆగస్టులో రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తను చెప్పినట్టుగా ఆ ఇద్దరు విపక్ష ఎంపీలను అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఆ ఉన్నతాధికారి బరితెగించి అక్రమాలు, వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
YSRCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు
-
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
భారీగా నగదు, బంగారం, మద్యం పట్టివేత
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ డబ్బు రవాణాపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అందులో భాగంగా అక్టోబరు 20వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ముంబై, ఉప నగరాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సంయుక్తంగా తనిఖీలు, నాకా బందీలు నిర్వహించారు. ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న భారీ నగదు, విదేశీ డాలర్లు, బంగారు, వెండి ఆభరణాలు, మద్యం పట్టుకున్నారు. అయితే ఈ సొత్తు ఎవరిది..? ఎవరికి అందజేయడానికి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. రూ.187 కోట్ల విలువైన నగదు స్వాధీనం ఎన్నికలు సమీపించడంతో వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా కావడం పరిపాటిగా మారింది. నాకాబందీలు, తనిఖీలు నిర్వహించినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా డబ్బు, మద్యం రవాణా అవుతూనే ఉంది. అయినప్పటికీ పోలీసులు, వివిధ శాఖల అధికారులు డేగ కళ్లతో కాపుకాస్తూ కోట్లలో అక్రమ డబ్బు, డ్రగ్స్, మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచి్చన తరువాత వివిధ శాఖల పోలీసులు, అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఏకంగా రూ.187.88 కోట్లు విలువచేసే సొత్తు హస్తగతం చేసుకున్నారు. ఇందులో రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా రూ.75 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.60 కోట్లు, ఆదాయ పన్ను శాఖ ద్వారా రూ.11 కోట్లు, మిగతా ఎన్నికల అధికారుల ద్వారా పట్టుకున్న సొత్తు ఉంది. అలాగే అక్రమంగా మద్యం తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై 2,637 కేసులు నమోదు చేశారు. అందుకు బాధ్యులైన 2,460 నిందితులపై చర్యలు తీసుకున్నారు.అలాగే రూ.9.61 కోట్లు విలువచేసే మద్యం నిల్వలను జప్తు చేశారు. జప్తు చేసిన మద్యంలో విదేశీ, దేశీ, నాటుసారా, తెల్లకల్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు తాము ప్రయతిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అప్పర్ కమిషనర్ ప్రసాద్ సుర్వే అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా మద్యం వినియోగించే అవకాశాలుంటాయి. దీంతో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు దాడులు, తనఖీలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రహస్య పార్టీలపై నిఘా.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పరితపిస్తున్నారు. అందుకు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. కార్యకర్తలు సహా ఓటర్లను సంతోష పెట్టేందుకు రహస్యంగా మద్యం పారీ్టలు ఇస్తున్నారు. అంతేగాకుండా ఇంటింటికి వెళ్లి మద్యం బాటిళ్లు, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతుంటారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఇలాంటి రహస్య పారీ్టలపై నిఘా వేస్తున్నారు. అందుకు 56 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 164 మంది కార్యకర్తలను అదపపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాకు చెక్ పేట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 25 పరి్మనెంట్ చెక్ పోస్టులు, 26 తాత్కాలిక చెక్ పోçస్టులను ఏర్పాటు చేశారు. టోల్ నాకాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అహిల్యనగర్–పుణే జాతీయ రహదారిపై పార్నెర్ తాలూకా హద్దులో ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలో ఓ వాహనంలో సుమారు రూ.25 కోట్లు విలువచేసే బంగారం పట్టుకున్నారు. అయితే కార్టన్ బాక్స్లో ప్యాకింగ్ చేసిన ఈ బంగారం ఎవరిచ్చారు..? ఎవరికిచ్చేందుకు తీసుకెళుతున్నారనే వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. వాహనంలో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులున్నారు. అనుమానం వచ్చి వాహనాన్ని మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయగా 45 కేజీల వెండి కడ్డీలు లభించాయి. దర్యాప్తు పూర్తయితే తప్ప పూర్తి వివరాలు బయటపడవని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో 160 చెరుకు క్రషింగ్ ఫ్యాక్టరీలు, 36 దేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు, 45 బీరు తయారుచేసే ఫ్యాక్టరీలు, 65 వైనరీ, 48 విదేశీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు అలాగే 216 నాటుసారా విక్రయించే షాపులు, 262 విదేశీ మద్యం విక్రయించే షాపులు, 1,734 వైన్ షాపులు, 4,155 దేశీ మద్యం విక్రయించే షాపులున్నాయి. దీంతో ఓటింగ్, కౌంటింగ్ తంతు పూర్తయ్యేంత వరకు హోల్సెల్, రిటైల్ మద్యం షాపులపై సీసీ టీవీ కెమరాల ద్వారా నిఘా వేయనున్నారు. ప్రభుత్వ వాహనాలనూ వదిలిపెట్టొద్దు.. ఎన్నికలకు ముందు విచ్చల విడిగా అక్రమంగా డబ్బు రవాణా జరుగుతుంది. అందుకు సొంత, అద్దె వాహనాలతోపాటు పోలీసు వ్యాన్లను కూడా వినియోగించే ప్రమాదం లేకపోలేదు. అధికార దురి్వనియోగానికి పాల్పడుతూ కొందరు నేతలు పోలీసు జీపులు, వ్యాన్లలో డబ్బు రవాణా చేసే ఆస్కారముంది. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో, నగరాలు, పట్టణాల్లో నాకాబందీలు, తనిఖీలు చేసే సమయంలో పోలీసు వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయకుండా వదిలిపెట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
చంద్రబాబు క్వాలిటీ మద్యమా మజాకా! చూస్తే షాకే!
-
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ రాష్ట్రాలదే: సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇండస్ట్రీయల్ ఆల్కహార్ తయారీ, అమ్మకాలను నియంత్రించే చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుందని సుప్రీంకోర్టు బుధవరం తీర్పునిచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తొలగించలేనని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోని ఎనిమిది మంది సభ్యులు ఈ పిటిషన్కు మద్దతు తెలపగా.. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం విభేదించారు. పారిశ్రామిక మద్యంపై శాసనాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండాలని ఆమె వాదించారు. దీంతో 8:1 మెజార్టీతో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది.అయితే యూపీ స్టేట్ వర్సెస్ సింథటిక్స్ అండ్ కెమికల్స్ కేసులో పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తూ 1990లో ఇచ్చిన ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీం రద్దు చేసింది. సీజేఐ చంద్రచూడ్, మెజారిటీ అభిప్రాయాన్ని అందజేస్తూ.. ‘డినేచర్డ్ స్పిరిట్స్' అని పిలవబడే 'పారిశ్రామిక మద్యం'పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, ఈ అధికారాలను రాష్ట్రాల నుండి తొలగించలేమని స్పష్టం చేశారు. వారి అధికార పరిధిలో పారిశ్రామిక మద్యం ఉత్పత్తి, సరఫరాను నియంత్రించడానికి వీలుందని ఆయన పేర్కొన్నారు. -
ఇది మాఫియా సామ్రాజ్యం
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలోదోచుకో పంచుకో తినుకో విధానంలో రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఎక్కడా మచ్చుకైనా డీబీటీ కానరావడం లేదని... కన్పిస్తుందల్లా డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా ఇన్ని నెలలపాటు ఓట్ ఆన్ అకౌంట్పై నడుస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ మరెక్కడా ఉండదన్నారు. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెర లేపారని చెప్పారు. అప్పుడైనా.. ఇప్పుడైనా అవే డిస్టిలరీస్, లిక్కర్లో అవే స్పెసిఫికేషన్స్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే 14 కంపెనీలకు చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, తాము అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలో దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో మాఫియా పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలు.. ప్రభుత్వ అవినీతిపై ఎవరూ నిలదీయకుండా.. ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే లక్ష్యంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్పై పెట్టిన కేసే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..» చంద్రబాబు మోడస్ ఆపరండా (ఓ పద్ధతి ప్రకారం అనుసరించే వ్యూహం) గమనిస్తే ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటాలాడుతూ అబద్ధాలు చెబుతారు. వాళ్లకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తారు. » ఆయన ఏ స్థాయిలో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారంటే.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం అని మోసగించడంతో అది మొదలవుతుంది. మీకు రూ.పది వేలు రావాలంటే మా ప్రభుత్వం రావాలి.. మా ప్రభుత్వం రావాలంటే మేం చెప్పిన అబద్ధపు హామీలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి అని వలంటీర్లకు చెబుతారు.» ఏ ఇంటికి వెళ్లినా సరే చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు! సంతోషమా..? అని అడుగుతారు. వాళ్ల అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు.. సంతోషమా? అంటారు. చిన్నమ్మలు తారసపడితే నీకు రూ.18 వేలు.. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు... ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు రూ.36 వేలు... కండువా వేసుకొని రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అని అడుగుతారు. ఎవరినైనా సరే ఇదే మాదిరిగా మాటలు చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడమే మోడస్ ఆపరండాగా మార్చుకున్నారు.» తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం క్లిçష్ట పరిస్థితుల్లో ఉంది. చేయాలన్నా నేను చేయలేకపోతున్నా..! అంటూ కొత్త మోడస్ ఆపరండా తెరపైకి తెస్తారు. అంతటితో ఆగిపోతుందా.. అంటే ఆగిపోదు. ఎన్నికల హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తారేమో? ఎవరైనా నిలదీస్తారేమో? అనే భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయాలని ఆరాట పడుతున్నారు. వీటికి తోడు మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో స్కామ్లకు తెర తీస్తున్నారు. వీళ్ల మోడస్ ఆపరండా ఏమిటో ఈ ఐదు నెలలుగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా పాలనే నిదర్శనం. -
బెడిసికొట్టిన టీడీపీ ఫేక్ ట్రిక్ చంద్రబాబును అరెస్ట్ చేసి విచారించాలి
-
రాబందుల రాజ్యంలో అరాచకాలపై బాబును చీల్చి చెండాడిన జగన్
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం
-
అధికారంలోకి వచ్చాక బాబు మార్క్ అరాచకం
-
ఈడీ అరెస్ట్ నుండి బాబు పీఏ శ్రీనివాస్ తప్పించుకోలేరు..
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం..
-
సొంత ఆదాయం పెంచుకుని.. ప్రభుత్వం ఆదాయం తగ్గిస్తున్నాడు
-
99 రూపాయలకే క్వార్టర్ పై వైఎస్ జగన్ సెటైర్లు
-
బాబుకు వణుకు పుట్టింది.
-
రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందబ్బా.. చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్
-
జగన్ నోటా చంద్రబాబు మాటలు ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
మద్యంపై కూటమి సర్కారు పన్నుల మోత
-
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
AP: మందుబాబులకు ప్రభుత్వం షాక్ !
సాక్షి,విజయవాడ: మందుబాబులకు ఏపీ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్ విధిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం(అక్టోబర్ 15) ఉత్తర్వులిచ్చింది.ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా అన్ని రకాల మద్యంపై రౌండప్ చార్జీల పేరుతో బాదిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు నిర్ణయించింది. ఈ బాదుడును తక్షణమే అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. కాగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్షాపులను ప్రైవేటు రిటైలర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వారి నుంచి షాపులకు దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ పద్ధతిన షాపులు కేటాయించింది.ఈ విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో ఓ పక్క మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల నుంచి అటు ప్రభుత్వం ఇటు పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకోనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.ఇదీ చదవండి: తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు -
అధికారులు జాగ్రత్త .. జమిలి ఎన్నికలు వస్తాయ్ ..
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
అన్ని దుకాణాలు మావే!
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
కూటమి నేతల బెదిరింపులు
-
టెండర్ గెలిస్తే.. కమీషన్ లేదా కరెన్సీ టీడీపీ బెదిరింపులు
-
కూటమి నేతల బెదిరింపులు
-
కిడ్నపులు, బెదిరింపులతో టీడీపీ నేతలు మద్యం షాపుల దందా
-
టీడీపీ లిక్కర్ మాఫియా దెబ్బకు ప్రభుత్వానికి 2000 కోట్లు నష్టం
-
నేను డబ్బులిస్తా..టెండర్లు వెయ్యండి ప్రజలకు ఫుల్లుగా తాగించండి
-
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి,అమరావతి: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే టీడీపీ నేతలు,లిక్కర్ సిండికేట్ల కోసం ప్రభుత్వం గడువు పెంచినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు అవుతున్నాయి. వాటాలు ఇస్తునే మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని లేదంటే అంతు చూస్తామంటూ సిండికేట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వ్యాపారులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే సాహసం చేయడం లేదు.రాష్ట్రంలో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారు లేకపోవడం, అవి ఖాళీ ఉన్నాయి. ఈ తరుణంలో ఖజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. -
లిక్కర్ సిండికేట్కి ఏపీ ప్రభుత్వం దాసోహం
సాక్షి,అమరావతి : లిక్కర్ సిండేకేట్కి ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10 శాతం ఉన్న రిటైలర్ మార్జిన్ను.. తాజాగా 20 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20 శాతం రిటైల్ మార్జిన్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా.. సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది . -
మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు
పట్నా: గత కొంతకాలంగా బీహార్లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ), సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి, దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి -
అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చేనా..?
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు మంగళవారం (సెప్టెంబర్10) విచారించనుంది. బెయిల్ పిటిషన్తో పాటు అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.సుప్రీం కోర్టు విచారణలో భాగంగా కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించనున్నారు. ఇది చదవండి: బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం -
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖరీదైన 415 మద్యం బాటిళ్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ : గోవా నుంచి అక్రమంగా తీసుకొస్తున్న ఖరీదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను ఎక్సైజ్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గోవా నుంచి మూడు విమానాల్లో మద్యం వస్తుందనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ వీబీ.కమలాసన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అదేశాలతో ఏఈఎస్ జీవన్కిరణ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్టీఎఫ్ సీఐలు సుబాష్ చందర్రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ప్రవీణ్, శంషాబాద్ ఎక్సైజ్ సీఐ దేవేందర్రావుతోపాటు ఎస్సైలు, సిబ్బంది కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ అధికారుల సహకారంతో మద్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 12 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, సరూర్నగర్ ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీలు గోవాలోని ఓ సదస్సుకు వెళ్లారు. వీరంతా తిరుగు ప్రయాణంలో మద్యం తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చిన నేరం కింద ఎక్సైజ్ ఈఏఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో శంషాబాద్ సీఐ దేవేందర్రావు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ‘చంఢీగడ్’మద్యం సీజ్చండీగఢ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా చేరిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ సీఐ రామకృష్ణ ఆర్టీసీ క్రాస్రోడ్డు మెట్రోసేషన్ సమీపంలో రూ.3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
మద్యం పాలసీ కేసు: విజయ్ నాయర్కు బెయిల్
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్కు ఊరట దక్కింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్గా ఉన్న విజయ్ నాయర్ మద్యం పాలసీ కేసులో 2022లో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై సోమవారం (సెప్టెంబర్2) విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో బెయిల్ పొందారు.ఏంటి ఈ మద్యం పాలసీ కేసు?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచి పెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా,కవితతో పాటు పలువురిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. -
Madhya Pradesh: తవ్వకాల్లో 35 కల్తీ మద్యం డ్రమ్ములు.. కంగుతిన్న పోలీసులు
మధ్యప్రదేశ్లోని శివపురిలో ఆశ్చర్యకర ఉదంతం చోటుచేసుకుంది. కరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో విషపూరిత మద్యాన్ని (ఓవర్ ప్రూఫ్ స్పిరిట్) స్వాధీనం చేసుకున్నారు.మద్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న కొందరు విషపూరితమైన మద్యాన్ని డ్రమ్ముల్లో దాచి ఉంచారు. పోలీసులు జేసీబీతో తవ్వకాలు జరపగా 35 కల్తీ మద్యం డ్రమ్ములు బయటపడ్డాయి. దీనిని చూసి పోలీసులు కంగుతిన్నారు. పోలీసులు రాకను గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ డ్రమ్ములకు పైపులైన్కు కనెక్షన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా కల్తీ మద్యాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఒక పథకం ప్రకారం ఈ స్థావరంపై దాడి చేశారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపి 35 కల్తీ మద్యం డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఆగస్ట్ 27 (మంగళవారం ) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఇదే ధర్మాసనం మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 15న సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఈ రెండు సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్పై రేపు విచారణకు రానుంది. -
మద్యానికి బానిసలై అమ్మలనే చంపేశారు
గండేడ్/ మహమ్మదాబాద్/త్రిపురారం: మద్యానికి బానిసలై కన్న తల్లులనే కడతేర్చారు ఆ కుమారులు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో ఒకరు, తనకు విడాకులిచ్చిన యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యులు ఆ వేడుకకు వెళ్లారన్న కక్షతో మరో వ్యక్తి మద్యం మత్తులో విచక్షణ మరచి.. జన్మనిచ్చి న అమ్మలనే చంపుకున్నారు. రాడ్డుతో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి.. మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం సల్కర్పేట్కు చెందిన వెంకటమ్మ(55), కోయిల్కొండ మండలం కొత్లాబాద్కు చెందిన టంకర రాములు పెళ్లయిన తర్వాత ముంబైకి వలస వెళ్లారు. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత రాములు మృతిచెందాడు. దీంతో ఆమె కుమారుడు కృష్ణయ్యతో కలసి అక్కడే ఉంటూ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించేది. రెండేళ్ల క్రితం అక్కడ ఇంటిని అమ్ముకుని పుట్టినిల్లయిన సల్కర్పేట్కు చేరుకుంది. అయితే ఆమె కుమారుడు కృష్ణయ్య మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బుల కోసం తల్లిని వేధించడంతోపాటు ఇల్లు అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టావని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో కృష్ణయ్య ఇనుపరాడ్డుతో వెంకటమ్మ తలపై కొట్టాడు. అంతటితో ఆగక కత్తి తీసుకొని గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి కొద్దిదూరంలో పడేశాడు. ఆదివారం తెల్లవారుజామున తన మేనమామ రాములుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని, ఎవరో చంపేశారని చెప్పా డు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించారు. డీఎ స్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహం పడేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరం వరకు గడ్డిపై రక్తం పడి ఉండడంతో, అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇల్లు కడిగి ఉండడంతో అనుమానం వచ్చి కృష్ణయ్యను గట్టిగా నిలదీయగా డబ్బుల కోసం తానే తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిని గొంతుకోసి చంపి, కొడుకు ఆత్మహత్య నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రావిరాల చినవీరయ్య, సాయమ్మ భార్యాభర్తలు. వీరికి శ్రీను, శివకుమార్ అనే కుమారులు, పద్మ అనే కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా, శివకుమార్కు అక్క పద్మ కుమార్తె మేఘనతో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన శివకుమార్ తరచూ భార్యతో గొడవ పడుతుండడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల వీరు విడాకులు తీసుకున్నారు. కాగా, మేఘనకు శనివారం హైదరాబాద్లో రెండో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి తండ్రి, అన్న హాజరుకావడంతో ఆగ్రహానికి గురైన శివకు మార్ రాత్రి బాగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడ్డాడు.తర్వాత తల్లి నిద్రిస్తుండగా.. కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం భయపడి శివకుమార్ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం చినవీరయ్య ఇంటికి తిరిగివచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉండటం గమనించాడు. వీరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్కు సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా. ఈడీ దాఖలు చేయలేదు. దీంతో.. శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. దీంతో.. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.Supreme Court posts the hearing for August 27 on the plea of BRS leader K Kavitha seeking bail in corruption and money laundering cases linked to the alleged Delhi excise policy scam. pic.twitter.com/0Klk3lvDJV— ANI (@ANI) August 20, 2024మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే సీబీఐ,ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు..ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను వాయిదా వేసింది. -
పుష్పను మించిపోయిన మందు స్మగ్లర్లు
-
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. వారి వాదనలు విన్న తర్వాతే తీర్పు!
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు. కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. Supreme Court issues notice to CBI and ED on BRS leader K Kavitha's plea seeking bail in the excise policy case. pic.twitter.com/GmKe5CjgCy— ANI (@ANI) August 12, 2024గతవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవితఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ (ఆగస్ట్12) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత శుక్రవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, హైకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసో డియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ను విచారించనుంది. కాగా, తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలను పరిగణలోకి తీసుకొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో ఉన్న ఏకైక మహిళ అని, తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించింది. ఆమె నాటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదే పిటిషన్పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్ను ఉప సంహరించుకున్నారు.అయితే పిటిషన్ విత్డ్రాలో కవిత బెయిల్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.కవితకు దెబ్బ మీద దెబ్బమరోవైపు మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కావాలని కోరుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తిరస్కరించింది. విచారణ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఆమె ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి సాక్ష్యాలు,సాక్ష్యుల్ని తారుమారు అయ్యే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని తెలిపాయి. ఈ అంశాలను పరిణగలోకి తీసుకున్న కోర్టు బెయిల్ను తిరస్కరించింది.చివరి అస్త్రంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్.. అంతలోనే ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. దీంతో న్యాయ బద్దంగా బెయిల్ పొందేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని జులై 6న కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్షీట్లో తప్పులు లేవని సీబీఐ తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్ షీట్ను జులై 22న పరిగణలోకి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జగింది. సుప్రీం కోర్టుకు కవితవిచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్ 9కి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా!
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. మరోవైపు ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ములాఖత్ కానున్నారు.ములాఖత్లో భాగంగా కవితను కలిసి ధైర్యం చెప్పనున్న బీఆర్ఎస్ నేతలు. Delhi Excise policy case | The Rouse Avenue court adjourned the hearing on the bail plea of BRS leader K Kavitha till August 7.Counsel sought time to argue. She has sought a default bail in CBI case linked to Delhi excise policy.— ANI (@ANI) August 5, 2024 -
పోలీసుల ముసుగులో దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారం వచ్చిందో లేదో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల ఆగడాలు మామూలుగా లేవు. అధికారం తమ గుప్పెట్లో ఉందనే ధైర్యం, తమ ప్రజాప్రతినిధుల అండదండలున్నాయనే బరితెగింపుతో ఆయా పార్టీల నేతలు చెలరేగిపోతూ దోపిడీలు, దౌర్జన్యాల కోసం నకిలీ పోలీసుల అవతారమెత్తుతున్నారు. నిజానికి.. రాష్ట్రంలో ప్రజలకు చెందాల్సిన ప్రతీపైసా నాటి సీఎం వైఎస్ జగన్ డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా బ్యాంకు ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసేవారు. అదే సందర్భంలో తాము అమలుచేస్తున్న డీబీటీని చంద్రబాబు అండ్ కో దోచుకో, పంచుకో, తినుకోగా మార్చేస్తుందని జగన్ పదేపదే హెచ్చరించేవారు. అప్పుడు ఆయనన్నట్లుగానే ఇప్పుడు కూటమి నేతలు ఆ మాటలను నిజంచేసి చూపిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిని మించి మరొకరు దందాలు చేస్తున్న తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రాపురం నియోజకవర్గం మసకపల్లి గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ ఏం జరిగిందంటే..చౌకగా కొని.. ‘చీప్’గా కల్తీచేసి..పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తక్కువ ధరకు లభించే వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లను కొందరు కూటమి నేతలు కొనుగోలు చేసి వాటి లేబుళ్లు, బాటిళ్లు మార్చి రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీచేసి విక్రయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నియంత్రణలో ఉన్న ఈ అక్రమ మద్యం దందా.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతోంది. ఈ క్రమంలో.. మంగళవారం రాత్రి పామర్రు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు అరిశెట్టి మణికంఠ (అయ్యప్ప) మరొకరు యానాం మద్యాన్ని పామర్రు తరలిస్తున్నారు. విషయం తెలుసుకుని మసకపల్లి, ద్రాక్షారామ ప్రాంతానికి చెందిన టీడీపీ, జనసేన నేతలు రవ్వా భూషణం, సలాది శ్రీనివాస్ పాణింగపల్లి వద్ద మాటేశారు. అక్కడకు దగ్గర్లోనే కారు పార్కు చేశారు. అందులో నకిలీ పోలీసులు ఇద్దరిని ఖాకీ డ్రెస్సుతో కూర్చోబెట్టారు. యానాం నుంచి లిక్కర్ బాటిళ్లతో వచ్చిన జనసేన ద్వితీయశ్రేణి నేతలను అడ్డగించి, కారులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు.. మీ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని తెదేపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. అందుకు వారు నిరాకరించడంతో ఇద్దరినీ కిడ్నాప్చేసి కారులో ఆ రాత్రి ద్రాక్షారామ తరలించారు. కనీసం రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే పోలీసులు మా వెంటే ఉన్నారని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో కేసులకు భయపడి జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రూ.25 వేలు చేతిలో పెట్టి మిగిలింది తరువాత చూస్తామని చెప్పడంతో వారిని విడిచిపెట్టారు. మణికంఠ అక్కడి నుంచి బయటపడి పామర్రు వచ్చేశాక వారిపై పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండ్రోజులుగా పరారీలో ఉన్న ఇద్దరు కూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పామర్రు ఎస్ఐ జానీబాషాను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సాయంత్రం ఓ పెగ్గు.. ఆపై పేకాట.. ఇవేం ముచ్చట్లు!
సాధారణంగా ఎవరైనా ప్రజా ప్రతినిధి ఏదైనా సమావేశంలో పాల్గొంటే.. నాలుగు మంచి మాటలు చెబుతారు. చెడు అలవాట్లకు వెళ్లవద్దని సూచిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణం నెలకొంది. అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే నిర్భీతిగా పేకాట క్లబ్ లను తెరపిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకుంటామని కూడా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్లలో గతంలో మాదిరి చదువులపై శ్రద్ద చూపడం లేదన్న విమర్శలు వస్తుంటే, మరో వైపు పేకాట క్లబ్లకు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇలాంటి క్లబ్ లను అనుమతించలేదు.దాంతో కొందరు బడాబాబులకు కోపం వచ్చేదట. కొన్ని చోట్ల ఆఫీసర్ల క్లబ్ లు కూడా పేకాటను అనుమతించకపోవడంపై గుర్రుగా ఉండేవట. అలాంటివారంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారని చెబుతారు. జగన్ ప్రభుత్వం ఓడిపోతోందన్న సమాచారం వస్తుండగానే.. గుంటూరు, విజయవాడ వంటి కొన్ని చోట్ల పేకాట క్లబ్ లు తెరచుకున్నాయని సమాచారం. మరి అనంతపురం వంటి చోట ఎందుకు ఆలస్యం అయిందో తెలియదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను క్లబ్ వారు పిలిచి సమావేశం పెట్టి కార్డ్స్ ను అనుమతించాలని కోరారు. దానికి ఆయన బదులు ఇస్తూ రాష్ట్రం అంతా క్లబ్ లు తెరిపిస్తానని హామీ ఇచ్చారట. అధికారులు, ఇతర వర్గాల రిలాక్సేషన్ కోసం క్లబ్ లు ఏర్పాటు అవుతుంటాయి. వాటిలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కుటుంబాలతో కలిసి వచ్చి ఆనందంతో పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది. కాని అవి రాను,రాను పేకాట క్లబ్ లు గా మారిపోయాయి. కొంతమంది వేల రూపాయల డబ్బును ఈ క్లబ్ లలో కోల్పోయి అప్పుల పాలవుతుంటారు. క్లబ్ ల నిర్వహణ ఒక వ్యాపారంగా మార్చివేశారు.కల్చరల్ క్లబ్ లు కాస్త జూదశాలలుగా మార్చివేయడంలో మాఫియాల పాత్ర ఉందని అంటారు. గతంలో హైదరాబాద్ లో కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు క్లబ్ లను నిర్వహించి పెద్ద ఎత్తున జూదాన్ని ప్రోత్సహించేవి. తత్ఫలితంగా కొందరు లక్షలు,కోట్ల రూపాయల మేర నష్టపోయిన ఘటనలు ఉండేవి.ఈ కారణంగా కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ క్లబ్ లను నిషేధించారు. కేవలం చట్టబద్దమైన క్లబ్ లను మాత్రమే అనుమతించారు. ఏపీలో కూడా అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉండగా, జగన్ ప్రభుత్వం అలాంటివాటిని అదుపు చేసింది. కాని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇలాంటి జూదగాళ్లకు ఉత్సాహం వచ్చింది. అనంతపురం క్లబ్ లో నాలుగేళ్లుగా జూదం బంద్ అయిందని, దీనిని ఆరంభించడానికి కలెక్టర్ తో మాట్లాడానని, రాష్ట్రవ్యాప్తంగా జూదక్లబ్ ల పునరుద్దరణకు ముఖ్యమంత్రి అనుమతి కోరతామని ఆ టీడీపీ ఎమ్మెల్యే నిస్సిగ్గుగా ప్రకటించారు. పైగా ఈ ఎమ్మెల్యే గారు ఇంకో సంగతి చెప్పారు. కరోనా టైమ్ లో క్లబ్ లో పేకాట లేనందువల్ల రిటైర్డ్ ఉద్యోగులు కొందరు మరణించారని అన్నారట. ఇదెక్కడి విడ్డూరం. ఆ రోజుల్లో అసలు ఎక్కడా జనం గుమికూడవద్దని ప్రభుత్వాలు ఆంక్షలు పెడితే, క్లబ్ లు నడవకపోవడం వల్ల మరణాలు సంభవించాయని చెప్పడం వింతగానే ఉంటుంది. పేద విద్యార్ధులకు అవసరమైన పుస్తకాలు, డ్రెస్ లు వంటివి సకాలంలో అందుతున్నాయా?లేదా?వారికి స్కూల్ టీచర్లు పాఠాలు సరిగా బోధిస్తున్నారా?లేదా?అన్నవి చూడవలసిన గౌరవ ఎమ్మెల్యే పేకాట క్లబ్ ల గురించి ఆసక్తి కనబరచడం విశేషం. దీనిని బట్టి ప్రజలు ఎలాంటివారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది, ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అర్ధం చేసుకోవచ్చు. మరో సంగతి కూడా చెప్పాలి. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం వారికి మద్యాన్ని కావల్సినంత సరఫరా చేస్తామని నిర్భీతిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం లో మద్యం బాబులకు హుషారైన కబుర్లు చెప్పేవారు. ‘‘ఏం తమ్ముళ్లూ.. సాయంత్రం అయితే ఒకటి,రెండు పెగ్గులు వేసుకుంటారు. ధరలు పెంచి జగన్ ప్రభుత్వం దానిని అందుబాటులో లేకుండా చేసిందా? లేదా?. మేం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే సరఫరా చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చారు. బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి హామీ ఇచ్చిన నేత ఇంకొకరు ఉండరు.ఈ విషయంలో చంద్రబాబు రికార్డు నెలకొల్పి ఉంటారు. మొత్తం మీద మందుబాబుల మద్దతు బాగానే కూడగట్టుకున్నారు. సుమారు పాతికలక్షల మంది మద్యం వినియోగదార్లు కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారన్నది ఒక అంచనా. జగన్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద అనేక వ్యాధులను చేర్చి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రాదాన్యత ఇస్తే, చంద్రబాబు ప్రభుత్వం మద్యం సరఫరాకు ప్రాముఖ్యత ఇస్తోంది. వైఎస్సార్సీపీ టైమ్ లో ఉన్న బ్రాండ్లకు తోడు, కొన్ని కొత్త బ్రాండ్లను అయితే అందుబాటులోకి తెచ్చారు.కాని ధరలు మాత్రం తగ్గించలేదని మందుబాబులు చెబుతున్నారు. తెలంగాణతో పోల్చితే మద్యం ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయట. అయినా మందుబాబులు వాటి గురించి ఫీల్ కావడం లేదేమో తెలియదు. గత ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహిస్తుంటే, తీవ్రమైన విమర్శలు గుప్పించిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు ,ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే షాపులను కొనసాగిస్తుండడం విశేషం. టీడీపీకి చెందిన పలువురు ఎప్పుడు ప్రభుత్వ షాపులు ఎత్తివేస్తారా? ఎప్పుడు తాము షాపులు నడుపుకోవచ్చా?అని ఎదురు చూస్తున్నారట. కాని దానివల్ల ఏ సమస్యలు వస్తాయని భయపడుతున్నారో కాని, ఇంకా ప్రైవేటు షాపులకు ఓకే చేయలేదు. స్కూళ్లను బాగు చేయవలసిన ప్రభుత్వం పేకాట క్లబ్ లను ప్రోత్సహిస్తే.. పేదల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం మద్యాన్ని అధికంగా అందుబాటులోకి తెవడానికి ఉత్సాహపడుతోంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారా?అని ఎవరికైనా సందేహం రావొచ్చు. ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను ప్రజలు వ్యతిరేకించేవరకు ఎవరు ఏమి అనుకున్నా ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మద్యం పేదల వ్యసనం
సాక్షి, అమరావతి: పేదలకు మద్యపానం ఓ వ్యసనమని, శారీరక శ్రమ చేసిన తర్వాత రెండు పెగ్గులు వేసుకునేవారికి గత ప్రభుత్వం మద్యం లభించకుండా చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మద్యాన్ని అధిక ధరలకు అమ్మడంతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం పెరిగిందన్నారు. తగ్గిన ఆదాయం నాటి నాయకుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. 2019–24 మద్యం అమ్మకాలపై సీఎం చంద్రబాబు బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. గత పాలకులు మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడంతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని ఆరోపించారు. 4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించి మళ్లీ ఏపీ టీడీసీ టూరిజం పేరుతో దుకాణాల సంఖ్యను 3,392కి పెంచారన్నారు. 2019లో ఉన్న 840 బార్లను అలాగే కొనసాగించారన్నారు. దీనివల్ల అక్రమ రవాణా పెరిగిందన్నారు. 2014–19లో ఏపీకి, తెలంగాణకు మద్యం ఆదాయంలో వ్యత్యాసం రూ.4,186.70 కోట్లు ఉంటే 2019–24లో ఏకంగా రూ. 42,762 కోట్లకు చేరడంతో 10 రెట్ల ఆదాయం ఏపీకి తగ్గిపోయిందన్నారు. మ ద్యం పాలసీలో వ్యత్యాసం వల్ల ఆదాయంలో తెలంగాణ ముందుందన్నారు. అన్ని వ్య యాలు పోనూ ఐదేళ్లలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.18,860 కోట్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు. ఇతర రాష్ట్రాలు లాభపడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు. పేదవాడు తాగే లిక్కర్ రేట్లు పెంచి 99.97 శాతం బ్రాండ్లు లేకుండా చేశారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో లిక్కర్ కేసుకు రూ.200, బీరు కేసుకు రూ.50 చొప్పున అక్రమంగా వసూలు చేశారని, 2019–24 మధ్య రూ. 3,113 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ధరలు తగ్గిస్తాం.. సీఐడీ, ఈడీతో దర్యాప్తు ఆబ్కారీ శాఖను ఒకే తాటిపైకి తెస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మద్యం ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీబీసీఐడీ, ఈడీతో దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. మానవీయ కోణంలో పనిచేయండిఅధికారులు రూల్స్ అనే కోణంలో పని చేయకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యారోక్రటిక్ కోణం కాకుండా మానవీయ కోణంతో పనిచేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎం సమావేశమయ్యారు. రూ. లక్ష కోట్ల వరకు బిల్లులు, బకాయిలు ఉన్నా యన్నారు. రాయలసీమలో ఇండ్రస్టియల్ కారిడార్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. రేపు ఢిల్లీకి బాబుచంద్రబాబు శుక్రవారం (రేపు) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సముచిత స్థానం ఇచ్చారని భావిస్తున్న ఆ యన అందుకు ప్రధాని ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వెళు తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, సీఎం చంద్రబాబుతో బుధవారం ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, అక్కడి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని చంద్రబాబు ఆయన్ని కోరారు. -
తీహార్ జైలులో కవితతో కేటీఆర్, హరీష్రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పాటు మాజీ మంత్రి హరీష్రావులు ములాఖత్ అయ్యారు. అరగంట పాటు సాగిన ములాఖత్లో ధైర్యంగా ఉండాలని.. కేసు విషయంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో తదుపరి కార్యచరణకు సిద్ధం కాగా.. అన్నీ అంశాలపై ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే విషయంపై హరీష్ రావు, కేటీఆర్.. కవితతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అంశంపై ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదలతో కేటీఆర్, హరీష్ రావులు చర్చించగా.. న్యాయవాదుల సలహా మేరకు సోమవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు హరీష్ రావు సూచించారు.మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక..ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. మద్యం పాలసీలో రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో..రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. -
మూడు రోజుల సీబీఐ కస్టడీకి సీఎం కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మూడు రోజులు మాత్రమే అనుమతిచ్చింది.అంతేకాదు సీబీఐ మూడు రోజుల కస్టడీ సమయంలో కేజ్రీవాల్ను కలుసుకునేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, అతని లాయర్కు ప్రతి రోజు 30 నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది.దీంతో పాటు కేజ్రీవాల్ సూచించిన మందులు, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని అందించేందుకు కూడా కోర్టు వారికి అనుమతించింది.కాగా, లిక్కర్ మద్యం పాలసీ కేసులో మంగళవారం తీహార్ జైల్లో కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరించింది. ఈ కేసులో మరింత దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకునేందుకు అనుమతి కావాలని కోర్టులో ధరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అనుమతించింది. ఈ మేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. పాలసీ కేసులో మరిన్ని వివరాల్ని రాబట్టేందుకు సీబీఐ అడిగిన ఐదురోజుల కస్టడీ కాకుండా మూడురోజులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మూడు రోజుల పాటు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. -
సీబీఐ అదుపులో కేజ్రీవాల్.. బీజేపీకి ఆప్ చురకలు!
సాక్షి,న్యూఢిల్లీ : రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో నడిచిన హైడ్రామా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం పాలసీ కేసులో తమ పార్టీ అధినేతకు (కేజ్రీవాల్) సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బయపడిపోతుందంటూ ఎక్స్ వేదికగా స్పందించింది.లిక్కర్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హైడ్రామా నడిచింది. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ విచారించింది. అనంతరం బుధవారం కోర్టుకు హాజరు పరిచింది. కోర్టులో విచారణ జరిగే సమయంలో కేజ్రీవాల్ను తమకు ఐదురోజుల పాటు కస్టడీ కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీ అమితాబ్ రావత్ అరెస్ట్ ఆర్డర్ను పాస్ చేయడంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు.ఈ వరుస పరిణామలపై ఆప్ స్పందించింది. ట్రయిల్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణకు రాకముందే ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆప్ మండిపడింది. కేజ్రీవాల్కు సుప్రీం కోర్టులో బెయిల్ వస్తుందేమోనని బీజేపీకి బయపట్టుకుంది. అందుకే సీబీఐ కోర్టులో అక్రమంగా అరెస్ట్ చేసిందని ట్వీట్లో పేర్కొంది.‘నియంత క్రూరత్వం అన్ని హద్దులు దాటింది.ఈ రోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నందున బీజేపీ తీవ్ర భయాందోళనకు గురైంది.సీబీఐతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించింది’అని ట్వీట్లో ద్వజమెత్తింది. -
సీఎం స్టాలిన్ సీరియస్...
-
ఈడీ కేసీఆర్ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు. -
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడిపై ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. స్వాతి మలివాల్ ఆరోపణల్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు. ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్ అందుబాటులో లేరు. అపాయింట్ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.‘అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయిఆ వీడియోలో స్వాతి మలివాల్ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.కాగా, స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు. -
హైదరాబాద్: వైన్ షాపులు ‘బంద్’.. బారులు తీరిన మద్యం ప్రియులు (ఫొటోలు)
-
‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించడం అద్భుతం కంటే తక్కువ కాదు అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్ సందర్భంగా ఆప్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. 40 రోజుల్లో మధ్యంతర బెయిల్ పొందడం అద్భుతం కంటే ఎక్కువే. సుప్రీం కోర్టు ద్వారా దేశంలో ఏమి జరిగినా మార్పు అవసరమని దేవుడి సూచనే అని ఆప్ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశం రాజ్యాంగపరమైన ముప్పు తెచ్చే వారికి ఎదురు దెబ్బే అవుతుందని ఆప్ నేతలు గోపాల్ రాయ్, అతిషి, భరద్వాజ్లు స్పష్టం చేశారు.కాగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రత్యర్థులను తప్పుడు కేసులతో వేధించేందుకు దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
టీడీపీ మద్యం ధ్వంసం
-
చెక్పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్కు చెందిన శ్రీనివాస గార్డెన్స్లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్లోని గెస్ట్హౌస్పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్ను, వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
పొంగుతున్న బీరు! ఎండల తీవ్రతతో పెరిగిన అమ్మకాలు
సాక్షి, హైదరబాద్: గ్రేటర్లో బీర్ల అమ్మకాలు పెరిగాయి. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మద్యం ప్రియులు లిక్కర్కు బదులు చల్లటి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు వీటిని ఆశ్రయిస్తారు. పెరిగిన బీర్ల అమ్మకాల మేరకు ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ప్రతిరోజూ గ్రేటర్లో 60 వేల నుంచి 80 వేల కేస్లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. మరో 20 వేల కేస్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద కేస్ల కోసం ఆర్డర్ చేసే వైన్ షాపులకు 70 కేస్ల వరకే లభిస్తున్నట్లు వైన్షాపుల నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల మరింత డిమాండ్.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సగానికి ఎక్కువగా బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్లో గ్రేటర్లో సుమారు 12 లక్షల కేస్లకుపైగా బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి 15 లక్షల కేస్లకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. ఈ మేరకు ఉత్పత్తి పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ‘ఇప్పటి వరకు సాధారణ రోజుల్లోలాగే బీర్ల ఉత్పత్తి ఉంది. డిమాండ్ మేరకు పెరగలేదు. కానీ.. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కంపెనీలు బీర్లను అందజేస్తాయా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది’ అని ఒక అధికారి వివరించారు. మరోవైపు బీర్ల అమ్మకాలు పెరగడంతో మద్యం విక్రయాలు కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్లు వైన్షాపుల నిర్వాహకులు చెప్పారు. బకాయిల పెండింగ్.. వినియోగదారుల డిమాండ్ మేరకు లక్షల కొద్దీ కేస్ల బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజులుగా ఉత్పత్తిని తగ్గించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండడమే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపారు. దాదాపు రూ.4 వేల కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. దీంతో 8 కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించారు. ఒకవైపు బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి తయారీ సంస్థలు ఉత్పత్తులను తగ్గించడం గమనార్హం. వేసవి కారణంగా నీటి ఎద్దడి కూడా బీర్ల తయారీకి ఇబ్బందిగా మారిందని పలు కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల బీర్లను ప్రస్తుతం తయారు చేస్తున్నాం. కానీ ఇదే సమయంలో గతంలో 2 లక్షల కేస్లకు పైగా కూడా ఉత్పత్తి జరిగింది. డిమాండ్ మేరకు ఉత్పత్తి పెరగాల్సి ఉండగా, వివిధ కారణాల దృష్ట్యా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది’ అని ఒక కంపెనీ నిర్వాహకుడు విస్మయం వ్యక్తం చేశారు. 40 లక్షల లీటర్ల నీళ్లు బీర్ల ఉత్పత్తికి అవసరమని, కొద్దిరోజులుగా నీటి లభ్యత తగ్గడంతోనూ బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. -
జనసేన ‘కిక్కు’ దిగింది
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు. తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్ అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్లను స్వాదీనం చేసుకున్నారు. -
సీఎం రమేష్ సారా అక్రమాల చరిత్ర ఇది
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన నమ్మిన బంటు.. కూటమి తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్రమాల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు.. సీఎం రమేష్పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ‘‘నా సంగతి మీకు తెలియదంటూ..’’ జీఎస్టీ తనిఖీల కోసం వెళ్లిన డీఆర్ఐ అధికారులపై గుండాయిజం ప్రదర్శించిన సీఎం రమేష్ అక్రమాల చరిత్రను పరిశీలిస్తే.. కుప్పంలో ఒకప్పుడు సీఎం రమేష్ తన తండ్రితో పాటు సారా వ్యాపారం చేశారు. రాయదుర్గం నుంచి అక్రమంగా సారా ప్యాకెట్లు తెప్పిస్తుంటే సీఎం రమేష్ను, ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మరొక కేసులో సీఎం రమేష్ తండ్రిని పీడీ యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లను ఎలా ఆకట్టుకోవాలో సీఎం రమేష్కు బాగా తెలుసు. 1989–94లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి బయట పడడానికి సీఎం రమేష్ ఆయన కుటుంబం కడపలో ఉన్న ఓ మంత్రి సాయం తీసుకునే వారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లాక సీఎం రమేష్ పోట్లదుర్తి నుంచి కొంతమందిని తీసుకెళ్లి కుప్పంలో దొంగ ఓట్లు నమోదు చేయించారు. కుప్పంలో ఓటు మేనేజ్మెంట్ అంతా సీఎం రమేష్ ఆయన తీసుకెళ్లిన పోట్లదుర్తి మనుషులే చూసుకునేవాళ్లు. అప్పటి నుంచి చంద్రబాబుతో సీఎం రమేష్కు వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు సీఎం రమేష్ రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ అనకాపల్లిలో సుమారు 200 మందిని తీసుకెళ్లి జీఎస్టీ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు. వీటికి బీజేపీ ఏమి సమాధానం చెబుతుంది.? కోల్కత్తాలో ఈడీ అధికారులపై అక్కడి టీఎంసీ నేతలు దాడికి దిగితే ఖండించిన బీజేపీ ఇప్పుడు సీఎం రమేష్ చేసిన ఈ దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతుంది? అక్రమ సారా నుంచి రూ.3 వేల కోట్లకు ఎదిగాడు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రమేష్ తనకు ఏం కావాలో చెప్పి చేయించుకునేవారు. అనకాపల్లిలో ప్రస్తుత ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి ఉన్నాడు. పోట్లదుర్తి నుంచి తన మనుషులను అనకాపల్లికి తీసుకొచ్చాడు. నీతులు చెబుతున్న చంద్రబాబు... సీఎం రమేష్ ఎదుగుదలలో ఆయన పాత్ర ఎంటో చెప్పగలరా?. గతంలో విజయమ్మ పోటీ చేసినప్పుడు కడప నుంచి మనుషులను తీసుకొచ్చారని టీడీపీ వాళ్లు అసత్య ప్రచారాలు చేయించారు. ఆమె ఓటమికి కారణమయ్యారు. కడప ప్రాంతానికే చెందిన రమేష్ ఇప్పుడు అనకాపల్లిలో చేస్తున్న దౌర్జన్యానికి ఏం సమాధానం చెబుతారు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఎంపీగా గెలిస్తే ఫారెన్ లిక్కర్ ఇస్తా: మహిళా అభ్యర్థి వినూత్న ప్రచారం
చంద్రాపూర్: ఈ లోక్సభ ఎన్నికల్లో తాను గెలిస్తే పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్యర్థి చెబుతున్నారు. ఈ విచిత్ర హామీ ఇస్తున్న అభ్యర్థి పేరు వనితా రౌత్. బీరు, విస్కీలను సబ్సిడీ ధరలకు ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది వనితా రౌత్. అయితే ఈ స్కీమ్ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్ ఉండాల్సిందేనన్న కండీషన్ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడమని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్ వారికి అవసరమని సమర్థించుకుంటోంది. పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది. వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్ను ఎన్నికల కమిషన్ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం. ఇదీ చదవండి.. మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివి -
టానిక్ వైన్ షాప్స్ సోదాల్లో సంచలన విషయాలు
-
టానిక్ లిక్కర్ మార్ట్ వ్యవహారాలపై ఎక్సైజ్ అధికారుల విచారణ
-
టానిక్ వైన్ షాపులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు
-
టానిక్ లిక్కర్ గ్రూప్స్పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టానిక్ లిక్కర్ గ్రూప్స్పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజ్లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇదీ చదవండి: Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
కేన్సర్ రిస్క్ : ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా మేలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి కేన్సర్.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మరణాలకు రెండో ప్రధాన కారణం కేన్సర్. కేన్సర్ చాలా రకాలు ఉన్నాయి. వంశపారంపర్యం, కాలుష్యం, జీవనశైలి ఇలా కేన్సర్కు చాలా కారణాలున్నాయి. కానీ దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ వ్యాధి మొదటి దశలో గుర్తించడం తోపాటు, కొన్ని దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. కేన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. మగవారిలో ఎక్కువగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు, లివర్ కేన్సర్లు వ్యాప్తిస్తుండగా, మహిళలు బ్రెస్ట్, కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ కేన్సర్ బారిన పడుతున్నారు. వయస్సు , మద్యం, పొగాకు, ఎక్కువ కాలం ఇన్ఫెక్షన్లు, రసాయన సహిత ఆహారం, హార్మోన్లు, ఇమ్యునోసప్రెషన్, రేడియేషన్, సన్ రేస్, ఊబకాయం లాంటివి రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉన్నాయి. (ఎన్ఆర్ఐ మహిళకు బ్యాంకు మేనేజర్ టోకరా) ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ♦ పొగాకు, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా ఉండటం ఆరోగ్య కరమైన ఆహారం ♦ బిడ్డకు పాలివ్వడం ద్వారా కొన్ని కేన్సర్లకు దూరంగా ఉండొచ్చు. ♦ పిల్లలకు హెపటైటిస్ బీ, హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించడం ♦ ఎక్కువగా సూర్యకాంతికి గురి కాకుండా ఉండటం. హానికరమై సూర్యకిరణాల బారిన పడకుండా రక్షణ పద్ధతులు పాటించాలి. ♦ ఇంటా, బయటా గాలి కాలుష్యానికి దూరంగా ఉండటం ♦ మద్యపానానికి దూరంగా ఉండటం. ఒక వేళ అలవాటు ఉన్నా దాన్ని పరిమితం చేసుకోవడం ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ♦ అనుమానం వచ్చినా, ఫ్యామిలీలో ఎవరికైనా కేన్సర్ సోకి వున్నా, వయసురీత్యా, సమయానుకూలంగా మిగిలినవారు కూడా కేన్సర్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడం. -
ఖరీదైన మద్యం తాగాలని...
బంజారాహిల్స్: ఓ పబ్ సెక్యూరిటీ గార్డ్ విదేశీ లిక్కర్ బాటిల్ను చోరీ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఆర్.యూ పబ్లో కొంతకాలంగా వినీత్కుమార్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ పబ్కు వచ్చే యువత ఖరీదైన విదేశీ లిక్కర్ను సేవిస్తుండటాన్ని గుర్తించిన అతను తాను కూడా స్నేహితులతో కలిసి ఆ లిక్కర్ను తాగాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న రాత్రి పబ్ మూసివేసిన తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి క్యాష్ బాక్స్లో ఉన్న రూ.2 లక్షల నగదుతో పాటు ఐదు రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు, ఒక చివాస్ రీగల్, ఒక మొహిట్ చాన్ దాన్ బాటిల్ను చోరీ చేసి పబ్పై అంతస్తు నుంచి పైపుల ద్వారా కిందకు దిగి పరారయ్యారు. మర్నాడు ఉదయం పబ్ మేనేజర్ మద్యం బాటిళ్లతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా సెక్యూరిటీ గార్డ్ వినీత్కుమార్తో పాటు మరో ఇద్దరు అగంతకులు నగదు, బాటిళ్లతో కిందకు పైపుల ద్వారా కిందకు జారుతున్న దృశ్యాలను గుర్తించారు. ఆ రోజు నుంచి వినీత్కుమార్ విధులకు హాజరుకావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ ఉందని మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
సుప్రీంకోర్టులో రెండు మద్యం సీసాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది. లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్పై ఉంచారు. వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్ప్రైజెస్కు నోటీసు జారీ చేశారు. -
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
ఎంత బరితెగింపు! సీజ్ చేసినా.. మద్యం బార్ నిర్వహణ
జడ్చర్ల: ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన మద్యం బార్ యథావిధిగా కొనసాగడం జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది. 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఓ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్న బార్ నుంచి గత నెల 15న ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించి డీసీఎం వ్యాన్లో అక్రమంగా మద్యం తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బార్లో ఉండాల్సిన మద్యం కాటన్లు ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా బయటకు తరలించడంపై ఎక్సైజ్ అధికారులు విచారించి బార్ను సీజ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ బార్ను నిర్వాహకులు యథావిధిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక విలేకరులు ఎక్సైజ్ సీఐ బాలాజీ దృష్టికి తీసుకెళ్లారు. తాము మద్యం బార్ను సీజ్ చేశామని, బార్ను మళ్లీ యథావిధిగా కొనసాగిస్తుండడంపై తమకు తెలిసిందన్నారు. మరోసారి విచారించి బార్ను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు. -
మంచిర్యాలలో పోలీసులు విస్తృత తనిఖీలు
-
విదేశీ మద్యంపై రామోజీ విషం !
-
లేని బ్రాండ్లకు ధరల పెంపా!?
సాక్షి, అమరావతి : ఎన్టీఆర్ హయాంలోలాగ తాను తలచుకుంటే ఎవరినైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలనన్న అతివిశ్వాసం రామోజీరావులో ఇంకా చావలేదు. తన వికృత రాతలతో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై పైసా ఆదాయం రాకుండా చేయాలని.. అలా ప్రభుత్వ ఆదాయ మార్గాలకు గండికొడితే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవచ్చని.. తద్వారా వాటిని అమలుచేయలేని పరిస్థితిల్లోకి నెడితే వైఎస్ జగన్ సర్కార్ ప్రజావిశ్వాసం కోల్పోతుందనేది రామోజీ దింపుడు కళ్లెం ఆశ. కానీ, ఇప్పుడున్నవి ఎన్టీఆర్ హయాం నాటి రోజులు కాదని ఆయన గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనసంతా బాబును అర్జెంటుగా సీఎం కుర్చీపై కూర్చోపెట్టడంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇందుకోసం ఆయన పడుతున్న ప్రయాస అంతాఇంతా కాదు. ఇందులో భాగమే ఆయన విషపుత్రిక ఈనాడులో అచ్చోసి ప్రజలకు ఏమాత్రం కిక్కివ్వని తాజా కథనం ‘ఆ కిక్కు ఎవరికో.. అస్మదీయుల బ్రాండ్ల ధరలు తగ్గింపు’.. బాగోతం. రాష్ట్రంలో మద్యం ధరలపై పన్నుల విధానాన్ని ప్రభుత్వం ఇటీవల హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసే క్రమంలో ‘పచ్చ’కిక్కు ఎక్కించుకుని ఉన్నవి లేనివి ఊహించుకుని పచ్చమీడియా చేతికొచ్చింది పిచ్చిరాతలు రాసిపారేసింది. అబద్ధాలను రంగరించి చంద్రబాబుకు ప్రీతిగా వండామని సంబరపడ్డాయి. కానీ, ఈ వంటకం వండే క్రమంలో పప్పులో కాలేశారు. అదేమిటంటే.. రాష్ట్ర మార్కెట్లో లేని మద్యం బ్రాండ్లు, దాదాపు బ్యాలెన్స్ స్టాక్లేని బ్రాండ్ల పేర్లను పేర్కొంటూ కథనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించి ఎల్లో ముఠా అభాసుపాలైంది. ‘పచ్చ’ పైత్యంలోని అసలు వాస్తవాలు ఏమిటంటే.. ♦ మద్యం ఉత్పత్తులపై పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరిస్తూ ప్రభుత్వం చాలా స్వల్పంగా ఏఆర్ఈటీ, ఏఈడీ, వ్యాట్ పన్నులతోపాటు స్పెషల్ మార్జిన్ను సవరించింది. అన్ని బ్రాండ్ల మద్యం ఉత్పత్తుల బేసిక్ ధరపై పన్నుల శాతాన్ని నిర్ణయిస్తూ పన్నుల విధానంలో ఏకరూపత తీసుకొచ్చింది. దాంతో అతికొద్ది బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి. అత్యధిక బ్రాండ్ల ధరలు యధాతథంగానే ఉన్నాయి. మొత్తం మీద ఆదాయం కొద్దీగా పెరిగినట్లు కనిపిస్తున్నా అత్యధిక బ్రాండ్ల మద్యం ధరల్లో మాత్రం ఏమాత్రం మార్పులేదు. ♦ ఇక అస్మదీయుల బ్రాండ్ల ధరలు పెరగలేదంటూ పచ్చ పత్రికలు ప్రచురించిన మద్యం బ్రాండ్లు అసలు మార్కెట్లో లేనేలేవు. సంబంధిత కంపెనీలు ఆ మద్యం బ్రాండ్లను రెన్యూవల్ చేసుకోలేదు. ఆ కంపెనీల మద్యం నిల్వలు దాదాపు ముగింపునకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హోల్సేల్, రిటెయిల్ మద్యం దుకాణాల్లో ఆ మద్యం బ్రాండ్ల నిల్వలు కూడా దాదాపులేవు. అంటే ఆ బ్రాండ్లు, వాటి ధరలు కేవలం కాగితాలపైనే కనిపిస్తున్నాయి తప్ప మార్కెట్లో అందుబాటులో లేవన్నది వాస్తవం. కానీ, ఆ బ్రాండ్ల ధరలు పెరగనే లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చ పత్రికలు యత్నించాయి. ♦ రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల గురించి పచ్చ పత్రికలు కనీసం పేర్కొనలేదు. ఎందుకంటే ఆ బ్రాండ్ల మద్యం ధరలు ఏమాత్రం పెరగలేదు కనుక. ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకే ఆ బ్రాండ్ల పేర్లను పచ్చ పత్రికలు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి. ♦ ఎంఎస్ బయోటెక్, ఈగిల్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎన్జీ సుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పిత్తి చేసే మద్యం బ్రాండ్లకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటి ధరలు పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోలేని ఆ కంపెనీల బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి తప్పా మార్కెట్లో ఉన్న బ్రాండ్ల ధరలు పెరగలేదు. ఉదా.. కింగ్ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, ఎస్ఎన్జే 10000 సూపర్ స్ట్రాంగ్ బీర్ ధరల గురించి పచ్చ పత్రికలు ప్రధానంగా రాశాయి. కానీ, ఆ బ్రాండ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో దాదాపు అందుబాటులో లేనేలేవు. గతంలో తెచ్చిన స్టాక్ దాదాపు పూర్తయ్యింది. ♦ పన్నులను హేతుబద్ధీకరించడంతో అతికొద్ది కంపెనీల లీటర్ సైజు లిక్కర్ బాటిళ్ల ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. రాష్ట్రంలో ఒక లీటర్ అంతకంటే పెద్ద పరిమాణంలో మద్యం బాటిళ్ల ఉత్పత్తి, అమ్మకాలు కేవలం నామమాత్రమే. ♦ ఇక మద్యం కంపెనీల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం దాదాపు చెల్లించేసింది. ఇటీవల రూ.175 కోట్లు చెల్లించడంతో బకాయిలన్నీ తీరిపోయాయి. ♦ కొన్ని కంపెనీలకు మద్యం ఉత్పత్తులపై కేసుకు రూ.250 చెల్లించమన్నారని పచ్చ పత్రికలు పేర్కొన్న విషయం పూర్తిగా అవాస్తవం. పూర్తి పారదర్శక విధానంలో ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని కచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది. -
అభిషేక్ బోయినపల్లి బెయిల్ కేసు డిసెంబర్ 4కు వాయిదా
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు బోయినపల్లి అభిషేక్ బెయిల్ కేసును సుప్రీం కోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది. అభిషేక్ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కన్నా , జస్టిస్ ఎస్ ఎన్ వి భట్టి ధర్మాసనం.. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని అభిషేక్ పిటిషన్ దాఖలు చేశాడు. లిక్కర్ కుంభకోణంలో ఇండో స్పిరిట్ నుంచి 3.85 కోట్ల రూపాయల ముడుపులు అభిషేక్ బోయినపల్లికి ముట్టినట్లు సాక్షాలు ఉన్నాయని ఈడి తరుపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 19 పై లోతుగా విచారణ చేస్తామని తెలిపిన ధర్మాసనం.. ఈలోగా ఇరుపక్షాలు తమ ప్లీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
ఎన్నికల వేళ భారీగా సొత్తు సీజ్: సీబీడీటీ
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరంలలో లెక్కల్లో చూపించని నగదు భారీగా పట్టుబడుతున్నట్లు ఆదాయ పన్ను విభాగం సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్)తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో 2019లో జరిగిన లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా బుధవారం తెలిపారు. సోదా, నిఘా చర్యలను ఎన్నికల కమిషన్ సమన్వయంతో చేపడుతున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలున్న రాజస్తాన్లో పట్టుబడిన అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి తదితరాల మొత్తం విలువ మూడింతలయిందన్నారు. 2021లో సీజ్ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.322 కోట్లు కాగా, 2022లో అది రూ.322 కోట్లకు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1,021 కోట్లకు పెరిగిందని గుప్తా పేర్కొన్నారు. -
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం
విశాఖపట్నం: నగర పరిధిలోని మద్యం లారీ బోల్తా పడడంతో జనం ఇదే అదనుగా మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. శనివారం ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ ఒకటి మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. -
లికర్ తాగిన ఎలుక..పట్టుకున్న పోలీసులు
చింద్వార: పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. దొంగలు పడడమే కాదు..స్టేషన్లో ఉన్న 60 లిక్కర్ బాటిళ్లను ఖాళీ చేశారు. ఈ విషయమై పోలీసులు ఓ దొంగను పట్టుకొని బంధించారు. ట్విస్టేంటంటే ఆ దొంగ మనిషి కాదు..ఎలుక. ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో జరిగింది. అసలేం జరిగిందంటే పోలీసులు ఓ అక్రమ మద్యం సరఫరా చేసే వ్యక్తి దగ్గర నుంచి 60 బాటిళ్ల లిక్కర్ సీజ్ చేశారు. ఈ మందు బాటిళ్లను తీసుకొచ్చి పోలీస్స్టేషన్లో ఉంచారు. అయితే పీఎస్లోకి వచ్చిన ఎలుకలు మొత్తం లిక్కర్ తాగేశాయని పోలీసులు చెబుతున్నారు. బాటిళ్లు ఖాళీ అయ్యాయన్న బాధ కంటే అక్రమ మద్యం కేసు నిరూపించడం ఇక కష్టమని పోలీసులు ఆవేదన చెందుతున్నారు. కేసు వీగిపోయే పరిస్థితులు కల్పించాయన్న కోపంతో లిక్కర్ బాటిళ్లు ఖాళీ చేసిన ఎలుకల్లో ఓ ఎలుకను ట్రాప్ చేసి పట్టుకున్న పోలీసులు దానిని బంధించారు. మిగతా ఎలుకలను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. కేవలం కొత్వాలి పోలీస్స్టేషనే కాదని, అక్కడున్న అన్ని ప్రభుత్వ ఆఫీసు భవనాలకు ఎలుకలు, చెదల బాధ తప్పడం లేదని, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వాటిని వదిలించుకోవడం తమ వల్ల కావడం లేదని ఓ అధికారి వాపోయారు. -
ఎలుకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
చేతి పంపునుంచి నీటికి బదులుగా మద్యం: షాకైన పోలీసులు
సాధారణంగా చేతి పంపు నుంచి నీరు రావడం అనేది అందరికీ తెలుసు. ఒక్కోసారి అవి మెరాయించడం కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఉన్నట్టుండి చేతి పంపు నుంచి నీళ్లకు బదులు మద్యం వస్తే ఎలా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో ఇలానే జరిగింది. చేతిపంపు నుంచి మద్యం వస్తుండటంతో తొలుత అందరూ షాక్కు గురయ్యారు. కానీ ఆ తరువాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు. మీడియా కథనం ప్రకారం రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ పెద్దఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. అయితే ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా ఎక్సైజ్ బృందానికి ఏమీ దొరకలేదు. అయితే చేతి పంపు నుంచి నీటికి బదులుగా మద్యం వస్తోందన్న వార్త ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ పోలీసులు మద్యం స్మగ్లింగ్కు కొత్త ఫార్ములా తెలుసుకుని షాక్ అయ్యారు. అధికారుల ముందే దాన్ని ఆపరేట్ చేయగా మద్యం బయటకు రావడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏమిటంటే ఆ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పెద్ద ఎత్తున మద్యం తయారు చేసి విక్రయిస్తోంది. పట్టు బడతామనే భయంతో మద్యం ట్యాంక్ను భూమిలో పాతి పెట్టినట్టు సమాచారం. అందులోంచి హ్యాండ్ పంపు ద్వారా మద్యాన్ని విక్రయిస్తోంది. చివరికి విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ బుల్డోజర్లతో భూగర్భ ట్యాంకును ధ్వంసం చేసింది. ఝాన్సీలో ఇలాంటి ఘటన నమోదు కావడం ఇదే మొదటిసారికాదు. 2020 సెప్టెంబరులో వేలకొలదీ లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇలాంటి సంఘటనే గతంలో మధ్య ప్రదేశ్లో కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. झांसी में शराब तस्करो ने शराब तस्करी का निकाला नया फॉर्मूला, पुलिस को शक ना हो तो घर में जमींन के नीचे टैंक बनाकर उस पर ऊपर हैंडपम लगा दिया और हैंडपंप को चलाने से पानी की जगह शराब बाहर निकलती है मुखबिर की सुचना पर पुलिस ने रेड मारकर पकड़ी लाखो लीटर नकली शराब#JhansiPolice #jhansi pic.twitter.com/MJXMajjRsY — Arjun Chaudharyy (@Arjunpchaudhary) November 7, 2023 -
మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం, ఎగబడిన జనం: వైరల్ వీడియో
‘మెడిసిన్’ పేరుతో మద్యాన్ని అక్రమ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అక్టోబరు 30న బిహార్లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ స్థంభించి, గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. కానీ అప్పటికే కారులో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరవాటిని తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించినట్టు స్థానికి అధికారి చెప్పారు. A video of people looting liquor bottles from a car on National Highway 2 in Bihar after the vehicle was involved in an accident has gone viral. Alcohol has been banned in the state since 2016. #Bihar #alcohol #liquor #viralvideo pic.twitter.com/F0gYIoycBt — Jammu Tribune (@JammuParivartan) November 1, 2023 -
ఒకే రోజు రూ.35 కోట్లు జప్తు
సాక్షి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజాంపేట్, రఘునాథపల్లి: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో మొత్తం రూ.35.52 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.165.81 కోట్లకు పెరిగిపోయింది. బుధవారం రూ.6.25 కోట్ల నగదును జప్తు చేయగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.77.87 కోట్లకు పెరిగింది. 7వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లు విలువ చేసే 59,091 లీటర్ల మద్యం, 18,088 కిలోల నల్లబెల్లం జప్తు చేశారు. రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత బుధవారం రూ.3 కోట్లు విలువ చేసే 1,086 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం గంజాయి విలువ రూ.7.55 కోట్లకు పెరిగింది. కాగా ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం బంగారం, ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.62.73 కోట్లకు చేరింది. బుధవారం రూ.2.3 కోట్లు విలువ చేసే ల్యాప్టాప్లు, కుక్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.8.64 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.165.81 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధాణ ఎన్నికల్లో మొత్తం రూ.97 కోట్ల నగదు, రూ.34 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వికాస్రాజ్ తెలిపారు. గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్షీట్స్ స్వాధీనం హైదరాబాద్ దక్కన్, దానాపూర్–సికింద్రాబాద్ రైళ్లలో పార్శిల్ సర్వీసు ద్వారా సికింద్రాబాద్కు చేరుకున్న 30 భారీ కాటన్ పార్శిళ్ల స్టెయిన్లెస్ స్టీల్ గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్షీట్లను రైల్వేపోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 26 కాటన్ పార్శిళ్లల్లో రూ.1.29 కోట్ల విలువ చేసే 2,160 కిలోల స్టెయిన్ లెస్ స్టీల్ ఆర్టికల్స్, మరో నాలుగు కాటన్ పార్శిళ్లల్లో రూ.78 వేల విలుచేసే దుప్పట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సికింద్రాబాద్ జనరల్ బజార్కు చెందిన కిషోర్సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 538 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.25 కోట్ల విలువైన చీరల పట్టివేతబాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్లోనిపంచవటి అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్నఏపీ 16టీవీ 3280 నంబరు గల లారీలో సరుకును పరిశీలించగా భారీ మొత్తంలో చీరలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2,25,98,500 ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పంచవటి అపార్ట్మెంట్లో ఓ రాజకీయపార్టీ సమావేశం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. రూ.1.37 కోట్ల బ్యాంక్ డబ్బు సీజ్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద క్యూ ఆర్ కోడ్ సరిగా లేని బ్యాంకు నగదు రూ.1,37,50,000ను పోలీసులు సీజ్ చేశారు. -
తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
-
మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో
మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఆమె చేసిన ఆరోపణలు, వాస్తవాలు... ఇవిగో. ఆరోపణ: ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను ఈ ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వంలో 4,380 మద్యం దుకాణాలుండగా ఈ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం, బీరు గరిష్ట స్వాధీన పరిమితి కూడా ఈ ప్రభుత్వమే తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను ఈ ప్రభుత్వమే తొలగించింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో ఐఎమ్ఎల్ (మద్యం), బీరు విక్రయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాకే గణనీయంగా తగ్గాయి. గత ప్రభుత్వంలో 2017–18లో అంటే 360.85 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే, 2018–19లో ఆ సంఖ్య 384.36 లక్షల కేసులకు పెరిగింది. అలాగే 2017–18లో బీర్ల అమ్మకాలు 227.26 లక్షల కేసులుంటే.. 2018–19లో ఆ సంఖ్య 277.16 లక్షల కేసులకు పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కేంద్ర ప్రభుత్వమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. దీనికి సంబంధించిన టేబుల్ కూడా చూడవచ్చు. ఆరోపణ: వైయస్సార్సీపీలోని కీలక నేతలే మద్యం తయారీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. వైయస్సార్సీపీ నాయకులకు తన కంపెనీని అప్పగించడానికి ఒక వైఎస్సార్సీపీ ఎంపీ నిరాకరిస్తే.. ఏపీఎస్బీసీఎల్ ఆ కంపెనీ నుంచి మద్యం కొనుగోలును ఆపేసింది. వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక అంటే 2019 మే తరవాత... ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే.. మద్యం తయారీ, సరఫరా చేస్తున్నాయి. ఆరోపణ: మద్యంలో నాణ్యత లేదు. విషపు అవశేషాలు ఉన్నాయి. ముడి పదార్థమైన రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి హానికారక అవశేషాలను తొలగించడం లేదు. మద్యం తయారీ ధర లీటరుకు రూ.15 కాగా.. విక్రయ ధర లీటరుకు రూ.600–రూ.800 మధ్య ఉంది, వాస్తవం: రాష్ట్రంలో మద్యం తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందనడం పూర్తిగా అవాస్తవం. ఏపీ డిస్టిలరీ (బీర్, వైన్ కాకుండా మద్యం తయారీ), 2006 నియమాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మద్యం తయారవుతోంది. మద్యంలో ఎలాంటి హానికారక అవశేషాలు ఉండకూడదని రూల్ 34 చెబుతోంది. మద్యం తయారయ్యే ప్రతి ఫ్యాక్టరీలోనూ మద్యం నాణ్యతను పరీక్షించేందుకు ఒక రసాయన ల్యాబొరేటరీ కూడా ఉంది. మద్యం తయారీ ప్రక్రియను, నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి డిస్టిలరీ పరిధిలోనూ ఒక డిస్టిలరీ ఆఫీసర్ ఉన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం వారు రాష్ట్రంలో 5 ప్రాంతీయ ఎక్సైజ్ ల్యాబొరేటరీలు ఏర్పాటుచేశారు. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో ఉన్నాయి. ఇవి మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం నమూనాల్లో అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో సర్టిఫికెట్లను కూడా ఇస్తాయి. ఇవి కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతాయి. ఆధునిక పరీక్షా పద్ధతులు సాధ్యమయ్యేలా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబొరేటరీలను ఆధునికీకరించింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం. ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత వేగంగా, కచ్చితంగా పరీక్షలు చేసేలా ఈ ల్యాబొరేటరీలు తయారయ్యాయి. ఈ అత్యాధునిక పరికరాల కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు. ఎసిటల్ డీహైడ్, ఇథైల్ ఎసిటేట్, మెథనాల్ వంటి వాటిని నిశితంగా పరిశీలించే వీలు ఇప్పుడు డిస్టిలరీల్లోని ల్యాబొరేటరీల్లోనూ, ప్రాంతీయ ల్యాబొరేటరీల్లోనూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో విశ్లేషించిన శాంపిళ్ల వివరాలను టేబుల్లో చూడొచ్చు. ఇక మద్యం ఎమ్మార్పీ విలువ విషయానికొస్తే... అందులో15 శాతం తయారీ ఖర్చు కాగా, మిగిలిన 85 శాతం ఏపీఎస్బీసీఎల్, ప్రభుత్వ ఆదాయం. ఆరోపణ: రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు.. డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే మద్యం కొంటున్నారు కనుక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఆరోపణ: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లు అయితే అందులో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారు. వాస్తవం: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. అలాంటప్పుడు రూ.25వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారు అనేది కూడా అసంబద్ధం, అవాస్తవం. ఆరోపణ: లంచాలిచ్చే కంపెనీల నుంచే ఏపీఎస్బీసీఎల్ మద్యం కొనుగోలు చేస్తోంది. వాస్తవం: రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత అంటే 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని 19–09–2022న నివేదిక ఇచ్చింది. ఆరోపణ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారు. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడం లేదు. వాస్తవం: వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. అందువల్ల ఆ స్పెషల్ మార్జిన్ రాష్ట్ర ఖజానాకు వెళ్లదు. ఆరోపణ: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మరణించిన వారు 25 శాతం పెరిగారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవం: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రతి మద్యం సీసాపైనా స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ప్రభుత్వం. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కాలేయం వంటివి దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేతప్ప, ప్రభుత్వం విక్రయించే మద్యంలో నాణ్యత లేకపోవడం వల్లనో, విషపూరిత అవశేషాలు ఉండటం వల్లనో కాదు. విశాఖపట్నంలోని కేజీహెచ్లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని అర్థమవుతోంది. అందువల్ల పురంధేశ్వరి రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే. మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే ఈ ప్రభుత్వ విధానం. పూర్తిగా నాణ్యమైన మద్యాన్ని తయారుచేసి, ఎలాంటి అవినీతికీ ఆస్కారం లేకుండా అమ్మకాలు జరిపేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చదవండి: Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ.. -
మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా?
చంద్రబాబు నాయుడి కోసం ‘ఈనాడు’ రాతలను లేఖలుగా సంధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిన్నచిన్న లాజిక్కులు కూడా మిస్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు మెప్పుకోసం కొన్ని రోజులుగా రాష్ట్రంలో ‘మద్యంపై పోరాటం’ అంటూ ఆమె చేస్తున్న హంగామా అంతా చూస్తున్నదే. తాజాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ అందజేశారు. తమ పార్టీ ప్రభుత్వానికే ఇలా వినతి పత్రాలివ్వటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నా... టీడీపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పురంధేశ్వరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. లేఖలో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు ఎంత అసంబద్ధమైనవంటే... అనుమతులిచ్చిన చంద్రబాబును ప్రశ్నించరేం? రాష్ట్రంలో మద్యం నాణ్యతపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరికి... దాన్ని తయారు చేస్తున్న డిస్టిలరీలకు అనుమతులిచ్చింది తన బావ చంద్రబాబు నాయుడేనని తెలియదా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోవాలి కదా? వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 20 మద్యం డిస్టిలరీలుండగా... వాటిలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబు నాయుడే. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అంతే తప్ప వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చిన డిస్టిలరీల్లో చాలావరకూ ఆయన హితులు, సన్నిహితులవే. వాళ్లు అప్పట్లో తయారు చేసిన మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నారు. మరి అప్పట్లో నాణ్యంగా ఉన్న మద్యం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? ప్రభుత్వం మారింది కాబట్టా? ఇదెక్కడి తీరు పురంధేశ్వరి గారూ?! నాడు నాలుగు డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు.. పురంధేశ్వరి తన లేఖలో వాస్తవానికి సమాధి కట్టి వినిపించిన మరో అందమైన అబద్ధమేంటంటే... వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకే ఎక్కువ మద్యం సరఫరా చేసే అవకాశమిస్తున్నారని. నిజం చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేతలకు డిస్టిలరీలే లేవు. అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో అనుమతులిచ్చిన ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలవే. పైపెచ్చు చంద్రబాబు హయాంలో డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగేది. తమ వారికి చెందిన 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 70 శాతం మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అంటే తనకు కావాల్సిన ఈ 4 డిస్టిలరీలకూ సగటున ఒక్కోదానికీ 17.5 శాతం ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 16 డిస్టిలరీలకూ కలిపి 30 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీటికి సగటున 2 శాతంలోపే ఆర్డర్లు దక్కాయి. కానీ ఇంతటి అవినీతిని పురంధేశ్వరి ఎన్నడూ... ఏ పార్టీలో ఉన్నప్పుడూ ప్రశ్నించలేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి డిస్టిలరీకీ సమానంగా అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 4 నుంచి 6 శాతం వరకు ప్రతి డిస్టిలరీకీ తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకే... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఒక నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర సంస్థే ఇలా చెప్పినపుడు... కేంద్రానికి పురంధేశ్వరి చేసిన ఫిర్యాదులో ఏ కొంచెమైనా అర్థం ఉన్నట్టా? సత్ఫలితాలనిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ.. మద్యం విక్రయాలను ప్రభుత్వ అధీనంలో చేపట్టడం... షాపుల సంఖ్యను తగ్గించటం... విక్రయ వేళల్ని పరిమితం చేయటం... పర్మిట్ రూముల్ని రద్దు చేయటం... బెల్టు షాపుల్ని తొలగించటం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018–19లో మద్యం విక్రయాలు 3.84 కోట్లు కేసులు. అదే ఏడాది బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. 2022–23లో మద్యం విక్రయాలు 3.35 కోట్ల కేసులకు, బీర్లు 1.16 కోట్ల కేసులకు పరిమితమయ్యాయి. మద్యం తాగేవారు వెనుకంజ వేసేలా... రేట్లను షాక్ కొట్టేలా పెంచుతామని గత ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాన్ని అమలు చేశారు. రేట్లను పెంచటంతో పాటు అదనపు పన్నునూ విధించారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గటానికి కారణమే. నిధులు మళ్లించింది చంద్రబాబు కాదా? తెలుగుదేశం, ‘ఈనాడు’ బాటలోనే... రాష్ట్రంలో మద్యం విక్రయించగా వచ్చిన సొమ్ము ఖజానాకు కాకుండా ఇంకెక్కడికో తరలిపోతోందంటూ పురంధేశ్వరి సైతం గగ్గోలుపెట్టారు. రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది తలా రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని నోటికొచ్చినట్లు చెప్పేశారు. ఇలా చూస్తే మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.57,600 కోట్లు రావాలని, కానీ రూ.32,600 కోట్లే చూపిస్తున్నారు కనక మిగతా రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారని నమ్మశక్యం కాని కూతలు కూసేశారు. నిజానికి కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక 2019–21 ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడ్డవారిలో మద్యం అలవాటు ఉన్నవారు 63.88 లక్షలమంది. వీరిలో రోజూ తాగేవారు సగటున 18.24 లక్షల మందే. మరి 80 లక్షల లెక్క ఎవరు చెప్పారు పురంధేశ్వరి గారూ? వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో తక్కువ మద్యం విక్రయిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ సొమ్ము సమకూరుతోంది. కానీ చంద్రబాబు హయాంలో ఇప్పటికంటే చాలా ఎక్కువ మద్యాన్ని విక్రయించినా కూడా... ఇప్పటికన్నా తక్కువ మొత్తమే ఖజానాకు చేరేది. మరి నిధుల మళ్లింపు అప్పుడు జరిగినట్టా? ఇప్పుడు జరుగుతున్నట్టా? కాస్త ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబును విమర్శించడానికి మనసు ఒప్పుకోకుంటే... ఇలాంటి పనికిమాలిన ఆరోపణలైనా చేయకుండా ఉండాలి కదా?. -
మద్యంపై ఈనాడు రామోజీ దుష్ప్రచారం
-
బిహార్లో పోలీసు స్టేషన్లో దొంగతనం
పట్నా: దొంగలు ఏకంగా పోలీసు స్టేషన్ను టార్గెట్ చేశారు. రాత్రిపూట లోపలికి ప్రవేశించి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బిహార్లో మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్రమ రవాణా జరుగుతున్న మద్యం సీసాలను పోలీసులు స్వా«దీనం చేసుకొని ఈ స్టేషన్లోని స్టోర్రూమ్లో భద్రపర్చారు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చిమ్మచీకట్లో దొంగలు చాకచక్యంగా గోడదూకి లోపలికి అడుగుపెట్టారు. స్టోర్రూమ్లో ఐదు పెట్టెలు, ఒక సంచిలో ఉన్న మద్యం బాటిళ్లను చోరీ చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది స్టేషన్లోనే ఉన్నారు. అసలు విషయం మరుసటి రోజు బయటపడింది. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. -
కిక్కెక్కించిన మద్యం దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు ‘మద్యం దరఖాస్తుల’రూపంలో కాసుల వర్షం కురిసింది. రానున్న రెండేళ్ల కాలానికి గాను రాష్ట్రంలోని వైన్షాపులకు లైసెన్సుల మంజూరు కోసం నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు అనూహ్య రీతిలో స్పందన కనిపించింది. శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ముగియగా, శనివారం మధ్యాహా్ననికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న లెక్కలను ఎక్సైజ్ శాఖ తేల్చింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 2,620 వైన్షాపుల లైసెన్సుల కోసం ఏకంగా 1,31,954 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లైసెన్సుల కోసం 68,691 దరఖాస్తులు రాగా, ఈసారి గతం కంటే 63,263 దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. గత రెండేళ్లతో పోలిస్తే రానున్న రెండేళ్ల కాలానికి గాను దరఖాస్తుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.2,639 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే లభించింది. ఈ దరఖాస్తుల నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈనెల 21న డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. హైదరాబాద్ శివార్లలో భారీగా.. భారీస్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లోని వైన్షాపులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడినట్లు గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని షాపుల కోసం వ్యాపారులు భారీ స్థాయిలో దరఖాస్తులు దాఖలు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. సరూర్నగర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలోని 134 షాపులకు ఏకంగా 10,908 దరఖాస్తులు రాగా, శంషాబాద్లోని 100 షాపులకు 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇవే షాపులకు గత రెండేళ్ల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో రావడం గమనార్హం. సరూర్నగర్ పరిధిలోని షాపులకు గత రెండేళ్ల కాలానికి 4,102, శంషాబాద్లో 4,122 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక మరో ఏడు జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య 5 వేలు దాటింది. ఖమ్మం (7,207), కొత్తగూడెం (5,057), సంగారెడ్డి (6,156), నల్లగొండ (7,058), మల్కాజ్గిరి (6,722), మేడ్చల్ (7,017), వరంగల్ అర్బన్ (5,858)లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే వెయ్యి కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. కాగా, క్రితం సారి 10 రోజుల పాటు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో మొత్తం కలిపి 68 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి చివరి ఒక్కరోజే 56,980 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈసారి చివరి నాలుగు రోజుల్లోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 15న సెలవు దినాన్ని మినహాయిస్తే 14,16,17, 18 తేదీల్లో కలిపి 1.10 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. ఆదిలాబాద్లో 979, ఆసిఫాబాద్లో 967 దరఖాస్తులు వచ్చాయి. ఇక, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల జాబితాలో నిర్మల్ (1,019), గద్వాల (1,179), వనపర్తి (1,329) ఉన్నాయి. ఈ దరఖాస్తుల సరళిని బట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపార రంగ సంస్థల యజమానులతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ వ్యాపారులు కూడా దరఖాస్తు చేసి ఉంటారని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మాకొద్దీ మాయదారి మద్యం
పలమనేరు/బైరెడ్డిపల్లి (చిత్తూరుజిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మేకల మాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎవరు అతిక్రమించినా జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ చేయాలని సర్పంచ్తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మేకల మాగిరెడ్డిపల్లిలో మొత్తం 270 కుటుంబాలు, రెండు వేల దాకా జనాభా ఉన్నారు. దాదాపు అందరికీ కూలీనాలీయే జీవనాధారం. అయితే కొన్నాళ్లుగా కొందరు కర్ణాటక టెట్రాప్యాకెట్లను తెచ్చి గ్రామంలో అమ్ముతున్నారు. దీంతో యువకులు మద్యానికి బానిసలై కుటుంబాలకు భారంగా మారారు. దీన్ని గమనించిన సర్పంచ్ బాలకృష్ణ గ్రామ పెద్దలతో చర్చించి వారం రోజుల కిందట పంచాయితీ పెట్టించారు. తమ గ్రామం బాగుపడాలంటే ఊర్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగినా, కర్ణాటక నుంచి ఎవరైనా మద్యం తెచ్చి అమ్మినా వారికి రూ.20 వేల జరిమానాతో పాటు, గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. ఫలితంగా గ్రామంలో వారం నుంచి మద్య పానం ఆగిపోయింది. అమ్మకాలు నిలిచిపోయాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. మా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలైపోవడంతో కలత చెందాం. దీంతో పాటు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లను తెచ్చి విక్రయించేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో గ్రామంలో యువకులు చెడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. – బాలకృష్ణ, సర్పంచ్, ధర్మపురి పంచాయతీ -
ఢిల్లీ మద్యం కుంభకోణం: మనీష్ సిసోడియా రూ.52 కోట్ల ఆస్తుల అటాచ్..
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య, ఇతరులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్డడీలో ఉన్నారు. అన్దీప్ సింగ్ ధాల్, రాజేశ్ జోషీ, గౌతమ్ మల్హోత్రాతో పాటు మరికొందరి ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు అకౌంట్లలో రూ.11 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సిసోడియాకు సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన మరుసటి రోజే ఈడీ ఆస్తుల అటాచ్ చర్యలకు పూనుకుంది. దేశ రాజధానిలోని నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాదే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియా ఇమేజ్ను దెబ్బతీయడానికే కేంద్రం కట్టుకథలు అల్లుతోందని అన్నారు. ఈడీ సీజ్ చేసిన రెండు ఫ్లాట్లలో ఒకటి 2005లోనే కొనుగోలు చేయగా.. మరొకటి 2018లో కొన్నట్లు చెప్పారు. మద్యం పాలసీ కంటే ముందే ఆ ఆస్తులను కొన్నట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చిందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
90ఎం.ఎల్. పోయట్లేదు.. బెల్ట్షాప్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలోని బెల్ట్షాపు నిర్వాహకుడు మద్యం పోయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హబ్సీపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి మంగళవారం ఉదయం గ్రామంలోని రవికి చెందిన బెల్ట్షాపులోకి వెళ్లాడు. తనకు 90 ఎం.ఎల్.మద్యం పోయాలని కోరగా.. అందుకు నిర్వాహకుడు నిరాకరించాడు. అయితే, తనను కులం పేరుతో తిట్టడమే కాక తనకు మద్యం పోయకుండా అవమానించాడని బాధితుడు రాత్రి పోలీసుస్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గోవా టూ గోదావరి.. కేడీ లేడీల లిక్కర్ దందా
కైకలూరు: ఏలూరు జిల్లాలోకి గోవా మద్యం అక్రమ రవాణా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కైకలూరు రైల్వేస్టేషన్లో బుధవారం ముగ్గురు మహిళల నుంచి 24 బ్యాగులలో ఏకంగా 2,949 మద్యం బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.4,54,400 ఉంటుందని అంచనా. తెలంగాణ కాదు.. గోవా బెటర్ గతంలో తెలంగాణ నుంచి అక్రమ మద్యాన్ని ఏపీకి తెచ్చేవారు. తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణాకు చెక్పోస్టుల వద్ద అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు ట్రైన్ల ద్వారా గోవా నుంచి ఏపీ రవాణా చేస్తున్నారు. వామ్మో కిలాడీ లేడీస్ బాపట్ల జిల్లా చీరాల మండలం, ఓడరేవుల గ్రామం వైఎస్సార్కాలనీకి చెందిన మహిళలు ఈ మద్యం రవాణాలో కీలక పాత్ర పోషిస్తోన్నారు. గతంలో వీరిపై సారా విక్రయ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కొందరు ముఠాలుగా ఏర్పడి ముంబయి మీదుగా గోవాకు రైలులో చేరుకుంటున్నారు. కొన్ని రైళ్లే కన్వినీయంట్ అక్కడ మద్యం కొనుగోలు చేసి తిరిగి ముంబయి–విశాఖ ఎల్టీటీ రైలు ద్వారా ఆంధ్రాకు వస్తున్నారు. ఇలా నెలలో ముఠాలు రెండు సార్లు వెళ్లి వస్తున్నారు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను లగేజీ బ్యాగ్లలో ప్యాకింగ్ చేయడానికి ప్రత్యేక ముఠా గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. గస్తీ లేని స్టేషన్ల ఎంపిక గోవా నుంచి ముంబయి, విజయవాడ మీదుగా విశాఖపట్నం ఎల్టీటీ రైలు రాత్రి వేళలో ప్రయాణిస్తోంది. ఈ రైలును అక్రమ రవాణాకు ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా నలుగురు మహిళలు వేర్వేరు బోగీలలో మద్యం సీసాల లగేజీ బ్యాగులను సీటు అడుగుభాగంలో ఉంచుతున్నారు. లగేజీ మాటున లిక్కర్ ఉదయం విజయవాడ దాటిన తర్వాత రైల్వేస్టేషన్లలో పోలీసుల గస్తీ తగ్గుతుంది. విజయవాడ స్టేషన్ తర్వాత ఎల్టీటీ ట్రైన్ గుడివాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం వంటి స్టేషన్లలో ఆగుతోంది. వీరు కై కలూరు, ఆకివీడు స్టేషన్లలో లగేజీలు దించుతున్నారు. ఎక్స్ ప్రెస్ నుంచి ప్యాసింజర్ ఆ తర్వాత పాసింజర్ రైలులో ఎక్కించి రామవరప్పాడు స్టేషన్లో దిగి అక్కడ నుంచి వాహనాల ద్వారా అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ ముఠాలో సభ్యులు ఆయా స్టేషన్ల వద్ద ముందుగానే ఉంటూ ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా మహిళలకు సమాచారాన్ని అందిస్తున్నారు. లాభం ఎంతంటే.? గోవాలో ఫుల్బాటిల్ ధర రూ.270 ఉంటే ఇక్కడ రూ.800 నుంచి రూ.1000, క్వార్టర్ బాటిల్ రూ.26 ఉంటే ఇక్కడ రూ.150 నుంచి రూ.200కి విక్రయిస్తున్నారు. రైలులో వీరు బ్యాగులను అక్కడక్కడ సీట్ల కింద ముందుగానే సర్ధుతున్నారు. దీంతో పోలీసులు ప్రయాణికుల బ్యాగులుగా భావించి తనిఖీ చేయడం లేదు. రైల్వే పోలీసుల నిఘా లేనిచోట ముందుగానే గమనించి ఆ స్టేషనలో అక్రమ మద్యాన్ని దించుతున్నారు. అక్రమ మద్యం విక్రయాలు అడ్డుకుంటాం స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో(సెబ్) సిబ్బంది మద్యం అక్రమ విక్రయాలపై దాడులు చేస్తుంది. పోలీసులు గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. రైలు, బస్ స్టేషన్ల వద్ద ఎవరైన అనుమానంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో మరిన్ని తనిఖీలు చేపడతాం. – ఆకుల రఘు, పట్టణ సీఐ, కై కలూరు -
30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్.. తాజాగా తాగి వాగేసి.. దొరికేశాడు
ముంబై: లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ 1993లో ఒక వృద్ధ జంటను హత్యచేసి వారింట్లో దొంగతనం చేశాడు. తర్వాత ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. పరారీలో ఉండి 30 ఏళ్ళు రాజాలా బ్రతికాడు. చివరికి ఒక ఫంక్షన్లో బాగా తాగి ఆ మర్డర్ గురించి వాగి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. లోనావాలాలో చిన్న వ్యాపారం చేసుకునే అవినాష్ పవార్ అనే ఆసామి ఇద్దరు సహచరులతో కలిసి సమీపంలోని ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధ జంటను హత్య చేసి వారింట్లో దొంగతనం చేశారు. తర్వాత పోలీసు విచారణలో మిగతా ఇద్దరు పట్టుబడగా అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. అప్పటికి అవినాష్ వయసు 19 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. తన భార్య రాజకీయంగా ఎదగడానికి కూడా తడ్పడ్డాడు. ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగు కాలవలో పడి చనిపోయినట్టు మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఓ పార్టీలో ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను విక్రోలిలో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం గాలిస్తూనే ఉన్నాము. అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడు. ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని గాని తన భార్య తల్లిదండ్రులను గాని చూడటానికి రాలేదు. చివరకు ఇలా విక్రోలీలో పట్టుబడ్డాడని తెలిపారు. -
అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో,భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు
ప్రపంచంలోని అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ డియాజియో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,భారత సంతతి చెందిన ఇవాన్ మెనెజెస్ ఇక లేరు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాలనుకుంటున్న 64 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ మెనెజెస్ లండన్లో (బుధవారం జూన్ 7) కన్నుమూశారు. రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీతోపాటు, పలువరు ప్రముఖులు, కంపెనీ సహచరులు ఇవాన్ మరణంపై ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కడుపులో అల్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అత్యవసర శస్త్రచికిత్స తర్వాత, ఏర్పడిన సమస్యల కారణంగా ఇవాన్ కోలుకోలేకపోయారని డియా జియో ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలోని పూణేలో పుట్టారు ఇవాన్.తండ్రి, మాన్యువల్ మెనెజెస్, భారతీయ రైల్వే బోర్డు అధిపతి. ఇవాన్ మెనెజెస్ తన చదువుల కోసం ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీతో పాటు అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసించారు. 1997నుంచి మెనెజెస్ డియాజియోలో కీలక వ్యక్తిగా ఉన్నారు. భారీగా ఆదాయాన్ని పెంచడంతోపాటు, అనేక బ్రాండ్స్తో విజయవంతంగా నడిపించారు. 2012 జూలైలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, 2013 జూలైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైనారు. అయితే అనారోగ్యం కారణంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.(ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం మెనెజెస్ తన పదవీ కాలంలో సాధించిన విజయాలను గుర్తిస్తూ ఇటీవల జారీప్రకటనలో "ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన, విశ్వసనీయమైన ,గౌరవనీయమైన వినియోగదారు ఉత్పత్తి కంపెనీలలో ఒకటిగా అవతరించడం లక్ష్యంగా డియాజియో పురోగతి సాధించిందంటూ మెనెజెస్ను అభింనందించింది. ఇవాన్ నాయకత్వంలో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసిందని, ఫలితంగా 180 కంటే ఎక్కువ మార్కెట్లలో 200 బ్రాండ్లను విక్రయిస్తోందనీ, స్కాచ్ విస్కీ, వోడ్కా, జిన్, రమ్, కెనడియన్ విస్కీ, లిక్కర్లు టెక్విలాలో నికర అమ్మకాల విలువలో నంబర్ వన్ కంపెనీగా ఉందపి మార్చి 28 ప్రకటనలో పేర్కొంది. జానీ వాకర్ విస్కీ, టాంక్వెరే జిన్, డాన్ జూలియో టేకిలా వంటి బ్రాండ్లకు పేరు గాంచింది డియాజియో. జూన్ 2023 నాటికి డియాజియో మార్కెట్ వాల్యుయేషన్ 96.16 బిలియన్ డాలర్లు. మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలో 144వ అత్యంత విలువైన సంస్థ డియాజియో. -
కర్ణాటక ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బు.. ఎన్ని కోట్లు దొరికాయంటే?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో మొత్తం రూ.375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు ఎన్ని కోట్లు సీజ్ అయ్యాయంటే.. ►నగదు రూ.147.46 కోట్లు ►దొరికిన మద్యం విలువ రూ.83.66 కోట్లు ►దొరికిన డ్రగ్స్ విలువ రూ.23.67 కోట్లు ►దొరికిన వస్తువుల విలువ రూ.96.6 కోట్లు ►ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ రూ.24.21 కోట్లు దీంతో ఎన్నికల సంఘం సోదాల్లో ఇప్పటివరకు మొత్తం రూ.375.61 కోట్లు పట్టుబడినట్లయింది. అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.83.93 కోట్లు పట్టుబడితే ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న(బుధవారం) జరగనుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: యాద్గిర్... బరాబర్.. కల్యాణ కర్ణాటకలోని గ్రామీణ జిల్లాలో రసవత్తర పోరు -
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
ఇళ్లకే మద్యం పంపిణీ అయ్యేలా గ్రీన్ సిగ్నల్..పెళ్లిళ్లలో కూడా తాగొచ్చు..
సాధారణంగా మద్యం విక్రయించాలంటే లైసెన్స్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు క్లబ్లు, స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యం వినియోగం కోసం లైసెన్స్ ఇచ్చేవారు. ఇక ఇళ్లలోని ఫంక్షన్స్ ఉత్సవాలు, స్టేడియం నుంచి జాతీయ, అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాల వరకు అన్ని చోట్ల మద్యం సర్వ్ చేయాలన్న లేదా కలిగి ఉండాలన్న లైసెన్స్ ఉండాల్సిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం 'ఎఫ్.ఎల్.12' అనే ఒక ప్రత్యేక లైసెన్స్ని తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని కూడా ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది. మద్యం అమ్మకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది తమిళనాడు ప్రభుత్వం. అందులో భాగంగానే మద్య అమ్మకాలు పెంచేలా ఈ ప్రత్యేక లైసెన్స్ని తీసుకువచ్చింది. దీంతో పెళ్లిళ్లలోనూ, ఇతర శుభాకార్యల్లోనూ మద్యం సేవించడానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం వాణిజ్య సముదాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక లైసెన్స్ వివరాలు.. దీన్ని డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్(ఎక్సైజ్) జారీ చేస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ లైసెన్స్ అతిథులు, సందర్శకుల తోపాటు అంతజర్జాతీయ లేదా జాతీయ ఈవెంట్లలో పాల్గొనేవారికి సర్వ్ చేసేందుకు, కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. దీని ఈవెంట్ తేదీ ఏడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆయా ప్రదేశాల్లో మద్యం విక్రయించాలంటే ఈ ప్రత్యేక లైసెన్సు ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్నికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్యపరమైన ఈవెంట్లకు ప్రత్యేక లైసెన్స్ వార్షిక రుసుము కింద మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. లక్ష, మున్సిపాలటీల్లో రూ. 75వేలు, ఇతర ప్రదేశాల్లో రూ. 50,000 వరకు ఉంటుంది. అదే ఒక్కరోజు ఈవెంట్ నిర్వహణకు అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 11 వేలు, మున్సిపాలటీల్లో రూ. 7500, ఇతర ప్రదేశాల్లో రూ. 5వేలు వరకు ఉంటుంది. ఇక గృహ వేడుకల సమయంలో నాన్-కమర్షియల్గా ఒక్కరోజుకి ఈ ప్రత్యేక లైసెన్స్ను రూ. 11,000 (మునిసిపల్ కార్పొరేషన్లలో), రూ. 7,500 (మున్సిపాలిటీలలో) రూ.5 వేలు(ఇతర ప్రదేశాల్లో). (చదవండి: ఆరోగ్య మంత్రి వీడియో చాట్ దుమారం.. బీజేపీ రాజీనామా డిమాండ్) -
కవితతో జరిపిన వాట్సాప్ చాట్ విడుదల
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
-
ఎన్నికలొచ్చినయ్.. ఓటర్లను తడిపేస్తున్నరు
బెంగళూరు: ఎన్నికలొస్తే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానారకాల ప్రయత్నాలు సాగుతుంటాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. అక్కడి అన్ని పార్టీలకు కీలకమే. జాతీయ పార్టీలైతే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్గా భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రచారం జోరందుకోగా.. అదే సమయంలో ఓటర్లపై విపరీతమైన ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కన్నడనాట ప్రస్తుతం క్యాష్, మద్యం, డ్రగ్స్ జోరు కనిపిస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం మార్చి 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలుకాగా.. ఉచిత హామీలతో పాటు ప్రచారంలో ప్రలోభాల పర్వం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నగదు, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే నిప్పాణి, భద్రావతి, గడగ్, నరగుండ్ ఏరియాల్లో మొత్తంగా రూ.4.45 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. 62వేల లీటర్ల మద్యం( రూ.కోటి 89 లక్షల విలువ) సైతం ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీం.. ధార్వాడ్ నియోజకవర్గంలో 45 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే.. బెంగళూరు నగరంలోని బైటరాయణపుర నియోజకవర్గంలో 34 లక్షల విలువ చేసే ఉచిత కానుకలను ఓటర్లకు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు.. బెలగావి ఖానాపూర్ తాలుకాలో ఏకంగా రూ.4.61 కోట్ల క్యాష్, 21 లక్షల విలువ చేసే బంగారం, మరోచోట 19 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 12 కోట్లు విలువ చేసే కానుకలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.27.38 కోట్ల నగదును రూ. 26.38 కోట్ల విలువైన మద్యాన్ని రూ.88 లక్షల డ్రగ్స్ను, రూ.9.87 కోట్లు విలువ చేసే బంగారం రూ.12.49 లక్షల ఇతర వస్తువులను అధికారులు గత 24 గంటల్లో స్వాధీనం చేసుకున్నారు. న్యామతి తాలూకాలోని జీనహళ్లి చెక్పోస్టు వద్ద పోలీసులు తనీఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా.. వాళ్ల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో ప్రశ్నించారు. తనిఖీలు చేస్తే.. నడుముకు దండలాగా ఏడున్నర లక్షల రూపాయల 500 నోట్ల కట్టలను కట్టుకోవడాన్ని గుర్తించారు. నగదు ఎక్కడిది అని పోలీసులు వారిని ప్రశ్నించగా.. ఎన్నికలొచ్చినయ్.. ఎటు చూసినా లిక్కర్, నోట్ల కట్టలే!నిందితులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో స్వాధీనం చేసుకున్నారు. -
ముంబైలో కీర్తి.. ఎత్తిన బాటిల్ దించకుండ తాగి షాకిచ్చిన ‘మహానటి’
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: జూనియర్తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం
పెనమలూరు: మిత్రులంతా కలసి సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్నగర్లోని జారా రెస్టారెంట్ యజమాని అబ్దుల్రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్ నిర్వహించే షేక్ ఖలీషా అలియాస్ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్ వద్దకు వచ్చారు. వీరు ఘాట్ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఉదయం వెలుగు చూసిన ఘటన.. కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్ ఆచూకీ తెలియలేదు. గల్లంతైన కిరణ్ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. -
తెలంగాణలో పడిపోయిన మద్యం అమ్మకాలు
-
చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!
సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆధిపత్య పోరుతోనే... టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం. కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్.. తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ మండల టీడీపీ కన్వీనర్ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది. సంబరాల్లో మరో వర్గం.. మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. (చదవండి: సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్) -
వాహనదారులకు షాక్.. పెట్రోల్, డీజిల్పై రూ.2 సెస్..ఎక్కడంటే?
తిరువనంతపురం: వాహనదారులకు కేరళ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.2 సెస్ విధించనున్నట్లు తెలిపింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ బడ్జెట్ ప్రసంగంలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. కేరళలో ఎల్డీఎఫ్ రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన రెండో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రాష్ట్రంలో ఇకపై సోషల్ సెక్యూరిటీ సెస్ పేరుతో లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.2 అదనంగా వసూలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. తద్వారా సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్కు రూ.750 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అలాగే భారత్లో తయారయ్యే విదేశీ లిక్కర్ బ్రాండ్ మద్యంపై రూ.20, రూ.40 సెస్ విధించనున్నట్లు బాలగోపాల్ వెల్లడించారు. రూ.500-999 ధర గల లిక్కర్ బాటిళ్లపై రూ.20 సెస్, ధర రూ.1000కి ఎక్కువగా ఉండే బాటిళ్లపై రూ.40 సెస్ విధించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా రూ.400 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంధనం, మద్యంపై సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదని మంత్రి తెలిపారు. చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..! -
కల్తీ కేరాఫ్.. ఆ నలుగురు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఓ ఇద్దరు కల్లు డిపోల నిర్వాహకులు..ఓ మద్యం వ్యాపారి..ఓ నకిలీ లిక్కర్ తయారీదారు.. ఉమ్మడి పాలమూరులో కల్తీ కల్లు, నకిలీ మద్యం దందాకు కేరాఫ్ వీళ్లేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి ఓ అధికారి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఓ ఎక్సైజ్ అధికారి కనుసన్నల్లో సిబ్బంది నిర్బంధ వసూళ్లకు పాల్పడుతుండగా, కల్లు డిపోల నిర్వాహకులు, మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం.. లిక్కర్లో ఘాటు పెంచే స్పిరిట్ సరఫరా జోరుగా సాగుతోంది. మరోవైపు పేరున్న మద్యం బ్రాండ్లలో మూతలు తీసి నీరుపోసేందుకు ఓ ముఠా ఇటీవల సరిహద్దులు దాటి వచ్చి ఐదు జిల్లాల్లో కార్యకలాపాలు విస్తరించింది. అయినా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిద్ర‘మత్తు’వీడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార’పార్టీ నేతల బినామీలే కల్తీ కల్లు, నకిలీ మద్యం దందా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్శాఖ చేతులెత్తేసిందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం, కల్లు కల్తీ రాకెట్ సూత్రధారులు, పాత్రధారులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. ఇద్దరి కీలక పాత్ర ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నారాయణ పేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా లకు ఆ్రల్ఫాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేయడంలో మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఈ నిషేధిత పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఎవరికి వారు జిల్లాలు, మండలాలు, ప్రాంతాల వారీగా పంచుకుని ఏజెంట్లను పెట్టుకుని కోడ్ భాష ఆధారంగా సరుకును ఆయా డిపోలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నువ్వా? నేనా? మహబూబ్నగర్ పట్టణ శివారులో ఆ ఇద్దరికి సంబంధించిన కల్లు కాంపౌండ్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి. అటు నిషేధిత మత్తు పదార్థాల రవాణాతో పాటు సదరు కాంపౌండ్లలో కల్లు విక్రయాల్లో కూడా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఒకరికి పట్టణ ప్రధాన కూడలిలో టైర్ల షాపు ఉంది. ఇతను తన పోటీదారుడిని, అతడి కాంపౌండ్లోకి కల్లు తాగేందుకు వెళ్లేవారిని బౌన్సర్లతో నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత అండదండలు తనకే ఉన్నాయని సదరు వ్యక్తి దబాయిస్తుండగా, ప్రస్తుతం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పంచాయితీ సదరు ముఖ్యనేత వద్దకు చేరడంతో, తాను సమస్య పరిష్కరిస్తానని, గొడవలు పడొద్దని మందలించినట్లు సమాచారం. బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో నీళ్లు! ఇక ఉమ్మడి జిల్లాలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా సాగుతుండడంతో వాటిలో స్పిరిట్ కలుపుతూ కల్తీ చేస్తున్నారు. అంతేకాదు వైన్స్లతోపాటు బార్లలో బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ బాటిళ్లలో 40 శాతం మేర మద్యం తీసి నీరు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక ఓ మద్యం వ్యాపారి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి ఆధ్వర్యంలోనే వికారాబాద్ నుంచి వచి్చన ఎవరూ కనిపెట్టని విధంగా లిక్కర్ మూతలు తీసి, పెట్టే గ్యాంగ్ పాలమూరులో కార్యకలాపాలను విస్తరించినట్లు సమాచారం. మునుగోడులో కల్తీ లిక్కర్ వెనుక గద్వాల కింగ్! నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కల్తీ లిక్కర్ ఏరులై పారింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దీన్ని గుర్తించిన అధికారులు కూపీ లాగారు. అనుమతి లేకుండా డిస్టిలరీ ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఉమ్మడి నల్లగొండతో పాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు తరలించినట్లు సమాచారం. ఇందులో బాలరాజుగౌడ్ కీలకంగా వ్యవహరించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గద్వాల జిల్లా పాతపాలెంకి చెందిన లిక్కర్ కింగ్ వెంకన్నగౌడ్ హస్తం కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఇతను కర్ణాటక లిక్కర్ను తెలంగాణ, ఏపీకి అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు చిక్కగా ఇరు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తన స్వగ్రామమైన పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తూ కూడా పట్టుబడ్డాడు. గతేడాది నవంబర్లో రూ.10 లక్షల విలువ చేసే 750 కిలోల సీహెచ్ను హైదరాబాద్లో కొనుగోలు చేసి కర్నూలుకు తరలిస్తున్న క్రమంలో భూత్పూర్ సమీపంలో పట్టుకున్నారు. ఇటీవల ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ బైండోవర్తో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
నీకో పెగ్గు.. నాకో పెగ్గు..! అంబులెన్స్ ఆపి పేషెంట్తో డ్రైవర్ లిక్కర్ పార్టీ
భువనేశ్వర్: ఏదైన ప్రమాదం జరిగినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అంబులెన్స్. వెంటనే ఫోన్ కొట్టి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు అంతా పక్కకు తప్పుకుని దారి ఇస్తారు. కానీ ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. లిక్కర్ కోసం వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు నిలిపేసిన సంఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అంతే కాదండోయ్..! అంబులెన్స్లోని రోగికి సైతం ఓ పెగ్గు అందించిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఒడిశా జగత్సింగ్పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన డ్రైవర్.. లిక్కర్ బాటిల్ తీసి గ్లాసులో పోసుకొని తాగటం ప్రారంభించాడు. వాహనంలోని పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దానిని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు. దీనిని చూసిన వాహనదారులు.. అంబులెన్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. బాధితుడే మద్యం అడిగారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక -
తెలంగాణాలో 3 కోట్ల విలువైన నకిలీ మద్యం సీజ్
-
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదేశాడు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది. ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ) -
ఈ బీరు ఖరీదు 4 కోట్లు
హే... బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ.. బీరు కు మరీ అంత కాస్ట్ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ఎందుకంటే అది 140 ఏళ్ల కిందటిది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. అదే దీన్ని అత్యంత ఖరీదైన మద్యంగా చేసింది. ఒక్లోహామాకు చెందిన ఓ వ్యక్తి 2007లో ఈ బీర్ ‘ఆల్సాప్స్ ఆర్కిటిక్ ఆలె’ని మసాచుసెట్స్కు చెందిన ఓ సెల్లర్ నుంచి కొన్నాడు. షిప్పింగ్తో కలిపి రూ. 24 వేలు అయ్యింది. ఆ బాటిల్తో పాటు... లామినేట్ చేసిన చేతిరాత నోట్ ఒకటి వచ్చింది. ‘ఈ బాటిల్ను 1919లో నేను పొందాను. దీన్ని 1852లో ఆర్కిటిక్ యాత్ర కోసమే తయారు చేశారు’ అని ఆ బాటిల్ అమ్మిన పెర్సీ.జి.బోలస్టర్ పేర్కొన్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆసక్తితో పరిశోధిస్తే ఈ చరిత్ర తెలిసింది. ‘ఆ బీర్ను సర్ జాన్ ఫ్రాంక్లిన్ ఆర్కిటిక్ యాత్ర కు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లారు. అప్పటికే ఆ వాయవ్య మార్గంలో రెండుసార్లు ప్రయాణించిన ఫ్రాంక్లిన్ బృందాన్ని ఆ యాత్ర మింగేసింది. రెండు ఓడలు మునిగిపోయాయి. 129 మంది మరణించారు. వారిని వెదకడానికి వెళ్లిన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ బెల్చెర్కు.. వాళ్లు తీసుకెళ్లిన సరుకుల్లో ఈ బీర్ మాత్రమే దొరికింది’ అని తెలుసుకున్నాడు. ఆ అరుదైన బీర్ను ఈబేలో వేలం వేస్తే... 157కు పైగా బిడ్లు వచ్చాయి. చివరకు రూ.4 కోట్లకు ఆ బాటిల్ను ఎవరో కొనుగోలు చేశారు. దాన్ని తాగారా? లేదా? అనేది మాత్రం తెలియదు. -
మునుగోడులో పట్టుబడ్డ డబ్బు, మద్యం
-
పండుగ ధమాక షురూ!.. ఇంటింటికి కిలో చికెన్, మద్యం, క్రాకర్స్ బాక్స్
సాక్షి, నల్లగొండ: పండుగ ధమాక షురూ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పండుగ తాయిలాల పంపిణీని ప్రారంభించాయి. చికెన్, మద్యంతోపాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇస్తున్నాయి. అంతేకాదు.. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీగా ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ ఓటర్ల ఇంటికే చికెన్, క్రాకర్ బాక్సుల పంపిణీని ఆదివారమే ప్రారంభించింది. మరో పార్టీ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం కల్లా పిల్లలకు క్రాకర్స్ అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మరోవైపు పెద్దలకు మద్యం బాటిళ్ల పంపిణీని కూడా షురూ చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు కొన్ని చికెన్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇచ్చారు. వాటిన్నంటిని తీసుకెళ్లి, ఆయా గ్రామాల్లో ఇంటింటికి పంచేందుకు కొందరు గ్రామ నాయకులకు బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులను పురమాయించినట్లు సమాచారం. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే గ్రామ, మండల స్థాయి నేతలకు బెస్ట్ ఆఫర్లు గ్రామ మండల స్థాయి నాయకులకు ప్రధాన పార్టీలు దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్ద మొత్తంలో బొనాంజా ప్రకటించాయి. భారీ మొత్తంలో నగదును నజరానాగా అందజేస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ వార్డు సభ్యుని నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకుని వరకు ఓట్లు వేయించగలిగే సత్తాను బట్టి రూ.25 వేల నుంచి రూ.2లక్షలు వరకు ముట్టజెప్తున్నట్లు తెలిసింది. మరో ప్రధాన పార్టీ వారు కూడా రూ.10వేల నుంచి మొదలుకొని రూ.లక్షన్నర వరకు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల పుణ్యమాని నియోజకవర్గంలో పండుగ అంతా పార్టీల విందులతోనే గడిచిపోతోంది. గత కొన్ని రోజులుగా నియోకవర్గంలో పొద్దంతా ప్రచారం, సాయంత్రం మద్యం సిట్టింగ్లు వేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో బయట నిర్వహించే సిట్టింగ్లు బంద్ చేసి ఇంటికే మద్యం, మాంసం పంపిణీలో పడ్డాయి. చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు మహిళలకు చీరలు.. దీపావళి సందర్భంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఓ పార్టీ నాయకులు మునుగోడు, మర్రిగూడ మండలాల్లో చీరల పంపిణీని ప్రారంభించింది. మరో పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. చీరలు పంచితే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో చీరలు కొనుక్కొమ్మని డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. -
వామ్మో!.. ఆరు నెలల్లోనే.. 16 కోట్ల లీటర్ల బీరు తాగేశారు
సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల గణనీయంగా తగ్గిపోయిన మద్యం విక్రయాలు ఇప్పుడు అంతకు రెట్టింపు జోరందుకున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల మద్యం విక్రయాలతో పోలిస్తే యువతకు అత్యంత ప్రియమైన బీరు విక్రయాలు గణనీయంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే ఆరు నెలల్లో 81 శాతం బీరు విక్రయాలు అదికంగా జరిగాయి. ఈ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి సుమారు రూ.10 వేల కోట్లు రెవెన్యూ వచ్చిందని రాష్ట్ర ఆదాయ శాఖలో నమోదైన గుణంకాలను బట్టి తెలిసింది. కరోనాతో పడిపోయిన అమ్మకాలు... కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల దాదాపు 90 శాతం జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేగాకుండా వాణిజ్య సంస్థలు, షాపులు, కార్యాలయాలు, పబ్లు, బార్లు మూసి ఉండటంతో ఎలాంటి పార్టీలు జరగలేదు. దీని ప్రభావం మద్యం విక్రయాలపై తీవ్రంగా చూపింది. కానీ ఈ ఏడాది గణనీయంగా మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 16.90 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. అదే గత సంవత్సరం ఇదే కాలంలో 9.32 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. అదే విధంగా ఈ ఏడాది ముంబైలో ప్రజలకు ప్రియమైన వైన్, మద్యం విక్రయాలు 51.52 శాతం పెరిగింది. ఆరు నెలల కాలంలో ఏకంగా 49 లక్షల లీటర్ల వైన్ విక్రయం జరగ్గా గత సంవత్సరం ఆరు నెలల కాలంలో 32.4 లక్షల లీటర్ల వైన్ విక్రయం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వైన్కు చాలా డిమాండ్ ఉందని విక్రయాలను బట్టి స్పష్టమవుతోంది. అదేవిధంగా విదేశీ మద్యం గత సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబరు మధ్య కాలంలో 10.34 కోట్ల లీటర్ల మద్యం విక్రయం జరగ్గా ఈ సారి 12.97 కోట్ల లీటర్లకు చేరింది. దేశీ మద్యం విక్రయాలు 15 కోట్ల లీటర్ల నుంచి 18.94 లీటర్లకు చేరింది. దేశీ, విదేశీ విక్రయాల్లో సుమారు 26 శాతం పెరిగిందని స్పష్టమైతోంది. మద్యం విక్రయాలు పెరగడంవల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖాజనాలోకి భారీగా ఆదాయం వచ్చి చేరుతోంది. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అక్టోబరు 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి సుమారు రూ.10 వేల 34 కోట్ల ఆదాయం వచి్చంది. అదే గత సంవత్సరం ఇదే సమయంలో సుమారు రూ.7.198 కోట్ల ఆదాయం వచ్చింది. దీన్ని ఈ ఏడాది ఏకంగా 39.4 శాతం ఆదాయం అదనంగా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. కరోనా కాలంలో బీరు విక్రయాలు 33 శాతం మేర తగ్గిపోయాయి. రాష్ట్రంలో 2019–20 లో 29 కోట్ల 79 లక్షల లీటర్ల బీరు విక్రయం జరిగింది. అదే కరోనా లాక్డైన్ కాలంలో అంటే 2020–21లో బీరు విక్రయం 20 కోట్ల లీటర్లకు పడిపోయింది. అదే 2021–22లో రాష్ట్ర వ్యాప్తంగా 23.13 లక్షల లీటర్ల బీరు విక్రయం జరిగింది. గత సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 9 కోట్ల 32 లక్షల లీటర్ల బీరు అమ్ముడు పోయింది. కానీ ఈ ఏడాది 81 శాతానికి పెరిగి ఆరు నెలల్లో 16 కోట్ల 90 లక్షల లీటర్లకు చేరుకుంది. ఇందులో అధిక అంటే 145 శాతం విక్రయం పర్భణి జిల్లాలోనే జరిగింది. ఆ తరువాత హింగోళి 125 శాతం, నాగ్పూర్లో 120 శాతం, యవత్మాల్లో 111 శాతం, నాసిక్, పుణే జిల్లాల్లో 109 శాతం, బీడ్లో 108 శాతం పెరిగినట్లు నమోదైంది. ముంబైకర్లు బీరు ప్రియులు... ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండ తాపం, ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరణ కారణంగా ముంబై, మహారాష్ట్రలో బీర్ వినియోగం పెరిగింది. ముంబై నగరం, సబర్బన్ జిల్లాల్లో అమ్మకాలు 157.93% పెరిగాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ మేలో 2020 సంబంధిత కాలంతో పోలిస్తే. మహారాష్ట్రలో, అదే వ్యవధిలో బీర్ అమ్మకాలు 199.25% పెరిగాయి. ఏప్రిల్ మే 2022లో, ముంబైవాసులు.. ముంబై నగరం సబర్బన్ జిల్లాల్లో వరుసగా 31.64 లక్షల బల్క్ లీటర్లు (ఎల్బీఎల్) 97.94 (ఎల్బీఎల్) బీర్ తాగారు, గత సంవత్సరం ఇదే కాలంలో 12.27, 48.17 కంటే తక్కువ. కోవిడ్ –19 పరిమితుల సడలింపు తర్వాత ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరణ కారణంగా తీవ్రమైన వేసవి వేడి, ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్లోకి రావడంతో ఈ వృద్ధి కనబడిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పరిశ్రమల వర్గాల అధికారులు గుర్తించారు. బీర్ ధరలు ఎక్కువగా ఉన్నందున, వినియోగదారులు ఇతర చౌక మద్యం తాగడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఎందుకంటే ఇది తక్కువ ధరలోనే ‘కిక్’ లేదా అధిక భావనను ఇస్తుంది. ముంబై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గత వేసవిలో వేడి తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బీర్ వినియోగానికి ఇది సరైన సమయంగా మద్యం ప్రియులు భావించారని మహారాష్ట్ర వైన్ మర్చంట్స్ అసోసియేషన్ చైర్మన్ దిలీప్ గియానాని అన్నారు. బీర్ తాగడం వల్ల కొన్ని వైన్ షాపుల్లో బీర్ నిల్వలు తగ్గాయని, విపరీతమైన డిమాండ్ నెలకొందని ఆయన అన్నారు. ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానంద్ శెట్టి కూడా ఈ వాదనతో ఏకీభవించారు. సాధారణంగా వేసవిలో బీర్ వినియోగం పెరుగుతుందని, గత సంవత్సరం, కోవిడ్–19 పరిమితుల కారణంగా అమ్మకాలు తీవ్రంగా పడిపోయి, వ్యాపారాలు దివాళా తీశాయని ఆయన చెప్పారు. -
Telangana: మద్యం అమ్మకాల రికార్డు.. ఏడాది రాబడి 9 నెలల్లోనే!
సాక్షి, హైదరాబాద్: మద్యం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సమకూరుతోంది. మందుబాబులు తెగ తాగేసి ఖజానాకు కాసుల కళ తెస్తున్నారు. ఏడాది మొత్తం అమ్మకాల ద్వారా వస్తుందని భావించిన రాబడి కేవలం తొమ్మిది నెలల్లోనే ఖజానాకు చేరే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. సంవత్సరం మొత్తం రూ. 22,500 కోట్ల మేర అమ్మకాలు సాగితే అందులో 70శాతం.. అంటే రూ.17,500 కోట్ల ఆదాయం రావచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్క. కానీ, తొలి ఆరునెలల్లోనే రూ.17,324 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్బీసీఎల్) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 70 శాతం అంటే... దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరిందన్నమాట. ఈ లెక్కనæ మరో రెండు నెలల్లోనే రూ.17,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందని అర్థమవుతోంది. 2021 నేషనల్ హెల్త్ సర్వే–5 ప్రకారం మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్ప్రదేశ్, సిక్కింల తర్వాత మూడోస్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 29 శాతానికిపైగా మందుబాబులున్నారు. ఈ మందుబాబులు తెగ తాగేస్తుండటంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు కూడా పెంచినందున అంచనాలకు మించి ఆదాయం వస్తుండటం గమనార్హం. నాలుగోవంతు రంగారెడ్డిలోనే.. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని బేవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ జిల్లాలో రూ. 3,970.82 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. రూ.వెయ్యి కోట్ల మార్కు దాటిన జిల్లాల్లో హైదరాబాద్ (రూ.1,828.10 కోట్లు), కరీంనగర్(1,469.93), ఖమ్మం(1,100.38), మహబూబ్నగర్ (1,233.53),మెదక్ (1,424.09), నల్లగొండ(1,774.46), వరంగల్ అర్బన్ (రూ.1,745.73 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రంలోని ఈ ఎనిమిది జిల్లాల్లోనే రూ.14 వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగ్గా, మిగిలిన అన్ని జిల్లాలు కలిపి రూ.3 వేల కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. కేసులవారీగా పరిశీలిస్తే గత ఆరునెలల్లో రాష్ట్రంలోని మందుబాబులు 1.7 కోట్ల లిక్కర్ కేసులు, 2.5 కోట్ల బీర్ కేసులు లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి. -
Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్
సాక్షి, బెంగళూరు: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్ 2న) బెంగళూరు గ్రామీణ జిల్లాలో మాంసం, మద్యం విక్రయాలను నిషేధిస్తూ కలెక్టర్ లత ఆదేశాలు జారీ చేసారు. శనివారం రాత్రి 11 నుండి మరుసటిరోజు ఆదివారం రాత్రి 12 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రజలు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్ కోరారు. చదవండి: (పోలీసుల మాస్టర్ప్లాన్: మొబైల్ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్) -
‘నా బిడ్డల మీద ఒట్టు.. అవి నా బ్రాండ్స్ కావు’
భువనేశ్వర్: అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఇంకేం.. ఆఫీస్ను తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నాడు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం చాలదన్నట్లు.. ఆఫీస్ వేళలో అదీ తన క్యాబిన్లోనే ఎంచక్కా చుక్కేశాడు. అంతటితో ఆగకుండా ఆ మైకంలో పచ్చిబూతులు మాట్లాడుతూ.. ఆ వీడియో, ఫొటోల ద్వారా వైరల్ అయిపోయాడు. ఒడిశా గాంజామ్ జిల్లా ఆరోగ్య విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో.. రాష్ట్రీయ బాల్ సురక్ష కార్యక్రమ(ఆర్బీఎస్కే), రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ(ఆర్కేఎస్కే) ప్రొగ్రామ్ల కింద అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు సందీప్ మిశ్రా. ఈయన వ్యవహార శైలిపై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈసారి పక్కా ఆధారాలతో ఆయన్ని పట్టించారు కొందరు ఉద్యోగులు. ఆఫీస్ వేళలో తన కుర్చీలో తాగుతూ ఆయన మాట్లాడిన మాటలు, ఫొటోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. వైరల్ వీడియో, ఫొటోలపై సందీప్ మిశ్రా స్పందించారు. ఇదంతా కుట్ర అని, అవి ఎడిటింగ్ చేసిన ఫొటోలనీ, తనను బద్నాం చేసేందుకు జరిగిన కుట్ర అని చెప్తున్నారాయన. ‘‘ఆఫీస్లో ఏనాడూ నేను మందు తాగలేదు. అసలు అందులో కనిపించిన బ్రాండ్లు నేనెప్పుడూ రుచి చూడలేదు. నా బిడ్డల మీద ఒట్టు.. అది మార్ఫింగ్ చేసినవి అయి ఉండొచ్చు’’ అని సందీప్ చెప్తున్నాడు. తాగిన మత్తులో ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడతాడని, మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తిస్తాడని ఓ ఉద్యోగిణి వెల్లడించారు. ఈ విషయంపై గాంజామ్ జిల్లా చీఫ్ డిస్ట్రిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా స్పందించారు. వీడియో తమ దృష్టికి రావడంతో సందీప్ మిశ్రాకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలిపారు. నివేదిక రాగానే చర్యలపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఇలా కూడా చేస్తారా? -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు
-
మందు మితంగా తాగితే మంచిదే అంటారుగా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. పిటిషన్ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
బిహార్లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్
పట్నా: బిహార్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం నిషేధ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం నితీశ్కు సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. నితీశ్ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసమే మద్యం నిషేధాన్ని ప్రకటించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, వాస్తవానికి మహిళలే నిషేధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం కోసం అడ్డదారులు తొక్కి మగవాళ్లు జైలు పాలైతే వారి కోసం మహిళలు కాళ్లరిగేలా స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పెచ్చుమీరిన అవినీతి కారణంగానే నిషేధం విఫలమైంది. అందుకే గొప్పలకు పోకుండా నిజాయతీగా ఈ విధానంపై సమీక్ష చేపట్టాలని సీఎంను కోరా’అని ఆయన వివరించారు. ‘జన్సురాజ్’ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టబోయే 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రకు ఏర్పాట్లను చంపారన్లో కిశోర్ సమీక్షించారు. మిస్టర్ సుంగోర్కిన్ యొక్క "ఆకస్మిక" మరణం మరొక రష్యన్ ఎలైట్, ఇవాన్ పెచోరిన్, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్, అతను స్పీడ్ బోర్డ్ నుండి ఓవర్బోర్డ్లో పడిపోయిన తర్వాత రహస్యమైన పరిస్థితులలో మరణించిన కొద్ది రోజులకే వచ్చింది. మిస్టర్ పుతిన్ స్వయంగా హత్యాయత్నం నుండి బయటపడినట్లు నివేదించబడిన ఒక రోజు తర్వాత కూడా ఇది వస్తుంది. టెలిగ్రామ్ ఛానెల్లోని ఖాతా ప్రకారం, మిస్టర్ పుతిన్ యొక్క లిమోసిన్ యొక్క ఎడమ ముందు చక్రం పెద్ద చప్పుడుతో కొట్టబడింది, యూరో వీక్లీ నివేదించింది, దాని నుండి పొగ వెలువడినప్పటికీ కారు త్వరగా సురక్షితంగా నడపబడిందని పేర్కొంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడు క్షేమంగా ఉన్నారని, అయితే పలువురిని అరెస్టు చేసినట్లు అవుట్లెట్ తెలిపింది. (చదవండి: వెనెకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా) -
బిహార్లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్
పట్నా: బిహార్లో ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతోంది. దీంతో స్వాధీనం చేసుకున్న బాటిళ్లను పారవేయడంలో తరుచుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ అన్నారు. ఈ మద్యం బాటిళ్లను మట్టిని తొలగించే ఎర్త్ మూవర్ మిషన్లతో చితక్కొట్టడం వల్ల భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకని ఈ వ్యర్థాలను తగ్గించేలా జీవనోపాధిని ఇచ్చేలా బిహార్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదే మద్యం బాటిళ్లతో గాజుల తయారీ. ఈ గాజుల తయారీని 'జీవిక పథకానికి' చెందిన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేసేందుకు బిహార్ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోహిబేషన్ శాఖ అందుకోసం దాదాపు కోటి రూపాయాల మొత్తాన్ని మంజూరు చేసింది. దీంతో ప్రోహిబేషన్ శాఖ గాజుల తరయారీ ముడి సరుకు కోసం జీవనోపాది కార్మికులను నియమించుకుంటుంది. ఆ కార్మికులకు పగిలిన మద్యం బాటిళ్ల పొడిని అందజేస్తారు. ఆ జీవనోపాది కార్మికులు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గాజులు తయారు చేయడంలో శిక్షణ పొందుతారు. తొలుత తయారీ యూనిట్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రానున్న నెలల్లో మరింతగా పెంచుతామని ప్రోహిబేషన్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఒక కుటీర పరిశ్రమలా పనిచేస్తుందన్నారు. అంతేకాదు దీన్ని మరింతగా విస్తరించగలమా లేదా అనే దానిపై నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో పేదరిక నిర్మూలన చేయడమే 'జీవిక పథకం' లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు మరింత ఉపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పట్నాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి బీహార్లో ఏప్రిల్ 2016లో మద్యం నిషేధించబడింది. దీనితో పాటు, మద్యం నిల్వ, వినియోగం, అమ్మకం, తయారీ వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. -
లిక్కర్ బాటిల్స్ దొంగిలిద్దామని వెళ్లారు.. కానీ!
-
మద్యం సేవించాలని మంత్రి ఉచిత సలహా.. వీడియో వైరల్
రాయ్పుర్: మద్యం సేవించటం ద్వారా కుటుంబాలు రోడ్డు పాలవుతాయని పెద్దలు చెబుతుంటారు. లిక్కర్కు దూరంగా ఉండాలని కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తుంటాయి ప్రభుత్వాలు. మద్యం హానికరం అని లిక్కర్ సీసాలపై పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. కానీ, డి-అడిక్షన్ కార్యక్రమం వేదికగా ఛత్తీస్గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్సాయి సింగ్ టెకమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందని, అయితే, కొద్ది మోతాదులో తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ‘నశా ముక్త్ అభియాన్’లో భాగంగా వద్రాఫ్నగర్లో డి-అడిక్షన్ కార్యక్రమం నిర్వహించారు పోలీసులు. పలు పాఠశాలలకు చెందిన పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా లిక్కర్ ప్రజలను ఏకం చేస్తుందటూ మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘ నేను ఓ మీటింగ్కు హాజరయ్యాను. అక్కడ ఓ వర్గం లిక్కర్ అనారోగ్యానికి గురిచేస్తుందని, దానిని తాగటం మంచిది కాదని వాదించింది. మరోవర్గం.. లిక్కర్ వల్ల లాభాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, లిక్కర్ ప్రతిఒక్కరిని కలుపుతుంది. కానీ, నియంత్రణ ఉండాలి. మనం సైతం ఉత్సవాలు, ఎన్నికల సమయంలో దానిని ఉపయోగిస్తాం. ’ అని పేర్కొన్నారు టెకమ్. బీజేపీ విమర్శలు.. లిక్కర్పై రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుట్టారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రాకర్. ‘భూపేశ్ బఘేల్ జీ ప్రభుత్వం, పార్టీ కార్టూన్లతో నిండిపోయింది. ఏఒక్కరికి విషయం అర్థంకాదు. ఇది పని చేసే ప్రభుత్వం కాదు. ఢిల్లీ(కాంగ్రెస్ అధిష్ఠానం) చేతిలో కీలుబొమ్మ. ’ అని ఆరోపించారు. మరోవైపు.. కొద్ది రోజుల క్రితం భంగ్, గంజాయీని లిక్కర్కు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధి వ్యాఖ్యానించిన తర్వాత రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. #WATCH | At a de-addiction drive, Chhattisgarh Min Premsai Singh Tekam says, "There should be self-control. I once went to a meeting where they spoke for & against liquor. One side spoke of its benefits. Liquor should be diluted, there should be a duration (to consume it)"(31.8) pic.twitter.com/FE8HJd3ktD — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 1, 2022 ఇదీ చదవండి: Jharkhand Crisis: గవర్నర్ను కలవనున్న అధికార కూటమి నేతలు -
ఆదాయం పెంచేందుకు... ‘మందు’కు రండి
టోక్యో: ‘యువతీ యువకుల్లారా! బాబ్బాబూ, దయచేసి మద్యం అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఎంపిక చేసుకుని తాగండి. ప్లీజ్’ అంటోంది జపాన్ సర్కారు! దేశంలో లిక్కర్ ఆదాయం ఏటేటా భారీగా పడిపోతుండటమే ఇందుకు కారణం. 1995లో సగటున ఒక్కో జపనీయుడు ఏటా 100 లీటర్ల మందు తాగితే 2020 కల్లా అది ఏకంగా 75 లీటర్లకు పడిపోయిందట. దాంతో 1980ల్లో మొత్తం పన్ను ఆదాయంలో 5 శాతంగా ఉన్న మద్యం వాటా కాస్తా 2011కు 3 శాతానికి, 2020కల్లా ఏకంగా 1.7 శాతానికి తగ్గిందని జపనీస్ టైమ్స్ పేర్కొంది. 2019తో పోలిస్తే 2020లో మద్యం ఆదాయం ఏకంగా 110 బిలియన్ యెన్ల మేరకు పడిపోయిందట! గత 31 ఏళ్లలో ఇదే అతి పెద్ద తగ్గుదల! ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ ఇప్పటికే నిధుల లేమితో సతమతమవుతోంది. మద్యం అమ్మకాలు కుచించుకుపోవడం మూలి గే నక్కపై తాటిపండు చందంగా మారింది. దాంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. వాటిని ఎలాగైనా పెంచాలని కంకణం కట్టుకుంది. ఇంతకీ సమ స్య ఎక్కడుందా అని కుస్తీ పడితే తేలిందేమిటంటే, పెద్దలు పర్లేదు గానీ జపాన్ యువతే అస్సలు మందు జోలికే పోవడం లేదట. జీవన శైలిలో వచ్చిన మార్పులు, కరోనా మహమ్మారి వంటి వాటివల్ల యూత్ మందు ముట్టడం మానేశారట. ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది గనుక కరోనా సమస్య తగ్గుముఖం పట్టినా బాటిళ్లకేసి కన్నెత్తి కూడా చూడటం లేదట! లిక్కర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. సేక్ వివా... ఈ నేపథ్యంలో మందు తాగేలా యువతను ప్రోత్సహించేందుకు భారీ ప్రచారానికి జపాన్ ప్రభుత్వం తెర తీసింది. ఇందులో భాగంగా ‘‘సేక్ వివా’’ పేరుతో నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. యూత్లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో వారు సలహాలు సూచనలివ్వాలి. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్ తదితరాల సాయంతో వినూత్నం, ఆకర్షణీయం అయిన సేల్స్ టెక్నిక్స్ పద్ధతులను రూపొందించవచ్చు. ఈ పోటీ సెప్టెంబర్ 9 దాకా నడుస్తుంది. ఫైనలిస్టులను అక్టోబర్లో నిపుణుల కన్సల్టేషన్ కోసం ఆహ్వానిస్తారు. నవంబర్లో టోక్యోలో తుది రౌండ్ పోటీ ఉంటుంది. విజేత తన మద్యం అమ్మకాల పెంపు బ్లూప్రింట్ను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందట! ‘‘మద్యం మార్కెట్ నానాటికీ కుంచించుకుపోతోంది. అందుకే యువత మందు అలవాటు చేసుకుని ఈ పరిశ్రమకు జీవం పోసేలా చేయడమే ఈ కాంపిటీషన్ లక్ష్యం’’ అని ఏజెన్సీ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదేం దిక్కుమాలిన పోటీ! ఈ కాంపిటీషన్పై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే పనిగట్టుకుని మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నించడం ఏమిటంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ‘‘అది కూడా దేశ సంపద అయిన యువతను మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకొమ్మని ప్రభుత్వమే పిలుపునివ్వడం ఎంతవరకు సబబు? మద్యానికి దూరంగా ఉండటం నిజానికి మంచిదే కదా!’’ అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆదాయమే తప్ప జనారోగ్యం పట్టదా అంటూ దుయ్యబడుతున్నారు. ‘మితిమీరిన తాగుడు మంచిది కాదు. అదో పెద్ద సామాజిక సమస్య’ అంటూ జపాన్ ఆరోగ్య శాఖ గతేడాది కార్యక్రమాలు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. -
ఈనాడుకు మళ్లీ మద్యనిషేధం గుర్తుకు వచ్చిందా?
ఈనాడు పత్రికవారికి సడన్ గా మద్య నిషేధం అంశం గుర్తుకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇంకా మద్య నిషేదం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.నిజంగానే ఈ పత్రిక చిత్తశుద్దితో ఈ ప్రశ్న వేస్తే తప్పు కాదు. కాని జగన్ ప్రభుత్వంపై ద్వేషంతో రాస్తున్నందునే ఈనాడు అప్రతిష్టపాలు అవుతోంది. గత మూడు దశాబ్దాలలో ఈ పత్రిక మద్య నిషేధంపై అనుసరించిన విదానాలు అందరికి గుర్తుకు వచ్చి నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా దూబగుంట అనే గ్రామంలో సారా విచ్చలవిడిగా పోరుతుంటే, దానికి వ్యతిరేకంగా రోశమ్మ అనే ఆమె ఆందోళన చేపట్టారు. ఆనాటి జిల్లా కలెక్టర్ కూడా అందుకు ప్రోత్సాహం ఇచ్చారు. తద్వారా దానికి మంచి ప్రచారం వచ్చింది. ఇదేదో అంది వచ్చిన అవకాశంగా భావించి ఈనాడు అదినేత రామోజీరావు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధ ఉద్యమానికి నడుం కట్టారు. తన పత్రికలో రెండు పేజీలు మద్య నిషేధ ఉద్యమ వార్తలకే కేటాయించేవారు. పుంఖానుపుంఖాలుగా సంపాదకీయాలు రాసేవారు. మా బోటి వాళ్లం కూడా ఇది చూసి సంతోషించేవాళ్లం. ఆ సందర్భంలో ఈనాడు విలేకరులే ఆయా చోట్ల కొన్ని సన్నివేశాలు సృష్టించి కధనాలుగా ఇచ్చిన ఘట్టాలు లేకపోలేదు. ఆ తరుణంలో అప్పటి మంత్రి రోశయ్య ఆద్వర్యంలో ఒక కమిటీ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి అక్కడ మద్య నిషేధం అమలు జరుగుతున్న తీరును పరిశీలించి వచ్చింది. అక్కడ పేరుకే మద్య నిషేధం తప్ప, ఆచరణలో జరగడం లేదని అభిప్రాయపడింది. దానికి తగినట్లుగానే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా గుజరాత్ కల్తీ సారా కారణంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కల్తీసారా తాగి నలభై మంది ఆ రాష్ట్రంలో మరణించిన వార్త వచ్చింది. బీహారులో ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మధ్య నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించినా, అక్రమ మద్యం ఏరులై పారుతోందన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. మద్యాన్ని నియంత్రించడం వేరు. నిషేధించడం వేరు. కారణం ఏమైనా వైఎస్సార్సీపీ కూడా దశలవారీగా మద్య నిషేధం హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అందుకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా చేయగలుగుతుందా?లేదా? విధానం మార్చుకుంటుందా? ఏమి చేస్తుందన్నది తేలడానికి మరికొంత సమయం ఉంది. కానీ ఈలోగానే ఈనాడు పత్రిక హడావుడి పడిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పేశారట. బార్లకు కొంచెం ఎక్కువ సంఖ్యలో లైసెన్సులు ఇచ్చేశారట.ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందట. అసలు ఏడుపు ఇదన్నమాట.మద్యం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినిపోతున్నాయని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అన్న మాటను ఈ పత్రిక గుర్తు చేసింది. కాని మధ్య నిషేధం అంశంలో గతంలో ఈనాడు మీడియా ఏమి చేసింది. తదుపరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఎలా ఫిరాయించింది గుర్తు లేదా! ఆ రోజులలో మహిళ ఉద్యమనేతలు కొందరి ప్రభావం , ఈనాడు పత్రిక సపోర్టు వంటి కారణాలతో కోట్ల విజయభాస్కరరెడ్డి సారా ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఈనాడు శాంతిస్తుందని ఆయన అనుకున్నారు. కానీ అలా చేయలేదు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాల్సిందే అంటూ పేజీలను ప్రత్యేకంగా కేటాయించి వార్తలు ఇచ్చేది. నిజానికి జనంలో సంపూర్ణ మద్య నిషేధంపై నమ్మకం లేదని ఎవరైనా చెప్పినా రామోజీరావు ఒప్పుకునేవారు కారు. ఆయన సభలు సదస్సులు కూడా పెట్టారు. మద్యం వ్యాపారం వ్యభిచారం కన్నా ఘోరమని ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత ఎన్.టి.రామారావు సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని తన రాజకీయ అవసరాల కోసం భుజానవేసుకున్నారు. ఒకప్పుడు వారుణి వాహిని పేరుతో పెద్ద ఎత్తున టీడీపీ ప్రభుత్వంలోనే సారా విక్రయాలు విపరీతంగా పెరిగాయన్న విమర్శ ఉంది. అయినా ఎన్.టి.ఆర్. మద్య నిషేధ ఉద్యమం పేరుతో రైలు యాత్ర చేస్తే విశేష స్పందన వచ్చింది. అదంతా ఒక చరిత్ర. అప్పట్లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత ,ఇతర కారణాలతో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఎన్.టి.ఆర్. మధ్యనిషేధాన్ని ప్రకటించారు. దీనిని అమలు చేయడం కష్టంగానే ఉన్నా, ఆయన వదలిపెట్టలేదు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే అక్రమ మద్యం వ్యాపారం చేస్తుంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎన్.టి.ఆర్. చెబుతుండేవారు. ఇంతలో ఆయనను కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్.టి.ఆర్.కన్నా స్ట్రిక్ట్ గా మద్య నిషేధం అమలు చేస్తానని తొలుత చెప్పారు. ఎన్.టి.ఆర్.హెల్త్ పర్మిట్లు ఇస్తే తాను తీసేస్తున్నానని చెప్పారు. నిజంగానే చంద్రబాబు చిత్తశుద్దితో ఈ పనిచేస్తున్నారని నమ్మినవారు కూడా ఉన్నారు. కాని ఆ తర్వాత కొద్ది నెలలకే మద్య నిషేధం వల్ల వస్తున్న సమస్యలు, అక్రమ మద్యం వంటివాటిపై ప్రచారం ఆరంభించారు. అక్రమ మద్యాన్ని నిలవరించడం కష్టసాధ్యంగా ఉందని చెప్పసాగారు. తదుపరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించారు. చివరికి ప్రజలంతా మద్య నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారంతగా బిల్డప్ ఇచ్చి దానిని ఎత్తివేశారు. ఆ తరుణంలో ఈనాడు పత్రిక యాధాలాపంగా వార్తలు రాసిందేకాని , చంద్రబాబు చేస్తున్నది తప్పు అని, అసమర్ధత వల్లే మధ్య నిషేధం అమలు చేయలేకపోతున్నారని రాయలేదు. దీంతో ఈనాడు రంగు చాలా మందికి తెలిసిపోయింది. అప్పట్లో ప్రముఖ మద్యం వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ఉదయం పత్రికను నడపడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆర్దికంగా శక్తిమంతుడు కావడంతో , ఆయనను దెబ్బకొట్టడానికిగాను రామోజీరావు మద్య నిషేధ ఉద్యమాన్ని నడిపారన్న సంగతి చాలామందికి అప్పటికి బోధపడింది. మరో వైపు ఎన్.టి.ఆర్. తాను ఆడమన్నట్లు ఆడరు కనుక ఆయనకు వ్యతిరేకంగా కార్టూన్లు, సంపాదకీయాలు, వార్తా కథనాలు వెలువరించేది. ఎన్.టి.ఆర్. ప్రభుత్వం పడిపోవడం, కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి తప్పనిసరిగా రామోజీరావు వద్దకు వెళ్లి ట్యూషన్ తీసుకోవడం వంటివి అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే ఆ రోజుల్లో మీడియా ఇంత బలంగా లేదు. అందువల్ల రామోజీరావును రాజ్యాంగేతర శక్తిగా ప్రొజెక్టు చేయలేకపోయాయి. ఈ రకంగా రామోజీరావు అటు వ్యాపార, ఆర్దిక ప్రయోజనాలు, ఇటు రాజకీయ ప్రయోజనాలు ఆశించి, వాటికి తగినట్లుగా వ్యూహాలు అమలు చేసి అప్పట్లో సఫలం అయ్యారని చెప్పాలి. ఉదయం పత్రిక కూడా ఆర్దికంగా నిలదొక్కుకోలేకపోయి మూతపడిపోయింది. దాంతో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ఆయన తన డాల్పిన్ హోటల్ లో మాత్రం మద్యం సరఫరాను ఆపలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తే ,రాష్ట్రం అంతటా నిషేదిస్తే తాను విక్రయించబోనని బదులు చెప్పేవారు. ఇక్కడే మద్యంపై ఆయన చిత్తశుద్ది అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీని స్తాపించి అక్కడ కూడా యధా ప్రకారం మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ విషయాలపై కోట్ల విజయభాస్కరరెడ్డి చాలా బాదపడేవారు. తాను రామోజీని గౌరవించి సారాను నిషేధించినా, రామోజీ కోరినట్లు ఆయన పిలిం సిటీకి సంఘీ నుంచి భూమిని వెనక్కి తీసుకుని అప్పగించినా , ఇలా సంపూర్ణ మధ్య నిషేధం అంటూ తనను ఇబ్బంది పెట్టారని ఆయన అనేవారు. ఇవన్ని ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే తన వ్యాపార ప్రయోజనాల కోసం ఆయన ఎంతకైనా వెళ్లడానికి వెనుకాడలేదని తెలుసుకోవడానికే. ఆ తర్వాత రామోజీని ఎదుర్కోవడానికి సాక్షి దినపత్రిక, టీవీ చానల్ వచ్చాయి. వీటిని దెబ్బతీయడానికి కూడా చంద్రబాబు,రామోజీలు చేయని ప్రయత్నం లేదు.అందులో భాగంగా పెట్టుబడులలో అక్రమాలు అంటూ ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ లోని ఒక వర్గంతో కలిసి సోనియాగాంధీకి పితూరిలు పంపడం, కేంద్ర స్థాయిలో ఫిర్యాదులు చేసేవారు. అయినా ఆనాడు వైఎస్ వెనక్కి తగ్గలేదు. ఆయన కుమారుడు జగన్ ధైర్యంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసి డీ అంటే ఢీ అనే పరిస్థితి తెచ్చారు. దానిని రామోజీ సహించలేకపోవడం ఆశ్చర్యం కాదు. అంతలో వైఎస్ అనూహ్య మరణంతో వారు మళ్లీ విజృంభించారు. వారికి అంతగా విషయాలపై అవగాహన లేని సోనియాగాంధీ వ్యవహార శైలి కలిసి వచ్చింది. టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి ఆయనపై కేసులు పెట్టాయి. జగన్ ను పదహారు నెలలు జైలులో నిర్భందించేలా చేశాయి. అంతవరకు సఫలం అయినా, మీడియాను దెబ్బతీయలేకపోయాయి. అదే వారి అసహనానికి కారణం అని చెప్పాలి. జగన్ జనంలోకి వెళుతున్న తీరు వారికి జీర్ణం కాలేదు. జగన్ పై సిబిఐ కేసుల నేపధ్యంలో ఎన్నెన్నో కల్పిత గాథలను రాసేవారు. 2014 ఎన్నికలలో కొంతమేర అవి ప్రభావితం చేశాయి. తత్పలితంగా వైసిపి అధికారంలోకి రాలేకపోయింది. దాంతో సాక్షిని ఇంకా తొక్కేయవచ్చని అనుకున్నా, జగన్ పట్టుదలతో నిర్వహించారు. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబును,ఈనాడును ఆయన ఎదుర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలను బయటపెట్టగలిగారు. రుణమాఫీ వంటి వాటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాన్ని తెలియచేయగలిగారు. నిత్యం ప్రజలలోకి వెళ్లి జగన్ అదికారంలోకి రాగలిగారు. అది రామోజీ ఎన్నడూ ఊహించలేదు. అంతే..తనకు సంబంధం లేకుండా జగన్ అధికారంలోకి వస్తారా?అన్న ద్వేషాన్ని ఆయన పెంచుకున్నారు. జగన్ సి.ఎమ్. అయినప్పటి నుంచి ఒకటే వ్యతిరేక కధనాలు రాయడం ఆరంభించారు. జగన్ తన ఎన్నికల మానిఫెస్టోలో 95 శాతం హామీలను నెరవేర్చినా వాటి గురించి ఒక్క ముక్క రాయరు. మిగిలిన ఐదు శాతం వాటి గురించి పదే,పదే రాసి, ప్రజలలో అదేదో ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదేమో అన్న భావన కలిగించే యత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న సుమారు 45 వేల బెల్టు షాపులను జగన్ ప్రభుత్వం నిర్మూలించినా, ఎన్నడూ రామోజీ మెచ్చుకుని సంపాదకీయం రాయలేదు. ప్రైవేటు మద్యం వ్యాపారాలు ఇష్టారాజ్యంగా చేస్తుంటే వారిని తొలగించి ప్రభుత్వం షాపులు పెట్టినా, గతంలో ఉన్న షాపుల సంఖ్యను తగ్గించినా ఈమీడియా స్పందించలేదు. అదే సమయంలో బ్రాండ్ల గురించి , రేట్ల గురించి చంద్రబాబుతో పాటు ఈ మీడియా కూడా తెగ బాదపడిపోయింది. ఇప్పుడు బార్ల వేలం ద్వారా సుమారు 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నది వీరి దుగ్ద. ప్రభుత్వాన్ని ఆర్దికంగా అన్ని వైపుల నుంచి దిగ్బందనం చేయడానికి వీరు చేయని ప్రయత్నం ఉండడం లేదు. అప్పులు పుట్టకుండా ఉండడానికి ఎన్ని అడ్డు పుల్లలు వేయాలో అన్ని వేస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని పక్కన పెట్టి, వాటిపై బురదవేసే పనిలోనే పూర్తిగా నిమగ్నమైపోతోంది. ఈ క్రమంలోనే మద్య నిషేధం అంశంలో జగన్ మడమ తిప్పేశారని ప్రచారం ఆరంభించారు. మరి ఇంకా రెండేళ్లు గడువు ఉంది కదా అని ఎ వరైనా ప్రశ్నించినా వారికి జవాబు ఇవ్వరు. మరి చంద్రబాబు టైమ్ లో నిషేధం ఎత్తివేసినా, ఆ తర్వాత వేలాది బెల్టు షాపులను ప్రోత్సహించినా, ఈనాడు ఎందుకు వార్తలు ఇచ్చి ఉద్యమాలు నడపలేదని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిది అమాయకత్వం అనుకోవడం తప్ప చేయగలిగింది లేదు. ఎందుకంటే ఈనాడు లక్షం మద్య నిషేధం కాదు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలన్నదే. ఈ సందర్భంలోనే జగన్ ప్రబుత్వం కూడా వాస్తవిక దోరణిలోకి వచ్చి, అవసరమైతే విధానపరంగా ఏమైనా మార్పులు చేసుకుంటే బెటరేమో ఆలోచించుకోవాలి.ఎందుకంటే సురాపానం అన్నది మానవ బలహీనతగా ఎన్నో తరాల నుంచి ఉంది. దానిని నిషేధించడం సాధ్యం కావడం లేదని చరిత్ర చెబుతోంది. అందువల్ల నిషేదం కన్నా, నియంత్రణ ద్వారానే కాస్త మేలు చేయవచ్చేమో యోచించుకోవల్సిన సమయం వచ్చింది. అయితే రాజకీయంగా ఆనుపానులు చూసుకుని కాని ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి వాటిలో నిర్ణయాలు తీసుకోలేదు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ డీ ఎడిక్షన్ (మద్యానికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించేలా చికిత్స ఇచ్చే) కేంద్రాల ఏర్పాటుపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లు నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ డీ ఎడిక్షన్, లిక్కర్ డీ ఎడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవోలో ఉన్నా.. ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్ హైకోర్టులో 2016లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. డీ ఎడిక్షన్ కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చిందన్నారు. పిటిషన్ దాఖలు చేసి ఆరేళ్లవుతున్నా ప్రతివాదులు ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. -
ఆ మూడు రోజులు మద్యం బంద్: ఎందుకు? ఎక్కడ?
పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్మకాలు నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది. చదవండి : ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!